డీఓపీటి ఎఫెక్ట్.. ఏపీకి రిపోర్ట్ చేసిన సోమేష్ కుమర్


Ens Balu
15
Tadepalli
2023-01-12 11:52:05

తెలంగాణ మాజీ సీఎస్‌, సోమేశ్‌కుమార్‌ ఏపీ ప్రభుత్వ సీఎస్‌ జవహర్‌రెడ్డిని కలిసి రిపోర్ట్ చేసి.. జాయినింగ్‌ ప్రక్రియను పూర్తిచేశారు. అనంతరం సీఎం జగన్‌తో  సోమేశ్‌కుమార్ మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. తెలంగాణలో సోమేశ్‌కుమార్‌ కొనసాగింపును ఇటీవల హైకోర్టు కొట్టేసింది. విభజన సమయంలో ఆయన్ను ఏపీకి కేంద్ర ప్రభుత్వం కేటాయించగా.. కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌) తెలంగాణకు మార్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం 2017లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. క్యాట్‌ ఉత్తర్వులను కొట్టేసి సోమేశ్‌కుమార్‌ ఏపీలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించింది. ఆ తీర్పు వచ్చిన గంటల వ్యవధిలోనే కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలోనే సోమేశ్‌కుమార్ ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్‌ చేశారు.