శ్రీవారి సేవలో కర్ణాటక సిఎం,మాజీ సిఎం


Ens Balu
12
Tirumala
2022-08-19 11:01:46


కర్ణాటక  ముఖ్యమంత్రి  బసవరాజ్  బొమ్మై , మాజీ  ముఖ్యమంత్రి  యద్యూరప్ప శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట  టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి , ఉప ముఖ్యమంత్రి  నారాయణ స్వామి వీరికి  స్వాగతం పలికారు . స్వామివారి దర్శనం అనంతరం. రంగనాయకుల మండపంలో  పండితులు వేద ఆశీర్వచనం చేశారు . అనంతరం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. సిఎం , మాజీ  సిఎం లకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించారు . టీటీడీ ఈవో   ఎ వి ధర్మారెడ్డి , సీవీఎస్వో   నరసింహ కిషోర్ ,ఆలయ డిప్యూటీ  ఈవో  రమేష్ బాబు పాల్గొన్నారు. 
శ్రీవారి  దర్శనం అనంతరం  తిరుమలలో  టీటీడీ నిర్మిస్తున్న కర్ణాటక సత్రాల భవనాల నిర్మాణం పనులను కర్ణాటక ముఖ్యమంత్రి ,మాజీ ముఖ్యమంత్రి పరిశీలించారు . ఈ సందర్బంగా టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ , కళ్యాణమండపం , మొదటి బ్లాక్ నిర్మాణాలను జనవరి ఆఖరుకు పూర్తి చేసి కర్ణాటక ప్రభుత్వానికి అప్పగిస్తామని తెలిపారు . ఇందుకోసం  కర్ణాటక ప్రభుత్వం టీటీడీ కి  రూ 200 కోట్లు చెల్లించిందన్నారు. టీటీడీ బోర్డు సభ్యులు  విశ్వనాథ రెడ్డి , కర్ణాటక దేవదాయ శాఖ కమిషనర్ కుమారి రోహిణి సింధూరి , టీటీడీ చీఫ్ ఇంజినీర్  నాగేశ్వరరావు , ఎస్ ఈ  జగదీశ్వర్ రెడ్డి , ఈ ఈ  జగన్మోహన్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.