విశాఖలో జూకి వెళ్లాలంటే ఆన్లైన్ టిక్కెట్టు ఉండాల్సిందే..
Ens Balu
1
Visakhapatnam
2020-11-16 16:13:49
విశాఖలో జూపార్కు రేపటి(17.11.20202) నుంచి తెరుకుంటోంది...కరోనా, లాక్ డౌన్ తరువాత జూపార్కును రాష్ట్ర అటవీశాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాల మేరకు రేపు తెరుస్తున్నారు అధికారులు. అయితే జూకి వచ్చేవారంతా టిక్కెట్లను ఆన్ లైన్ ద్వారా పొందాల్సి వుంటుంది. దానికి కోసంwww.vizagzoo.com ద్వారా లాగిన్ అయి టిక్కెట్లు తీసుకున్న తరువాత జూ రావాలని జూ అధికారులు కోరుతున్నారు. అదే సమయంలో ఖచ్చితంగా మాస్కులు, సామాజిక దూరం పాటిస్తూ, కేంద్ర ప్రభుత్వ నిబంధనలు పాటించిన వారికి మాత్రమే ప్రవేశాలు ఉంటాయని జూ అధికారులు చెబుతున్నారు. పర్యాటకులు, జంతు ప్రేమికులు ఈ విషయాన్ని గుర్తించి ఆన్ లైన్ లో టిక్కెట్లు తీసుకుని వాటిని ప్రింట్ అవుట్ ద్వారా తీసుకొని రావాలని కోరుతున్నారు. అంతేకాకుండా టపాసులు, బయట నుంచి తెచ్చే ఆహార పదార్ధాలు లోనికి అనుమతించేది లేదని కూడా తెలియజేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను అన్నీ తెలుసుకున్న తరువాత మాత్రమే జూకి టిక్కెట్లు తీసుకోవాలని కూడా విశాఖ జూ అధికారులు సూచిస్తున్నారు.