ఏకాంతంగానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు..చైర్మన్ వైవీ
Ens Balu
2
Tirumala
2020-08-28 18:49:05
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలను కోవిడ్ కారణంగా సెప్టెంబరు 19 నుంచి 27 వరకూ ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నట్లు టిటిడి ఛై ర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. అక్టోబర్లో నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాలను అప్పటి పరిస్థితులను బట్టి ఎలా నిర్వహించాలో నిర్ణయిస్తామన్నారు. శుక్ర వా రం జరిగిన టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం చైర్మన్ మాట్లాడుతూ, శ్రీవారి వైభవాన్ని విశ్వ వ్యాప్తం చేయడంలో భాగంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు శ్రీవా రి ఆలయాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇందులో స్థానిక భక్తులను భాగస్వాములను చేస్తూ, దాతల నుండి విరాళాలు సేకరించాలని నిర్ణయించా మన్నా రు. టిటిడి ఆదాయం పెంచుకునే ఆలోచనలో భాగంగా ఇకమీదట నగదు, బంగారు డిపాజిట్లలో ప్రతి నెల కొంత మొత్తానికి గడువు తీరేలా బ్యాంకుల్లో జమ చేయాలని నిర్ణయం తీసుకున్నామని ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకులు తక్కువ వడ్డీ ఇస్తున్నందు వలన టిటిడి డిపాజిట్లకు ఎక్కువ వడ్డీ వచ్చేలా ఆర్బిఐ, ఇతర బ్యాంకులతో చర్చించనున్నామన్నారు.