తిరుమల శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం


Ens Balu
14
Tirumala
2023-02-12 04:37:20

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని శనివారం అర్ధరాత్రి వరకూ 75,728 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.4.15  కోట్లు వచ్చింది. 38,092  మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. అన్ని కంపార్ట్ మెంట్లతో పాటు టిబిసీ కాంప్లెక్ బయట వరకూ భక్తులు స్వామి దర్శనం కోసం వేచిఉన్నారు. స్వామివారి దర్శనానికి 30 గంటల సమయం పడుతున్నది. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులకు వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.