1 ENS Live Breaking News

అనకాపల్లి నుంచే మరలా పోటీ చేస్తా ..మంత్రి అమర్

అనకాపల్లి నుంచే రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని, ప్రాణం పోయినా అవినీతి కి పాల్పడనని రాష్ట్ర పరిశ్రమలు శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ భావోద్వేగ ప్రసంగం చేశారు. స్థానిక న్యూకాలనీ లోని రోటరీ కళ్యాణ మండపంలో మంగళవారం సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులతో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన ప్రసంగం అందర్నీ ఆశ్చర్యపరిచింది.ఎప్పుడు కూల్ గా సాగే ఆయన ప్రసంగం ప్రత్యర్థులకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసినట్టుగా కనిపించింది.  సుదీర్ఘంగా సాగిన తన ప్రసంగంలో అమర్నాథ్ అనేక విషయాలపై క్లారిటీ ఇచ్చారు. అనకాపల్లి నుంచి పోటీ చేస్తానని, కార్యకర్తలే తన బలమని, చెప్పుడు మాటలు విని తనను దూరం చేసుకోవద్దు అంటూ భావోద్వేగంతో చేసిన ప్రసంగం పలువురిని ఆలోచింపజేసే విధంగా చేసింది.తన మీద నమ్మకం ఉంటే తనతోనే ఉండండి.తనను నమ్మిన వారిని  ఎప్పుడూ దూరం చేసుకోను. పలకరించలేదనో. లేక పట్టించుకోలేదనో తనను దూరం చేసుకోవద్దు. నా గుండెల్లో తన తల్లిదండ్రులకు ఏ స్థానం ఉందో అంతకుమించి తనను నమ్ముకున్న కార్యకర్తలకు ఉందని అమర్నాథ్ అన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పదవుల కేటాయింపులలో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, ఆయా నాయకులు కార్యకర్తలు సంప్రదింపులు జరుపుకొని తన దగ్గరికి వచ్చిన తర్వాతే ఆయా పదవులనుభర్తీ చేశానని అమర్నాథ్ వెల్లడించారు. 

ఇదిలావుంటే వచ్చే ఎన్నికల్లో తాను అనకాపల్లి నుంచే పోటీ చేస్తానని, కార్యకర్తలే నా ఎలక్షన్ నిర్వహణ బాధ్యతను తీసుకోవాలని అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు.  రాజకీయా ల్లో ఓపిక అవసరమని, సమయం వచ్చినప్పుడు పదవులు అంది వస్తాయని ఆయన అన్నారు.ఇదిలావుంటే తాను అవినీతికి పాల్పడుతున్నట్లు చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ప్రాణం పోయినా అవినీతికి పాల్పడబోనని అమర్నాథ్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కార్యకర్తలంతా కాలర్ ఎగరేసి మరీ చెప్పచ్చని అమర్నాథ్ అన్నారు. తానేదో  భూ కుంభకోణానికి పాల్పడ్డానని అంటూ దాన్ని నిరూపించడానికి వచ్చిన ఒక సినిమా యాక్టర్,  కేవలం నాలుగు నిమిషాలు ఇక్కడ ఉండి నిరూపించలేక పలాయనం చిత్తగించారని ఆయన అన్నారు. నోరు ఉందని ఇష్టానుసారంగా తనపై ఆరోపణలు చేస్తే సహించేది లేదని అమర్నాథ్ హెచ్చరించారు. తనపై అవినీతి మరక పడకూడదని, ఎదుటివారి వద్ద తలదించుకోకూడదన్న భావన తనలో ఇప్పటికీ ఎప్పటికీ ఉంటుందని అమర్నాథ్ స్పష్టం చేశారు.త్వరలోనే అనకాపల్లికి తాను మకాం మారుస్తానని అమర్నాథ్ తెలియజేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర బి.సి వెల్ఫేర్ గవర కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, ఎపి ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్, అనకాపల్లి ఎంపీపీ గొర్లి సూరిబాబు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మలసాల కిషోర్, అర్బన్ సచివాలయాల కన్వీనర్ కొణతాల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2023-08-22 16:07:14

ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదా..?

