తిరుమల శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం


Ens Balu
35
Tirumala
2023-08-10 02:15:04

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని మంగళవారం అర్ధరాత్రి వరకూ 75,594 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.4.69  కోట్లు ఆదాయం వచ్చింది. 26,213  మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు.  16 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచిఉన్నారు. కాగా స్వామివారి సర్వ దర్శనానికి 15 గంటల సమయం పడుతున్నది. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలియజేసింది.