ఏపీలో మనం అత్యధిక కరోనా పరీక్షలు చేస్తున్నాం..సీఎం


Ens Balu
4
Srikakulam
2020-07-28 20:20:03

రాష్ట్రంలో అత్యధికంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నమని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ లతో ముఖ్యమంత్రి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రోజుకు 50వేలకు పైగా కరోనా పరీక్షలు చేస్తున్న రాష్ట్రం మనదే అని ముఖ్యమంత్రి అన్నారు. 90శాతం పరీక్షలు కొవిడ్‌ క్లస్టర్లలో చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రోజూ చేసే పరీక్షల్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని,  కొవిడ్‌ వస్తుంది.. పోతుంది.. కొవిడ్‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. 85శాతం మందికి ఇళ్లలోనే నయమవుతుందని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్ డా.కె. శ్రీనివాసులు, నగర పాలక సంస్థ కమీషనర్ పి.నల్లనయ్య, డిఎంహెచ్ఓ ఎం.చెంచయ్య, డిఇ ఓ కె.చంద్రకళ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పిడి హెచ్.కూర్మారావు తదితరులు పాల్గొన్నారు.