ఆంధ్రకేసరిని ప్రతీఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి...


Ens Balu
3
Visakhapatnam
2020-08-23 15:01:09

ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్  వి.వినయ్ చంద్ అన్నారు.  ఆదివారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో శ్రీ టంగుటూరి ప్రకాశo పంతులు  జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్  వి.వినయ్ చంద్, జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాలరెడ్డి  పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశము పంతులు సేవా స్పూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన అన్నారు.  స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించి, సైమన్ కమిషన్ ను వ్యతిరేకిస్తూ  తుపాకులకు  ఎదురొడ్డిన ధీరుడు అని  అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి గా పనిచేశారన్నారు.  ఈ కార్యక్రమంలో  కలెక్టర్ వి.వినయ్ చంద్, జాయింట్ కలెక్టర్  ఎం . వేణుగోపాలరెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.