భారీగా ఆదాయం కోల్పోతున్న సచివాలయాలు


Ens Balu
3
Tadepalli
2022-07-15 04:32:31

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వం భారీస్థాయిలో ఆదాయాన్ని కోల్పోతున్నాయి. సచివాలయాల ద్వారా 725 సర్వీసులను అందించనున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. అరకొరగా కొన్ని సర్వీలు మాత్రమే సచివాలయం నుంచి అందిస్తున్నది. దానికి కారణం కూడా లేకపోలేదు గ్రామ, వార్డు సచివాయాల్లో కలిపి 19శాఖలకు చెందిన సిబ్బంది పనిచేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఒక్కో సచివాలయానికి రెండు కంప్యూటర్లు మాత్రమే మంజూరు చేసింది. అందులో ఒకటి రెగ్యులర్ గా డిజిటల్ అసిస్టెంట్ పనిచేస్తుండగా, మరో కంప్యూటర్ ద్వారానే సచివాలయంలో అందరు సిబ్బంది పనిచేయాలని. ఈ క్రమంలో ప్రజల నుంచి వచ్చే వినతులు పని భారం మొత్తం డిజిటల్ అసిస్టెంట్లపైనే పడుతోంది. అల కాకుండా ఒక్కోశాఖ సిబ్బందికి ఒక్కో కంప్యూర్ లేదా. సచివాలయానికి ప్రస్తుతం ఉన్న రెండు కంప్యూటర్లకు తోడు మరో మూడు కంప్యూటర్లు ప్రభుత్వం మంజూరు చేయగలిగితే కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా నిర్వహించే 725 రకాల సర్వీసులు సచివాలయంలో పనిచేసే అందరు సిబ్బంది ద్వారా ప్రజలకు అందించడానికి వీలుంటుంది. అంతేకాకుండా అటు ప్రభుత్వానికి కూడా రాష్ట్రవ్యాప్తంగా వున్న 14వేల 5 సచివాలయాల నుంచి పూర్తిస్థాయిలో ఆదాయం కూడా అనునిత్యం వస్తుంది. కానీ ప్రభుత్వం సిబ్బందిని అయితే నియమించింది తప్పితే వారితో పూర్తిస్థాయిలో ప్రజలకు సేవలు అందించే విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

యూపీఐ, క్యూఆర్ స్కాన్ కార్డులు ఏర్పాటు చేస్తే..
గ్రామ,వార్డు సచివాలయాల్లో అందించే సేవలకు ప్రభుత్వం క్యూఆర్ స్కాన్ కార్డులు, యూపీఐ ఐడీలు ఏర్పాటు చేయడం ద్వారా నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసి బ్యాంకు ఖాతాకే సేవలు పొందిన వారి ద్వారా సర్వీసు మొత్తం చేరే అవకాశం వుంటుంది. లేదంటే రోజంతా పనిచేసిన మొత్తాన్ని డిజిటల్ అసిస్టెంట్లు ప్రత్యేకంగా బ్యాంకులకు వెళ్లడం ద్వారా కొంత సమయం వ్రుధా అవుతున్నది. ప్రస్తుతం 725 సర్వీసులకు గాను ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కేలం 25 నుంచి 50 సర్వీసులను మాత్రమే అందిస్తున్నది. అదీ కూడా ఒక్క సచివాలయంలో ఒక్క డిజిటల్ అసిస్టెంటు ద్వారానే పనులు జరుగుతున్నాయి. అలా కాకుండా అన్ని శాఖల సిబ్బందిని కామన్ సర్వీస్ సెంటర్ కు అనుసంధానించి, శాఖాపరమైన పనులు లేని సమయంలో అందరు సిబ్బంది ద్వారా ఈ సర్వీసులు మొత్తం ప్రజలకు అందించే ఏర్పాటు చేస్తే గ్రామ,వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసిన లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం సచివాలయాల్లో ఒక లక్షా 21వేల మంది సిబ్బంది సచివాలయాల్లో పనిచేస్తున్నారు. ఇంతమంది పనిచేస్తున్నా..నేటికీ మండలాలు, గ్రామాల్లోని మీసేవా కేంద్రాలకే వెళ్లి సర్వీసులు పొందడానికి ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. దానికి కారణం సచివాలయాల్లోపూర్తిస్థాయిలో కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా సేవలు అందకపోవడమే.

సిబ్బంది సేవలను వినియోగిస్తే కాసుల వర్షం..
ఆంధ్రప్రదేశ్ లోని 75 ప్రభుత్వశాఖల్లో ఏ శాఖకు లేనంద మంది పూర్తిస్థాయి ఉద్యోగులు ఒక్క గ్రామ, వార్డు సచివాలయ శాఖకు మాత్రమే ఉన్నారు. ప్రభుత్వం ఉన్న ఉద్యోగులను పూర్తిస్థాయిలో ప్రజల సేవకు వినియోగించడం మొదలు పెడితే..గ్రామంలోనే ప్రజలకు డిజిటల్ సేవలతో పాటు మిగిలిన అన్ని రకాల సర్వీసులు అందే అవకావం వుంది. సచివాలయశాఖలో మేన్ పవర్ అధికంగా ఉన్నా.. ఇక్కడ టెక్నాలజీ, సాంతికేతిక, కంప్యూటర్ల విషయంలో ప్రభుత్వం కాస్త వెనుకడుగు వేయడంతో ఇంత మంది సిబ్బంది వున్న ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. ప్రస్తుత రోజుల్లో అన్ని అనుమతులు ఆన్ లైన్ లో ప్రభుత్వం ద్వారా తీసుకోవాల్సి రావడంతో వాటన్నింటినీ ప్రభుత్వం కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా సచివాలయాల ద్వారానే అందించే ఏర్పాటు చేస్తున్నది. ఏర్పాటైతే చేసిందిగానీ, దానికి సరిపడ కంప్యూటర్లను మాత్రం మంజూరు చేయలేదు. ఒక్కో సచివాలయాలనికి కేవలం రెండు కంప్యూటర్లు మాత్రమే ఇవ్వడంతో ఒక శాఖ ఉద్యోగి పని పూర్తిగా అయ్యేంత వరకూ మరోశాఖ ఉద్యోగికి చెందిన పనులు చేసుకోవడానికి గానీ, ప్రజలకు సర్వీసులు అందించడానికి గానీ వీలులేకుండా పోతుంది. సిబ్బందికి అనుగుణంగా కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇంటర్నెట్ సౌకర్యం అన్నీప్రభుత్వం ఏర్పాటుచేస్తే ప్రభుత్వంలోని అన్నిశాఖల కంటే గ్రామ, వార్డు సచివాలయ శాఖ ద్వారానే ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం సమకూరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాలి..!