ప్రాంతం అభివృద్ధి చెందడం పవన్ కళ్యాణ్ కు ఏ మాత్రం ఇష్టం లేదని ఇప్పటివరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆయన పర్యటన, మాట్లాడుతున్న మాటలు బట్టి అర్థమవుతోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.  పవన్ కళ్యాణ్ బుధవారం ఎర్రబట్టిదిబ్బలను సందర్శించిన అనంతరం మాట్లాడిన మాటలపై అమర్నాథ్ తీవ్రంగా స్పందించారు. ఎర్రమట్టి దిబ్బలు చారిత్రక ఆనవాళ్ళని దానిని ఆక్రమించుకుంటున్నారంటూ పవన్ కళ్యాణ్ చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. అక్కడ విఎంఆర్డిఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని, ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ నిర్మాణాలు చేపట్టడం తప్పంటే ఎలా? అనిఆయన ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో భూ కుంభకోణాలు బయట పెడతానంటూ గత నాలుగైదు రోజులుగా ఈ ప్రాంతంలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్  వాటిని నిరూపించలేక బొక్క బోర్లా పడ్డారని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. " మీ డాడీ ఇచ్చిన స్క్రిప్ట్ చదవకుండా, వాస్తవాలు తెలుసుకొని, అవగాహన పెంచుకుని ఇక్కడికి వచ్చి ఉంటే బాగుండేది." అని అమర్నాథ్పవన్ కళ్యాణ్ కు హితవు పలికారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఈ ప్రాంతంలో వేలాది ఎకరాలు కబ్జాకు గురైతే పెదవి మీ పని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఆరోపణలు వాస్తవ విరుద్ధమని,  ఇప్పటికైనా ఆయన పద్ధతి మార్చుకోవాలని అమర్నాథ్ కోరారు. ఆయన ఇప్పటివరకు పర్యటించిన ప్రాంతంలో  ఎక్కడ ఎటువంటి లోపం కనిపించకపోవడంతో , ఇక్కడ జరుగుతుందంతా ఎన్జీటీకి, మోడీకి చెప్తానంటూ లేనిపోని ప్రగల్బాల్ పలుకుతున్నారని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. " మీరు ఇక్కడ ఉండే ఒకటి రెండు రోజుల్లోనైనా మీరు ప్రజలకు ఏం చేస్తారో చెప్పుకోండి.. అవాస్తవాలను మాత్రం మాట్లాడకండి" అని అమర్నాథ్, పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు.

Visakhapatnam

2023-08-16 15:46:29

నిర్ణీత కాల‌వ్య‌వధిలోగా ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ‌

ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ‌లో భాగంగా చేప‌ట్టిన ఇంటింటి స‌ర్వేకి కేవ‌లం ఐదు రోజులే గ‌డువు ఉంద‌ని, ఆ లోగా ప‌ని పూర్తి చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి ఆదేశించారు. రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధులు, అధికారుల‌తో బుధవారం సాయంత్రం క‌లెక్ట‌రేట్‌లో స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ‌, ఇంటింటి స‌ర్వే పై నియోజ‌క‌వ‌ర్గాల వారీగా, మండ‌లాల వారీగా స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, ఇంటింటి స‌ర్వేకి ఎక్కువ స‌మ‌యం లేద‌ని, నిర్ణీత గ‌డువులోగా పూర్తి చేయాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. అర్హ‌త ఉన్న ప్ర‌తీఒక్క‌రికీ ఓటు క‌ల్పించాల‌ని, అలాగే అన‌ర్హులంద‌రినీ తొల‌గించాల‌ని ఆదేశించారు. ఓటు తొల‌గించేట‌ప్పుడు త‌ప్ప‌నిస‌రిగా ఫార‌మ్ 7 ద‌ర‌ఖాస్తు తీసుకోవాల‌ని, డెత్ స‌ర్టిఫికేట్ లేదా ఏదో ఒక థృవ‌ప‌త్రం కూడా ఉండాల‌ని, వాటిని ఫైల్ చేయాల‌ని సూచించారు. ఒక కుటుంబ ఓట్లు, ఒక అపార్ట్‌మెంట్ లేదా గ్రూప్ హౌస్ ఓట్లు ఒకే పోలింగ్ స్టేష‌న్లో ఉండేలా రేష‌న‌లైజేష‌న్ చేయాల‌ని చెప్పారు.

 విజ‌య‌న‌గ‌రం, బొబ్బిలి నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌క్రియ కొంత నెమ్మ‌దిగా సాగుతోంద‌ని, వేగ‌వంతం చేయాల‌ని ఆదేశించారు. ఎటువంటి త‌ప్పులు లేని, ఆరోగ్య‌క‌ర‌మైన ఓట‌ర్ల జాబితాల‌ను రూపొందించాల‌ని క‌లెక్ట‌ర్‌ ఆదేశించారు.  ఈ స‌మావేశాల్లో జాయింట్ క‌లెక్ట‌ర్ కె.మ‌యూర్ అశోక్‌, ట్రైనీ క‌లెక్ట‌ర్ వెంక‌ట త్రివినాగ్‌, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, ఆర్‌డిఓలు ఎంవి సూర్య‌క‌ళ‌, ఎం.అప్పారావు, శేష‌శైల‌జ‌, స్పెష‌ల్ డిప్యుటీ క‌లెక్ట‌ర్లు బి.సుద‌ర్శ‌న‌దొర‌, నూక‌రాజు, ప‌ద్మ‌ల‌త‌, నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల తాశిల్దార్లు, డిటిలు, రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధులు రొంగ‌లి పోత‌న్న‌, శ్రీ‌నివాస‌రెడ్డి, స‌తీష్‌కుమార్, ద‌యానంద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2023-08-16 14:40:23

