50.47 లక్షల రైతులు..రూ. 1,115 కోట్ల సహాయం..
Ens Balu
3
Velagapudi
2020-10-27 15:19:45
వైయస్ఆర్ రైతుభరోసా 2వ విడత సాయాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమవారతిలోని తన కార్యాలయంలో మంగళవారం ప్రారంభించారు. 50.47 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 1,115 కోట్ల నగదును కంప్యూటర్ లో నొక్కి బదిలీ చేశారు. తొలిసారిగా ఖరీఫ్లో నష్టపోయిన 1.66 లక్షల మంది రైతులకు ఖరీఫ్ లోనే ఇన్పుట్ సబ్సిడీ రూ. 135.7 కోట్లు చెల్లిస్తున్నామని పేర్కొన్న సీఎం వైఎస్ జగన్ లక్ష మంది గిరిజన రైతులకు రూ. 11,500 చొప్పున రూ.104 కోట్ల పెట్టుబడి సాయం అందిస్తున్నామని చెప్పారు. రబీ సీజన్కు గాను భూ యజమానులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు, దేవాదాయ, అటవీ భూములు సాగు చేసుకుంటున్న (ROFR) రైతులకూ రైతు భరోసా సాయం అందుతుందని తెలిపారు. తమ ప్రభుత్వం రైతుల పక్షాన ఉందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముందని, రైతులను సాయమందించడం గర్వంగా ఉందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ 90శాతం నెరవేర్చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎస్ నీలం సాహ్నితోపాటు వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శిలు ఇతర అధికారులు పాల్గొన్నారు.