ఉత్సాహంగా ప్రారంభమైన సహకార వారోత్సవాలు..
Ens Balu
3
Srikakulam
2020-11-15 17:44:06
శ్రీకాకుళం జిల్లాలో 67వ అఖిల భారత సహకార వారోత్సవాలు ప్రారంభం అయ్యాయి. వారోత్సవాలు ఈ నెల14 నుండి 20వ తేదీ వరకు జరుగుతాయి. ఈ సందర్భంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పాలవలస విక్రాంత్ బ్యాంక్ అవరణలో శనివారం సహకార బ్యాంక్ పతాకన్ని ఆవిష్కరించారు. అనంతరం చైర్మన్ పాలవలస విక్రంత్ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అత్మ నిర్బర్ భారత్ ను ప్రకటించారని చెప్పారు. సహకార సంస్దలు ఈ అంశం పై దేశ స్దాయిలో చర్చలు జరపాలని అన్నారు. ఆత్మనిర్బర్ భారత్ లో స్వయం ప్రతిపత్తిగల దేశంగా, స్వయం సమృద్దిగల దేశంగా , ప్రపంచ ఆర్దిక వ్యవస్దలో భారత దేశాన్ని గొప్పగా చుాపడమే మన ప్రధాన మంత్రి ఉద్దేశ్యం అని అయన అన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో పాల ఉత్పత్తి రంగంలో అగ్రగామి సహకార సంస్ద అయిన ఆముాల్ తమ వంతు సహకారాన్ని అందించారని చెప్పారు. సహకార రంగం మరింత బలోపేతం కావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి కె.ఎం.మురళి క్రిష్ణా రావు, డివిజనల్ సహకార అధికారి రమణ మూర్తి, డిసిసిబి జనరల్ మేనేజర్ పి. జ్యోతిర్మయి, డి జి ఎం లు ఎస్వి.సత్యనారాయణ, ఎస్ వి ఎస్.జగదీష్, ఎస్ రమేష్, జి శ్రీనివాసరావు. ఎస్.విజయ్ కుమార్, కె మురళీకృష్ణ. తదితరులు పాల్గొన్నారు.