సుజల స్రవంతి పనులు వేగవంతం చేయాలి-మంత్రి అమర్

అనకాపల్లి జిల్లాలో సుజల స్రవంతి పనులు మరింత వేగవంతం చేయాలని పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ అధికారులను ఆదేశించారు.  బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొత్తం 1876 ఎకరాల భూమిలో 1205 ఎకరాలు జిరాయితీ భూమి ఉందన్నారు. అనకా పల్లి, కసింకోట, సబ్బవరం మండలాల పరిధిలో మొత్తం 22 గ్రామాలకు చెందిన భూమిని సమీకరించాలన్నారు.  ఆరిపాక నల్లరేగు పాలెం, కొండుపాలెం లలో వెంటనే పనిని ప్రారంభించాలన్నారు.  జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి మాట్లాడుతూ  సర్వే పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు.  ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు   సమన్వయంతో తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మొత్తం భూమిలో 1025 ఎకరాలు జిరాయితీ, 476 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా మిగిలింది అటవీ భూమి గా గుర్తించడం జరి గిందని అధికారులు తెలిపారు.   సేకరించిన భూమిలో పనులు వేగంగా చేయాలని, మిగిలిన భూమిని సేకరించేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని కలెక్టర్ అధికారు లను ఆదేశించారు.  సమావేశంలో అనకాపల్లి ఆర్డీవో చిన్నికృష్ణ, బాబు జగ్జీవన్ రామ్ సుజల స్రవంతి ప్రత్యేక ఉప కలెక్టర్ కె. రమామనణి, ఇంజనీరింగ్ అధికారులు తదిత రులు పాల్గొన్నారు.

Anakapalle

2023-08-16 14:16:12

పరిశ్రమల అభివృద్ధికి చర్యలు చేపట్టాలి-జిల్లా కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ రవి పట్టణ శెట్టి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యా లయ సమావేశ మందిరంలో  నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్తగా పరిశ్రమలు ఏర్పాటుచేసే పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు.  ప్రభుత్వం కల్పించే రాయితీలు, తోడ్పాటును గురించి వారికి పూర్తి అవగాహన కల్పించాలన్నారు. పరిశ్రమలకు ప్రభుత్వం తరఫున అందించే ఇన్సెంటివ్ లు మంజూరు కొరకు సబ్ కమిటీని ఏర్పాటు చేసి నివేదికను సమర్పించాలన్నారు.  ఏపీఐఐసీలో పరవాడ వద్ద విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు విషయమై  అధికారులు పారిశ్రామికవేత్తలు విన్నవించగా కలెక్టర్ ఏపీ ఈపీ డి సి ఎల్  సిఎండి తో మాట్లాడతానని హామీ ఇచ్చారు.  అంతకుముందు గత సమావేశంలో లేవనెత్తిన అంశాలపై తీసుకున్న చర్యలు గూర్చి జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీధర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.  కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ మెంబర్ నదియా, ఏపీఐఐసీ జెడ్. ఎం. త్రినాథ్, డిపిఓ శిరీష రాణి, డి ఆర్ డి ఏ పీ డి లక్ష్మీపతి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ ఇ, అగ్నిమాపక శాఖ అధికారి, పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2023-08-16 14:14:39

వీజేఎఫ్ ఆధ్వర్యంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం (వీజేఎఫ్ -ప్రెస్ క్లబ్)ఆధ్వర్యంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డాబా గార్డెన్స్ లోని సంస్థ ప్రధాన కార్యాలయం ఆవరణలో మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొని స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించారు. రైతు బజార్ లో కాయగూరలు అమ్ముకొని జీవన సాగిస్తున్న 90 ఏళ్ల వయసు కలిగిన నారాయణమ్మ జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ, ఎందరో మహనీయుల  త్యాగఫలం మన స్వావాతంత్ర్యాన్ని స్మరించుకోవడం మన కర్తవ్యమన్నారు. బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర సిద్ధించడానికి దేశం కోసం ఎందరో ప్రాణ త్యాగాలు చేశారని చెప్పారు. వృద్ధ మహిళా రైతు నారాయణమ్మ లాంటి అనేకమంది శ్రమజీవులు  శ్రమ ఫలితంగా దేశం  ఇంతగా అభివృద్ధి చెందిందని చెప్పడానికే ఆమె చేత జాతీయ జెండాను ఆవిష్కరించమని తెలిపారు. స్వేచ్ఛ ,స్వాతంత్రాలతో అనేక హక్కులతో మన జీవిస్తున్నామంటే గాంధీ,సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్,నెహ్రూ, పటేల్, భగత్ సింగ్ ,అల్లూరి సీతారామరాజు లాంటి అనేకమంది త్యాగ ఫలితం అన్నారు. స్వాతంత్ర ఉద్యమ కృషితోపాటు దేశ ప్రజలకు గొప్ప రాజ్యాంగాన్ని అందించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  దని పేర్కొన్నారు. ఆ మహానీయుల స్ఫూర్తితో వీజేఎఫ్ అభివృద్ధికి జర్నలిస్టుల హక్కుల సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వీజేఎఫ్ సభ్యులు, జర్నలిస్టులు టి.బంటయ్య ,పి.సత్యనారాయణ, బి.నారాయణరావు ,ఎస్వీ రమణ,ఎస్ సన్యాసిరావు, కె .పరశురాం , ఆర్.అబ్బాస్,బి.శివప్రసాద్ ,చొప్పాబాలకృష్ణ, దుంపల ప్రసాదరావు, పృధ్వి రాజు,యు. వి. రమణ మూర్తి , కె.కె. రెడ్డి, ఎమ్.శ్రీహరి , యెద్దు  బాలకృష్ణ,అర్జున, కె.శివ,నటరాజు, మోహన్ ,బి. ఏ .నాయుడు, నరసింహం,సతీష్, శ్రీనివాస్, కె సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-08-15 08:35:30

