ఏపీలో ఇంటర్ విద్యకు మహర్ధశ..


Ens Balu
4
Tadepalle
2021-06-19 02:17:01

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ విద్యకు చాలా ఏళ్ల తరువాత మహర్ధశ పట్టబోతుంది.. ఇప్పటివరకూ విద్యార్ధులకు నాణ్యమైన విద్యకోసం క్రుషిచేసిన అధికారులు బోర్డుకి లేకుండా పోయారు. దీనితో ఇంటర్ విద్య రాష్ట్రంలో అంతంత మాత్రంగానే సాగింది. ఏపీలోని ఇంటర్ విద్య దేశానికే ఆదర్శం కావాలన్నా, ప్రైవేటు విద్యకు ధీటుగా ప్రభుత్వ కాలేజీల్లో అందాలన్నా ఈ బోర్డులోని ఉన్నతాధికారులు కీలకంగా వ్యవహరిస్తే తప్పా అదిజరగదు. దానికోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం డేరింగ్ అండ్ డేషింగ్  సీనియర్ ఐఏఎస్ అధికారి డా.పోలాభాస్కర్ ను రంగంలోకి దించింది. ఈయన ఇంటర్ బోర్డుకి కమిషనర్, డైరెక్టర్ టెక్నకల్ ఎడ్యుకేషన్ గా చేరిన వెంటనే బోర్డు ద్వారా శాస్వత అభివ్రుద్ధికి, ప్రక్షాలనకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా రీజియన్ కేంద్రాలు, వాటి కింద వున్న ఇంటర్ కాలేజీలు, సదుపాయాలు, విద్యావ్యవస్థ, ఆన్ లైన్ విద్య, ఇలా అన్ని విషయాలపై ఒకేసారి ద్రుష్టి కేంద్రీకరించారు. దీనితో ఇంటర్ బోర్డులో ఎన్నడూ రానంతగా చురుకుదనం, కొత్త కొత్త విధానాలు అమలవుతున్నాయి. కరోనా సమయంలో ఇంటర్ విద్యార్ధులు నాణ్యమైన విద్యకు దూరమయ్యారు. మళ్లీ విద్యార్ధులకు ఆ స్థాయిలో విద్య అందించాలంటే ఇంటర్ బోర్డులో కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్పా విద్యార్ధుల భవిష్యత్తుకి బాటలు వేయలేమని ప్రభుత్వం భావించి ఆ దిశగా తన దైన స్టైల్ లో కార్యాచరణ తో ద్రుష్టిని కేంద్రీకరించారు.  ఈ ఉన్నతాధికారి విధుల్లోకి చేరుతూనే కరోనా సమయంలో ఆన్ లైన్ విద్య విద్యార్ధులకు సక్రమంగా జరగడం లేదనే విషయాన్ని పసిగట్టారు. వెంటనే రీజనల్ కార్యాలయాల అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకోవడంతోపాటు సదుపాయాలు, సిబ్బందికొరత, భవనాలు, విద్యావిధానం ఇలా అన్ని అంశాలను గాడిలోపెట్టడానికి కార్యాచరణ రూపొందించారు. ఇంటర్ బోర్టు కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తే వచ్చే ఫలితాలు ఎలావుంటాయో ఈయన జిల్లా కలెక్టర్ గా చేసిన జిల్లాల్లో ఇప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధుల నెమరు వేస్తూనే వుంటారు. 
ఇంటర్ బోర్డుకి కమిషనర్ పోలాభాస్కర్ పుణ్యమాని విద్యార్ధుల విద్యావిధానం, నాణ్యమైన విద్య, కళాశాలల్లో మరింతగా అభివ్రుద్ధి చెందుతాయని అన్ని వర్గాల్లో ఆశలు చిగురించాయి..!