1 ENS Live Breaking News

సినీ పరిశ్రమకు విశాఖ పర్యాటకం ఒక స్వర్గదామం-డా.కంచర్ల

ఆంధ్రప్రదేశ్ లో సినిమాలు నిర్మించే దర్శక నిర్మాతలకు విశాఖ పర్యాటకం ఒక స్వర్గదామమని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్, ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత డా.కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. విభజన ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి విశాఖ ఎంతగానో ఉపయోగ పడుతు న్నదన్నారు. విశాఖమహానగరంతోపాటు ఉమ్మడి జిల్లాలో కూడా అనేక పర్యాటక ప్రాంతాలు సినిమాలకు ఎంతో అనువుగా ఉంటాయ న్నారు. సినీ నిర్మాతలు, దర్శకులు, టివీ సీరియల్ నిర్వాహకులు తక్కువ ఖర్చుతో విశాఖలో తమ షూటింగ్స్ చేసుకోవచ్చు నన్నారు. సొంత రాష్ట్రం లోని సినిమాలు నిర్మించడం ద్వారా సదరు ఆదాయం రాష్ట్రప్రభుత్వానికి చేరడానికి ఆస్కారం వుంటుందన్నారు. అతేకాకుండా విశాఖ పర్యాక ప్రదేశాలను సినిమాల ద్వారా ప్రమోషన్ చేసే అవకాశం కూడా లభిస్తుందన్నారు. 

నిర్మాతలు, దర్శకులు కథ, హీరో హీరోయిన్లతో విశాఖ వస్తే ఇక్కడే పూర్తి సినిమా తీసుకునేంతగా సదుపాయాలు ఉన్నాయన్నారు. త్వరలోనే సినీ పరిశ్రమను విశాఖ తీసుకు వచ్చేందుకు చర్యలు ప్రారంభించామన్నారు. విశాఖలోనే సినిమా ఇండస్ట్రీకి చెందిన అనుబంధ పరిశ్రమ లను కూడా ఏర్పాటు చేయడం ద్వారా నిర్మాతలు సినిమా నిర్మించడంతోపాటో ఫస్ట్ కాపీ ఇక్కడి నుంచే తీసుకెళ్లే విధంగా అభివృద్ధి చేయడా నికి కార్యాచరణ సిద్దమవుతుందన్నారు. ఇప్పటికే ఈ విషయాన్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. అంతేకాకుండా ప్రభుత్వ పరంగా సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలను కూడా విశాఖ లో ఏర్పాటు చేసేలా చేయడానికి రాష్ట్రప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళుతున్నామన్నారు. దేశంలోనే విశాఖలో ఉన్న పర్యాటక ప్రాంతాలు మరె క్కడా లేవన్నారు. అలాంటి అందమైన విశాఖను పర్యాటకంగా ప్రమోట్ చేయడానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నట్టు కంచర్ల చెప్పారు.

visakhapatnam

2024-09-24 17:16:09

టూరిజం అండ్ పీస్ పై విశాఖజిల్లా పర్యాటకశాఖ పోటీలు

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పర్యాటకశాఖ ఆధ్వర్యంలో "టూరిజం అండ్ పీస్"  అనే అంశంతో యువ టూరిజం క్లబ్ ద్వారా స్కూల్స్ కాలేజీల్లోలో ఎస్సే రైటింగ్ ఆర్ట్ పెయింటింగ్ కాంపిటీషన్స్ ను నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెకలెక్టర్ హరేంధిరప్రసాద్ పేర్కొ న్నారు. ఈ మేరకు మంగళవారం మీడియాకి ప్రకటన విడుదల చేశారు. మూడు అంశాల మీద ఫోటోగ్రఫీ,  షార్ట్ ఫిలిం కాంపిటీషన్స్ కూడా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. 27న జరగనున్న ప్రపంచ పర్యాటక దినోత్సవంలో భాగంగా జిల్లా కలెక్టర్, చైర్మన్ డిస్టిక్ టూరిజం కౌన్సిల్ ద సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నంలో.. ఈ ఏడాది వరల్డ్ టూరిజం డే థీమ్ తో 26న ఉదయం ఆరు గంటలకు హెరిటేజ్ వాక్ కూడా నిర్వహి స్తున్నామన్నారు. అదేవిధంగా నగరంలోని ముఖ్య మైన కూడళ్ళలో విశాఖలోని అందమైన పర్యాటక ప్రాంతాలు, ప్రదేశాలకు సంబంధించిన ఫోటోలతో ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ ఫోటో గ్రఫీ  పోటీలో ఎన్నికైన వారికి  27న వుడా చిల్డ్రన్స్ ఎరీనా లో జరగనున్న వరల్డ్ టూరిజం డే సెలబ్రేషన్లో  బహుమతులు అందజేయనున్నట్టు చెప్పారు. ఈ పోటీల ద్వారా యువతకు టూరిజంపై అవగాహన, ఆశక్తి పెంపొందించాలనే లక్ష్యంతోనే చేపట్టే ఈ కార్యాక్రమాల్లో పెద్దఎత్తున పాల్గొనాలని జిల్లా కలెక్టర్ పిలుపు నిచ్చారు. జిల్లా పర్యాటకశాఖ నిర్వహిం చే ఈ పోటీల్లో పాఠశాల, కళాశాల విద్యార్దులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కలెక్టర్ పిలుపు నిచ్చారు. మరిన్ని వివరాల కోసం జిల్లా పర్యాటక అధికా రి జ్ఞానవేణి  9494918484 చరవాణిలో  సంప్రదించవచ్చునని పేర్కొన్నారు.

visakhapatnam

2024-09-24 15:58:33

ఆ.. సూపరింటెండెంట్ బదిలీ కోసం ఎస్ఈ అష్ట కష్టాలు

 విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం (జోన్-1) సూపరింటెండెంట్ల బదిలీల్లో జరుగుతున్న అడ్డగోలు వ్యవహారంపై విశాఖ మీడియాలో వచ్చిన కథనాలు కూడా డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లినట్టు తెలిసింది. ముఖ్యంగా శ్రీకాకుళం జాల్లాలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న జి.కనవల్లీ కుమారి ప్రస్తుతం ఓడీపై విశాఖజిల్లాలోనే పనిచేస్తున్నారు. ఈమెకు 2024 పంచాయతీరాజ్ బదిలీల్లో జీఓఎంఎస్ నెంబరు -75 నిబంధనల ప్రకారం బదిలీకి దరఖాస్తుచేసుకునే అర్హత లేకపోయినా.. ఆమె బదిలీకి దరఖాస్తు చేసుకోవడంతో ఇటీవలే రిటైర్ అయిన ఎస్ఈ, ప్రస్తుత ఇన్చార్జి ఎస్ఈలు ఆమెను కోరుకున్న చోటుకి బదిలీలు చేయడానికి అన్ని దారులు వెతుకుతున్న విషయంపై వచ్చిన మీడియా కథనాలు కూడా డిప్యూటీ సీఎం కార్యాలయాలకు ఫిర్యాదులు అందినట్టు సమాచారం. ఇటు విశాఖజిల్లా కలెక్టర్ వద్ద ఆమె విశాఖలోనే  ఓడిపై విధులు నిర్వహిస్తున్న విషయాన్ని, సదురు ఆర్ఢర్ ను దాచిపెట్టి ప్రస్తుత ఎస్ఈ కనకవల్లీ కుమారిని బదిలీచేయడానికి రంగం సిద్దం చేయడంతో ఈ విషయాన్ని ఈరోజు-ఈఎన్ఎస్ లు స్వయంగా జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్(ఇఎన్సీ) బాలూనాయక్ దృష్టికి కూడా ఈఎన్ఎస్-ఈరోజు ప్రతినిధి స్వయంగా తీసుకెళ్లారు. 

దానితో స్పందించిన విశాఖ జిల్లా కలెక్టర్ ఆమె బదిలీపై ఎస్ఈల అత్యుత్సాహం, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న వ్యవహారంపై విచారణ చేస్తామని ప్రకటించగా.. ఇఎన్సీ మాత్రం జీఓనెంబరు 75కి విరుద్ధంగా బదిలీలు చేపడితే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా ఇదే  విషయాన్ని ఈఎన్ఎస్-ఈరోజు నేరుగా ప్రస్తుతం బదిలీలు చేపడుతున్న జోన్-1 ఇన్చార్జి ఎస్ఈ ఎం.శ్రీనివాసరావుని  ఇప్పటికే ఓడిపై పనిచేస్తూ.. మళ్లీ బదిలీలకు నిబంధనలకు విరుద్దుంగా దరఖాస్తు చేసుకున్న సూపరింటెండెంట్ ను బదిలీచేయడానికి నిబంధనలు ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందని, ఎవరి సహకారంతో ఆమెను ప్రభుత్వ జీఓకి వ్యతిరేకంగా బదిలీ చేస్తున్నారని.. దీనిపై వచ్చిన ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని కోరగా..  ఈ విషయమై తాను తర్వాత మాట్లాడతానని జవాబు దాటవేశారు. అంతేకాకుండా ఈ బదిలీలపై జరుగుతున్న అక్రమాలకు సంబంధించి సమాచార హక్కుచట్టం దాఖలైన విషయాన్ని కూడా బయట పెట్టడానికి ఆయన అంగీకరించలేదు. 

ఈమె బదిలీ విషయంలో ఇటీవలే ఉద్యోగ విరమణ చేసిన ఎస్ఈ, ప్రస్తుత ఇన్చార్జి ఎస్ఈలు పనిగట్టుకొని మరీ కష్టపడటం. ఇటీవలే రిటైర్ అయిన ఎస్ఈ, కొందరు డిఈల, ఈఈల సహకారంతో సిఫారసు లేఖల కోసం ప్రయత్నాలు చేయడం కూడా చర్చనీయాంశం అవుతోంది.  కాగా తనకు క్యాన్సర్, కిడ్నీ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయని సదరు సూపరిటెండెంట్ కి సిఫారసు చేస్తూ ఇవే కారణాలతో బదిలీ చేయాలని చూస్తున్నారని కూడా తెలుస్తుంది. విశేషం ఏంటంటే ఈసారి బదిలీల్లో అనారోగ్య సమస్యలపై బదిలీలు చేసుకోవడానికి వీలు లేకుండా నిబంధనలు కఠినతరం చేసినా.. అదే కారణాలు చూపించడం.. బదిలీలు చేసే అధికారులు తనకు వత్తాసు పకడంతో తానే తన ట్రాన్స్ ఫర్ ఆర్డర్ ను ముందుస్తుగానే తయారు చేసేసుకొని.. జిల్లా కలెక్టర్ నోట్ ఫైల్ అప్రూవల్ కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే సూపరింటెండెంట్ల బదిలీల్లో జరుగుతున్న అక్రమాలపై సమాచారహక్కుచట్టం దరఖాస్తు దాఖలైనందును వచ్చే సమాచారం.. సదరు ఉద్యోగిని ఆరోగ్య సమస్యలపై నిజంగానే వైద్యాధికారులతో విచారణ చేపడితే దానికి కూడా ఈమెను ఎలాగైనా బదిలీ చేసేయాలని చూస్తున్న ఎస్ఈలు లిఖిత పూర్వకంగా చేసిన తప్పులను ఒప్పుకోవాల్సి వస్తుంది..!

visakhapatnam

2024-09-24 02:31:06

విశాఖ ఉక్కుకోసం ఉద్యమాలన్నీ వేస్టేనా..?!

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇది ఒకప్పటి మాట.. విశాఖ ఉక్కు కేంద్రం హక్కు ఇది నేటి మాట. అవును ఎవరు బాధపడినా.. మరెవరు ఆనందపడినా ఇది నిజం. కేంద్రప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన నిజం. విశాఖ కోసం నాడు చేసిన ఉద్యమం.. అదే విశాఖ కోసం నేడు చేస్తున్న ఉద్యమం కేంద్రానికి అస్సలు పట్టలేదు. సరికదా..కేంద్రంలోని ఖాయిలా పడ్డ పరిశ్రమల్లో విశాఖ ఉక్కు మాత్రమే ప్రధమ స్థానంలో ఉందని తేల్చి చెప్పింది. అంతేకాదు.. రాజ్యసభ సభ్యులు గొల్లబాబూరావు పార్లమెంటులో వేసిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వకంగా సమాధానం కూడా ఇచ్చారు. విశాఖ ఉక్కుని ఖచ్చితంగా ప్రైవేటు పరం చేసేస్తామని. ఇక మేటర్ క్లియర్ అయిపోయింది కదా..

 అయితే విశాఖ ఉక్కు (ఆర్ఐఎన్ఎల్)ను ప్రైవేటు పరం చేస్తే సహించం అని తెలుగుదేశం నాయకులు చెబుతున్నప్పటికీ  కేంద్రం మాత్రం ఆ దిశగా చక చకా అడుగులు వేసుకొని పోతోందని అధికారికంగా ప్రకటించడం పట్ల ఉత్తరాంధ్ర ఉప్పెనై పైకి లేస్తున్నా.. కూటమి ప్రభుత్వం విశాఖ ఉక్కు విషయంలో లిఖిత పూర్వక హామీ మాత్రం తేలేకపోయింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావుకు ఈనెల సెప్టెంబరు 10వ తేదీన రాసిన లేఖ ఈరోజు విశాఖలో ఆయన బయట పెడితే తప్పా అసలు విషయం బయటకు రాలేదు.. గత అయిదేళ్లగా వైఎస్సార్సీపీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వాలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం నుంచి నిర్ధిష్టమైన హామీ తీసుకురాలేకపోవడం విశాఖ ఉక్కు రాజకీయాలకు వేదికైంది.

 విశాఖ ఉక్కులో పెట్టుబడులను ఉపసంహరించుకోడానికి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఇప్పటికే ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి రాజ్య సభ సభ్యునికి రాసిన లేఖ వెల్లడించారు. అంతే కాకుండా ఆత్మ నిర్భర్ భారత్ పాలసీ ద్వారా కొత్త పబ్లిక్ సెక్టార్ పాలసీకి కేంద్రం అనుమతించిందని కూడా పేర్కొన్నారు. నాన్ స్ట్రాటజిక్ సెక్టార్లలో వుండే పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ ్స్ను ప్రైవేటు రంగానికి ఇచ్చేయడమో, లేదా మూసి వేయడమో చేస్తామని మంత్రి స్పష్టంగా ఈ లేఖలో తెలియజేశారు. అంతే కాదు ఉక్కు పరిశ్రమ నాన్ స్ట్రాటజిక్ సెక్టార్లో వుందని కూడా మంత్రి పంకజ్ చౌదరి గుర్తు చేస్తూ చావు కబురు చల్లగా చెప్పారు. దీనిని బట్టి చూస్తుంటే నాడు ఉక్కో కోసం చేసిన ఉద్యమాలు.. ఇపుడు దానిని కాపాడుకోవడం కోసం చేస్తున్న ఉద్యమాలు వేస్టేనని తేలిపోయింది.  ఎవరేమనుకున్నా విశాఖ ఉక్కు ప్రైవేటు పరం అయిపోయితుందనే అధికారిక లేఖ ఇపుడు రాష్ట్రంలో రాజకీయ దుమారం లేపుతోంది. మరోవైపు ఈ విషయమై అటు వైఎస్సార్సీపీ, ఇటు కూటమి ప్రభుత్వాలు ప్రజలను నేటికీ మభ్య పెడుతూనే ఉన్నాయి..

