శంఖవరం సచివాలయ ఉద్యోగినికి కరోనా పాజిటివ్...


Ens Balu
3
2020-07-27 18:00:16

శంఖవరం లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే వస్తున్నాయి. సోమవారం గ్రామసచివాలయ ఉద్యోగినికి తాజాగా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.  పరీక్ష చేసిన వారం రోజుల తర్వాత రిజల్ట్ రావడంతో ఈ లోపుగా ఎంతమందికి దగ్గరికి  సదరు ఉద్యోగిని విధి నిర్వహణ నిమిత్తం ఉవెళ్ళారో  అని గ్రామస్తులు, సిబ్బంది భయాందోళన చెందుతున్నారు. ఇపుడు సదరు ఉద్యోగిని ప్రైమరీ కాంటాక్ట్ లను గుర్తిస్తున్నారు. వెంటనే సచివాలయ ప్రాంతాన్ని శానిటేషన్ చేశారు.  దీనితో సచివాలయంలో ఇద్దరికి కరోనా సోకినట్టు అయ్యింది. అందులో మరొకరు సానిటేషన్ విభాగంలో పనిచేసే వ్యక్తి కావడం విశేషం. దీంతో శంఖవరం గ్రామంలోనే 24 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు అయ్యింది. పాజిటివ్ వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్ట్ వారికి పరీక్షలు, ఫలితాలు ఆలస్యం కావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది..