12న రణస్థలంలో పవన్ కళ్యాణ్ "యువశక్తి"


Ens Balu
14
Visakhapatnam
2023-01-03 15:36:19

రాష్ట్రాన్ని వెఎస్సార్సీపీ కబంధహస్తాల నుండి కాపాడి, నిరుద్యోగ యువతకు దిశా నిర్దేశం చేయడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 12న శ్రీకాకుళంలోని రణస్థలంలో యువశక్తి పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తు న్నట్టు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తెలిపారు. మంగళవారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఇందుకోసం తమ పార్టీ ప్రాంతాలవారీగా సభ ను విజయవంతం చేయడానికి జనసేన యువశక్తి మీడియా కమిటీ సభ్యులుగా దూలం గోపి, నాగలక్ష్మి, గండి దుర్గాప్రసాద్, గురు ప్రసాద్, మిడతాన రవికుమార్, దాసరి జ్యోతి రెడ్డి నియమించామన్నారు.