ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర గ్రంధాలయాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో గుర్తింపు పొందిన మూడు సంస్థల ద్వారా నిర్వహించనున్న 5నెలల కాలపరిమితితో కూడిన సర్టిఫికెట్ కోర్సు ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్పర్మేషన్ సైన్స్(CLISc)కోర్సులో చేరేందుకు ఆసక్తిగల అభ్యర్ధుల నుండి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర గ్రంధాలయాల శాఖ సంచాలకులు డా.ఎం.ఆర్.ప్రసన్నకుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు.రాష్ట్రంలో గుర్తింపు పొందిన పిఎన్.స్కూల్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ విజయవాడ,రాయలసీమ ఇనిస్టిట్యూట్ లైబ్రరీ అండ్ ఇన్పర్మేషన్ సైన్స్,గాంధీనగర్,కడప, వావిలాల సంస్థ లైబ్రరీ సైన్స్,అరండల్ పేట, గుంటూరుల్లోని సంస్థల్లో ఒక్కొక్క సంస్థలో 40 తెలుగు మీడియం,40 ఆంగ్లమాద్యం సీట్లు కలిపి మొత్తం 120 తెలుగు మాద్యమం,120 ఆంగ్ల మాద్యం సీట్లు ఉన్నాయని ఆయన తెలిపారు.వచ్చే డిశంబరు 1వ తేదీ నుండి 2023 ఏప్రిల్ 30వ తేదీ వరకూ ఐదు నెలల కాలవ్యవధితో ఈసిఎల్ఐఎస్సి(CLISc) సర్టిఫికెట్ కోర్సును నిర్వహించడం జరుగుతుందని డా.ప్రసన్న కుమార్ తెలియజేశారు.
ఈశిక్షణా కోర్సులో చేరేందుకు ఆసక్తి చూపే అభ్యర్ధులు విధిగా ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత కలిగి ఉండాలని లేదా యుజిసి గుర్తింపు కలిగిన ఏదైనా విద్యాసంస్థలో తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలని డా.ప్రసన్న కుమార్ స్పష్టం చేశారు.అభ్యర్దులను వారు సాధించిన మార్కుల శాతం మెరిట్ ప్రకారం ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.ఇంటర్మీడియెట్ ఒకేషనల్ కోర్సు చేసిన అభ్యర్ధులు ఈ CLISc సర్టిఫికెట్ శిక్షణా కోర్సులో చేరేందుకు అర్హులు కాదని స్పష్టం చేశారు.ఈకోర్సులో చేరే అభ్యర్ధులకు వారి కనీస విద్యార్హతైన ఇంటర్మీడియెట్ లో సాధించిన మార్కులకు అదనంగా డిగ్రీ ఉత్తీర్ణత సాధిస్తే 5మార్కులు,పిజి ఉత్తీర్ణులైతే 10 మార్కులు కలిపి ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
అదే విధంగా ఈకోర్సులో చేరే అభ్యర్ధులను రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎంపిక చేయడం జరుగుతుందని,అంతేగాక మహిళలకు 33/3 శాతం సీట్లు రిజర్వు చేయడం జరుగుతుందని రాష్ట్ర పౌర గ్రంధాలయాల శాఖ సంచాలకులు డా.ఎం.ఆర్.ప్రసన్న కుమార్ తెలియజేశారు.అంతేగాక ఈకోర్సులు నిర్వహించే మూడు సంస్థల్లోను తెలుగు,ఆంగ్ల మాద్యమాల్లో 10శాతం సీట్లను రాష్ట్ర పౌర గ్రంధాలయాల సంస్థ సంచాలకుల వారి పరిధిలోని జిల్లా గ్రంధాలయ సంస్థలు,ప్రభుత్వ లైబ్రరీల్లో పనిచేసే సిబ్బందికి రిజర్వు చేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఈసర్టిఫికెట్ శిక్షణా కోర్సులో చేరేందుకు గుర్తింపు పొందిన పై మూడు సంస్థల ప్రిన్సిపాళ్ల నుండి నవంబరు 1వ తేదీ నుండి 15వ తేదీ వరకూ ధరఖాస్తులు పొందవచ్చని డా.ప్రసన్న కుమార్ తెలియజేశారు.పోస్టు ద్వారా అయితే సంబంధిత సంస్థ ప్రిన్సిపాల్ పేరిట 2రూ.లు ఇండియన్ పోస్టల్ ఆర్డర్ తీసి 10X24 సైజు ఎన్వలప్ కవర్ పై 5రూ.ల స్టాంపు అతికించి పంపి పొంద వచ్చన్నారు.పూర్తి చేసిన ధరఖాస్తులను నవంబరు 18వ తేదీ సాయంత్రం 5గం.ల లోగా పైన పేర్కొన్న సంబంధిత సంస్థల ప్రిన్సిపాళ్ళకు అందేలా పంపాల్సి ఉంటుందని చెప్పారు. ఒకవేళ సకాలంలో ధరఖాస్తులు ఆయా సంస్థలకు అందకుంటే అందుకు ఆయా సంస్థల ప్రిన్సిపాళ్ళకు ఏవిధమైన సంబంధం ఉండదని రాష్ట్ర పౌర గ్రంధాలయాల శాఖ సంచాలకులు డా.ఎం.ఆర్.ప్రసన్న కుమార్ తెలియజేశారు.