పోలీస్ కానిస్టేబుల్ పరీక్షకు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రిలిమినరీ ప్రవేశపరీక్షరు 4లక్షల 58వేల 219 మంది హాజరైనట్టు అమరావతిలోని డిజిపీ
కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. మొత్తం5,03,487 మందికి హాల్ టిక్కెట్లు జారీచేయగా..4,58,219 మంది పరీక్షకు హాజరయ్యారని..45,268
మంది పరీక్షకు అబ్సెంట్ కాగా 91శాతం హాజరు నమోదైనట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని కేంద్రాల్లోనూ పరీక్ష ప్రశాంతంగా
జరిగినట్టు మీడియాకి విడుదల చేసిన ప్రకనటలో తెలిజేశారు.