విశాఖలో సెంచరీకి చేరువలో కరోనా వైరస్ మరణాలు..
Ens Balu
4
2020-07-28 15:52:02
విశాఖజిల్లాలో కరోనా వైరస్ ద్వారా సోకిన మరణాలు వందకు చేరువలో రావడం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం నాటికి 71 మరణాలు జిల్లాలో సంభవించాయి. అధికారిక లెక్కల ప్రకారం 5103 మంది కోవిడ్ 19కి వివిధ క్వారంటైన్ కేంద్రంలో చికిత్స పొందుతుండగా, 2676 మంది వ్యాధి నుంచి కోల్కొని ఇంటికి చేరుకున్నారని కోవిడ్ 19 మూడు జిల్లాల ప్రత్యేక అధికారి డా.పీవీ సుధాకర్ తెలియజేశారు. 116 వెరీ యాక్టివ్ క్లస్టర్లు, 274 సాధారణ క్లస్టర్లు, 275 డోర్మాన్ట్ లు, 39 డిటోటిఫైగా ఉన్నాయని చెప్పారు. జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగానే వుందని చెప్పిన ఆయన ప్రజలు వైరస్ నియంత్రణకు పూర్తిస్థాయిలో సహకరించాలన్నారు. మాస్కు లేకుండా బయటకు రాకూడదని, అత్యవసర సమాయాల్లో తప్పా అంతా ఇంటికే పరిమితం కావాలని ఆయన కోరుతున్నారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయక చర్యలు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ పర్యవేక్షణలో జరుగుతున్నాయన్నారు.