ఐటిఐకి 18వలోగా దరఖాస్తు చేసుకోవాలి..
Ens Balu
3
Srikakulam
2020-11-15 17:07:40
శ్రీకాకుళంజిల్లా ఐ.టి.ఐలలో రెండవ విడత అడ్మిషన్లకు ఈనెల 18వ తేదీ లోగా ధరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ఐ.టి.ఐ ప్రిన్సిపాల్ మరియు కన్వీనర్ రాడా కైలాస రావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన జారీ చేస్తూ 2020-21 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ, ప్రయివేటు ఐ.టి.ఐ లలో మిగిలి ఉన్న ఖాళీ సీట్లు భర్తీ చేయుటకు ఉపాధి మరియు శిక్షణ శాఖ కమీషనర్ ఆదేశాల జారీ చేశారని ఆయన తెలిపారు. అభ్యర్థులు www.iti.nic.in వెబ్సైటులో ఆన్ లైన్ లో 18వ తేదీ లోగా దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఐ.టి.ఐలో చేరుటకు ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 19వ తేదీన, ప్రయివేటు ఐ.టి.ఐలో చేరుటకు ఈ నెల 20వ తేదీన ఆయా ఐ.టి.ఐ వద్ద అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నకలుతో హాజరుకావాలని ఆయన సూచించారు. పూర్తి వివరములకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ, ప్రయివేటు ఐ.టి.ఐ లలో సంప్రదించవచ్చని ఆయన వివరించారు.