కొండంతా వెతికి ఎలుకని పట్టలేని పవన్ కళ్యాణ్

 కళ్యాణ్ ని చూస్తే జాలేస్తోంది.. ఎవరో చెప్పిన మాటలు విని విశాఖలో భూ కుంభకోణాలు వెలికితీస్తానంటూ బయలుదేరిన పవన్ కళ్యాణ్ గత ఐదు రోజులుగా ఈ ప్రాంతంలో తిరిగినా ఏమి సాధించలేకపోయాడని, ఎందుకు తిరుగుతున్నాడో .. ఎవరి కోసం తిరుగుతున్నాడో ఆయనకే అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. సోమవారం అయిన విశాఖ సర్క్యూట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విస్సన్నపేట భూముల్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని.. దాన్ని బయటపెడతానంటూ జబ్బలు చరుచుకుంటూ వెళ్లిన పవన్ కళ్యాణ్ కొండను తవ్వి ఎలకను కూడా పట్టలేదు అని విమర్శించారు... వ్యాన్ ఎక్కి నాలుగు మాటలు మీడియాతో మాట్లాడి.. దిగి.. కారెక్కి వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్ ను చూసి అందరూ నవ్వుకుంటున్నారని అమర్నాథ్ఎద్దేవా చేశారు. 2004వ సంవత్సరంలో రంగుబోలుగడ్డ కోసం 45 ఎకరాలను చంద్రబాబు నాయుడు హయాంలో సేకరించారని, అప్పట్లో రైతులకు పరిహారం కూడా ఇచ్చారని.. అక్కడున్న పోరంబోకు భూములు అయితే పరిహారం ఎందుకు ఇచ్చారని అమర్నాథ్ ప్రశ్నించారు.

వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరో చెప్పిన మాటలు నమ్మి విస్సన్నపేట వెళ్లి పవన్ కళ్యాణ్ సమయం వృధా చేసుకున్నాడని ఆయన అన్నారు. విస్సన్నపేట భూముల్లో జరిగిన వ్యవహారం గురించి మీడియా ప్రతినిధులు మాట్లాడమంటే, నేను మంత్రులతో మాట్లాడను నేరుగా సీఎంతోనే మాట్లాడుతానని పవన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఆయన ఆరోపణలలో బలం లేకపోవడం వలనే  పవన్ అలా కప్పిపుచ్చుకొని వెనదిరిగారని అమర్నాథ్ అన్నారు. నిజంగా విస్సన్నపేట భూముల్లో అవకతవకలు జరిగి ఉంటే ఆయన ఆధారాలు చూపాలి కదా! లేవు కనుకనే మారు మాట్లాడకుండా వెనుతిరిగాడని ఆయన అన్నారు.


పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇమేజ్ ఆధారంగా చేసుకుని సినిమాల్లోకి వచ్చారు. 'మీ నాన్న  కానిస్టేబుల్ కాకముందే, మా తాత ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. మా కుటుంబం గత 60 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో రాజకీయం చేస్తోంది. నేను నా తండ్రిని, తాతను అడ్డం పెట్టుకొని రాజకీయాలకు రాలేదు. 18 ఏళ్లు కష్టపడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఇంత వాడినయ్యాను. మేము ప్రభుత్వ భూములకు కస్ట్రోడియన్లు గా ఉంటాం కానీ, ఆక్రమించుకోo అని అమర్నాథ్ దీటుగా సమాధానం ఇచ్చారు.
జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడలేక, ఆయన అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను స్వాగతించలేక, ద్వేషం, ఈర్ష్యతో ఆయన మీద అర్థం  లేని ప్రచారం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా కాస్తంత జ్ఞానం సంపాదించుకొని మాట్లాడితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని అమర్నాథ్ వ్యక్తం చేశారు. కాగా పవన్ కళ్యాణ్ యువతను మభ్యపెట్టి తన వెంట తిప్పుకుంటూ కీచక గురువుగా తయారయ్యాడని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ నమ్ముకుని రాజకీయాల్లో ఎవరైనా ఒక రూపాయి పెట్టుబడి పెట్టిన అది తిరిగి రాదని త్వరలోనే ఆయన తన కేడర్ను  మూట కట్టి చంద్రబాబు నాయుడుకి అమ్మేస్తాడని ఆయన అన్నారు. ఆ తర్వాత ఈ రెండు రాజకీయ పార్టీలను బంగాళాఖాతంలో కలిపేస్తాం! అని అమర్నాథ్ అన్నారు.

