ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం


Ens Balu
7
Tirumala
2023-01-28 12:03:00


 ఢిల్లీకి చెందిన రమా సివిల్ ఇండియా కన్ స్ట్రక్షన్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ తరఫున వారి ప్రతినిధి తిరుపతికి చెందిన  వై.రాఘవేంద్ర రూ.10 లక్షలు  
విరాళం అందించారు. ఈ మేర‌కు విరాళం డిడిని తిరుమలలోని కార్యాలయంలో ఈఓ  ఎవి.ధర్మారెడ్డికి అంద‌జేశారు. ఈ సంస్థ ఇదివరకే టిటిడికి రూ.20 లక్షలు 
విరాళంగా అందజేసింది. అనంతరం దాతలు స్వామివారిని దర్శించుకున్నారు. దాతలకు టిటిడి సిబ్బంది స్వామవారి ప్రసాదాలను అందజేశారు.