పచ్చమీడియా బ్రమ కల్పించేంతగా విశాఖలేదు..రాజీవ్


Ens Balu
4
Visakhapatnam
2020-07-25 20:23:29

పచ్చ పత్రికలు భూకంపాలన్నా, డర్టీయెస్ట్ పొలిటీషియన్ దడపుట్టించాలనుకున్నా, ఎల్లో వైరస్ సునామీలు సృష్టించాలనుకున్నా ప్రజలకు సమాచారం రకరకాల సోర్సెస్ నుంచి అందుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ అన్నారు. శనివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సముద్రాన్ని అడ్డంపెట్టుకుని విషప్రచారం నడవదన్నారు. పైగా సముద్రం అంటే కోట్లాదిమందికి ఒక తల్లి, ప్రధాన ఆదాయవనరు అన్నారు. అదో అడ్వాంటేజ్ కూడా. 2004లో సునామీవచ్చి ప్రపంచ వ్యాప్తంగా రెండున్నర లక్షల మంది చనిపోయినప్పుడు సముద్రం ఒక్క అడుగైనా ముందుకు వచ్చిందా? అన్నారు. డాక్ యార్డ్ లోని ఒక్క నౌకైనా తల్లకిందులయ్యిందా?. పెట్టని కోటల్లాంటి కొండలు, సముద్రమట్టానికి నగరం ఎత్తుగా ఉంటే సునామీలు ఎలావస్తాయి అన్నారు. ఇప్పటికైనా విశాఖపై విషం చిమ్మే ఎల్లోమీడియాల వస్తవాలను తెలుసుకోవాలని రాజీవ్ సూచించారు.