ఏపీఎస్ఆర్టీసీలో శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త


Ens Balu
35
Srisailam
2023-01-12 08:39:19

శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవడానికి వెళ్లే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. శ్రీశైలానికి బస్ టికెట్ రిజర్వేషన్ చేసుకుంటే స్పర్శ దర్శనం టికెట్లనూ అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు ఆర్టీసీ ఎండీ సిహెచ్డీ. తిరుమలరావు ప్రకటించారు. రాష్ట్ట్రంతో పాటు, పొరుగు రాష్ట్రాల్లోని ఆధ్యాత్మిక కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలకూ ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. భక్తులకు వసతి కల్పించి, టూరిస్ట్ గైడ్ లను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. స్వామివారి దర్శన టిక్కెట్లు ఆర్టీసీ రిజర్వేషన్ చేసుకునే సమయంలో పొంది నేరుగా స్వామిని దర్శించుకోవచ్చునని వివరించారు.