 విశాఖ ఉక్కుపై మీ స్టాండ్  ఏంటంటే మీ స్టాండ్ ఏంటంటూ మీడియా వేదిక ముష్టి యుద్దాలు కూడా చేసుకుంటున్నాయి. గత ప్రభుత్వం నుంచి సాగుతున్న ఈ వ్యవహారం కూటమి స్నేహబంధంలో ఆగుతుందని అంతా అనుకున్నారు. అయినా కేంద్రం తన పనిని తాను చల్లాగా చేసుకుపోతుందని తేలిపోయింది. ఎవరేమనుకున్నా మాకు వినపడదు.. కనపడదు.. అన్నట్టుగానే కేంద్రం వ్యవహరిస్తోంది. ఈ పరిస్థితుల్లో అటు వైఎస్సార్సీపీ, ఇటు కూటమి ప్రభుత్వాలు విశాఖ ఉక్కు కోసం చేస్తున్న ఉద్యమాలు చేస్తున్న కార్మికులకి, ఉత్తరాంధ్ర సెంటిమెంట్ అనుకున్న ఈ ప్రాంత ప్రజలకు కేంద్రం ద్వారా ఎలాంటి సమాధానం మళ్లీ రాజకీయంగా చెప్పిస్తారనేది కోటి డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. కేంద్రం అనుకున్నట్టుగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణా లేదంటే..ఉత్తరాంధ్ర ప్రజల మనోభవాలపై నీళ్లా.. కాదంటే రాజకీయంగా పైచేయా..? ఎవరు ఏం చేస్తారనేది కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.

visakhapatnam

2024-09-16 19:19:03

విశాఖ జిల్లా కలెక్టర్ నే బురిడీ కొట్టించారు..!

పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ల బదిలీల విషయంలో జోన్-1 ఎస్ఈలు(విశాఖ ఎస్ఈ కె.శ్రీనివాసరావు)  విశాఖ జిల్లా కలెక్టర్ నే బురిడీ కొట్టించారు. జిఓఎంఎస్ నెంబరు 75కి విరుద్ధంగా బదిలీలు జరుగుతున్నాయని.. ఈరోజు-ఈఎన్ఎస్ లు ఆధారాలతో సహా కథనాలు ప్రచురిం చాయి. దానిపై స్పందించిన విశాఖజిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ జోన్-1 యూనిట్ ఆఫీసర్ ను వివరణ కోరగా.. అంతా బాగానే జరుగుతున్నా యని.. పత్రికల్లో వచ్చిన కథనాలు ఆధారాలు లేవని ఉమ్ముతడిగా సమాధానం ఇచ్చారు. అయితే ఇదే విషయాన్ని గురువారం ఈరోజు ప్రధాన ప్రతినిధి జిల్లా కలెక్టర్ వద్ద స్వయంగా ప్రస్తావించారు. అంతేకాకుండా సూపరింటెండెంట్ల బదిలీల్లో జోన్-1 ఎస్ఈలు ఏవిధంగా వ్యవహరిస్తు న్నారో కూడా పూసగుచ్చినట్టు కలెక్టర్ కు వివరించారు. మరీ ముఖ్యంగా సూపరింటెండెంట్ ల బదిలీల్లో ఇప్పటికే పలు మార్లు ప్రభుత్వ ప్రయోజనాలను ఉపయోగించుకొని  శ్రీకాకుళం జిల్లాలో సూపరింటెండెంట్ గా ఉద్యోగం చేస్తూ.. ఆరోగ్యసమస్యలు, మహిళా, హ్యుమారిటే యన్  తదితర కారణాలతో  జివికనవల్లీ కుమారినే  సూపరింటెండెంట్ ఓడిపై విధులు చేస్తున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. 

దానికి సంబంధించిన ఆధారాలను కూడా జిల్లా కలెక్టర్ ఓడీ ఆర్డర్లు కూడా చూపించడంతో అసలు తన దృష్టికి ఓడిపై విశాఖలో విధులు నిర్వ హిస్తున్న అంశం ఎస్ఈలు తన దృష్టికి తీసుకు రాలేదన్నారు. 2024లో బదిలీలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేకపోయినా.. దరఖా స్తు చేసుకున్నారని.. సదరు నోట్ ఫైల్ పై ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన ఎస్ఈ బిఎస్.రవీంధ్ర సంతకం చేసిన వాటినే  ఫైనల్ చేస్తూ నేడు( సెప్టెంబరు 13న) ఆర్డర్లు కూడా ఇవ్వడానికి సిద్దపడిపోతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లడంతో అసలు నోట్ ఫైల్ పై తన అప్రూవల్ లేకుండా ఏ విధంగా బదిలీ చేస్తారని కలెక్టర్ సమాధాన మిచ్చారు. ఈ విషయాన్ని తాను స్వయంగా జోన్-1 బదిలీల అధికారి అయిన ఎస్ఈ లని పిలిపించి మాట్లాడతానని కూడా చెప్పారు. బదిలీల విషయంలో తేడాలు జరుగుతున్నాయని ఎస్ఈని వివరణ ఇవ్వమంటే ఏదో ఇచ్చా రు కానీ పూర్తిస్థాయి సమాచారం ఇవ్వలేదని కూడా కలెక్టర్ స్పష్టం చేశారు. దానితో ఈరోజు ప్రతినిధి మాట్లాడుతూ.. జిఓఎంఎస్ నెంబరు-75కి విరుద్దంగా జరిగిన బదిలీల ప్రక్రియపై ఏవిధమై చర్యలు తీసుకుంటారని ప్రశ్నించగా.. తొలుత ఎస్ఈతో మాట్లాడతానని.. ఇప్పటికే ప్రభు త్వం బదిలీలకు గడువు పెంచిన నందున.. ప్రభుత్వం ఇచ్చిన జీఓ ప్రకారం బదిలీలు జరిగేలా చూస్తామని చెప్పారు. 

ఒక ఉద్యోగి పదే పదే తనకు అనుకూలంగా ప్రభుత్వ ప్రయోజనాలను తన బదిలీల కోసం ఎలా వినియోగించుకుంటారని.. ఇలా చేయడం వలన మిగిలిన ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని కూడా కలెక్టర్ కు వివరించడంతో ఈ మొత్తం వ్యవహరంపై విచారణ చేయిస్తామని కూడా చెప్పారు. దీనితో నేడు నేరుగా బదిలీల ఉత్తర్వులు తీసేసుకుంటానని.. ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నవారికి జిల్లా కలెక్టర్ ఆదేశం అడ్డుకట్ట పడినట్టు అయ్యింది. అంతేకాకుండా ఈ మొత్తం వ్యవహారంపై సమాచారహక్కు చట్టం దరఖాస్తు కూడా దాఖలు కావడంతో దానికి కూడా పంచాయతీరాజ్ జోన్-1 అధికారులు లిఖిత పూర్వకంగా సమాధానం చెప్పాల్సి వుంటుంది. ఒక వేళ ఇప్పుడు సమాచారం ఇవ్వకుండా బదిలీలు జరిగిపోయిన తరువాత సమాచారం ఇచ్చినా.. వాస్తవాలు, చేసిన తప్పులు బయటపడినపుడు జిల్లా కలెక్టర్ ను కావాలనే పంచాయ తీరాజ్ ఎస్ఈలు సూపరింటెండెంట్ జివి. కనవల్లీ కుమారికి ప్రయోజనం చేకూర్చడానికి ప్రజాప్రతినిధిలు ఇచ్చిన సిఫారసు లేఖలు కూడా పక్కనపెట్టి నడిపించిన కథ మొత్తం బయటకు వస్తుంది. 

ఇప్పటికే పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ల బదిలీల విషయంలో జరిగిన అడ్డగోలు వ్యవహారాన్ని ఈఎన్ఎస్-ఈరోజు మొత్తం బయట పెట్టింది. అపుడు సమాచార హక్కు చట్టం ద్వారా సమాధానం వస్తే అధికారులే ఈ బదిలీల విషయంలో అర్హత లేనివారికి కూడా బదిలీలకు అవకాశం కల్పించారని రుజువు అవుతుంది. దానితో జిల్లా కలెక్టర్ ను ఒక ఉద్యోగిని కోసం బురిడీ కొట్టించి మరీ బదిలీలు చేశారని వారంతట వారే లిఖిత పూర్వకంగా ఒప్పుకున్నట్టు అవుతుంది.  ఇలా జరగకుండా ఉండేందుకు విశాఖ జిల్లా కలెక్టర్ నోట్ ఫైల్ అప్రూవల్ కూడా లేకుం డా మొత్తం వ్యవహారం తమ అనుకూలితల కోసం పాత ఎస్ఈ సంతకాన్ని బూచీగా చూపి కథ నడిపించేద్దామనుకున్న విశాఖపట్నం ఎస్ఈ కె.శ్రీవాసరావు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా గతంలో ఆమెకోసం అనకాపల్లి ఎమ్మెల్యే కాళ్లావేళ్లా పట్టుకొనైనా సిఫారసు లేఖ తీసుకొస్తానని.. ఆమెకు అనకాపల్లి బదిలీ చేయడానికి ట్రాన్స్ ఫర్ ఆర్డర్ కూడా తయారు చేయాలని సిబ్బందికి సూచించారట. అయితే ఇక్కడ  జోన్-1 యూనిట్ ఆఫీసర్, ఎస్ఈ మాత్రం జిల్లా కలెక్టర్ ఆదేశాలు, ప్రభుత్వ నిబంధనల మేరకే బదిలీలు చేయడానికి సిద్దపడినట్టు సమాచారం అందుతుంది. ఈ విషయాన్ని ఈఎన్ఎస్-ఈరోజు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లడంతో విశాఖ ఎస్ఈకి గొంతులో పచ్చి వెలక్కా య్ పడ్డట్టు అయ్యింది. మొన్నటి వరకూ నియోజకవర్గానికి సంబంధం లేని ప్రజా ప్రతినిధి సిఫారసు లేఖను అడ్డం పెట్టంకొని కొన్ని ఎలాగైనా బదిలీచేయాలని చూస్తే.. సదరు నియోజకవర్గం నుంచి లేఖలు ఇచ్చిన ప్రజాప్రతినిధులు బదిలీ అధికారులకు ఫోన్లు చేయడంతో ఆ విషయా న్ని పక్కన పెట్టేశారు.

 ప్రభుత్వం ఇచ్చిన జీఓ ప్రకారం బదిలీ చేయాలంటే వీలుపడదని.. మహిళా ఉద్యోగి, ఆరోగ్య సమస్యలు, మానవీయ కోణాన్ని బూచిగా చూపి బదిలీ చేయాలని చూస్తే.. ఆ ప్రయోజాన్ని కూడా సదరు సూపరింటెండెంట్ జివి.కనవల్లీ కుమారి ప్రస్తుతం వినియోగించేసుకొని శ్రీకాకుళం ఉద్యోగాన్ని విశాఖ పంచాయతీరాజ్ లో చేస్తున్నారు. ఇపుడు ఆ విషయాన్ని కూడా జిల్లా కలెక్టర్ దృష్టికి మీడియా తీసుకెళ్లడంతో ఒక ఉద్యోగిని ప్రయోజనం చేకూర్చడానికి ఎన్నిసార్లు అధికారులు ఆమెకు అనుకూలంగా వ్యవహరిస్తారని ప్రశ్నించడం మొదలు పెట్టారు. అంటే ఇక్కడ ఏ విధంగానైనా సదరు ఉద్యోగిని కోరుకున్న చోటుకి బదిలీ చేయాలన్నది జోన్-1 పంచాయతీరాజ్ ఎస్ఈలలో విశాఖపట్నం ఎస్ఈకి అత్యు త్సాహం ప్రదర్శిస్తున్నట్టు స్పష్టమవుతున్నది. ఇంత మొండిగా ప్రభుత్వ జిఓని కూడా పక్కన పెట్టి  వ్యవహరిస్తున్నారంటే ఏ స్థాయిలో మనీ లాభీయింగ్ జరిగిందనేది స్పష్టంగా అర్ధం చేసుకోవచ్చు. పైగా ఎన్నికారణాలు, లోపాలు బయటపెట్టినా ఎలాగైనా బదిలీ చేయడానికే ఎస్ఈలు చూపించే అత్యత్సాహానికి జిల్లా కలెక్టర్ మలి విచారణ అడ్డుకట్ట వేయనున్నది. చూడాలి.. జోన్-1 లోని, విశాఖ ఎస్ఈ కె.శ్రీనివాస్ లు ఈమె కోసం మరోసారి విశాఖ జిల్లా కలెక్టర్ ను ఏ విధంగా ముగ్గులోకి దించే ప్రయత్నం చేస్తారో.. ఏ ప్రభుత్వ ప్రయోజనాన్ని ఆమె బదిలీకోసం విని యోగిస్తారనేది..!

visakhapatnam

2024-09-12 19:07:47

అడ్డగోలు బదిలీలపై ఆర్టీఐ దాఖలు..!

పంచాయతీరాజ్ శాఖలోని జోన్-1(విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం) సూపరింటెండెంట్ల బదిలీల్లో జరుగుతున్న అక్రమాలు ఆధా రాలతో సహా నిగ్గుతేల్చేందుకు.. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి జిల్లా ప్రభుత్వశాఖల చైర్మన్, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం దరఖాస్తు దాఖలైంది. అర్హత లేకపోయినా కాసులకు కక్కుర్తి పడిన బదిలీ అధికారులు జిఓనెంబరు 75లోని ప్రధాన నిబంధ నలను పక్కన పెట్టి మరీ సూపరింటెండెండ్లను అడ్డగోలుగా బదిలీ చేయడానికి రంగం సిద్దం చేసేసుకున్నారు. ఈ విషయాన్ని ఈఎన్ఎస్-ఈరోజు ఆధారాలతో సహా బయట పెట్టడంతో విశాఖజిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మొత్తం వ్యవహారానికి సంబంధించిన పూర్తిస్థాయి నివేది కలు ఇవ్వాలని ఇద్దరు ఎస్ఈలను వివరణ కోరిన సమయంలోనూ వారు అంతా సక్రమంగా జరిగిందంటూ జిల్లా కలెక్టర్ ను మాటలతోనే బురిడీ కొట్టించారు. ఈ బదిలీల్లో జివికనకవల్లీ కుమారి అనే సూపరింటెండెంట్ ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తూ.. రెండేళ్లుగా ఓడీపై విశాఖలోనే పనిచేస్తున్నారు. 