Visakhapatnam

2023-08-14 14:11:48

సనాతన ధర్మంపై అవగాహన పెంచుకోవాలి

ఆయుర్వేద వైద్య విద్యార్థులు సనాతన ధర్మంపై అవగాహన పెంచుకుని ధర్మబద్ధంగా నడుచుకోవాలని హైదరాబాదు లోని రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద తెలియజేశారు. తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో బుధవారం సాయంత్రం సనాతన ధర్మంలో విజయ సూత్రాలు అనే అంశంపై స్వామీజీ ఉపన్యసించారు. సనాతన ధర్మంలో చెప్పిన విధంగా బ్రహ్మచర్యం, ఇంద్రియనిగ్రహం, మితాహారం‌,  బాహ్య, అంతర శుద్ధి ద్వారా మనసుశుద్ధి చెంది జ్ఞాపకశక్తి పెంపొందుతుందన్నారు. తద్వారా సమాజంలో వైద్యులుగా చక్కగా కర్తవ్యాన్ని నిర్వహించగలుగుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. మురళీకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ డా. సుందరం, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డా. హరినాథాచారి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tirupati

2023-08-09 16:14:38

స్వచ్ఛమైన ఓటర్ల జాబితాకి పార్టీలు సహకరించాలి

అనకాపల్లి జిల్లాలో స్వచ్ఛమైన స్పష్టమైన ఓటర్ల జాబితా తయారీకి వివిధ రాజకీయ పార్టీలు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని జిల్లా ఓటర్ల ఎన్రోల్మెంట్ అధికారి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి కోరారు.  బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్క ఓటరు జాబితాలో నమోదు కావాలన్నారు. ప్రస్తుతం రూపొందిస్తున్న ఓటర్ల జాబితాలో చేర్పులు మార్పులు తొలగింపులు ప్రతివారం సమీక్ష చేస్తున్నట్లు తెలిపారు.  రానున్న పది రోజులలో ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తికానుందని, జాబితా స్వచ్చీకరణ కొరకు గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ క్షుణ్ణమైన పరిశీలనతో జాబితా రూపొందించాలని ఆదేశించారు. ఓటు తొలగించే సమయంలో ఫారం 7 తప్పనిసరిగా ఉండాలని, బిఎల్ఓ రిపోర్టు ఉండాలని, స్పష్టమైన డాక్యుమెంట్లు ఉండాలని చెబుతూ ఏ వార్డులోనైనా రెండుకుమించి ఓట్లు తొలగింపు చేయవలసి వచ్చినప్పుడు ఈఆర్వో సమక్షంలో జరగాలన్నారు.  రాజకీయ పార్టీల వారు ప్రతి వార్డుకు తమ బూత్ లెవెల్ ఏజెంట్ను నియమించి బూత్ స్థాయి అధికారికి సహకరించాలన్నారు.  తమ ఓటు నమోదు చేసుకో వలసినదిగా విజ్ఞప్తి చేస్తూ విస్తృతమైన ప్రచారం చేయాలన్నారు.  దీనిపై ప్రసార మాధ్యమాలలో ప్రకటనలు, గ్రామాలలో దండోరా వేయడం చేయాలని అధికారులను ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం. జాహ్నవి, డిఆర్ఓ పి. వెంకటరమణ అనకాపల్లి నర్సీపట్నం ఆర్డీవోలు చిన్ని కృష్ణ, జయరాం, ఎస్డీసీలు ప్రమీల గాంధీ, అనిత, జ్ఞాన వేణి, రామలక్ష్మి రాజకీయ పార్టీలకు చెందిన కే హరినాథ్ బాబు వై ఎన్ భద్రం వి రాము బి శ్రీనివాసరావు ఎస్ రామచంద్రరావు జి శ్రీరామ్ ఏ సెక్షన్ సూపరెంట్ లక్ష్మీదేవి, డిటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2023-08-09 15:28:19

