విశాఖ కాలుష్య నియంత్రణకు మొక్కలు నాటండి..
Ens Balu
4
Visakhapatnam
2020-07-27 22:38:20
విశాఖ మహానగరాన్ని కాలుష్యాన్ని రక్షించేందుకు ప్రతీ ఒక్కరూ తమవంతు బాధ్యతగా మొక్కలు నాటాలని ప్రముఖ సమాజసేవకులు సానా రాధ పిలుపునిచ్చారు. సోమవారం ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, విశాఖ మహానగరంలో రోజు రోజుకూ కాలుష్యం పెరుగుతోందన్నారు. దీనిని నియంత్రించడానికి ప్రతీ ఇంట్లో, ప్రతీ ఒక్కరూ తమ పేరుతో మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతను కూడా వారే తీసుకోవాలన్నారు. మొక్కలు నాటే సమయంలో ఫలసాయం, నీడను ఇచ్చే మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ముఖ్యంగా బాదం మొక్కలు, సిల్వర్ ఓక్ మొక్కలు, టేకు మొక్కలు, పనస, మామిడి, జామ తదితర మొక్కలను నాటడానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా వాటిని పెంచే ఆశక్తి కూడా కలుగుతుందన్నారు. నగరంలో పచ్చదనం ఎంత ఎక్కువైతే అంత కాలుష్య నియంత్రణ జరుగుతుందని రాధా ఆశాభావం వ్యక్తం చేశారు.