రైస్ కార్డు కోసం మరో అవకాశం కల్పించిన ఏపీ ప్రభుత్వం


Ens Balu
63
Amaravathi
2023-06-04 15:29:41

ఆంధ్రుప్రదేశ్ ప్రభుత్వం రైస్ కార్డు కోసం అర్హులైన వారికోసం మరో అవకాశం కల్పించిందని సివిల్ సప్లైస్ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ ఒక సర్క్యులర్ ద్వారా తెలి యజేశారు. ఈ మేరకు ఆ ఉత్తర్వులను 26జిల్లాల కలెక్టర్లకు, జిల్లా సివిల్ సప్లై అధికారులకు పంపించారు. ఈ ఉత్తర్వు ద్వారా ఏడాదిలో రెండు సార్లు మాత్రమే రైస్ కార్డు కోసం అర్హులైన వారు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వం రైస్ కార్డులు మంజూరు చేస్తా రు. రైస్ కార్డులో మార్పులు, చేర్పులు, ఒంటరి వ్యక్తులుగా వున్నవారు రైస్ కార్డుకి దరఖాస్తు చేసుకోవచ్చు. దాని సమాచారం రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాల యాలతో పాటు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, సిబ్బంది దగ్గర అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నారు. అదేవిధంగా దరఖాస్తులను గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వా రా సచివాలయాల్లో పెట్టుకోవచ్చునని తెలియజేశారు. ఈ అవకాశాన్ని అర్హులైన వారంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.