కాళీమాత భక్తుడైన రామకృష్ణ పరమహంస ప్రభావంతమైన యోగి, ఆధ్యాత్మికవేత్త అని సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడలోని మంగళవారం సర్పవరం జంక్షన్లో బోట్ క్లబ్ వాకర్స్ సంగం ఆధ్వర్యంలో శ్రీ రామకృష్ణ పరమహంస వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బెంగాల్ రాష్ట్రంలో పేద బ్రాహ్మణ కుటుంబంలో ఆయన జన్మించారని అన్నారు. చిన్నతనం నుంచి ఏకాంతంగా ఉంటూ భగవంతుని పట్ల పలు రకాల ఆలోచనలు చేసేవారని అన్నారు. వివిధ ఆచారాలతో,భిన్నమైన ఆలోచన విధానంతో ఉన్నా చివరికి చేరే గమ్యం ఒకటేనని బోధించారని అన్నారు. 1886 ఆగస్టు 16న ఆయన కాలం చేశారని సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాఘవరావు, రాజా, రేలింగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.