డిసిఎంఎస్ ను ప్రగతిపథంలో నడిపించాలి

ప్రగతి పథంలో డిసిఎంఎస్ ను నడిపేందుకు అందరి సహకారం అవసరమని ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. అనకాపల్లి  డిసిఎంఎస్ కార్యాలయ ప్రాంగణంలో బుధవారం విశాఖపట్నం కో- ఆపరేటివ్ మార్కెటింగ్ సోసైటీ (డిసిఎంఎస్) కొత్త పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ధర్మశ్రీ మాట్లాడుతూ కోపరేటివ్ వ్యవస్థ గాజుబొమ్మ లాంటిదని ఆయన అభివర్ణించారు.  ప్రోఫర్టీ ఉండి ప్రోఫిట్ లేని సంస్థ డిసిఎంఎస్ అని ఆయన అన్నారు. ఈ సంస్థ లాభాలు బాట పట్టేందుకు అందరి సహకారం అవసరమన్నారు. బిసిలు బ్యాక్ బొన్ లాంటి వారన్నారు. పార్టీ ని నమ్ముకున్న వారి కి పదవులు వస్తుంటాయని అన్నారు. అయితే కొన్ని సామాజిక సమీకరణలు వల్ల పదవులు ఒకేసారి అందరికీ ఇవ్వడం సాధ్యం కాదన్నారు.యాదవ్ లకు సముచిత స్థానం కల్పించి ఇలాంటి సంస్థ కు ఛైర్మన్ పదవి కేటాయించడం జరిగిందన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ని అందరూ ఆదరించాలని ఆయన అన్నారు. తొలుత నూతనంగా డిసిఎంఎస్ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన పల్లా నర్సింగరావు  ప్రమాణస్వీకారం చేశారు.అనంతరం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అభిమానులు నర్సింగరావు కు గజమాలాలుతోను, పూల బొకే లతోను ఘనంగా సత్కరించారు.

 ఈసందర్భంగా డిసిఎంఎస్ ఛైర్మన్ నర్సింగరావు మాట్లాడుతూ  అందరి సహకారం తో సంస్థ ను ప్రగతి బాట లో నడిపేందుకు కృషి చేస్తానన్నారు. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కి, ప్రభుత్వ విప్ ధర్మశ్రీ కి అభిమానులు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు డాక్టర్ కె. విష్ణుమూర్తి, ఆనంద్, ఎ.సత్యారావు, డేవిడ్, కె. దేముడు,పి.అప్పారావు, కలగా సోమునాయుడు, సేనాపతి సత్యారావు, దొండా రాంబాబు, వెంకటరావు, కోనపల్లి రామమోహనరావు, డిసిఎంఎస్ పాలకవర్గ సభ్యులు పి.డి నర్సింగరావు (గాంధీ), జి. సత్యదేవ్, పి.అప్పారావు,ఎస్.సుకరయ్య, తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2023-08-09 15:03:27

ఆదివాసీల సంస్కృతిని గౌరవించాలి.. కలెక్టర్ రవిపట్టన్ శెట్టి

ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలను అందరూ గౌరవించాలని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి పిలుపునిచ్చారు.  ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా పట్టణంలోని గుండాల వద్ద గల సచివాలయ సమావేశ మందిరంలో బుధవారం ఏర్పాటుచేసిన ఉత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. అనంతరం అల్లూరి సీతారామరాజు, బిర్సాముండా,  గాం గంటం దొర,  గాం మల్లు దొర చిత్రపటాలకు పూలమాలలు వేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  ప్రపంచంలో వివిధ ఆదివాసి తెగలను పరిచయం చేయడం వారిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  భారతీయ మూలాలు సజీవంగా ఉన్నాయంటే ఆదివాసుల వల్లనే నని గుర్తించి వాటిని అవగాహన చేసుకుని ప్రచారం చేయాలన్నారు. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని చెప్పారు.
ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ నిజాయితీగా అమాయకంగా ఉండే గిరిజనులు అభివృద్ధి బాట పట్టారని చెప్పారు.

   అనకాపల్లి జిల్లా గిరిజన ప్రాంతాలన్నీ ఏజెన్సీని ఆనుకొని ఉంటాయన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గిరిజనులను అభివృద్ధి పరిచేందుకు చైతన్యం నింపేందుకు ఉత్తరాంధ్రలో  అల్లూరి, మన్యం పేర్లతో రెండు ప్రత్యేక జిల్లాలను ఏర్పాటు చేశారని చెప్పారు.  జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు బి. వరాహ సత్యవతి మాట్లాడుతూ గిరిజనులు ఆర్థికంగా, సామాజికంగా, వైద్య, విద్యా పరంగా అభివృద్ధి చెందుతున్నారని చెప్పారు.తొలుత గిరిజన బాలికలు ప్రదర్శించిన ధింసా నృత్యాలు ఇతర గిరిజన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ సమావేశంలో బీసీ వెల్ఫేర్ డిడి రాజేశ్వరి, గిరిజన సంక్షేమ శాఖ అధికారి నాగ శిరీష , బుచ్చయ్య పేట, జెడ్ పి టి సి దొండా రాంబాబు, సర్పంచ్ పెంటయ్య నాయుడు, జిల్లాలోని రామన్నపాలెం, కోనాం, తాండవ, నరసయ్య పేట, తాటిపర్తి ఇతర ప్రాంతాల నుండి గిరిజన సంక్షేమ పాఠశాలల విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2023-08-09 15:00:33