శాస్తవానికి సదరు ఉద్యోగినికి బదిలీకి దరఖాస్తు చేసుకునే అర్హత 2024 పంచాయతీరాజ్ శాఖలోని జిఓఎంఎస్ నెంబరు -75 ప్రకారం అర్హత లేదు. కానీ ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన విశాఖ పంచాయతీరాజ్ సర్కిల్ ఎస్ఈ బిఎస్.రవీంధ్ర తాను రిటైర్ కావడానికి ఒక్కరోజు ముందు గానే ఆమె బదిలీకి సంబంధించిన నోట్ పైలుపై సంతకం చేసేశారు. దీనితో మిగిలిర రెండు జిల్లాల ఎస్ఈలు కూడా తలూపారు. ఇదంతా అక్రమమని బదిలీల్లో తమకు అన్యాయం చేసి.. ఆమెకు మాత్రం అడ్డదారిలో న్యాయం చేశారని అర్హులైన ఉద్యోగులు డిప్యూటీ సీఎం కార్యాలయానికి మీడియాకి ఫిర్యాదులు చేశారు.  విషయం బయట పడటంతో విచారణకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇంత జరిగినా పెద్ద ఎత్తున బదిలీలకు నగదు చేతులు మారడంతో రిటైర్ అయిన ఎస్ఈ సంతకాలు చేసిన ఫైలు, వ్యవహారం పై తానేమీ చేయలేనని ప్రస్తుత ఇన్చార్జి ఎస్ఈ కె.శ్రీనివాసరావు సదరు ఉద్యోగినికి న్యాయం అడ్డదారిలో అనకాపల్లి జిల్లాకి బదిలీ చేయడం కోసం చక చకా ఫైళ్లు కదిపేశారు. అయితే పంచాయతీరాజ్ లోని బదిలీలు చేపట్టే ఎస్ఈల అడ్డగోలు వ్యవహారాన్ని ఆధారాలతో బయటకు తీసేందుకు ఈ బదిలీ వ్యహారానికి సంబంధించిన 11 కీలకమైన అంశాలకు సంబంధించి సమాచారహక్కు చట్టం దరఖాస్తు జిల్లా ప్రభుత్వశాఖల చైర్మన్, విశాఖజిల్లా కలెక్టర్ కార్యాలయంలో దాఖలైంది. 

ఈ దరఖాస్తుకి సంబంధించి సమాచారం రావడానికి నెలరోజు సమయం పడుతుంది. అయితే ఈ 15లోగా బదిలీల ప్రక్రియ మొత్తం పూర్తయి పోతుంది. ఈ బదిలీల్లో అక్రమార్కులను బదిలీలు చేసేసినా.. సమాచార హక్కు చట్టం క్రింద దాఖలైన దరఖాస్తుకి సమాచారం లిఖిత పూర్వకంగా ఇస్తే.. అర్హులైన వారికి కావాలనే అన్యాయం చేస్తే.. రిటెన్షన్ ఇచ్చినట్టు.. బదిలీలు చేపట్టిన వివరాలతో కూడి సమాచారం ఇవ్వా ల్సి వస్తుంది. అలా ఇచ్చిన ఆధారాలతో బాధితులు కోర్టును ఆశ్రయిస్తే ఉద్దేశ్య పూర్వకంగానే బదిలీ చేసే అధికారులు వారికి కావాల్సిన ఉద్యోగులకు అర్హత లేకపోయినా బదిలీలు చేపట్టినట్టు ఆధారాలతో సహా రుజువవుతుంది. దానితో జిల్లాశాఖ చైర్మన్, జిల్లా కలెక్టర్ తో పాటు, బదిలీలు చేసే అధికారులు కూడా కోర్టుకి సమాధానం చెప్పాల్సి వుంటుంది. ఖచ్చితంగా పరిపాలనా పరమైన అంశం కావడంతో ముందుగా జిల్లా కలెక్టర్ ఎస్ఈలు కావాలని, జిఓనెంబరు-75 ఉల్లంఘించినట్టు తేలినా..ఎస్ఈలపై చర్యలు తీసుకోని అధికారిగా కూడా ముద్ర పడే అకకాశాలున్నాయి. అందులోనూ ఈ బదిలీలకు సంబంధించి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, అసెంబ్లీ స్పీకర్ఇచ్చిన సిఫారసు లేఖలకు కూడా వక్రీకరించి చేపట్టిన బదిలీల వ్యవహారం కావడంతో మొత్తం వ్యవహారం రచ్చ రచ్చ అయ్యే అవకాలున్నాయి.

 ఈ మొత్తం వ్యవహారం సూపరిటెండెంట్ జివి.కనకవల్లీ కుమారి కోసమే చేసినట్టుగా ఆర్టీఐలో కోరిన సమాచారంతోనే రుజువవుతుంది. ప్రస్తు తానికి బదిలీల ప్రక్రియ ఈనెల 15 వరకూ ఉన్నప్పటికీ.. 13నే నోట్ ఫైల్ పై సంతకాలు పూర్తయిన వారికి ట్రాన్స్ ఫర్ ఆర్డర్లు ఇస్తామని ఇప్ప టికే కబుర్లు పెట్టేశారు ఎస్ఈ కార్యాలయం సిబ్బంది. ఈ తరుణంలో జిల్లా కలెక్టర్ ఈ అక్రమ బదిలీల వ్యవహారాన్ని పూర్దిగా రద్దు చేయా లంటే రీ-కౌన్సిలింగ్ తప్పా మరో మార్గం లేదు. రీ-కౌన్సిలింగ్ చేపడితే అర్హులకు న్యాయం జరిగి.. అనర్హులకు అసలు బదిలీలకు దరఖాస్తు చేసు కునే అవకాశం కూడా లేకుండా పోతుంది. ఇంకా పంచాయతీరాజ్ ఎస్ఈలు ఈ మొత్తం బదిలీల ప్రక్రియకు సంబంధించి జిల్లా కలెక్టర్ కోరిన నివేదికలు ఇవ్వనందున.. కలెక్టర్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది..!

visakhapatnam

2024-09-05 07:42:38

ఆమె కోసం రాత్రికి రాత్రే నోట్ పైల్ పై సంతకం..!

కాదేదీ పంచాయతీ రాజ్ ఎస్ఈలకి  ఆఖరి రోజు కూడా అక్రమ ఆదాయానికి, అడ్డగోలు వ్యవహారానికి రాచమార్గం.. ఏంటి మీకు డౌట్ వస్తుంది కదూ ఇది పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ల తేడా బదీలీల కోసమేనని.. నిజమేనండి అదే.. అర్హత లేని ఉద్యోగిని జివి.కనకవల్లీ కుమారిని శ్రీకాళుం జిల్లా నుంచి అనకాపల్లి జిల్లాకు బదిలీచేసేస్తున్నట్టు రిటైర్ అవ్వడానికి ముందురోజు రాత్రి విశాఖపట్నం పిఆర్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్  బిఎస్.రవీంధ్ర బదిలీలకు సంబంధించిన పత్రాలపై సంతకాలు చేసేశారు. అదీ ఎందుకంటే సూపరింటెం డెంట్ల బదిలీల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఈఎన్ఎస్-ఈరోజు సంయుక్తంగా అడ్డగోలు వ్యవహారాన్ని బయటపెట్టాయి. దీనితో ఎక్కడ తన బదిలీ ఆగిపోతుందోనని భయ పడిన జివి.కనవల్లీ కుమారి ఎస్ఈ రిటైర్ మెంటుకి ముందురోజే నోట్ ఫైల్ పై సంతకం చేయించే సుకున్నారు.. దీనితో భారీ మొత్తంలో నగదు చేతులు మారిన కారణంగానే అసలు బదిలీకి అర్హత లేకపోయినా ఈమెకోసం సంతకాలు చేసినట్టుగా రుజువైంది. పక్కా పథకం ప్రకారం ముందుగానే సంతకాల వ్యవహారాన్ని చక్కబెట్టేశారన్నమాట. అంతేకాకుండా 31వ తేది నుంచి నేటి వరకూ బదిలీల విషయంలో జరుగుతున్న అక్రమాలపై మీడియాలో వరుస కథనాలు వస్తున్నా.. ఇన్చార్జి ఎస్ఈగా ఉన్న కె.శ్రీనావాసరావు సైతం ఈ వ్యవహారంపై సదరు ఉద్యోగిని వివరణ కోరలేదు సరికదా.. రిటైర్ అయి వెళ్లిపోయిన ఎస్ఈ బిఎస్.రవీంధ్ర సంతకం చేసేసిన నోట్ ఫైల్ ను తాను తిరిగి మార్చలేనని భీష్మించుకు కూర్చుకున్నారు. 

వాస్తవానికి జీఓఎంఎస్ నెంబరు 75కి విరుద్ధంగా జరిగిన ఈ బదిలీలను జోన్-1 పరిధిలోని ఎస్ఈలు ఏ ఒక్కరైనా వ్యతిరేకించాల్సి వుంది. నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేయాల్సి వుంది. లేదంటే ఈ విషయాన్న జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంది. ఇక్కడ ఎవరూ వ్యతిరేకించకపోగా.. ఆమెకోసం మొత్తం వ్యవహారం మొత్తం సాఫీగానే సాగిపోయిందని.. బదిలీ ఉత్తర్వుల కోసం 13న రావాలని ఉద్యోగులకు అనధికార ఆదేశాలు కూడా జారీ చేశారు. వాస్తవానికి బదిలీలు చేసే సమయంలో ఉద్యోగులకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, శాసన సభ స్పీకర్ ఇలా ఎవరు సిఫారసు లేఖలు ఇచ్చినా సదరు నియోజకవర్గ పరిధిలోని ఉద్యోగులకు మాత్రమే బదిలీలు చేసే అధికారులు పరిగణలోనికి తీసుకోవాల్సి వుంది. కానీ అప్పటికే శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తూ.. ఓడిపై రెండేళ్లు విశాఖలోనే పనిచేస్తూ.. మళ్లీ అనకాపల్లిజిల్లా బదిలీకోసం ప్రక్కనియోజవకర్గం ఎమ్మెల్యే లేఖతో ఈమె తన బదిలీని రిటైర్ అయిన ఎస్ఈ  బిఎస్.రవీంధ్ర సంతకాలు తీసేసుకోగలిగారు. జోన్-1 పరిధిలో బదిలీలు చేసే సమయంలో ముగ్గురు ఎస్ఈలు అనుకునే ముందుగానే సంతకాలు చేసేశారు. అయితే ఈ అక్రమ బదిలీలపై 30న ‘ఈఎన్ఎస్-ఈరోజు’ కథనాలు బయటపడటంతోపాటు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయానికి కూడా ఫిర్యాదులు వెళ్లినా.. మిగిలిన ఇద్దురు ఎస్ఈలు ఈమె బదిలీ విషయంలో అస్సలు వెనక్కి తగ్గలేదు. 

సూపరింటెండెంట్ల అడ్డగోలు బదిలీలపై మీడియాలో వచ్చిన కథనాలపై విశాఖ జిల్లా కలెక్టర్ నివేధిక కోరిన తరువాత కూడా నేటికీ అక్రమాల వ్యవహారాన్ని మాత్రం జిల్లా కలెక్టర్ ముందు ఉంచలేదు. కలెక్టర్ వివరణ కోరినపుడు కూడా బదిలీలను అంతా జీఓ ప్రకారమే చేసుకొని మాత్రమే వచ్చామని జిల్లా కలెక్టర్ ను కూడా బురిడీ కొట్టించారంటే ఇక్కడ ఎస్ఈలు ఏ స్థాయిలో లాలూచీ పడ్డారో అర్ధం చేసుకోవచ్చు.  వాస్తవానికి అర్హత లేని ఉద్యోగులను బదిలీలకు పరిగణలోనికి తీసుకోవడమే తప్పు.. అందునా ఈ విషయం మీడియాలో బహిర్గతం అయిన తరువాత కూడా రిటైర్ కావడానికి ఒక్కరోజు ముందుగా ఈమె బదిలీ కోసం నోట్ పైల్ పై ముగ్గురు ఎస్ఈలు సంతకాలు చేయడం రెండో తప్పు.. ఈమె కోసం ఇతర జిల్లాల్లోని సూపరింటెండెంట్లకు బదిలీ అర్హత ఉన్నా కూడా జిఓలోని నిబంధనలను పక్కనపెట్ట  వారిని కూడా  రిటెన్షన్ చేయడం మూడో తప్పు.. ముగ్గురు ఎస్ఈలు చేసిన నోట్ ఫైల్ విషయం నేటికీ కలెక్టర్ ముందు ఉంచకపోవడం  నాల్గవ తప్పు. ఇవన్నీ ఆగస్టు 31 నుంచి నేటి వరకూ మీడియాలో కథనాలు వస్తున్నా వాటిని పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరించడం ఐదవ తప్పు ఇలా.. ఒక ఉద్యోగిని కోసం ఎస్ఈలు తప్పులు మీద తప్పులు చేస్తున్నారంటే.. ఏ స్థాయిలో ఆర్దిక లావాదేవీలు.. ప్రభుత్వ జీఓల ఉల్లంగన.. నియోజవర్గాల ఎమ్మెల్యేల లేఖలు అపహాస్యం అయ్యారో మూడు జిల్లాల కలెక్టర్లు గుర్తించాల్సి ఉంది. 

ఇంత పెద్దస్థాయిలో అక్రమాలు జరిగిన పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ల బదిలీలపై విశాఖ జిల్లా కలెక్టర్ రీ-కౌన్సిలింగ్ ఆదేశిస్తే తప్పా అక్రమాలకు అడ్డుకట్ట పడే పరిస్థితి లేదు. ఇదే విషయమై ఈఎన్ఎస్-ఈరోజు విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లగా.. ప్రస్తుతం జరిగిన బదిలీలపై ఎస్ఈలను వివరణ కోరామని.. నివేధికలు రావాల్సి ఉందని.. వారిచ్చిన వివరణ ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోప్రక్క తమ నియోజవర్గంలోని ఉద్యోగుల బదిలీల కోసం ఇచ్చిన సిఫారసు లేఖలు పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అసెంబ్లీ స్పీకర్ సైతం గుర్రుగా ఉన్నారు. ఇదేనా జిల్లా జిల్లాలో ప్రజాప్రతినిధులకు జిల్లా యంత్రాంగం ఇచ్చే గౌరవం అంటూ మండి పడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఒక కొలిక్కి రావాలన్నా.. బాధితులకు న్యాయం జరగాలన్నా రీ-కౌన్సిలింగ్ పెడితే న్యాయం జరగడంతోపాటు, ఎస్ఈలు చేసిన అడ్డగోలు వ్యవహారాలు బయట పడతాయని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాగా రేపో, మాపో డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి కూడా ఈ అక్రమ బదిలీలపై ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. చూడాలి ఏం జరుగుతుందనేది..!

visakhapatnam

2024-09-04 15:50:15

పంచాయతీరాజ్ లో అడ్డుగోలు బదిలీలకు అడ్డుకట్ట..నివేదిక కోరిన జిల్లా కలెక్టర్

పంచాయతీరాజ్ లోని సూపరింటెండెంట్ ల అడ్డగోలు బదిలీలకు విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అడ్డు కట్ట వేశారు. అర్హత లేకపో యినా కావాల్సిన చోటుకి బదిలీలు చేయడానికి జోన్-1వలోని మూడు జిల్లాల ఎస్ఈలతో కలిసి చక్కబెట్టిన తేడా వ్యవహారానికి కలెక్టర్ ఆదేశా లతో బెడిసికొట్టాయి. పంచాయతీరాజ్ రాజ్ లో జీఓనెంబరు 75కి విరుద్ధంగా జరుగుతున్న వ్యవహారాలపై ఈఎన్ఎస్-ఈరోజులు సంయుక్తంగా వరుస కథనాలు ఆధారాలతో సహా ప్రచురించాయి. దీనితో ఆగ్రహం వ్యవక్తం చేసిన జిల్లా కలెక్టర్ ఇద్దరు ఎస్ఈలని కలెక్టరేట్ కి రప్పించారు. ఏంటి బదిలీల వ్యవహారం.. అసలు సూపరింటెండెంట్ ల బదిలీల్లో ఏం జరుగుతుంది.. రోజూ మీడియాలో దీనికి సంబంధించి ఎందుకు వ్యతిరేక వార్తలు వస్తున్నాయి.. అసలు మీరు బదిలీల్లో ఏం చేశారు.. ఎవరికి అన్యాయం చేస్తున్నారు.. మరెవరికి మేలు చేయడం కోసం ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారు.. అసలు జీఓ ప్రకారమే బదిలీలు చేస్తున్నారా.. కావాల్సిన వారికోసం జీఓ నిబంధనలను పక్కన పెట్టేశారా.. ఇప్పటి వరకూ జరిగిన బదిలీలకు సంబంధించిన జీఓ, నిబంధనలపై పూర్తిస్థాయిలో నివేదిక కావాలని ఆదేశించారు. కలెక్టర్ ఆగ్రహంతో అడగటంతో  బదిలీ అధికారుల్లో ఒణుకు మొదలైంది. సూపరింటెండెంట్ ల బదిలీల్లో ప్రస్తుతా తాజాపరిస్థితి జోన్-1లో జరుగుతున్న బదిలీల ప్రక్రియపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశించడంతో.. శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తున్న జివి.కనకవల్లీ కుమారికి అనకాపల్లి జిల్లా బదిలీ చేయడానికి  పీఆర్ ఎస్ఈలు మ్.శ్రీనివాసరావు(ఎస్.ఇ, పి.అర్- శ్రీకాకుళం) బి.ఎస్. రవీంద్ర(ఎస్.ఇ, పి.అర్ - విశాఖపట్నం), యూ.వి ప్రసాద్ (ఈ.ఈ, పి.ఆర్ - క్వాలీటి కంట్రోల్ విశాఖపట్నం)లు చేసిన కార్యాచరణ మొత్తం ఇపుడు కలెక్టర్ ముందు ఉంచాల్సి వచ్చింది.

