శైవక్షేత్ర దర్శనకు ప్రత్యేక బస్సులు..


Ens Balu
1
Srikakulam
2020-11-16 15:12:01

కార్తీక మాసంలో భక్తులకు ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని కలిగించనున్నట్లు  ప్రజారవాణా శాఖ డివిజనల్ మేనేజరు జి.వరలక్ష్మి  తెలిపారు.  సోమవారం  ప్రజారావాణా శాఖ కార్యాలయంలో,  డివిజనల్ మేనేజరు పత్రికా సమావేశాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కార్తీక మాసం సందర్భంగా భక్తులకు అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట శైవ క్షేత్రాలైన పంచారామాల సందర్శనకు  ప్రత్యేకంగా బస్సు సౌకర్యాన్ని కలిగించడం జరిగిందన్నారు. కార్తీక మాసంలోని ఆదివారం  సాయంత్రం 4 గం.లకు బస్సు బయలుదేరుతుందని, మంగళవారం వేకువఝామున సురక్షితంగా తిరిగి చేర్చడం  జరుగుతుందని తెలిపారు. సూపర్ డీలక్స్, అల్ట్రా డీలక్స్ , పుష్ బ్యాక్, డీలక్స్, ఎక్స్ ప్రెస్ లతో పాటు పల్లె వెలుగు బస్సులను కూడా వేస్తున్నట్లు తెలిపారు.  సూపర్ లగ్జరీ బస్సుకు పెద్దలకు రూ.2,100లు, పిల్లలకు  రూ.1575 లు, అల్ట్రా డీలక్స్ బస్సులకు పెద్దలకు ఒక్కొక్కరికి  రూ. 1960 లు, పిల్లలకు  రూ.1470 లు, ఛార్జీలు వుంటాయన్నారు. రిజర్వేషన్  ఛార్జీలు అదనంగా వుంటాయన్నారు.  మరిన్ని వివరాలకు 9959225608, 7382921647, 7382919694 ఫోన్ నెంబర్లను సంప్రదించాలన్నారు. అదే విధంగా శ్రీకాకుళంలోని శ్రీముఖలింగం, రావివలస, శ్రీచక్రపురం వెళ్ళదలచుకున్న వారికి కూడా బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు.   శబరిమలై వెళ్ళే భక్తులకు ప్రత్యేక ప్యాకేజీతో బస్సులను ఏర్పాటు చేస్తామని, ఈ నెల 20వ తేదీ నుండి తుగభద్ర పుష్కరాల సందర్భంగా  బస్సులను ఏర్పాటు చేయడానికి సిధ్ధంగా వున్నామని తెలిపారు.  భక్తులు, బృందాలుగా వచ్చి బుక్ చేసుకోవాలని కోరారు. అనంతరం కార్తీక మాస ప్రత్యేక ప్యాకేజీల ఫాంప్లెట్ ను విడుదల చేసారు.  కోవిడ్ సంబర్భంగా బస్సులలో థర్మల్ స్క్రీనింగ్ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో 1 వ డిపో మేనేజరు వి.ప్రవీణ, అసిస్టెంట్ మేనేజరు వి.రమేష్, ఆర్.సి.జి.ఎ.ఎన్.ఎస్. శ్రీనివాస్, ఎస్.టి.ఐ.  ఆర్ వెంకటేష్వరరావు, తదితరులు పాల్గొన్నారు.