జర్నలిస్టులూ డిసెంబరు వరకూ జాగ్రత్త..
Ens Balu
2
Visakhapatnam
2020-10-27 15:55:55
కరోనా వైరస్ రెండవ దశ విజ్రుంభించే ప్రమాదం ఉన్నందున రాష్ట్రవ్యాప్తంగా వున్న జర్నలిస్టులు వచ్చే రెండు నెలల పాటు అత్యంత జాగ్రత్తగా ఉండాలని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు కోరారు. విశాఖలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)చేసిన హెచ్చరికల నేపథ్యంలో జర్నలిస్టులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తొలుతు 45 రోజుల్లో కరోనా వైరస్ నీరసిస్తుందని భావించినా దాని ప్రభావం ఇపుడే అధికంగా కనిపిస్తుందని ప్రభుత్వం హెచ్చరించిందన్నారు. వైద్యులు, పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని హెచ్చరిస్తున్న తరుణంలో జర్నలిస్టులు తగు జాగ్రత్తలు వహించాలన్నారు. విధినిర్వహణలో బయటకు వెళ్లే ప్రతీ జర్నలిస్టూ విధిగా మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ లాక్ 5.0 నిబంధనలు సులభరతరం చేసినా, వార్తా సేకరణలో మాత్రం జర్నలిస్టులు మరో నెల రోజులు ముఖ్యమైన వాటికి మాత్రమే బయటకు రావాలన్నారు. మీమీద ఆధారపడి కుటుంబాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తించాలని గంట్ల శ్రీనుబాబు గుర్తు చేశారు.