సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ 15వరకూ


Ens Balu
31
Tadepalli
2023-06-08 07:49:26

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ గడువును జూన్ 15 వరకూ పెంచింది. ఈ మేరకు రాష్ట్రంలోని 26 జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వుల వచ్చాయి. వాస్తవానికి నేటి నుంచి 10వ తేదీవరకూ కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీలు చేపట్టనున్నట్టు ప్రభుత్వం మొదట ప్రకటించింది. అయితే ఉమ్మడి జిల్లాలు విడిపో యిన తరువాత అక్కడి నుంచి సమాచారం రావడం ఆలస్యం కావడం, బదిలీల ప్రక్రియకు అధికారుల నియామకం తదితర కారణాల ద్రుష్ట్యా ఈ ప్రక్రియను ఈనెల 15వర కూ పెంచారు. కాగా ఇప్పటికే అన్ని జిల్లాల్లో సిబ్బంది తమ వివరాలు ఆన్లైన్ చేసుకున్నారు.