తిరుమల శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం


Ens Balu
20
Tirumala
2023-06-20 02:54:02

కలియుగ వైంకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి 15 గంటల సమయం పడుతున్నది. సోమవారం అర్ధరాత్రివరకూ శ్రీవారిని 69,879  మందిభక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.82కోట్లు రాగా, 29,519 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఇంకా దర్శనంకోసం 20 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారికి నిత్యంచేసే సేవలు,దర్శనాలు యధావిధిగా కొనసాగుతున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రటకనలో తెలియజేసింది.