బదిలీల్లో ఎస్ఈలు కావాలని చేసిన తేడా వ్యవహారం.. వారికి కావాల్సిన వారికోసం అడ్డగోలుగా చక్కబెట్టిన వైనం ఒక్కసారి తెలుసుకుంటే..  బి.శ్రీనివాసరావు సూపరింటెండెంట్, ఈ.ఈ.పి.ఐ.యూ సదరు అధికారి పాడేరులో ఆరేళ్లు పూర్తి అయ్యాయి. జి. ఓ. ఎమ్.ఎస్.నెం. 75 ప్రకారం ఏజెన్సీ ఏరియాలో రెండేళ్లు  పూర్తైన వ్యక్తిని వారి కోరిన చోట బదిలీ చేయమని జి.ఓ.లో ఉన్నది కాని అలా చేయకుండా ఇతనిని  పాడేరు ఏజెన్సీలోనే రిటన్షన్ ఇచ్చారు. అది ఏ జీఓ ప్రకారంగా చేశారో పర్యవేక్షక అధికారులు జిల్లా కలెక్టర్ కు, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శికి  నివేదికలు సమర్పించాల్సి ఉన్నది.  ఇక  ఆర్.నాగరాజు సూపరింటెండెంటు, డి.పి.ఆర్.ఈ.ఓ ఆఫీస్ అనకాపల్లిలో పనిచేస్తున్న ఇతనని రెండేళ్లు నిండకపోయినా  పి.ఆర్.ఐ. డివిజన్ టెక్కలికి బదిలీ చేశారు. ఇతని స్థానంలో సూపరింటెండెంట్ జి.వి. కనక వల్లీ కుమారిని ఓ ఎమ్మెల్యే ఇచ్చిన శిఫారసు లేఖ ఆధారంగా చూపి అనకాపల్లికి బదిలీచేసేశారు. అంటే ఇక్కడ నిభందనలు ఏమీ పరిగణలోనికి తీసుకోలేదు.. 

ఈమెను బదిలీ చేయడానికి కానీ ఈమెకు అనుకూలంగా అనకాపల్లి జిల్లాలో  ఏ ఎమ్మెల్యే కూడా సిఫారసు లేఖా ఇవ్వలేదు. కానీ ఇచ్చినట్టుగా అధికారులను మభ్య పెట్టి అమాయకులైన  ఆర్. నాగరాజు ని ఆమె స్థానంలోనికి పంపేశారు. ఇక్కడ పెద్ద మొత్తంలో చేతులు మారిన కారంణంగానే లేని ఎమ్మెల్యే సిఫారసు లేఖను బూచిగా చూపించినట్టు తేటతెల్లం అయ్యింది. ఈయనను కె.ఎస్.కె.శోభా రాణి స్థానంలో బదిలీ చేశారు. ఈమె పై ఎ.సి.బి. కేసుతోపాటు శాఖాపరమైన కేసులు కూడా ఉండటం విశేషం. బదిలీ అయిన స్థానానికి వెళ్లకపోతే ఇక్కడ ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తామని కూడా సదరు అధికారిని బెదిరించడం కొసమెరుపు.  ఎస్.రమేష్ ఈయన జూనియర్ అసిస్టెంట్ పాడేరు డివిజన్ లో ఏడేళ్లు సర్వీసు పూర్తిచేసుకొని బదిలీలకు దరఖాస్తు చేసుకుంటే.. జీఓ ప్రకారం కోరిన ప్రదేశానికి బదిలీ చేయాల్సి ఉండగా  ఇతనని కూడా పాడేరు ఏజెన్సీలోనే రిటన్షన్  చేసేశారు. ప్రభుత్వం బదిలీల జీఓ ఒక్క శాతం కూడా పరిగణలోనికి తీసుకోకుండా అంతా మా ఇష్టం అన్నరీతిలోనే బదిలీలను చేయి తడుపు వ్యవహారంలో చక్కబెట్టేశారు.

మరో విశేషం ఏంటంటే సదరు సూపరింటెండెంట్ జి.వి. కనక వల్లీ కుమారి శ్రీకాకుళంలో పనిచేయాల్సి ఉండగా..విశాఖపట్నంలో కూడా ఓ.డి బేసిస్ మీద గత రెండేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నారు. ఇక్కడే ఓడీలో పనిచేస్తున్న అధికారి బదిలీల్లో ఖచ్చితంగా వెనక్కి వెళ్లాల్సి ఉంది. లేదా జీఓ ప్రకారం కోరుకున్న అధికారుల బదిలీలు జరగగా ఖాళీ ఉన్న ప్రదేశాల్లోకి బదిలీపై వెళ్లాలి. కానీ ఇక్కడకి దగ్గర్లోని అనకాపల్లికి చాలా చాకచక్యంగా బదిలీ చేయించుకుంటున్నారు. ప్రభుత్వం జీఓ ఈ అధికారిణి బదిలీ విషయంలో చేతి వ్యవహారం ముందు మోకరిల్లాల్సి వచ్చింది. చక్రం తిప్పే నేర్పు ఉంటే ఏ విధంగా నైనా బదిలీలు చేయించుకోవచ్చునని.. దానికోసం బదిలీలు చేసే అధికారులు కూడా వారికి అనుకూలంగానే పనిచేస్తార విషయం పంచాయతీరాజ్ శాఖలోని బదిలీల్లో చాలా క్లియర్ గా కనిపించింది. జి.గంగారామ్ సూపరింటెండెంట్ మూడు నెలల సర్వీసు చేసిన వ్యక్తిని అడ్డగోలుగా విజయనగరానికి బదిలీచేసేశారు. ఇలా ఒకటి కాదు రెండు ఇష్టానుసారం బదిలీలు చేశారు అధికారులు. వీటన్నింటికీ బదిలీల ఉత్తర్వులే సాక్షిగా నిలుస్తున్నాయి. ఈ విషయాలను బయటకు రానీయకుండా ఉండేందుకుందు, ఒక వేళ తమపై మీడియాలో  కథనాలు వచ్చినా వెనుక నుంచి రక్షించేందుకు ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారని.. ఎవరేం చేసుకున్నా పర్లేదంటూ హుకుం కూడా జారీ చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ఈమె విషయంలో బదిలీ అధికారులు ఏం చేశారో.. అవన్నీ ఇపుడు కలెక్టర్ నివేదికలో అక్షరం పొల్లుపోకుండా సమర్పించాల్సి వుంటుంది. అదే జరిగితే ఇక్కడ బదిలీ అధికారులైన ఎస్ఈలు జిఓనెంబరు 75కి పూర్తిగా విరుద్ధంగా చేసినట్టుగా కలెక్టర్ కోరిన నివేదికలో ఒప్పుకున్నట్టు అవుతుంది. 

అపుడు ఖచ్చితంగా కలెక్టర్ కూడా ఇప్పటి వరకూ జరిగిన బదిలీల ప్రక్రియ నిలుపుదలచేసి.. అర్హులైన ఉద్యోగులకు బదిలీలు చేయాలని ఆదేశించాలి జీఓలో ఉన్న నిబంధనల ప్రకారం. కానీ ఇపుడు జోన్-1లోని ఎస్ఈలు కలెక్టర్ కోరిన నివేదికలో మళ్లీ సదరు జివి కనకవల్లీ కుమారి విషయాన్ని గానీ.. ఇద్దరు ఉద్యోగులకు రిటెన్షన్ ఇచ్చిన విషయాన్ని గాని పొందుపరచకపోతే అన్యాయం జరిగిన ఉద్యోగులంతా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెబుతున్నారట. అదే జరిగితే అపుడు బదిలీల చేసిన ఎస్ఈలు, జిల్లా కలెక్టర్, పంచాయతీరాజ్ కమిషనర్ లతో సహా కోర్టుకి హాజరు అయ్యే అవకాశం వుంటుంది. కానీ ఒక సూపరింటెండెంట్ కోసం ఎస్ఈలు నివేదికలు మార్చి కలెక్టర్ బురిడీ కొట్టించే సాహసం చేస్తారా లేదా అన్నది ఇపుడుఆశక్తి కరంగా మారింది. పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ బదిలీల కోసం పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారడంతోనే కొందరు ఉద్యోగుల కోసం బదిలీలు చేసే అధికారులు నేటికీ వారిని వెనుకేసుకు వస్తూ..వారికి న్యాయం చేసి.. మిగిలిన వారికి అన్యాయం చేయాలని చూస్తున్నారని బాధిత ఉద్యోగులు వాపోతున్నారు. ఈ మొత్తం ప్రక్రియను ఈఎన్ఎస్-ఈరోజులు ఎప్పటికప్పుడు బయటపెట్టడంతో.. తొలుత లైట్ తీసుకున్న అధికారులు నేరుగా జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగి నివేదికలు కోరడంలో ఎస్ఈలకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికైనా ఎస్ఈలు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఆమెను పక్కన పెట్టి.. అర్హులకు జిఓనెంబరు 75 ప్రకారం న్యాయం చేస్తారా..? లేదంటే ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకే ఉత్తర్వులు ఇస్తారా.. అసలు జిల్లా కలెక్టర్ నివేదిక తరువాత మొత్తం సీన్ మారుతుందా లేదా అనేది ఆశక్తి కరంగా మారింది...!

visakhapatnam

2024-09-03 05:59:52

ఆమెకి అడ్డదారిలో ఆర్డర్ ఇద్దామా వద్దా..?!

జోన్-1 పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ల బదిలీల్లో అర్హత లేకపోయినా ఆ.. ఉద్యోగిని అడ్డగోలుగా తానుకోరుకున్న చోటుకి బదిలీ చేయించుకోవడానికి అన్ని దారులూ వెతుకుతోంది. ఆమె కోసం ఏం చేయడానికైనా సిద్దంగా ఉన్నామని ఇప్పటికే జిఓ నెంబరు 75ని అపహాస్యం చేశారు  పీఆర్ ఎస్ఈ  మ్.శ్రీనివాసరావు(ఎస్.ఇ, పి.అర్- శ్రీకాకుళం) బి.ఎస్. రవీంద్ర(ఎస్.ఇ, పి.అర్ - విశాఖపట్నం), యూ.వి ప్రసాద్ (ఈ.ఈ, పి.ఆర్ - క్వాలీటి కంట్రోల్ విశాఖపట్నం)లు. విశాఖ జిల్లా కలెక్టర్ జిఓఎంఎస్75ని పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ బదిలీలో అధికారులే బుట్టదాఖలు చేసిన విషయంపై విచారణ చేపట్టడంతో సదరు ఉద్యోగినికి ఆమె కోరుకున్న చోటుకి అంటే శ్రీకాకుళం జిల్లా నుంచి అనకాపల్లికి బదిలీ చేసేయాలా..? వద్దా..  అనే  దొడ్డిదారి వ్యవహారం రసకందాయంలో పడింది. అయితే ఇక్కడి తేడా బదిలీల విషయాన్ని ఈఎన్ఎస్-ఈరోజు బట్టబయలు చేయడంతో విశాఖజిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ స్పందించారు. జరుగుతున్న అడ్డగోలు వ్యవహారంపై విచారణ చేపట్టారు. 

అంతేకాకుండా ఇద్దరు ఎస్ఈలకు తక్షణమే కలెక్టరేట్ కి రావాలని కబురు కూడా పంపించి పూర్తిస్థాయిలో తేడా బదిలీల విషయంలో తలంటేసినట్టు సమాచారం అందుతున్నది..  దీనితో మరింత ప్రెస్టేషన్ పెంచుకొని బదిలీ అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నారు సదరు ఉద్యోగిని. అసలు బదిలీలకి అర్హతే లేని ఆమె కోసం ఎందుకు జీఓని, నియమ నిబంధనలను పక్కన పెట్టాల్సి వచ్చిందని మీడియా ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు బదీలు చేపట్టే అధికారులు.  ప్రస్తుతం ఆమెకు ఆర్డర్ ఇచ్చే విషయంలో ఎస్ఈలు డైలమాలో పడ్డారు. అయినా తాను కోరుకున్న చోటుకి బదిలీచేస్తే ఎలాంటి ఒత్తిడిలనైనా తాను తిప్పికొడతాననే ధీమాతోనే ఉన్నారు. అంతేకాదు సహచర ఉద్యోగుల వద్ద  తన బదిలీ ఆరు నూరైనా ఆగదని మంగమ్మ శపధం కూడా చేసినట్టు చెబుతున్నారు. ఆమె బదిలీ కోసం ఏకంగా రూ.5 లక్షలకు పై చిలుకు చేతులు మారిన కారణంగానే అధికారులు కూడా ఆమె బదిలీ కోసం జీఓలోని నిబంధనలనే ప్రక్కన పెట్టినట్టు ప్రచారం జరుతుతుంది.

