ఎల్లోమీడియా కధనాలు ప్రజలు నమ్మేపరిస్థితి లేదు..వంశీ
Ens Balu
4
Visakhapatnam
2020-07-26 21:36:33
పచ్చమీడియా చూపించే మోసపూరిత కధనాలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని విశాఖ మహానగర వైఎస్సార్సీపీ అధ్యక్షులు సీహెచ్ వంశీక్రిష్ణ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మద్దెలపాలెం పార్టీ కార్యాయలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశాఖలో పరిపాలనా రాజధానిని ఏర్పాటును ప్రకటించిన దగ్గర నుంచి ప్రజలను తప్పుదోవపట్టించేందుకు పనిగట్టుకొని పచ్చమీడియా పనిచేస్తుందన్నారు. సీఎం వైఎస్ జగన్ కు ప్రజలు బ్రహ్మరధం పడుతుంటే దానిని ప్రజల్లో తప్పుగా చూపించే ప్రయత్నం చేయడమే టిడిపి, వారి అనుకూల మీడియా పనిచేస్తుందన్నారు. ఎన్నో ప్రక్రుతి వైపరిత్యాలు వచ్చినపుడు నోరు మెదపని భజన మీడియా ఇపుడు కరోనా వైరస్ సమయంలో మ్రుతులను సైతం బూతద్ధంలో చూపించే ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రజలు బుద్దిచెప్పినా కనీసం తెలుసుకోకపోవడం సిగ్గుచేటన్నారు.