భక్తులూ కరోనాతో జర భద్రం..


Ens Balu
3
Srikakulam
2020-11-15 14:58:48

శ్రీకాకుళం జిల్లాలో కరోనా వ్యాప్తిలోనే ఉందని, కార్తీక మాసం దృష్ట్యా భక్తులు జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ కోరారు. సోమవారం నుండి కార్తీక మాసం ప్రారంభం ప్రారంభం కానుండటంతో భక్తులకు పలు సూచనలు జారీ చేస్తూ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కార్తీక మాసం పేరుతో ఆలయాల వద్ద అధిక రద్దీ ఉండకుండా చూడాలని కోరారు. అధిక రద్దీ ప్రదేశాల వద్ద కరోనా వ్యాప్తికి అవకాశాలు ఎక్కువ ఉంటుందని గుర్తించాలని సూచించారు. సాధ్యమైనంత వరకు ఇంటి దగ్గర పూజలు నిర్వహించుకోవాలని ఆయన కోరారు. కుటుంబం ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖశాంతులతో ఉండాలని చేసుకునే పూజలు వలన కుటుంబం కరోనా భారీనా పడే అవకాశం ఉండకుండా ప్రతి ఒక్కరూ ఆలోచించాలని అన్నారు. చలి కాలంలో వైరస్ వ్యాప్తి ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందని, రెండవ దశ వ్యాప్తి జరుగుతుందని ప్రసార మాధ్యమాల ద్వారా వస్తున్న సూచనలు అందరూ అవగాహన చేసుకుని ఉంటారని భావిస్తున్నామని పేర్కొన్నారు. వీటన్నింటి దృష్ట్యా సురక్షితంగా ఉండే విధంగా కార్తీక మాసం పూజలు నిర్వహించు కోవాలని కోరుతూ ఆలయాలకు వెళ్ళే ముందు ఒక్కసారి ఆలోచించాలని పిలుపునిచ్చారు. బయటకు వచ్చేటప్పుడు విధిగా మాస్కు ధారణ మరచిపోవద్దని, భౌతిక దూరం పాటించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేసారు. దీపాలు వెలిగించే ముందు చేతులకు శానిటైజర్ పూయరాదని ఆయన సూచించారు. సురక్షిత చర్యలు చేపట్టి కుటుంబం యావత్తు ఆరోగ్యంగా ఉండాలని కలెక్టర్ కోరారు.