1 ENS Live Breaking News

గ్రామ సచివాలయ మహిళా పోలీసులకి ప్రభుత్వశాఖ లేనట్టే..?!

గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు ఇప్పట్లో కూటమి ప్రభుత్వం ప్రభుత్వ శాఖ కేటాయించే పరిస్థితులు కనిపించడం లేదు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నా..నేటికీ సచివాలయ మహిళా పోలీసులకు, ఉద్యోగులకు ఇచ్చిన హామీని ఒక్కటి కూడా నెరవేర్చలేదు. నెరవేర్చే అంశం కూడా ప్రభుత్వం వద్ద లేదని తెలుస్తుంది. ఫలితంగా సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ శాఖ లేకుండా, సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ లేకుండా, ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులకి వచ్చే సాధారణ ప్రయోజనాలను కూడా కోల్పోవాల్సి వస్తోంది.. ఇక మహిళా పోలీసుల విషయంలో ప్రతీ మూడు నెలలకు ఒకసారి హడావిడీ చేస్తున్న కూటమి ప్రభుత్వం దానిపై స్పష్టమైన ఆదేశాలేమీ ఇవ్వలేదు. దీనితో తమకు ప్రభుత్వశాఖ రాదు.. పదోన్నతులూ ఉండవని ఉద్యోగులు ఫిక్స్ అయిపోయా రు. కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తే కష్టాలు గట్టెక్కి ప్రభుత్వశాఖ కేటాయింపు జరుగుతుందనుకుంటే ప్రకటనలు, హామీలు తప్పా పనిమాత్రం జరగడం లేదని మహిళా పోలీసులు నెత్తీనోరూ కొట్టుకుంటున్నారు..!

ఆంధప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. నిర్ణయం తీసుకుంటే ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాల్సి వస్తుందనో.. లేదంటే గత ప్రభుత్వం తలా తోకా లేకుండా చేసి గాల్లో పెట్టేసిన విధానాన్ని ప్రచారానికి వాడుకోవాలని చూస్తుందో తెలీదు కానీ సచివాలయ ఉద్యోగులు, అందులోని మహిళాపోలీసులను అలాగే గాలికొదిలేసింది. ఎపుడైనా పత్రికలు, మీడియాలో కథనాలు వచ్చినపుడు మాత్రం  వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యోగులకు అన్యాయం చేస్తుందని.. వారిని సక్రమంగా..సరైన సీట్లో కూర్చోబెడతామని మాత్రం ప్రకటన చేస్తున్నది కూటమి ప్రభుత్వం. గత నెలలో కూడా హోం మంత్రి వంగలపూడి అనిత పదిరోజుల్లో మహిళా పోలీసులకు సముచిత స్థానాన్ని కల్పించి ప్రభుత్వ శాఖ కేటాయిస్తామని నాలుగైదు ప్రెస్ మీట్లో ప్రకటించారు. ఆ తరువాత ఆ ప్రకటన చూసి పొంగిపోయిన మహిళా పోలీసులు, సచివాలయ ఉద్యోగులకు రోజులు పోయి నెలలగు గడుస్తున్నాయి తప్పితే వారి సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు.

 మహిళా పోలీసుల పోస్టుల అంశం హైకోర్టులో ఉండటంతో గత ప్రభుత్వం తాత్సాహరం చేసి చేతులు దులుపుకుంది తప్పితే ఏమీ చేయలేదు. ఆ సమయంలో సీఎం చంద్రబాబు అప్పడు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని, గ్రామ, వార్డు వాలంటీర్ల జీతం రూ.10 వేలు చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్లు లైవ్ లో లేరు.. వారిని కొనసాగించలేదమని చెప్పి వారికి మంగళం పాడేసి వారి క్లస్టర్లను సచివాలయ ఉద్యోగులకు మ్యాపింగ్ చేసేశారు. అప్పటిని నుంచి వాలంటీర్ల విధులు, ఉద్యోగుల విధులు, సచివాలయ ఉద్యోగులచే చేయాల్సి వస్తున్నది. దానితోపాటు అదనంగా రక రకాల సర్వేలు కూడా చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో సచివాలయ ఉద్యోగులకు ఇతర ప్రభుత్వశాఖల్లోని ఖాళీలను బట్టి వారికి డిపార్ట్ మెంట్ స్లైడింగ్ ఇవ్వడంతోపాటు, ఇష్టమున్నవారిని పోలీసుశాఖలోనే ఉంచుతామని కూడా ప్రకటించింది. 

