భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు ఘన స్వాగతం..
Ens Balu
2
Renigunta
2020-11-24 12:09:42
భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కి రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని, తిరుమల శ్రీవారిని దర్శనానికి వచ్చిన గవర్నర్ కు మంగళవారం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర పతి భిశ్వభూషణ్ హరిచందన్ లుస్వాగతం పలికారు. వీరితోపాటు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, జిల్లా ఇంచార్జీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఎపిఐఐసి ఛైర్మన్ రోజా, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి, పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి, రెడ్డెప్ప, పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి , ఎం.ఎల్.సి. యండపల్లి శ్రీనివాసులురెడ్డి, శాసన సభ్యులు ఆదిమూలం, బియ్యపు మధుసూధన రెడ్డి, భూమన కరుణాకర రెడ్డి, చింతల రామచంద్రా రెడ్డి, నవాజ్ బాషా , వెంకటే గౌడ, పెద్దిరెడ్డి ద్వారకానాధ రెడ్డి, జంగాలపల్లి నివాసులు, బాబు , డిసీసీబీ చైర్మన్ రెడ్డెమ్మ, జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్త,టిటిడి ఇఓ జవహర్ రెడ్డి, జెసి మార్కండేయులు, నగరపాలక కమిషనర్ గిరీషా, ఐజి శశిధర్ రెడ్డి, డిఐజి కాంతిరణా టాటా, తిరుపతి ఆర్బన్ ఎస్.పి.రమేష్ రెడ్డి, సివి అండ్ ఎస్ ఓ గోపినాధ్ జెట్టి,ఎయిర్ పోర్టు డైరెక్టర్ సురేష్, డిప్యూటీ కమాండెంట్ శుక్లా, చిత్తూరు ఎస్.పి.సెంధిల్ కుమార్ , జెసి (సంక్షేమం) రాజశేఖర్ , డిఆర్ఓ మురళి, ఆర్డీఓ కనక నరసా రెడ్డి, స్వాగతం పలుకగా విమానాశ్రయంలో ఏర్పాట్లను పర్యవేక్షించిన తహశీల్దార్లు శివప్రసాద్ , ఉదయ్ సంతోష్, డిఎస్ పి లు గంగయ్య, చంద్రశేఖర్ లు పర్యటనలో వి వి పి ల లైజన అధికారులు తుడ సెక్రటరీ లక్ష్మి, సెట్విన్ సి ఈ ఓ మురళీకృష్ణ , తహశీల్దార్ సురేష్ బాబు, సిడిపిఓ శాంతి దుర్గా , రెవెన్యూ ,పోలీస్ అధికారులు, సిబ్బంది వున్నారు.