తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మార్చినెల నిర్వహించే ఉత్సవాలను అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. మార్చి 3న శ్రీ కులశేఖరాళ్వార్ వర్ష తిరునక్షత్రం, మార్చి 3 నుంచి 7వతేదీ వరకు శ్రీవారి తెప్పోత్సవాలు, మార్చి 7న కుమారధార తీర్థ ముక్కోటి, మార్చి 18న శ్రీ అన్నమాచార్య వర్ధంతి, మార్చి 22న శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది. శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం, మార్చి 30న శ్రీరామనవమి ఆస్థానం, మార్చి 31న శ్రీరామ పట్టాభిషేకం ఆస్థానం కార్యక్రమాలు నిర్వహించనున్నారు.