అలా కాకపోతే.. ఎంత దైర్యంతో అర్హతే లేకుండా కోరిన చోటుకి ఏ విధంగా బదిలీకి దరఖాస్తు చేస్తారు..? దానిని బదిలీలు నిర్వహించే అధికారులు ఆమోదించి ఆమెకోసం ప్రత్యేకంగా పనిచేస్తారో అధికారులే జిల్లా కలెక్టర్ కి వివరించాల్సి వుంది. మొన్నటి రాత్రి జిల్లా పరిషత్ లో రాత్రి 10.30 వరకూ సదరు ఉద్యోగిని ఆర్డర్ తీసేసుకోవడానికి జిల్లా పరిషత్ పెద్ద హైడ్రామానే నడిపారట. అయితే అప్పటికే అక్రమ బదిలీల విషయంలో ఈఎన్ఎస్-ఈరోజు కథనాలు మూడు జిల్లాల్లో పంచాయతీరాజ్ శాఖలో తీవ్ర ప్రకంపనలు సృష్టించడంతో కాస్త వెనక్కి తగ్గారు అధికారులు. అయినప్పటికీ సదరు ఉద్యోగిని మాత్రం తనకి ఏ విధంగానైనా ఆర్డర్ ఇవ్వాలని.. ఆమె స్వయంగా ఆర్డర్ టైప్ చేసుకొని సదరు బదిలీలు చేసే అధికారుల వద్దకు తెచ్చేసుకున్నారట. కానీ అడ్డగోలు బదిలీల విషయం మీడియాలో బయట పడటం.. ఇంకా బదిలీలకు ఈనెల 15 వరకూ గడవు ఉంటడంతో విషయం సద్దు మనిగితే అపుడు చూద్దామని అధికారులు ఆ ఫైలు పక్కన పెట్టినట్టు తెలిసింది. 

 ఈ బదిలీల విషయంలో మీడియాలో వ్యతిరేక కథనాలు రాకుండా చూసుకున్నా.. జిల్లా కలెక్టర్ నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోతే తాము మీకు ఆర్ఢర్ ఇవ్వగలమని.. లేదంటే ఇవ్వలేమని సదరు ఉద్యోగినికి బదిలీలు చేసే అధికారులు చెప్పినట్టు తెలిసింది. దానికి అనుగుణంగా బదిలీల వ్యవహారాన్ని మొట్టమొదటి సారిగా బయట పెట్టిన ఈఎన్ఎస్-ఈరోజు మీడియాకి ఎవరెవరి వద్ద నుంచో తీవ్రమైన ఒత్తిడి వస్తోంది.. మీకేం కావాలో చెప్పండి.. కానీ బదిలీ విషయంలో జరుగుతున్న విషయాలపై ఇకపై వార్తలు రాయొద్దు అనేది  ఆ ఒత్తిడి సారాశం. అలా రాయకుండా ఉంటే మీకు కూడా ప్యాకేజీ ఇస్తామని చెప్పటం విశేషం.  కొందరు ప్రైవేటు సిబ్బంది స్వయంగా వచ్చి చర్చలు జరపడం చూస్తుంటే అడ్డదారిలో కోరుకున్న చోటుకి బదిలీ చేయించుకోవడానికి ఏ తరహాలో వ్యూహరచన చేస్తున్నారో అర్ధమవుతుంది. అయితే ప్రస్తుత బదిలీల్లో జరుగుతున్న అక్రమాలు, అవకతవకలపై వాస్తవాలు రాయకుండా ఆగే ప్రశక్తి లేదని.. మీరుఇస్తామన్న ప్యాకేజీలు బదిలీలు చేపట్టే  తేడా అధికారులు, మిమ్మల్ని మా దగ్గరకి పంపిన సదరు అక్రమార్గంలో బదిలీలు చేయించుకోవాలనుకున్న ఉద్యోగులకే ఇవ్వాలని ఈఎన్ఎస్-ఈరోజు  తిప్పి పంపేయడంతోపాటు.. ఆ విషయాన్ని కూడా ఈరోజు మరో కథనంగా రాస్తున్నామని వారి ముందే తెగేసి చెప్పాం. తొలుత ఈరోజు-ఈఎన్ఎస్ లో వచ్చినంత మాత్రన ఏం జరుగుతుంది.. 

ఎవరికి చేతనైతే వాళ్లు చేసుకోవాలని సహచర ఉద్యోగుల వద్ద ప్రగల్భాలు పలికి సదరు ఉద్యోగిని, ఆమెకు సహకరించిన వారు ఇపుడు అసలు విషయం బయట పడటం, బదిలీలు చేస్తామన్న అధికారులు కూడా కాస్త వెనుకడుగు వేయడంతో కాళ్బ బేరానికి తన మనిషులను పంపి రాయబారాలు చేయడం ఏమై వుంటుందనేది వార్త చదువున్న మీకు.. బదిలీలు చేసే అధికారులకు తెలియాల్సి వుంది. పంచాయతీ రాజ్ లో జరుగుతున్న బదిలీల విషయంలో వాస్తవాలను మాత్రమే బయటకు తీసుకు రావడానికి ఈఎన్ఎస్-ఈరోజు కట్టుబడి ఉందని. ఈ విషయంలో ఎక్కడా తగ్గేది లేదని.. అంతేకాకుండా ఈ అంశాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళుతున్నట్టు రాయబారం నడపడానికి వచ్చిన వారితో చెప్పడంతో వాళ్లు తోకముడిచి వెనుతిరిగారు. రీ-కౌన్సిలింగ్ జరిగి బదిలీలకు అర్హులైన ఉద్యోగులకు న్యాయం జరిగే వరకూ ఈఎన్ఎస్-ఈరోజు తనవంతు భాద్యత నిర్వహిస్తుందని కూడా బల్లగుద్ది మరీ వారికి చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నామని కూడా ఈఎన్ఎస్-ఈరోజు ప్రతినిధులు ప్రకటించారు.

-రీ-కౌన్సిలింగ్ చేస్తారా..ఆమెనే పక్కన పెడతారా..?
పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ల బదిలీలలో పెద్ద మొత్తంలో చోటు చేసుకున్న అక్రమ వ్యవహారాలన్నీ ఆధారాలతో సహాయ బయటకు రావాలంటే రీ-కౌన్సిలింగ్ చేసి.. ఇప్పటి వరకూ జరిగిన కౌన్సిలింగ్ మొదటి నుంచీ చేపడితేనే బదీలీలు చేపట్టే అధికారులు ప్రభుత్వ జీఓని ఏ విధంగా తొక్కిపెట్టారో తేలిపోతుంది. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ విచారణ అనంతరం రీ-కౌన్సిలింగ్ చేపడతారా..? లేదంటే సదరు ఉద్యోగిని విషయంలో అంతా బయటకు రావడంతో కేవలం ఆమె అక్రమ బదిలీ ఫైలునే పక్కన పెడతారా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.  అంతేకాకుండా అసలు బదిలీకి అవకాశమే లేని ఉద్యోగిని కోసం జోన్-1 బదిలీల్లో ఎస్ఈలు ఎందుకు అంత అత్యుత్సాహం చూపుతున్నారన్న మచ్చ నుంచి కూడా బదిలీలు చేసే అధికారులు బయటపడే అవకాశం కూడా లేకపోలేదు. కాదు కూడదు.. పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిన తరువాత కావాల్సిన వారికి.. అనుకున్నవారికి ..వారు కోరిన చోటుకి బదిలీలు చేయపోతే ఎలా అనుకుంటే మాత్రం.. కాస్త ఆలస్యమైనా పని జరుగుతుంది. లేదంటే జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పక్కగా రీ-కౌన్సిలింగ్ మాత్రమే పంచాయతీరాజ్ అధికారులు చేపట్టాల్సి వుంటుంది. చూడాలి.. ఆమెకోసం అడ్డగోలుగా ఆర్డర్ ఇస్తారా..? లేదంటే రీ-కౌన్సిలింగ్ పెడతారా..? ఆమెను పక్కన పెడతారా..?  అనేది..?! 

Visakhapatnam

2024-09-02 09:50:32

ఆర్డర్ ఇచ్చేయండి ఆ తర్వాత నేను చూసుకుంటా..!?

పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ల బదిలీల్లో దొడ్డిదారి వ్యవహారం రసకందాయంలో పడింది. ఇక్కడ అడ్డగోలుగా జరుగుతున్న బదిలీల వ్యవహారాన్ని ఈఎన్ఎస్-ఈరోజు ఆధారాలతో సహా బయట పెట్డడంతో బదిలీలు చేపట్టే  పంచాయతీరాజ్ ఎస్ఈలు డైలమాలో పడ్డారు. అయినా తాను కోరుకున్న చోటుకి బదిలీచేస్తే ఎలాంటి ఒత్తిడిలనైనా తాను తిప్పికొడతానని.. అందునా ప్రస్తుతం భారీ వర్షాలు పడుతు న్నాయని.. నా బదిలీ కోసం జిల్లా కలెక్టర్ దృ ష్టిపెట్టేంత సీన్ ఉండదని బదిలీ అధికారులకు భరోసా ఇచ్చినట్టు తెలిసింది.  ముందు తనకి ఆర్ఢర్ ఇచ్చేయాలంటూ సదరు ఉద్యోగిని శనివారం రాత్రి జిల్లా పరిషత్ లో రాత్రి 10.30 వరకూ హైడ్రామా నడిపారు. తన బదిలీని ఆపాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారని.. ఎంతటి అధికారినైనా తన వెనుక ఉన్న ప్రజాప్రతినిధుల ఒత్తిడితో తాను తిప్పికొట్టగలనని ధీమా వ్యక్తం చేయడం విశేషం. సూపరింటెండెంట్ లబదిలీల్లో అర్హులైన వారిని బదిలీలు చేయకుండా రిటెన్షన్ చేసి.. అర్హులు కానీ పంచాయ తీరాజ్ జోన్-1 సూపరింటెండెంట్ ఉద్యోగుల బదిలీల్లో జివి.కనకవల్లీ కుమారికి అనకాపల్లి జిల్లా బదిలీ చేయడానికి  పీఆర్ ఎస్ఈలు మ్.శ్రీనివాసరావు(ఎస్.ఇ, పి.అర్- శ్రీకాకుళం) బి.ఎస్. రవీంద్ర(ఎస్.ఇ, పి.అర్ - విశాఖపట్నం), యూ.వి ప్రసాద్ (ఈ.ఈ, పి.ఆర్ - క్వాలీటి కంట్రోల్ విశాఖపట్నం)లు ఏకంగా జీఓఎంఎస్-75ని బుట్టదాఖలు చేసి మరీ ఆర్ఢర్ ఇవ్వాలని చేసిన ప్రయత్నం భగ్నం అయినా.. సదరు ఉద్యోగిని బదిలీ అధికారులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడాన్ని బట్టి పెద్ద స్థాయిలోనే లాబీయింగ్ జరుగుతున్నట్టుగా స్పష్టం అవుతున్నది.

 కాగా తన బదిలీ విషయంలో ఓ వర్గం మీడియాని వ్యతిరేకంగా వార్తలు రాకుండా కూడా అడ్డుకున్నానని అందుకే ప్రధాన పత్రికల్లో వార్తలేమీ రానీయకుండా చేశానని అధికారులపై ఒత్తిడితి తెచ్చే ఉద్యోగిని చెప్పినట్టుగా బాధిత ఉద్యోగులు గొల్లుమంటున్నారు. మీడియా కూడా అక్రమార్కులకే కొమ్ముకాయడం వలనే బదిలీలు చేసే అధికారులు వాస్తవాలు బయటపడినా.. కూడా కోరుకున్నవారికే బదిలీలు చేయడానికే సముఖత చూపుతున్నారని వాపోతున్నారు. ప్రభుత్వం జీఓ ఇచ్చినా ఒక ఉద్యోగిని కోసం బదిలీలు చేసే అధికారులు ఒక్కమాటపై కట్టుబడి ఉండి మరీ కధనడిపించడం చూస్తుంటే భారీ మొత్తంలో డబ్బు చేతులు మారిందని స్పష్టమవుతున్నది. ఆఖరికి ఈ విషయంలో విశాఖప ట్నం జిల్లా కలెక్టర్ హరీంధిర ప్రసాద్ విచారణకు ఆదేశించినా కూడా బదిలీ చేసే ఎస్ఈలు సదరు ఉద్యోగికి మేలు చేయడానికి ఎన్ని దారులు న్నాయో అన్ని దారులూ వెతకడడం చర్చనీయాంశం అవుతుంది.

-రీ-కౌన్సిలింగ్ చేస్తే అక్రమాలన్నీ బయటకు
పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ల బదిలీలో పెద్ద మొత్తంలో చోటు చేసుకున్న అక్రమ వ్యవహారాలన్నీ ఆధారాలతో సహాయ బయటకు రావాలంటే ఇప్పటి వరకూ జరిగిన కౌన్సిలింగ్ మొదటి నుంచీ చేపడితే బదీలీలు చేపట్టే అధికారులు ప్రభుత్వ జీఓని ఏ విధంగా తొక్కిపెట్టారో తేలిపోతుంది.  అంతేకాకుండా అసలు బదిలీకి అవకాశమే లేని ఉద్యోగిని కోసం జోన్-1 బదిలీల్లో ఎస్ఈలు ఎందుకు అంత అత్యుత్సాహం చూపుతున్నారో కూడా ఆధారాలు బయటపడే అవకాశం ఉంది. అంతేకాకుండా బదిలీలకు అవకాశం ఉండి రిటెన్షన్ కు గురైన ఉద్యోగులకు ఖచ్చితంగా ప్రభుత్వ జీఓ ప్రకారం బదిలీ జరడానికి కూడా మార్గం సుగమం అవుతుంది. అదే జరిగితే బదిలీలు చేసే అధికారులు చేసిన మోసాలు, తొక్కిన అడ్డదారులు, కావాల్సిన వారికోసం ముందుగానే ఆర్డర్లు ఇవ్వడానికి లేని సిఫారసు లేఖలు చూపించిన బూచీ వ్యవహా రాలన్నీ కూడా బయటపడిపోతాయి. ఈ ఒక్క కారణంతోనే సదరు ఉద్యోగిని తనకు అర్జెంట్ గా ఉత్తర్వులు ఇస్తే ఆఘమేఘాలపై శ్రీకాకుళం జిల్లాలో రిలీవ్ అయిపోయి వెంటనే అనకాపల్లి వెళ్లి జాయిన్ అయిపోతానని కూడా అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం అందుతుంది. 

అయితే ఈమె విషయంలో జరిగిన మోసం బయటకు రావడంతో ముగ్గు ఎస్ఈల్లో ఒక ఎస్ఈ వెనుకడుగు వేసినట్టు తెలిసింది. ఇప్పటికే ఈమె విషయంలో ఈఎన్ఎస్-ఈరోజు వరుస కథనాలు రాస్తున్నది. నిజంగా ఆర్డర్ ఇస్తే నేరుగా తప్పుచేసినట్టు జిల్లా కలెక్టర్ ముందు కూడా దోషు లుగా మిగిలిపోతామని చెప్పినట్టు సమాచారం. అయితే ఎవరూ తన బదిలీని ఆపలేరని, ఎలా తనకు బదిలీ జరగదో చూస్తానని.. కోరుకున్న చోటు తనకు రాకపోతే ఏం చేయాలో కూడా తనకి తెలుసునని కూడా అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఇప్పటికే విశాఖజిల్లా కలెక్టర్ పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ లబదిలీల్లో జరిగిన అక్రమాలపై దృష్టిసారించిన నేపథ్యంలో బదిలీలు చేసే ఎస్ఈలు సదరు ఉద్యోగినికి ఉత్తర్వులు ఆమె ఒత్తిడి మేరకు ఇచ్చేస్తారా..? లేదంటే అర్హులైన వారికి ఇస్తారా అనేది తేలాల్సి వుంది.

visakhapatnam

2024-08-31 18:08:10

తెలుగు సీనీ పరిశ్రమను విశాఖ తరలించడమే ప్రధాన లక్ష్యం

తెలుగు సినీ పరిశ్రమను విశాఖకు తీసుకు వచ్చి 24క్రాఫ్ట్స్ కార్మికులకు పూర్తిస్థాయిలో జీవనోపాది కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తానని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ గా  భాధ్యతలు స్వీకరించిన ఉపకార్ ట్రస్టు, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత  సినీ నిర్మాత డా. కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. శనివారం విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు కార్యక్రమంలో అట్టహాసంగా డా.కంచర్ల ఏపీఎఫ్ఐఈఎఫ్ చైర్మన్ గా  ప్రమాణ స్వీకారారం చేశారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినా ఇంకా తెలుగు చిత్రపరిశ్రమ తెలంగాణకే పరిమితం అయిపోయిందన్నారు. ఫలితంగా సీని పరిశ్రమ ద్వారా వచ్చే ఆదాయం మొత్తం తెలంగాణ రాష్ట్రానికే వెళ్లిపోతుందన్నారు. అలాకాకుండా తెలుగు చిత్రపరిశ్రమ తెలంగాణ నుంచి విడిపోయి రాష్ట్రానికి చెందిన వాటాతోపాటు విశాఖ రావాలన్నారు. ఆదిశగా ఫెడరేషన్ తొలి అడుగు వేస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని విశాఖలో ఫిల్మ్ చాంబర్ ను ఏర్పాటు చేసి, సెన్సార్ బోర్డుని కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలన్నారు.