ఇదంతా గత నెలలో జరిగిపోతుందని అనుకున్నారు. మీడియాలో కూడా భారీ హెడ్డింగులతో వార్తలు వచ్చాయి. అయితే అదంతా వార్తలకే పరిమితం అయిపోయింది. కానీ ఒక్క అడుగుకూడా ముందుకి పడలేదు. వాస్తవానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామ, వార్డుసచివాలయ ఉద్యోగుల నోటిఫికేషన్, డిపార్ట్ మెంట్, రిక్రూట్ మెంట్, సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానల్ చక్కగా ఏర్పాటు చేసి ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి ఉద్యోగులకు మొదటి పదోన్నతి రావాల్సి ఉంది. కానీ గత ప్రభుత్వం తలా తోకా లేకుండా సచివాలయ ఉద్యోగుల నియామకాలు చేపట్టడంతో వారి భవితవ్యం గాల్లోనే ఉంది. అసలు ఈ శాఖలోని ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయో రావో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒకటిరెండు ప్రభుత్వశాఖల సిబ్బందికి పదోన్నతులు ఇచ్చి  మమా అనిపించారు. మిగిలిన వారికి ఇద్దామనుకునే లోపు వైఎస్సార్సీపీ ప్రభుత్వం గద్దె దిగేసింది. 

వెంటనే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంత హామిలిచ్చి ఉద్యోగులు నుంచి తిరుగుబాటు రాకుండా ప్రతీ మూడు నెలలకు ఒకసారి మీడియాలో ప్రకటనలు ఇచ్చి ఒకసారి ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్ పేస్కేలు ఇవ్వడానికి ప్రతిపాదించామని.. మరోసారి పేరెంట్ డిపార్ట్ మెంట్ లోనే పదోన్నతులు ఇవ్వనున్నామని.. మరోసారి ప్రభుత్వశాఖలేని మహిళా పోలీసులకు ఆప్షన్లు ఇస్తామని చెప్పి ప్రకటనలతో ఊదరకొడుతూ వచ్చారు. వాస్తవానికి అసెంబ్లీలో చర్చించిన అంశాలను ప్రభుత్వం ప్రత్యేక జీఓల ద్వారా అమలు చేయాలని. అదేంతో కూటమి ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగులు, అందునా మహిళా పోలీసుల విషయంలో పెద్ద ఎత్తున అసెంబ్లీ, శాసన మండలిలో చర్చలకు తెరలేపి. ఆ తరువాత వారిని ఏమీ చేయకుండా వదిలేయడం ఇపుడు ప్రభుత్వ వర్గాల నుంచి వ్యతిరేకతకు కారణం అవుతున్నది. గత ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయస్సు రెండేళ్లు పెంచేసిన తరువాత 74 ప్రభుత్వశాఖల్లో వేల సంఖ్యలో ఉద్యోగులు దఫ దఫాలుగా ఉద్యోగ విరమణలు చేస్తూ వస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ప్రభుత్వశాఖల్లోని భారీగా ఖాళీలు ఏర్పడుతున్నాయి. వాటిని భర్తీచేయాలంటే జరిగే పనికాదు. అలాగని సచివాలయ ఉద్యోగులను వారి మాత్రులశాఖలకు అటాచ్ చేస్తే ఇటు సచివాలయ ఉద్యోగులకు అటు ప్రభుత్వశాఖలకు సిబ్బంది కొరత లేకుండా ఉంటుందని కూడా ప్లాన్ చేశారు. అయితే అవన్నీ ప్రచారాలకే పరిమితం అవతున్నాయి. ఒక సారి ఒక అంశం ప్రచారం జరిగితే అది మూడు నాలుగు నెలల వరకూ అలా నాన్చే ఉంచుతున్నారు తప్పితే వాటిపై నిర్ధిష్టంగా చర్యలు తీసుకోవడం లేదు. గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసుల పరిస్థితి కూడా గత ఏడాది నుంచి కూటమిప్రభుత్వం అలా నాన్చుతూ వచ్చింది తప్పితే గాల్లో వున్నవారికి ప్రభుత్వ శాఖ కేటాయించే విషయంలో  ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనితో ఒక కూటమి ప్రభుత్వంలో కూడా ప్రకటనలు తప్పితే.. ఎలాంటి ప్రయోజనం ఉండదని..ఇక ప్రభుత్వశాఖ కేటాయి కలగానే మిగిలిపోతుందని మహిళా పోలీసులు ఫిక్స్ అయిపోయారు.

