మొన్న అంతర్వేది.. నిన్న విజయవాడ.. నేడు ఏలేశ్వరం


Ens Balu
2
Yeleswaram
2020-09-17 15:12:21

ఆంధ్రప్రదేశ్ లో  హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.అంతర్వేది రధం దగ్ధం విషయంలో రేగిన గాయం మానక ముందే అమ్మల గన్న అమ్మ ఇంద్రకీలాద్రి పై వేంచేసిఉన్న కనకదుర్గమ్మ వారి వెండిరధం కి అమర్చిన మూడు సింహాలు మాయమయ్యాయి. అదే రోజే నిడమానూరులో సాయి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. వాటివలన దెబ్బతిన్న మనోభావాలనుండి తెరుకోకముందే గతరాత్రి తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం లో హనుమాన్ విగ్రహం,కృష్ణా జిల్లా వత్సవాయి మండలం మక్కపేటలోని ప్రాచీరణ కాశీ విశ్వేశ్వర దేవాలయంలో స్వామి వారి ముందుండే నంది విగ్రహాన్ని ధ్వంసం చేయటం రాష్ట్రంలో చర్చనీ యాంశంగా మారింది.  ఇన్ని దాడులు చేస్తున్నా ప్రభుత్వం ఏమీ చెయ్యదనా?ఏమీ చెయ్యలేదనా ?అనే ధీమా ఈ విధ్వంసానికి పాల్పడుతున్న దుండగుల్లో నాటుకుపోయి ఈ దూరాగతాలకు పాల్పడుతున్నారా?అని హిందూ బంధువులు ప్రశ్నిస్తున్నారు. అంతర్వేదిలో రేగిన ఆందోళన తర్వాత అయినా ఇలాంటి దుష్ట చేష్టలకు స్వస్తి చెప్పవలసిన దుష్టులు ఇంకా చెలరేగి పోతూ ఒకదాని అనంతరం మరొక దూరాగతానికి పాల్పడటం వలన ఏమి సాధించాలి? ఇలాంటి నీచ నికృష్ట చేష్టలకు పాల్పడుతూ ప్రభుత్వానికే సవాల్ విసురుతున్న దుష్టుల అట కట్టించాలని హిందూ బంధువులు కోరుతున్నారు. ఈ ఆటవిక చర్యల వెనుక ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే దుష్ట శక్తుల ప్రమేయం ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆ కోణంలో దర్యాప్తు చేస్తే పలు ఆశక్తికర అంశాలు వెలుగుచూసే అవకాశం వుంది..