 విశాఖలోని చాలా ప్రాంతాలు, ఉత్తరంధ్రా రాయలసీమ జిల్లాల్లో సినిమాలకు అనుకూలమైన పర్యాటక ప్రదేశాలున్న కారణంగా చక్కటి లొకేషన్స్ తో సినిమాలు తీసుకోవడానికి ఎంతో అనువుగా వుంటుందని.. ఇక్కడే చాంబర్, సెన్సార్ బోర్డులు ఉండటం వలన అనుతుమలు తీసుకోవడానికి రాష్ట్రప్రభుత్వానికి ఆదాయం పెరగడానికి మార్గం సుగమం అవుతుందన్నారు. సినీ పరిశ్రమను అభివృద్ధి చేయడం కోసం ఒక ప్రత్యేక స్థలాన్ని కేటాయించి ఇక్కడ స్టూడియోలు,  సినీ విభాగానికి చెందిన ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయాలన్నారు. 64 కళలు, 24 క్రాఫ్ట్స్ లో పనిచేసే  ఏ కళాకారుడైతే ఫెడరేష్ లో సభ్యత్వాలు తీసుకుంటారో వారందరికీ తక్షణమే ఈశ్రమ్ కార్డులు నమోదు కూడా చేపట్టాలని.. కార్డు తీసుకున్న వారందరికీ ప్రభుత్వ ప్రయోజనాలు కళాకారుడికి అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ కార్మికుడు, కళాకారుడికి ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేయాలన్నారు. మద్రాస్ లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్న దగ్గర నుంచి కళాకారులు, కార్మికులకు ఇస్తామన్న ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణ పథకాలను ఫెడరేషన్ లోని అన్ని విభాగాల్లోని వారికి వర్తింపజేయాలన్నారు. 

 సినీ కళాకారులు, కార్మికుల కోసం ప్రభుత్వం తక్షణమే ఒక ప్రత్యేక కార్యాలయం, వెబ్ సైట్ ను ఏర్పాటు చేసి అన్ని విషయాలను అందులోనే నమోదు చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ కి సినిమా నిర్మాణాల వలన వచ్చే ఆదాయం మొత్తం తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలు తరలిపోతున్నదని.. దానిని నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్ లోనే సాధ్యమైనంత మేరకు సినిమా షూటింగులు జరిగే విధంగా రాష్ట్రాన్ని, ఇక్కడి సినిమా స్పాట్ లను ప్రమోట్ చేస్తూ.. ఫెడరేషన్ ద్వారా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతేకాకుండా సినిమా నిర్మాణ సమయంలో కూడా రాష్ట్రంలోని కళాకారులు, సిబ్బందికే ప్రాధాన్యత ఇచ్చేవిధంగా కూడా సినిమా నిర్మాతలు, దర్శకులతో  చర్చలు కూడా జరపుతామని చెప్పారు. త్వరలోనే 24 క్రాఫ్ట్స్ తో పాటు 64 కళలకు సంబంధించిన కళాకారులతో జిల్లా కమిటీలను కూడా ఏర్పాటు చేస్తామని.. 26 జిల్లాలకు చెందిన కళాకారులు, కార్మికులు సదరు జిల్లా కమిటీల పరిధిలోకి వచ్చి పనిచేసేవిధంగా చేయనున్నామన్నారు. రాష్ట్ర కమిటి పిలుపు మేరకు జిల్లా కమిటీలన్నీ కార్మికులు, కళాకారులు సంక్షేమాన్ని, ప్రభుత్వ పథకాల అమలును సదరు జిల్లా కమిటీలు చూసుకునేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

 దీనికోసం ప్రత్యేకంగా తయారు చేసుకున్న కార్యాచరణ ప్రణాళికతో ప్రభుత్వంతో చర్చలు జరపనున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏపీ పిల్మ్ ఛాంబర్ ను విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయడం ద్వారా సినిమా రిజిస్ట్రేషన్లతోపాటు, ఇతర అనుమతుల ఆదాయం భారీగా రాష్ట్రప్రభుత్వానికి చెందే అవకాశాలున్నాయని ఫెడరేషన్ కు ప్రభుత్వ మద్దతు కూడా కోరతామన్నారు. అంతేకాకుండా ఈరోజు నుంచి ఫెడరేషన్ సభ్యులకు విద్య, వైద్యం, మౌళిక సదుపాయాల విషయంలో ఫెడరేషన్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని పనిచేస్తుందన్నారు. వారి కష్ట నష్టాల్లోనూ ఫెడరేషన్ తోడుగా వుంటుందని భరోసా ఇచ్చారు. కొత్త కమిటీలు ఏర్పాటు చేసిన తదగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ ఫెడరేషన్ దగ్గరుండి సభ్యులు.. వారి కుటుంబాలకు అండగా వుండి వారి సంక్షేమం కోసం పనిచేస్తుందని స్పష్టం చేశారు. అభిమానులు, ఫెడరేషన్ సభ్యుల కరతాల ధ్వనుల మధ్య చైర్మన్ గా సంతకం చేసిన అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. సభ్యులంతా కలిసిని గజమాలతో ఘనంగా సత్కరించారు.  

ఈ కార్యక్రమంలో దర్శకులు, ఫెడరేషన్ అధ్యక్షులు తోరం రాజా, ప్రధాన కార్యదర్శి సలాది గణేశ అచ్చుత రామస్వామి, కోశాధికారి ముళ్లపూడి రాధ, కార్యదర్శి ముద్దన సుభాషిణి, ఎపిమా అధ్యక్షులు ముత్తుకూరు నరసింహులు, ఎపిమా విశాఖ అధ్యక్షులు భయ్యా శ్రీనివాసరావు, ఎపిమా ప్రధాన కార్యదర్శి చవల మురళీకృష్ణ, ఎపి మా కోశాధికారి  పూల శ్రీను,  ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు.. కె.ఇందిరా ప్రియదర్శని, చెన్నుపల్లి పుష్ప, జానపాటి విశ్వేశ్వర రావు, పంపన సత్యనారాయణ, జుజ్జువరపు సరోజిని, బి. శోభారాణి , కసుకుర్తి అరుణశ్రీ, యర్రంశెట్టి దుర్గా భవాని, పోలుదాసు రంగనాయకులు, వీరికి నరసింహారావు, షేక్ అహ్మద్, షేక్ సైదావలి, షేక్ చాన్ భాష, పెద్ద ఎత్తున అభిమానులు, ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు సభ్యులు సుధీర్, నాగు, రాజా, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ప్రతినిధులు పలువురు కంచర్ల అభిమానులు ఫెడరేషన్ సభ్యులు పాల్గొన్నారు. 

visakhapatnam

2024-08-31 16:36:21

ఆ ఉద్యోగిని కోసం జీఓనే పక్కనపెట్టేశారు..!

పంచాయతీరాజ్ జోన్-1 సూపరింటెండెంట్ ఉద్యోగుల బదిలీల్లో జివి.కనకవల్లీ కుమారికి అనకాపల్లి జిల్లా బదిలీ చేయడానికి  పీఆర్ ఎస్ఈలు మ్.శ్రీనివాసరావు(ఎస్.ఇ, పి.అర్- శ్రీకాకుళం) బి.ఎస్. రవీంద్ర(ఎస్.ఇ, పి.అర్ - విశాఖపట్నం), యూ.వి ప్రసాద్ (ఈ.ఈ, పి.ఆర్ - క్వాలీటి కంట్రోల్ విశాఖపట్నం)లు ఏకంగా జీఓఎంఎస్-75ని బుట్టదాఖలు చేశారు. ఐదేళ్లు దాటిన వారిని మాత్రమే బదిలీల్లో అన్ని కేటగిరీల్లో కదపాలని జీఓని బేస్ చేసుకొని ట్రాన్స్ ఫర్ గైడ్ లైన్స్ ఇచ్చిన ఈ అధికారులే.. సదరు ఉద్యోగినికి న్యాయం చేసి.. అర్హులైన ఉద్యోగులకు శక్తివంచన లేకుండా అన్యాయం చేయడానికి పూనుకున్నారు.  శ్రీకాకుళం జిల్లాలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న సదరు ఉద్యోగిని గత ఏడాది నవంబరు 23 నుంచి వారంలో నాలుగు రోజులు విశాఖ సర్కిల్ లో పనిచేయాలని ప్రత్యేక ఉత్తర్వులు తెచ్చుకున్నారు. పేరుకి 4 రోజులు అయినా.. సర్వీసు మొత్తం ఇక్కడే చేస్తూ వస్తున్నారు. విశాఖలో ఉంటూ శ్రీకాకుళం రోజూ అప్ అండ్ డౌన్ చేయలేక తెచ్చుకున్న ఉత్తర్వులతో రెండేళ్లు ఉద్యోగం చేసి.. ఆతరువాత కూడా కేవలం ఒక్క గంటలో విశాఖపట్నం-అనకాపల్లి పీఆర్ కార్యాలయానికి  చేసే జర్నీ కోసం మళ్లీ వెసులుబాటు  బదిలీల్లో తెచ్చేసుకున్నారు. 

పాపం ఓడిపై సేవలు అందించిన సదరు ఉద్యోగినికోసం బదిలీలు చేపట్టే పంచాయతీరాజ్ ఎస్ఈలు కూడా ఈమె కోసం ప్రభుత్వం విడుదలచేసిన జీఓనే పక్కనపెట్టేశారు. ఉద్యోగిని కంటే జీఓ ఏం పెద్ద ముఖ్యం.. మేము చేసే అక్రమ బదిలీలు, అడ్డుగోలు వ్యవహారాలను ఎవరు అడుగుతారు.. ఇంకెవరు ప్రశ్నిస్తారులే అనుకున్నారో ఏమో తెలీదుగానీ.. జీఓలో పొందు పరిచిన నిబంధనలపై సూచనలు చేసిన ఈ అధికారులే అమెను అనకాపల్లి బదిలీచేయడానికి సిద్దపడిపోయారు. బదిలీ చేసేశారు. దీనితో అర్హులైన ఇతర విభాగా సూపరింటెండెంట్ లకు ఇబ్బందులు తలెత్తాయి. ఐదేళ్లు, ఏడేళ్లు వివిధ ప్రాంతాల్లో పనిచేసిన మాకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం బదిలీ చేయకుండా ఈమెకోసం.. ఈమె కోరిన ప్రదేశానికి ప్రత్యేకంగా బదిలీచేయడం ఏంటని..? స్థానిక నియోజకవర్గ ప్రజాప్రతినిధుల సిఫారసులేఖలు కూడా ఆమె కోసం పక్కన పెట్టేయడం దారుణమని మండి పడుతున్నారు. తక్షణమే బదిలీల్లో జీఓలో ఉన్న అంశాల వారీగా ఆఫ్ లైన్ పద్దతిలోనే బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా జోన్-1లో జరుగుతున్న బదిలీల అక్రమాలను డిప్యూటీ సీఎం, సీఎం కార్యాలయాలకు ఫిర్యాదులు సైతం అందాయి. అవి కాస్త ఈఎన్ఎస్-ఈరోజుకి చేతికి చిక్కాయి. నిబంధనల ప్రకారం సదరు ఉద్యోగినికి ప్రస్తుతం జరుగుతున్న బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాల్సి వుంది.  లేదా.. అర్హులైన ఉద్యోగులు కోరిన చోటుకి బదిలీలు చేపట్టినతరువాత  మాత్రమే ఇతర అంశాలను పరిగణలోనికి తీసుకోవాలని. కానీ అధికారులు బదిలీకి అర్హత లేకపోయినా పనిగట్టుకొని మరీ అమెను అనకాపల్లి జిల్లాకి బదిలీల చేయడాన్ని అర్హులైన ఉద్యోగులంతా వ్యతిరేకిస్తున్నారు. 

ఈమె విషయంలో బదిలీ చేసే అధికారులు ఎంత అత్యుత్సాహం చూపిస్తున్నారో బదిలీ జీఓని పూర్తిగా పక్కనపెట్టడమే దానికి నిదర్శనం. ఈ విషయాన్ని ఈఎన్ఎస్-ఈరోజు సంయుక్తంగా బదిలీ అక్రమాలను ఆధారాలతో సహా బయట పెట్టింది. ఎవరెవరికి ఏఏ ప్రాతిపదిన బదిలీలు చేశారు. కావాలనే ఎందకు ఏజెన్సీలో పనిచేసిన వారికి రిటెన్షలు ఇచ్చారు. పక్కా ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా ఆధారాలన్నీ జిల్లా కలెక్టర్ హరీంధిర ప్రసాద్ దృష్టికి తీసుకు వెళ్లడంతో స్పందించిన జిల్లా కలెక్టర్ హరేంధిన ప్రసాద్ ఈ అంశంపై విచారణ చేయిస్తామని బదులిచ్చారు. కాగా శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తూ.. విశాఖజిల్లాలో ఓడిపై పనిచేస్తూ.. అడ్డదారిలో రావాలని ప్రయత్నానికి బదిలీచేసే అధికారులు రెడ్ కార్పెట్ వేసి మరీ బదిలీచేయడంపై పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారాయిని తెలిసింది. అయితే ఈ విషయమై బదిలీ అధికారులని నేరుగా ఈఎన్ఎస్-ఈరోజు ఫోన్ లో సంప్రదించగా ఎవరూ స్పందించలేదు. వాట్సప్ లో వివరణ కోరినా..దానికి కూడా బదిలీలు చేపట్టే జోన్-1 పంచాయతీరాజ్ ఎస్ఈలు బదులు ఇవ్వలేదు. అడ్డగోలుగా జరుగుతున్న ఈ అక్రమ బదిలీల్లో ఒక ఉద్యోగిని కోసం జోన్-1 అధికారులు చూపిస్తున్న అత్యుత్సాహం.. ప్రభుత్వం విడుదల చేసిన జీఓని బుట్టదాఖలు చేయడంపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాల్సి వుంది. ప్రక్రియ మొత్తం మొదటి నుంచి చేపట్టి అర్హులైన ఉద్యోగులకు న్యాయం చేయాల్సి వుంది. బదిలీల ప్రక్రియకు వచ్చేనెల 15వరకూ సమయం ఉన్నందున అక్రమార్కులపై జిల్లా కలెక్టర్ ఏవిధంగా చర్యలు తీసుకుంటారో చూడాలి మరి..?!

visakhapatnam

2024-08-30 14:13:23

పంచాయతీ రాజ్ లో అడ్డగోలు బదిలీలు..!

పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలోని బదిలీల్లో జోన్-1 సూపరింటెండెంట్ జివి.కనకవల్లీ కుమారి కి మేలు చేయడం కోసం అధికారులు జీఓనెంబరు 75ని బుట్టదాఖలు చేసి మరీ ఏకపక్షంగా వ్యవహించారు. పేరుకి జీఓని నిబంధనలున్నా.. ఇందులోని ఒక్క నిబంధనకూడా బదిలీలు చేపట్టిన అధికారులు అమలు చేయలేదంటే పరిస్థితి ఎంత కాస్ట్లీగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. భారీ మొత్తాలు తీసుకునే కావాల్సిన వారికి బదిలీలు చేసినట్టుగా ఆధారాలతో సహా బయట పడ్డాయి. ప్రభుత్వం బదిలీలు చేసే సమయంలో ప్రత్యేకంగా పక్కాగా మార్గదర్శకాలతో జీఓని విడుదల చేసింది. దాని ఆధారంగా మాత్రమే అధికారులు బదిలీలు చేయాల్సివుందని కూడా పేర్కొంది. కానీ పంచాయతీ రాజ్ లో మొదటి నుంచి అన్నీ తేడా వ్యవహారాలే కావడంతో ఈ సారి కూడా బదిలీల్లో అధికారులు  కావాల్సిన వారికోసం పక్కగా చేతి వాటాన్ని ప్రదర్శించారు. దీనితో బదిలీల్లో తేడాలు జరిగాయని మీడియా విచారణ చేపడితే  పక్కాగా వాస్తవాలు వెలుగుచూశాయి. 

మరెందుకు బదిలీల విషయంలో అక్రమాలు, వక్రమార్గాలు ఎంచుకున్నారని అధికారులను అడిగితే అన్నీ నిబంధనల ప్రకారమే చేశామని సెలవిచ్చారు. ప్రభుత్వం పంచాయతీరాజ్ లో బదిలీల కోసం ప్రత్యేకంగా జీఓఎంఎస్ నెంబరు 75ని విడుదల చేసినా బదిలీలు పర్యవేక్షించిన  అధికారులు కనీసం అందులోని ఒక్క అంశాన్నీ కూడా పరిగణలోకి తీసుకోలేదు. అంతా ఆ సూపరింటెండెంట్ కోసం వారికి నచ్చినట్టుగానే చేయడం విశేషం. జోన్-1లోని సూపరింటెండెంట్  ట్రాన్స్ఫర్లు పర్యవేక్షపు ఇంజనీయర్లు ఎమ్.శ్రీనివాసరావు(ఎస్.ఇ, పి.అర్- శ్రీకాకుళం) బి.ఎస్. రవీంద్ర(ఎస్.ఇ, పి.అర్ - విశాఖపట్నం), యూ.వి ప్రసాద్ (ఈ.ఈ, పి.ఆర్ - క్వాలీటి కంట్రోల్ విశాఖపట్నం) పర్యవేక్షణలో  ఈనెల 27న రాత్రి పదిగంటలకు చాలా చక్కగా అన్నీ తేడాగానే నిర్వహించేశారు. ఏవిధంగా చేసేశారో ఒక్కసారి ఆరా తీస్తే..

 బి.శ్రీనివాసరావు సూపరింటెండెంట్, ఈ.ఈ.పి.ఐ.యూ సదరు అధికారి పాడేరులో ఆరేళ్లు పూర్తి అయ్యాయి.  ఈ జి. ఓ. ఎమ్.ఎస్.నెం. 75 ప్రకారం ఏజెన్సీ ఏరియాలో రెండేళ్లు  పూర్తైన వ్యక్తిని వారి కోరిన చోట బదిలీ చేయమని జి.ఓ.లో ఉన్నది కాని అలా చేయకుండా ఇతనిని  పాడేరు ఏజెన్సీలోనే రిటన్షన్ ఇచ్చారు. అది ఏ జీఓ ప్రకారంగా చేశారో పర్యవేక్షక అధికారులు జిల్లా కలెక్టర్ కు, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శికి తెలియజేయాల్సి వుంది.  ఇక  ఆర్.నాగరాజు సూపరింటెండెంటు, డి.పి.ఆర్.ఈ.ఓ ఆఫీస్ అనకాపల్లిలో పనిచేస్తున్న ఇతనని రెండేళ్లు నిండకపోయినా  పి.ఆర్.ఐ. డివిజన్ టెక్కలికి బదిలీ చేశారు. ఇతని స్థానంలో సూపరింటెండెంట్ జి.వి. కనక వల్లీ కుమారిని ఓ ఎమ్మెల్యే ఇచ్చిన శిఫారసు లేఖ ఆధారంగా చూపి అనకాపల్లికి బదిలీచేసేశారు. అంటే ఇక్కడ నిభందనలు ఏమీ పరిగణలోనికి తీసుకోలేదు.. విశేషం ఏంటంటే  ఈమె బదిలీ అయిన ప్రదేశం అనకాపల్లి టౌన్ లో ఉన్నది.. 

ఈమెను బదిలీ చేయడానికి కానీ ఈమెకు అనుకూలంగా సదరు ఎమ్మెల్యే ఎలాంటి సిఫారసు లేఖా ఇవ్వలేదు. కానీ ఇచ్చినట్టుగా అధికారులను మభ్య పెట్టి అమాయకులైన  ఆర్. నాగరాజు ని ఆమె స్థానంలోనికి పంపేశారు. ఇక్కడ పెద్ద మొత్తంలో చేతులు మారిన కారంణంగానే లేని ఎమ్మెల్యే సిఫారసు లేఖను బూచిగా చూపించినట్టు తేటతెల్లం అయ్యింది. ఈయనను కె.ఎస్.కె.శోభా రాణి స్థానంలో బదిలీ చేసి యున్నారు. ఈమె పై ఎ.సి.బి. కేసుతోపాటు శాఖాపరమైన కేసులు కూడా ఉండటం విశేషం. బదిలీ అయిన స్థానానికి వెళ్లకపోతే ఇక్కడ ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తామని కూడా సదరు అధికారిని బెదిరించడం కొసమెరుపు.  ఎస్.రమేష్ ఈయన జూనియర్ అసిస్టెంట్ పాడేరు డివిజన్ లో ఏడేళ్లు సర్వీసు పూర్తిచేసుకొని బదిలీలకు దరఖాస్తు చేసుకుంటే.. జీఓ ప్రకారం కోరిన ప్రదేశానికి బదిలీ చేయాల్సి ఉండగా  ఇతనని కూడా పాడేరు ఏజెన్సీలోనే రిటన్షన్  చేసేశారు. ప్రభుత్వం బదిలీల జీఓ ఒక్క శాతం కూడా పరిగణలోనికి తీసుకోకుండా అంతా మా ఇష్టం అన్నరీతిలోనే బదిలీలను చేయి తడుపు వ్యవహారంలో చక్కబెట్టేశారు.

మరో విశేషం ఏంటంటే సదరు సూపరింటెండెంట్ జి.వి. కనక వల్లీ కుమారి శ్రీకాకుళంలో పనిచేయాల్సి ఉండగా..విశాఖపట్నంలో కూడా ఓ.డి బేసిస్ మీద గత రెండేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నారు. ఇక్కడే ఓడీలో పనిచేస్తున్న అధికారి బదిలీల్లో ఖచ్చితంగా వెనక్కి వెళ్లాల్సి ఉంది. లేదా జీఓ ప్రకారం కోరుకున్న అధికారుల బదిలీలు జరగగా ఖాళీ ఉన్న ప్రదేశాల్లోకి బదిలీపై వెళ్లాలి. కానీ ఇక్కడకి దగ్గర్లోని అనకాపల్లికి చాలా చాకచక్యంగా బదిలీ చేయించుకుంటున్నారు. ప్రభుత్వం జీఓ ఈ అధికారిణి బదిలీ విషయంలో చేతి వ్యవహారం ముందు మోకరిల్లాల్సి వచ్చింది. చక్రం తిప్పే నేర్పు ఉంటే ఏ విధంగా నైనా బదిలీలు చేయించుకోవచ్చునని.. దానికోసం బదిలీలు చేసే అధికారులు కూడా వారికి అనుకూలంగానే పనిచేస్తార విషయం పంచాయతీరాజ్ శాఖలోని బదిలీల్లో చాలా క్లియర్ గా కనిపించింది. జి.గంగారామ్ సూపరింటెండెంట్ మూడు నెలల సర్వీసు చేసిన వ్యక్తిని అడ్డగోలుగా విజయనగరానికి బదిలీచేసేశారు. ఇలా ఒకటి కాదు రెండు ఇష్టానుసారం బదిలీలు చేశారు అధికారులు. వీటన్నింటికీ బదిలీల ఉత్తర్వులే సాక్షిగా నిలుస్తున్నాయి. ఈ విషయాలను బయటకు రానీయకుండా ఉండేందుకుందు, ఒక వేళ తమపై మీడియాలో  కథనాలు వచ్చినా వెనుక నుంచి రక్షించేందుకు ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారని.. ఎవరేం చేసుకున్నా పర్లేదంటూ హుకుం కూడా జారీ చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది.  

భారీఎత్తున అక్రమాలు, ప్రభుత్వ జీఓను ఉల్లంఘించి మరీ జరిపిన ఈ బదిలీలను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని బాధిత అధికారులు కోరులున్నారు. అలా జరగకపోతే అక్రమార్గంలో బదిలీలపై వచ్చిన వారు ఇక్కడే మరో పదేళ్లు తిష్టవేసుకొని ఉండిపోయే ప్రమాదం కూడా ఉంటుందని వాపోతున్నారు. అలా కాకపోయినా ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను పాటించకుండా జరిపిన బదిలీలపై పంచాయతీరాజ్ శాఖ కమిషనర్, మూడు జిల్లాల కలెక్టర్లు దృష్టిసారిస్తే ఎవరి విషయంలో ఏ తరహా మోసాలు, అక్రమాలు జరిగాయో బయటపడే అవకాశం వుంది. అక్రమంగా జరిగిన బదిలీలపై జిల్లా కలెక్టర్లు దృష్టిసారిస్తారా.. లేదంటే జిఓలను సైతం బుట్టదాఖలు చేసిన అధికారుల తేడా బదిలీలకే ఒకే చెబుతారా  అనేది. కాగా పంచాయతీరాజ్ లో జరిగిన అక్రమాలపై డిప్యూటీ సీఎం, కమిషనరేట్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫిర్యాదులు వెళ్లినట్టు తెలిసింది.

visakhapatnam

2024-08-29 18:07:30

పంచాయతీ రాజ్ జోన్-1లో అడ్డగోలు బదిలీలు..!

పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలోని బదిలీల్లో జోన్-1 సూపరింటెండెంట్ జివి.కనకవల్లీ కుమారి కి మేలు చేయడం కోసం అధికారులు జీఓనెంబరు 75ని బుట్టదాఖలు చేసి మరీ ఏకపక్షంగా వ్యవహించారు. పేరుకి జీఓని నిబంధనలున్నా.. ఇందులోని ఒక్క నిబంధనకూడా బదిలీలు చేపట్టిన అధికారులు అమలు చేయలేదంటే పరిస్థితి ఎంఖ కాస్ట్లీగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. భారీ మొత్తాలు తీసుకునే కావాల్సిన వారికి బదిలీలు చేసినట్టుగా ఆధారాలతో సహా బయట పడ్డాయి. ప్రభుత్వం బదిలీలు చేసే సమయంలో ప్రత్యేకంగా పక్కాగా మార్గదర్శకాలతో జీఓని విడుదల చేసింది. దాని ఆధారంగా మాత్రమే అధికారులు బదిలీలు చేయాల్సివుందని కూడా పేర్కొంది. కానీ పంచాయతీ రాజ్ లో మొదటి నుంచి అన్నీ తేడా వ్యవహారాలే కావడంతో ఈ సారి కూడా బదిలీల్లో అధికారులు  కావాల్సిన వారికోసం పక్కగా చేతి వాటాన్ని ప్రదర్శించారు. దీనితో బదిలీల్లో తేడాలు జరిగాయని మీడియా విచారణ చేపడితే  పక్కాగా వాస్తవాలు వెలుగుచూశాయి. మరెందుకు బదిలీల విషయంలో అక్రమాలు, వక్రమార్గాలు ఎంచుకున్నారని అధికారులను అడిగితే అన్నీ నిబంధనల ప్రకారమే చేశామని సెలవిచ్చారు. ప్రభుత్వం పంచాయతీరాజ్ లో బదిలీల కోసం ప్రత్యేకంగా జీఓఎంఎస్ నెంబరు 75ని విడుదల చేసినా బదిలీలు పర్యవేక్షించిన  అధికారులు కనీసం అందులోని ఒక్క అంశాన్నీ కూడా పరిగణలోకి తీసుకోలేదు. అంతా ఆ ఎస్ఈ కోసం వారికి నచ్చినట్టుగానే చేయడం విశేషం. జోన్-1లోని సూపరింటెండెంట్  ట్రాన్స్ఫర్లు పర్యవేక్షపు ఇంజనీయర్లు ఎమ్.శ్రీనివాసరావు(ఎస్.ఇ, పి.అర్- శ్రీకాకుళం) బి.ఎస్. రవీంద్ర(ఎస్.ఇ, పి.అర్ - విశాఖపట్నం), యూ.వి ప్రసాద్ (ఈ.ఈ, పి.ఆర్ - క్వాలీటి కంట్రోల్ విశాఖపట్నం) పర్యవేక్షణలో  ఈనెల 27న రాత్రి పదిగంటలకు చాలా చక్కగా అన్నీ తేడాగానే నిర్వహించేశారు. ఏవిధంగా చేసేశారో ఒక్కసారి ఆరా తీస్తే..

