నవంబరులో శ్రీవారికి విశేష ఉత్సవాలు..


Ens Balu
3
Tirumala
2020-10-27 14:10:49

తిరుమలలో నవంబరులో విశేష ఉత్సవాలు శ్రీవారికి జరపనున్నారు. వరుసగా నవంబరు 14 నుంచి 29వరకూ స్వామివారికి జరిపే ఉత్సవాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కోవిడ్ ను ద్రుష్టిలో ఉంచుకొని అన్నిఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీవారి విశేష ఉత్స‌వాలు కోసం తెలుసుకుంటే.. న‌వంబ‌రు 14న దీపావ‌ళి ఆస్థానం,  న‌వంబ‌రు 18న నాగుల చ‌వితి,  నవంబర్ 20న పుష్పయాగానికి అంకురార్పణ,  నవంబరు 21న తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవం,  నవంబరు 25న స్మార్త ఏకాదశి, - నవంబరు 26న మధ్వ ఏకాదశి, క్షీరాబ్ది ద్వాద‌శి, చాతుర్మాస వ్ర‌త స‌మాప్తి, చ‌క్ర‌తీర్థ ముక్కోటి,  నవంబరు 27న కైశిక ద్వాదశి ఆస్థానం,  నవంబరు 29న కార్తీక దీపం, తిరుమంగై ఆళ్వార్ శాత్తుమొర‌ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఒక్కో కార్యక్రమానికి సంబంధించిన రోజువారీ షెడ్యూల్ ను ముందుగానే అధికారులు ప్రకటించారు. ఆయా తేదీల వారీగా స్వామివారికి విశేష ఉత్సవాలు జరపనున్నామని తిరుమల జెఈఓ వివరించారు.