కరోనా ఫలితాల్లో ఐఎంఏ సేవలు చాలా అవసరం...కలెక్టర్


Ens Balu
3
Srikakulam
2020-07-27 22:20:44

శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ చికిత్సలో మంచి ఫలితాలు సాధించుటకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పూర్తి సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహకారం బాగుందని, వైద్యులు చక్కటి సేవలు అందిస్తున్నారని ఆయన కొనియాడారు. జిల్లాలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఎక్కువ మంది వైద్యుల సేవలు అవసరం అందుకు వైద్యులను సమకూర్చాలని ఆయన కోరారు. రోజుకు 5 వందల వరకు కేసులు వస్తున్నాయని చెప్పారు. పరీక్షల సామర్ధ్యంను పెంపుదల చేశామని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన విరాళాలతో మరో విఆర్డిఎల్ లాబ్ ను పీపుల్స్ లాబ్ గా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ లాబ్ వలన రోజుకు అదనంగా 2 వేల పరీక్షలు చేయవచ్చని చెప్పారు. కరోనా చికిత్సకు పల్మనాలజిస్ట్ సేవలు అవసరం ఎక్కువగా ఉందని కలెక్టర్ చెప్పారు. స్పెషలిస్ట్ వైద్యులకు వేతనంగా లక్షా 50 వేల రూపాయలను ప్రభుత్వం నిర్ణయించిందని, ఎంబిబిఎస్ వైద్యులకు 75 వేల రూపాయల వరకు చెల్లించుటకు నిర్ణయించిందని ఈ మేరకు జిల్లా కలెక్టర్ తెలిపారు.  ఈ సమావేశంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు సిబ్బంది వ్యవహారాల పర్యవేక్షకులు హెచ్. కూర్మారావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం.చెంచయ్య, అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.జగన్నాథ రావు,  ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ కె.అమ్మన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.