1407 జంటలకు వై.యస్.ఆర్ కళ్యాణ మస్తు

విజయనగరం జిల్లాలో 1407  జంటలకు వై.యస్.ఆర్ కళ్యాణ మస్తు ఆర్థిక సహాయం మంజూరు చేసినట్లు ఇంచార్జ్ కలెక్టర్ మయూర్ అశోక్ తెలిపారు.  అల వై.యస్.ఆర్ కళ్యాణ మస్తు, వై.యస్.ఆర్ షాది తోఫా పథకం క్రింద 2023 ఏప్రిల్  - జూన్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న 18,883 జంటలకు రూ.141.60 కోట్లు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్య మంత్రి వై. యస్. జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి నుండి వర్చువల్ గా బుధవారం ప్రారంభించారు.  జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వర్చువల్ కాన్ఫరెన్స్ లో జిల్లా ఇంచార్జ్   శాసన సభ్యులు శంబంగి చిన్న అప్పల నాయుడు, డి ఆర్ డి ఏ పి.డి  కల్యాణ చక్రవర్తి , జి.ఎస్.డబ్ల్యూ. జిల్లా కార్డినేటర్ నిర్మల దేవి,  రెడ్డికే వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్  రౌతు భాస్కర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 



వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ జిల్లాలో  1168 బిసి -  జంటలకు ,  149 ఎస్.సి జంటలకు ,  26  ఎస్.టి జంటలకు , 17 దివ్యాంగ జంటలకు , 7 మైనారిటీ జంటలకు ఇంటర్ చస్తే  వారికి   వెరసి 1407  జంటలకు రూ.8.32  కోట్లు మంజూరు అయ్యాయన్నారు. వై.యస్.ఆర్ కళ్యాణ మస్తు, వై.యస్.ఆర్ షాది తోఫా పథకాలతో ఆర్థిక కారణాలతో మధ్యలోనే విద్యను నిలిపి వేసే అవకాశం బాగా తగ్గుతుందని అన్నారు. సామాజిక మార్పులో ఒక విశిష్టమైన పాత్రను పోషిస్తుందని అనడంలో సందేహం లేదని ఆయన చెప్పారు. ఎస్.సి, ఎస్.టి, బి.సి తదితర వర్గాలకు ఇది ఎంతో సహాయంగా ఉంటుందని ఆయన అన్నారు. సామాజిక, ఆర్థిక వెనుకబాటు నుండి బయటకు రావడానికి, సామాజిక హోదా, సామాజిక సామరస్య సాధనకు ఇది దోహదం చేస్తుందని  అన్నారు. 

Vizianagaram

2023-08-09 10:09:58

నులిపురుగుల నివార‌ణతో పిల్ల‌లకు సంపూర్ణ ఆరోగ్యం

నులి పురుగుల‌ నివార‌ణ ద్వారా పిల్ల‌ల ఆరోగ్యానికి పూర్తి ర‌క్ష‌ణ ల‌భిస్తుంద‌ని ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయ‌ని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా. ఎస్. భాస్క‌రరావు పేర్కొన్నారు. 1-19 సంవ‌త్స‌రాల లోపు వ‌య‌సు గ‌ల పిల్ల‌ల‌కు 400 గ్రా. మాత్ర‌లు వేయ‌టం ద్వారా బంగారు భ‌విష్య‌త్తును అందించ‌వ్చ‌ని హిత‌వు ప‌లికారు. ఆగ‌స్టు 10న‌ జాతీయ నులిపురుగుల నివార‌ణ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని జిల్లాలో నిర్వ‌హించ‌బోయే కార్య‌క్ర‌మాల నిమిత్తం బుధ‌వారం త‌న కార్యాల‌యంలో ఆయ‌న విలేక‌రుల స‌మావేశం నిర్వహించారు. ఆల్బెండ‌జోల్ మాత్ర‌లు వేయటం ద్వారా పిల్ల‌ల్లో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంద‌ని, ఇత‌ర అనేక‌ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 4,834 కేంద్రాల్లో జాతీయ నులిపురుగుల నివార‌ణ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నామ‌ని దానిలో భాగంగా జిల్లా కేంద్రంలోని మ‌హారాజ సంస్కృత క‌ళాశాల‌లో గురువారం మధ్యాహ్నం జిల్లా క‌లెక్ట‌ర్, డిప్యూటీ స్పీక‌ర్, జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ చేతుల మీదుగా కార్య‌క్ర‌మాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నామ‌ని వెల్ల‌డించారు. జిల్లాలోని అంగ‌న్వాడీ కేంద్రాలు, పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల్లో ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతున్నామ‌ని ఈ మేర‌కు అన్ని కేంద్రాల్లో ఏర్పాట్లు చేశామ‌ని అవ‌స‌ర‌మైనంత మేర‌కు మాత్ర‌లు స‌ర‌ఫ‌రా చేశామ‌ని పేర్కొన్నారు.

 ఒకే రోజు 3,60,974 మంది 1-19 సంవ‌త్స‌రాల వ‌య‌సు గ‌ల‌ పిల్ల‌ల‌కు ఆల్బెండ‌జోల్ మాత్ర‌లు అంద‌జేసేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశామ‌ని వివ‌రించారు. అన్ని విభాగాల అధికారులు, ప్ర‌జ‌లు భాగ‌స్వామ్య‌మై కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న పిలుపునిచ్చారు.మిగిలిపోయిన వారికి 17వ తేదీన‌ గురువారం జిల్లా వ్యాప్తంగా నిర్వ‌హించే కార్య‌క్ర‌మంలో ఒక వేళ ఎవ‌రైనా మందులు తీసుకోలేకపోయిన‌ట్ల‌యితే వారి కోసం ప్ర‌త్యేకంగా 17వ తేదీన ఆల్బెండ‌జోల్ మాత్ర‌లు అంద‌జేస్తామ‌ని డీఎం&హెచ్‌వో స్ప‌ష్టం చేశారు. అలాగే ఏడాది లోపు వ‌య‌సు క‌లిగిన చిన్నారులు, మూడు నెల‌ల లోపు గ‌ర్బిణీలు ఈ మాత్ర‌ల‌ను తీసుకోరాద‌ని హెచ్చ‌రించారు. కార్య‌క్ర‌మంలో భాగంగా జాతీయ నులిపురుగుల నివార‌ణ దినోత్స‌వానికి సంబంధించిన పోస్ట‌ర్న ఆవిష్క‌రించారు.స‌మావేశంలో డిప్యూటీ డీఎం&హెచ్వో డా. ర‌వి కుమార్, డెమో చిన్నిత‌ల్లి, ఎపెడిమిక్ సెల్ ఇన్ఛార్జి స‌త్య‌రాజ్, ఆర్.బి.ఎస్.కె. ఇన్ఛార్జి లోక్‌నాథ్ ప్ర‌శాంత్, ర‌మ‌ణ‌, రామ‌కృష్ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2023-08-09 10:07:14

ఎస్ఎస్ఆర్ ఓటరు జాబితా సవరణ గుర్తించాలి

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు జరుపుతున్న ఇంటింటి సర్వే లో బూత్ స్థాయి అధికారులు ఓటరు గుర్తింపు ప్రక్రియలో హేతుబద్ధత కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డా కె.మాధవీలత ఆదేశించారు.  మంగళవారం సాయంత్రం నియోజక వర్గాల వారిగా ఓటరు గుర్తింపు సర్వే పై జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ తో కలిసి నియోజక వర్గ ఈ ఆర్ ఓ, సహాయ ఈ ఆర్ వో లతో సర్వే పురోగతిపై సమీక్ష చేశారు. ఈ సమీక్ష లో భాగంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, వచ్చే ఏడాది రాష్ట్రంలో సాధారణ ఎన్నికల నిర్వహించే క్రమంలో ఓటరు జాబితా లో ఓటరు గుర్తింపు, ఓటు హక్కు లేని వారికి ఓటు హక్కు కల్పించడం, ఇల్లు, నియోజక వర్గం మారిన ఓటరు గుర్తింపు, మరణించిన వారి వివరాలు వంటి ప్రతి ఒక్క ప్రక్రియ ను అత్యంత జాగ్రత్తగా సర్వే చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే క్షేత్ర స్థాయి లో బూత్ స్థాయి లో ఇంటింటి సర్వే ప్రక్రియ జరుగుతున్న దృష్ట్యా నియోజక వర్గ స్థాయి ఓటరు నమోదు చేసే ఈ ఆర్ వో లు మరింత ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. మార్పులు,  చేర్పులు, యువ ఓటరు నమోదు పై వ్యక్తిగత పర్యవేక్షణ బాధ్యతలను చేపట్టి రాబోయే 14 రోజులు అత్యంత కీలకం అని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్,  జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, నియోజక వర్గ ఈ ఆర్ ఓ, సహాయ ఈ ఆర్ వో, ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Rajamahendravaram

2023-08-08 14:41:13

చంద్రబాబుపై రౌడీషీట్ ఓపెన్ చేయాలి..మంత్రి అమర్

హింసాత్మక రాజకీయాలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని.. ఆ తెలివితోనే పుంగనూరులో ఆయన ఇదేవిధమైన కుట్రను అమలు చేశాడని ఐటిశాఖ మంత్రి గుడివాడ అమర్నాద్ ఆరోపించారు. మంగళవారం ఆయన విశాఖలోని సర్క్యూట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు. సీఎం  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎంతమాటంటే అంతమాట అంటున్నారు. అయితే, ఆ ముగ్గురి కుట్రపూరిత ఆలోచనలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేశ్‌లకు తగిన బుద్ధిచెప్పేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. పోలీసుల్ని రెచ్చగొట్టడం, తద్వారా వారు ఫైరింగ్‌ ఓపెన్‌ చేస్తే..ఎవరో ఒకరు చనిపోతే.. మా పార్టీ కార్యకర్తల్ని అన్యాయంగా చంపారంటూ ఒక డ్రామాతో రాజకీయ లబ్ధి పొందాలనేది బాబు రాజకీయ పన్నాగం పన్నారన్నారు.  మొన్న పుంగనూరు బైపాస్‌లో పోలీసులపై టీడీపీ దాడికి ముమ్మాటికీ చంద్రబాబునే కారకుడన్నారు. ఈ కేసులో అతనే ప్రథమ ముద్దాయని చంద్రబాబుపైనే రౌడీషీట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు.

Visakhapatnam

2023-08-08 13:58:20