నవంబరు 3నుంచి 6వ విడత పారాయణం..


Ens Balu
3
Tirumala
2020-10-28 16:01:47

కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై నవంబరు 3వ తేదీ మంగళవారం  6వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు. ఉద‌యం 7 గంటల నుంచి సుందరకాండలోని 20వ సర్గ నుంచి 24వ సర్గ వరకు ఉన్న 185 శ్లోకాలను పారాయణం చేస్తారు.  తిరుమల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం, తిరుప‌తిలోని వేద విశ్వవిద్యాలయం, సంస్కృత విశ్వవిద్యాలయం, వేదపారాయణదారులతో పాటు సుమారు 200 మంది ఈ అఖండ పారాయ‌ణంలో పాల్గొంటారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది. ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా శ్రీ‌వారి భ‌క్తులు త‌మ ఇళ్ల‌లోనే ఈ పారాయ‌ణంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని టిటిడి కోరుతుంది. కోవిడ్ ను ద్రుష్టిలో ఉంచుకునే, ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేసినట్టుగా కూడా టిటిడి పేర్కొంది. తిరుమలలో నిర్వహించే ఈ పారాయణంకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది..