ఆ పరీక్షలో మహిళా పోలీసులంతా పాస్
Ens Balu
4
Tadepalli
2022-06-01 14:42:31
రాష్ట్రవ్యాప్తంగా 14849 మంది గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకి ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో 366 మంది అభ్యర్ధినిలు మినహా 14483 మంది పాస్ అయినట్టు రాష్ట్ర డీజీపీ కార్యాలయం తెలియజేసింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని 15వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో మహిళా పోలీసులు ఈ పరీక్షలు రాశారు. అయితే ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసులను 33నెలల తరువాత సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తున్న తరుణంలో కోర్టుకేసుల కారణంగా ఈ ప్రక్రియ ఒక్క మహిళా పోలీసుల విషయంలోనే నిలిచిపోయింది. ఈ తరుణంలోనే హోంశాఖ మహిళా పోలీసులు అప్పుడెప్పుడో రాసిన పరీక్షల ఫలితాలను ఇపుడు విడుదల చేయడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.