ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఐడీ కొత్త చీఫ్ గా ఎన్.సంజయ్ ను నియమించింది. 1996 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన సంజయ్ ప్రస్తుతం ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్నారు. ఆయన గతంలో ఏపీ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ గానూ పనిచేశారు. సీఐడీ చీఫ్ గా సంజయ్ మంగళవారం బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఏపీ సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ ను రాష్ట్ర ప్రభుత్వం జేఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఐపీఎస్ లు బదిలీలు జరుగుతాయని ముందుగానే సీఎంఓలో ప్రచారం జరిగిన నేపథ్యంలో సీఐడీ చీఫ్ గా ఆయన నియామకం కూడా చర్చనీయాంశం అవుతోంది.