రేపు ఏపీ సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే


Ens Balu
2
Visakhapatnam
2022-07-14 15:52:40

ఆంధ్రప్రదేశ్‌లో వరదలు అధికంగా కురుస్తున్నందున వరదలకి ప్రభావితమైన ప్రాంతాలను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహనరెడ్డి ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. శుక్రవారం ఉదయం హెలికాప్టర్‌ నుంచి వరద ప్రాంతాలను, ముంపునకు గురైన ప్రాంతాల్లోనూ పర్యటించనున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలోని వరద ప్రభావిత గ్రామాల్లో ఆయన ఏరియల్‌ సర్వే కొనసాగనుంది. సీఎం ఏరియల్‌ సర్వే కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎగువ గోదావరి నుంచి అత్యధికంగా వరద ప్రవాహం రావడంతో ఉబయ గోదావరి జిల్లాల్లో చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగన్ కోరారు. ఎవరూ అదైర్య పడవద్దని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండేలా చూడాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ముఖ్యంగా కాటన్ బ్యారేజీ వద్ద 24 గంటలూ పర్యవేక్షణ చేపట్టాలని, వరద ఉద్రుతిని బట్టి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయంతో సహాయక చర్యలు కూడా చేపట్టాలని విపత్తు నిర్వహణ శాఖ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.