మాజీ సైనికుల పిల్లల విద్యకు స్కాలర్ షిప్ లు


Ens Balu
20
2022-10-13 07:38:43

ప్రధాన మంత్రి ఉపాధి పథకం క్రింద మాజీ సైనికుల పిల్లలకు  2022-2023 విద్యాసంవత్సరంలో వివిధ వృతి విద్యా కోర్సులలో మొదటి సంవత్సరము చదువుచున్న క్రింద స్కాలర్ షిప్పు పొందుటకు కేంద్రీయ సైనిక బోర్డు(KENDHRIYA SAINIK BOARD) దరఖాస్తులు ఆహ్వానిస్తోందని జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారి జి.సత్యానందం ఒక ప్రకటనలో తెలియజేశారు.  MBBS, BDS, BAMS, BHMS,BSMS, BUMS, BNYS,, BVSC & (AH), B.pharma, PHARMA.D. Bsc Nursing, BSC BPT, BSC MLT, BOT, GNM, B.SC(OT&AT), B.SC (MICRO BIOLOGY), BBA, B.Tech, BE, B.Arch, BEA, BSC (Agriculture), BSC(Forestry), B.Sc(Horticulture) BF Sc, BMC, B.Sc (Computer Science), B.Sc (Media technology), BASLP, BFT, BCA, MCA, MBA, BBA, BBM, BPEd, BFSC. BFA, BSC Bio-Tech, BHMCT, B.SC (CA&BM), B.SC (HHA) BBM, BMS Bed, LLB, BMC, Hotel Management.

 కోర్సులకు మొదటి ఏడాది చేరిన విద్యార్ధులు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. పై కోర్సులలో రెండవ సంవత్సరము చదువుతున్న వారు అనర్హులని పేర్కొన్నారు. ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకొనుటకు ఇంటర్మీడియట్ పరీక్ష లలో కనీసము 60 % మార్కులు పొంది ఉండాలని తెలియజేశారు. ఈ పధకం క్రింది ఏడాదికి విద్యార్థికి రూ.30,000  చొప్పున మరియు విద్యార్థినికి 36,000 చొప్పున మంజూరు చేస్తారని పేర్కొన్నారు. నిర్ణీత దరకాస్తు ఫారమును ఆన్లైన్ WWW.RSB.GOV.IN ద్వారా మాత్రమే నింపి పంపించాలని సూచించారు. ఆ విధం గా పూర్తిచేసిన దరకాస్తు ఫారములను సంబంధిత ధృవపత్రముల తో జిల్లా సైనిక సంక్షేమశాఖ కార్యాలయము - విశాఖపట్నం అడ్రసులో అందజేయాలని కోరారు. దరఖాస్తులు స్వీకరించేందుకు ఆకరు తేది 30-11-2022గా నిర్ణయించినట్టు వివరించారు. మరిన్ని  వివరాలకు జిల్లా సైనికి సంక్షేమ కార్యాలయము విశాఖపట్నంలో సంప్రదించాలని సూచించారు.