తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం


Ens Balu
18
Tirumala
2023-06-16 04:44:55

కలియుగ వైంకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతున్నది. గురువారం అర్ధరాత్రివరకూ శ్రీవారిని 70,896 మందిభక్తులు ద ర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.07 కోట్లు రాగా, 37,546 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఇంకా దర్శనంకోసం అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోగా.. క్రిష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ భక్తులు వేచి ఉన్నారు. స్వామివారికి నిత్యంచేసే సేవలు,దర్శనాలు యధావిధిగా కొనసాగుతున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రటకనలో తెలియజేసింది.