 బి.శ్రీనివాసరావు సూపరింటెండెంట్, ఈ.ఈ.పి.ఐ.యూ సదరు అధికారి పాడేరులో ఆరేళ్లు పూర్తి అయ్యాయి.  ఈ జి. ఓ. ఎమ్.ఎస్.నెం. 75 ప్రకారం ఏజెన్సీ ఏరియాలో రెండేళ్లు  పూర్తైన వ్యక్తిని వారి కోరిన చోట బదిలీ చేయమని జి.ఓ.లో ఉన్నది కాని అలా చేయకుండా ఇతనిని  పాడేరు ఏజెన్సీలోనే రిటన్షన్ ఇచ్చారు. అది ఏ జీఓ ప్రకారంగా చేశారో పర్యవేక్షక అధికారులు జిల్లా కలెక్టర్ కు, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శికి తెలియజేయాల్సి వుంది.  ఇక  ఆర్.నాగరాజు సూపరింటెండెంటు, డి.పి.ఆర్.ఈ.ఓ ఆఫీస్ అనకాపల్లిలో పనిచేస్తున్న ఇతనని రెండేళ్లు నిండకపోయినా  పి.ఆర్.ఐ. డివిజన్ టెక్కలికి బదిలీ చేశారు. ఇతని స్థానంలో సూపరింటెండెంట్ జి.వి. కనక వల్లీ కుమారిని ఓ ఎమ్మెల్యే ఇచ్చిన శిఫారసు లేఖ ఆధారంగా చూపి అనకాపల్లికి బదిలీచేసేశారు. అంటే ఇక్కడ నిభందనలు ఏమీ పరిగణలోనికి తీసుకోలేదు.. విశేషం ఏంటంటే  ఈమె బదిలీ అయిన ప్రదేశం అనకాపల్లి టౌన్ లో ఉన్నది.. ఈమెను బదిలీ చేయడానికి కానీ ఈమెకు అనుకూలంగా సదరు ఎమ్మెల్యే ఎలాంటి సిఫారసు లేఖా ఇవ్వలేదు. కానీ ఇచ్చినట్టుగా అధికారులను మభ్య పెట్టి అమాయకులైన  ఆర్. నాగరాజు ని ఆమె స్థానంలోనికి పంపేశారు. ఇక్కడ పెద్ద మొత్తంలో చేతులు మారిన కారంణంగానే లేని ఎమ్మెల్యే సిఫారసు లేఖను బూచిగా చూపించినట్టు తేటతెల్లం అయ్యింది. ఈయనను కె.ఎస్.కె.శోభా రాణి స్థానంలో బదిలీ చేసి యున్నారు. ఈమె పై ఎ.సి.బి. కేసుతోపాటు శాఖాపరమైన కేసులు కూడా ఉండటం విశేషం. బదిలీ అయిన స్థానానికి వెళ్లకపోతే ఇక్కడ ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తామని కూడా సదరు అధికారిని బెదిరించడం కొసమెరుపు.  ఎస్.రమేష్ ఈయన జూనియర్ అసిస్టెంట్ పాడేరు డివిజన్ లో ఏడేళ్లు సర్వీసు పూర్తిచేసుకొని బదిలీలకు దరఖాస్తు చేసుకుంటే.. జీఓ ప్రకారం కోరిన ప్రదేశానికి బదిలీ చేయాల్సి ఉండగా  ఇతనని కూడా పాడేరు ఏజెన్సీలోనే రిటన్షన్  చేసేశారు. ప్రభుత్వం బదిలీల జీఓ ఒక్క శాతం కూడా పరిగణలోనికి తీసుకోకుండా అంతా మా ఇష్టం అన్నరీతిలోనే బదిలీలను చేయి తడుపు వ్యవహారంలో చక్కబెట్టేశారు.

మరో విశేషం ఏంటంటే సదరు సూపరింటెండెంట్ జి.వి. కనక వల్లీ కుమారి శ్రీకాకుళంలో పనిచేయాల్సి ఉండగా..విశాఖపట్నంలో కూడా ఓ.డి బేసిస్ మీద గత రెండేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నారు. ఇక్కడే ఓడీలో పనిచేస్తున్న అధికారి బదిలీల్లో ఖచ్చితంగా వెనక్కి వెళ్లాల్సి ఉంది. లేదా జీఓ ప్రకారం కోరుకున్న అధికారుల బదిలీలు జరగగా ఖాళీ ఉన్న ప్రదేశాల్లోకి బదిలీపై వెళ్లాలి. కానీ ఇక్కడకి దగ్గర్లోని అనకాపల్లికి చాలా చాకచక్యంగా బదిలీ చేయించుకుంటున్నారు. ప్రభుత్వం జీఓ ఈ అధికారిణి బదిలీ విషయంలో చేతి వ్యవహారం ముందు మోకరిల్లాల్సి వచ్చింది. చక్రం తిప్పే నేర్పు ఉంటే ఏ విధంగా నైనా బదిలీలు చేయించుకోవచ్చునని.. దానికోసం బదిలీలు చేసే అధికారులు కూడా వారికి అనుకూలంగానే పనిచేస్తార విషయం పంచాయతీరాజ్ శాఖలోని బదిలీల్లో చాలా క్లియర్ గా కనిపించింది. జి.గంగారామ్ సూపరింటెండెంట్ మూడు నెలల సర్వీసు చేసిన వ్యక్తిని అడ్డగోలుగా విజయనగరానికి బదిలీచేసేశారు. ఇలా ఒకటి కాదు రెండు ఇష్టానుసారం బదిలీలు చేశారు అధికారులు. వీటన్నింటికీ బదిలీల ఉత్తర్వులే సాక్షిగా నిలుస్తున్నాయి. ఈ విషయాలను బయటకు రానీయకుండా ఉండేందుకుందు, ఒక వేళ తమపై మీడియాలో  కథనాలు వచ్చినా వెనుక నుంచి రక్షించేందుకు ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారని.. ఎవరేం చేసుకున్నా పర్లేదంటూ హుకుం కూడా జారీ చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది.  

భారీఎత్తున అక్రమాలు, ప్రభుత్వ జీఓను ఉల్లంఘించి మరీ జరిపిన ఈ బదిలీలను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని బాధిత అధికారులు కోరులున్నారు. అలా జరగకపోతే అక్రమార్గంలో బదిలీలపై వచ్చిన వారు ఇక్కడే మరో పదేళ్లు తిష్టవేసుకొని ఉండిపోయే ప్రమాదం కూడా ఉంటుందని వాపోతున్నారు. అలా కాకపోయినా ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను పాటించకుండా జరిపిన బదిలీలపై పంచాయతీరాజ్ శాఖ కమిషనర్, మూడు జిల్లాల కలెక్టర్లు దృష్టిసారిస్తే ఎవరి విషయంలో ఏ తరహా మోసాలు, అక్రమాలు జరిగాయో బయటపడే అవకాశం వుంది. అక్రమంగా జరిగిన బదిలీలపై జిల్లా కలెక్టర్లు దృష్టిసారిస్తారా.. లేదంటే జిఓలను సైతం బుట్టదాఖలు చేసిన అధికారుల తేడా బదిలీలకే ఒకే చెబుతారా  అనేది. కాగా పంచాయతీరాజ్ లో జరిగిన అక్రమాలపై డిప్యూటీ సీఎం, కమిషనరేట్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫిర్యాదులు వెళ్లినట్టు తెలిసింది.

visakhapatanm

2024-08-29 09:41:35

అన్నవరంలో సత్యదేవుడికే శఠగోపం..!

అన్నవరంలో వాళ్లు ఎంత చెబితే అంత..ఎలాంటి వారికైనా.. ఎంత ఎక్కువ రద్దీ ఉన్నా ఇట్టే సత్యదేవుని  అంతరాలయ దర్శనం చేయిం చేస్తారు.. ఆ సమయంలో దేవస్థాన సిబ్బందిగానీ, సెక్యూరిటీ గానీ వీరిని అడ్డుకోరు.. చూడటానికి సాక్షాత్తూ దేవస్థాన ఉద్యోగులు మాదిరిగానే చక్కటి తెలుపు రంగు దుస్తుల్లోనే కనిపిస్తూ..సత్యదేవుడికే శఠగోపం పెట్టేస్తున్నారు. రత్నగిరి వాసుడి ఆదాయానికి రూ.లక్షల్లో గండి కొట్టడానికి పీఆర్వో కార్యాలయం సాక్షిగా అడ్డగోలుగా అనధికార విధులు నిర్వహిస్తున్న గైడ్లు వచ్చిన దానిలో ఈఓ కార్యాలయానికే సింహా భాగం ఇచ్చే స్తారు. ఒక్క దర్శనాలే కాదండోయ రూములు కావాలన్నా.. ప్రసాదాలు కావాలన్నా.. ఇంకేమైనా వీరే అక్కడి సిబ్బందికి రాయబారులు. ఇలా దర్శనాలు చేయించేందుకు వీఐపీలు ఇచ్చే మొత్తం ఎంతో తెలిస్తే.. ఈ వార్త చదువుతున్నవారికి కూడా కళ్లు బైర్లు కమ్ముతాయి..అక్షరాలా ఒక్కో సార్టీ నుంచి రూ.3500 నుంచి రూ.5వేల వరకూ. ఇక అంతరాలయంలో హుండీలో కాకుండా అర్చకులతో చేసుకున్న ఒప్పందం మేరకే ప్లేటు దక్షిణల రూ.500 నుంచి ఆపై ఎంతిస్తారో లెక్కేలేదు. ఈ విషయం రత్నగిరిపై వార్తలను కవర్ చేసే ఓ వర్గం బాకా మీడియా కూడా వారి పనులు చేయించుకోవడానికి విషయాన్ని బయట పెట్టడానికి ముందుకి రావడం లేదు. 

అన్నవరం శ్రీ సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో అనధికార గైడ్లు ప్రతీరోజూ అడ్డదారిలో సంపాదించి అక్కడి అధికారులను మేపే విధానం స్వామిరి భక్తులకు సైతం ఆగ్రహం తెప్పిస్తున్నది. అదేంటి అంటే వీళ్లు ప్రత్యేక టిక్కెట్టుపై వస్తున్నారని సిబ్బందే ఒంటికాలపై లేస్తారు. ఎందుకంటే ఆ గైడ్లు జోబులో ఆ విధంగా టిక్కెట్లు కూడా ఉంటాయి. రోజుకి, రెండు మూడు టిక్కెట్లు తీసుకొని..వాటిపైనే ఎంత మంది వచ్చినా అంతమంది విఐపీ(అనధికార)లను అడ్డదారిలో లోనికి తీసుకెళ్లి ఇట్టే దర్శనాలు, వేద ఆశీర్వచనాలు చేయించి తీసుకొచ్చేస్తారు. వాస్తవానికి అంతరాలయ దర్శనాలకు తీసుకునే టిక్కెట్టును అక్కడ సిబ్బంది దర్శనం అయిన వెంటనే చించి పారేయాలి. కానీ అనధకార గైడ్లు సౌలభ్యం కోసం వాటిని ఏమీ చేయకుండా వారి వద్దనే ఉంచేస్తారు. అలా ఉంచేయడం వలన ఎప్పుడైనా ఉన్నతాధికారులు యాక్టింగ్ చేయడానికి తనిఖీలకు వచ్చినా స్వామివారి దర్శనానికి తామూ వచ్చామని.. ఇవిగో అంతరాలయ దర్శన టిక్కెట్లని భక్తుల ముందు అధికారులను కూడా బూరిడీ కొట్టిస్తారు. అనధికార విఐపీ వాహనాలను రాచమార్గంలో కొండపైకి ఎక్కించేందుకు ఒక బ్యాచ్, అక్కడ వాహనాలు సిఆర్వో కార్యాలయ సమీపంలో పార్క్ చేయించేందుకు మరో బ్యాచ్, గదులు ఇప్పించేందుకు ఒక బ్యాచ్, స్వామివారి ఆలయంలో దర్శనాలు చేయించేందుకు ఒక బృందం ఇలా విడిపోయి వారి విధులు.. కాదు కాదు.. అనధికార వసూళ్లు చక్కగా చేసుకుంటున్నారని రత్నగిరి కోడైకూస్తున్నది. 

ఇదేంటని ఈఓని ప్రశ్నిస్తే.. తాము చాలా పద్దతి గలవారమని.. ఎలాంటి అవినీతిని సహించమని.. దేవస్థానంలో అనధికార సిబ్బంది ఎవరూ లేరని చెప్పుకొస్తారు. తమ పనులు, వ్యాపారాలు, వ్యవహారాల కోసం మీడియా ఐడీ కార్డులతో ఉండే బాకా మీడియా కూడా ఈ విషయాన్ని మాత్రం గట్టిగా పబ్లిసిటీ చేస్తుంది. మరి అంతముందు అనధికార గైడ్లు విషయం ఎందుకు వదిలేసిందనే అనుమానం మీకు రావొచ్చు. కానీ వారి కనపడే.. కనీసం వినపడదే.. అసలు ఇక్కడ గైడ్లు ఎక్కడ ఉన్నారని వీళ్లే తిరగేసి ప్రశ్నలు వేస్తారు. వంతుల వారీగా గైడ్లు చేసే అడ్డగోలు దర్శనాల విధులకు ఒక్కొక్కరికీ అన్ని ఖర్చులు, అధికారులు, సిబ్బందికి ఇచ్చేసే మొత్తం పోనూ రూ.5వేల వరకూ తీసుకెళ్లిపోతారంటే అతిశయోక్తి కాదు.  వాస్తవానికి లఘుదర్శన టిక్కెట్ల ద్వారా ఆదాయం వస్తే సత్యదేవుడి హుండీ, గల్లా పెట్టి నిత్యం గల గలలాడుతుంటుంది. కానీ అనధికార గైడ్లే వచ్చే మొత్తాన్ని కొందరు సిబ్బంది.. అధికారుల సహకారంతో  కొల్లగొడుతుంటే.. మూడవాడిలా సత్యదేవుడు కళ్లప్పగించి చూడటం తప్పా మరేమీ చేయలేకపోతున్నాడని భక్తులు గొల్లుమంటున్నారు.  సాధారణ రోజుల్లో అడ్డదారి దర్శనాలకు రూ.1500 నుంచి రూ.2 వేల వరకూ ఛార్జి చేస్తే ప్రత్యేక రోజుల్లో రూ.3 వేల నుంచి రూ.5వేల వరకూ వసూలు చేస్తున్నారని సమాచారం అందుతుంది. 

ఈ విషయాన్ని చూసీ చూడనట్టు ఉండే మీడియాకి ప్రతీరోజూ దారి ఖర్చుల క్రింద రూ.500 టిప్పు కూడా ఇస్తారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. అంతేకాదండోయ్.. ఇక్కడకు వచ్చే కొందరు అనధికార విఐపీలు, రాజకీయనాయకులు, మీడియా పిచ్చి ఉన్నవారికి ప్రచారం కావాలంటే మరో రేటు ఉంటుంది. దానికి బాకా మీడియా సిద్దంగా వుంటుంది. వారి దర్శనం, విరాళాలు ఇచ్చిన ఫోటోలు, వీడియోలు ప్రచారం చేస్తే వారికి వచ్చే ఆదాయం వేరే లెవల్ లో వుంటుంది. ఇలా అటు గైడ్లు.. కొందరు తేడా మీడియా సభ్యులు రెండు చేతులా సంపాదిస్తూ సత్యదేవుని ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. ఇపుడు ఈవార్త చదివిన తరువాత కూడా ఇక్కడ అలాంటివేమీ జరగనపుడు ఎందుకు స్పందించాలని మాత్రమే ఇక్కడి సిబ్బంది ఊరుకుండిపోతారు. ఒకరిద్దరు హడావిడి చేసి రెండు మూడు రోజులు మీడియా సభ్యులను దర్శనాలకు అనుమతించరు. అంతకు మించి చేసేది ఏమీ ఉండదని వాళ్లకి, ఈ వార్త చదువుతున్నవారికి అందరీ తెలుసు. సత్యదేవ ఇప్పటికైనా నీ ఆదాయాన్ని గద్దల్లా తన్నుకుపోతున్న వారి నుంచి నిన్ను నువ్వే కాపాడుకోవాలయ్యా.. లేదంటే గైడ్లు అడ్డదారిలో ఆదాయం  కొల్లగొడుతున్నా ఏమీ చేయలేని సత్యదేవుడనే శీర్షికతో మళ్లీ మళ్లీ మేమే వార్తలు రాయలి.. నమో సత్యదేవ నమో నమహ..!

annavaram

2024-08-10 19:21:39