అర్హత కలిగిన గిరిజనులకి అటవీహక్కులు మంజూరు..


Ens Balu
5
2020-07-27 19:01:01

అర్హత కలిగిన గిరిజన రైతులకు అటవీహక్కు పత్రాలు మంజూరు చేయాలని ఇంచార్జి సబ్ కలెక్టర్ ,సమీకృత గిరిజనాభివృద్ది సంస్ధ ప్రాజెక్టు అధికారి డా. వేంకటేశ్వర్ సలిజామల పేర్కొన్నారు. 2005కు మందు అటవీభూములు, రిజర్వుఫారెస్ట్ భూముల్లో వ్యవసాయం,కాఫీసాగు చేస్తున్న రైతులకు అటవీ హక్కుపత్రాలు మంజూరు చేసి న్యాయం చేయాలని స్పష్టం చేసారు. సోమవారం ఐటిడి ఏ సమావేశ మందిరంలో ఎస్ డి ఎల్ సి కమిటీ సమావేశం నిర్వహించారు. అటవీశాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు వి ఎస్ ఎస్ భూములకు హక్కపత్రాలు మంజూరు చేయాలని వచ్చిన దరఖాస్తులను బృందాలుగా ఏర్పడిపరిశీలించారు. ఈసందర్భంగా పి ఓ మాట్లాడుతూ గిరిజన రైతులకు రైతు భరోసా అందించి లబ్ది చేకూర్చాలని ప్రభుత్వ ఆశయ సాధనకు అటవీశాఖ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి గిరిజన రైతులకు తోడ్పాటు అందించాలని చెప్పారు. కాఫీ రైతులసాగు చేస్తున్న భూములకు హక్కుపత్రాలు అందించాలని అన్నారు. ఈ సమావేశంలో డి ఎఫ్ ఓలు వినోద్ కుమార్, విఘ్నేష్, ఫారెస్ రేంజ్ అధికారులు, 11 మండలాల తహాశీల్దార్దులు, ఆర్ ఓ ఎఫ్ ఆర్ డి టి ఈశ్వరరావు , ఆర్ ఐలు , బీటు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.