 అటు మిగిలిన సచివాలయ ఉద్యోగులు కూడా తమకు గత ప్రభుత్వం చేసినట్టుగానే ఈ ప్రభుత్వం కూడా అలా నాన్చుకుంటూ వచ్చి ఆఖరికి చేతులెత్తేస్తుందని సామాజిక మాద్యమాల్లో చర్చలు మొదులు పెట్టారు. నిజం కూటమి ప్రభుత్వం చేస్తున్న చర్యలే ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణం అవుతున్నాయనడానికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల అంశం, నేటికీ ఎలాంటి ప్రభుత్వ శాఖలేకుండా ఉన్న మహిళా పోలీసు విషయమే ప్రధాన ఉదాహరణగా మిగిలిపోయింది. చూడాలి ఏడాది దాటిన సందర్భంగా అయినా సచివాలయ ఉద్యోగులకు ఇచ్చిన ఎన్నికల హామీని కూటమిప్రభుత్వం నిలబెట్టుకుంటుందా.. పదోన్నతులు, ప్రయోజనాలు కల్పించాల్సి వస్తుందని మీడియా ప్రచారాలతోనే మిగిలిన నాలుగేళ్లు గడిపేస్తుందా అనేది..?!

visakhapatnam

2025-05-06 19:55:35

కూటమి ప్రభుత్వమైనా వర్కింగ్ జర్నలిస్టులను కరుణించేనా..?!

వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మీడియా పూర్తిగా అణచివేతకు గురైంది.. చిన్న, స్థానిక, మధ్య తరహా పత్రికలు, న్యూస్ ఏజెన్సీలు చాలా వరకూ మూతపడ్డాయి.. ప్రభుత్వ ప్రకటనలు ఒక ప్రధాన పత్రికలు, సొంత మీడియాకి తప్పా.. స్థానిక పత్రికలకు విడుదల చేసింది లేదు.. అలాగని జర్నలిస్టులకు తాము జర్నలిస్టులమని చెప్పుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే ప్రెస్ అక్రిడిటేషన్ కూడా పూర్తిస్థాయిలో అందుకోకుండా జీఓ నెంబరు 38 స్థానిక, చిన్న, మధ్య తరహా పత్రికలను అదహ్ పాతాళానికి తొక్కేసింది. ఇది దాదాపు జర్నలిస్టులు ప్రెస్ అక్రిడిటేషన్ కి కూడా నోచుకోకుండా అయిపోయింది. భారత దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా వచ్చిన జీఓతో చిన్నపత్రికలు కుదేలు అయిపోయాయి. చాలా మంది పత్రికలు మూసేసి వేరే పనులు కూడా చూసుకొని వెళ్లిపోయారు. ఇక మీడియానే నమ్ముకున్న వారు మాత్రం అప్పులు చేసి సంస్థలు నుడుపుతూ.. పత్రికలు ముద్రించి గత ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జర్నలిస్టులకు మళ్లీ ఆశలు చిగురించాయి.

 సీఎం చంద్రబాబు మీడియా, జర్నలిస్టులు పనిచేస్తేనే ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు తెలుస్తుందని నమ్మిన వ్యక్తిగా ఎప్పుడు టిడిపి అధికారంలో ఉన్నా మీడియాకి ఒక సముచిత స్థానం ఇస్తూ వచ్చారు. అయితే గత ప్రభుత్వంలో ఎన్నో గుణపాఠాలు నేర్చుకొని మీడియాకి దూరమైపోయిన వారంతా మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కొక్కరుగా మీడియాతోకి రావడం మొదలు పెడుతున్నారు. కారణం సీఎం చంద్రబాబుపై కాస్తంత నమ్మకం. ఆ నమ్మకమే ప్రస్తుతం చిన్న పత్రికలకు ఆక్సిజన్ అందిస్తోంది. ఎంపానల్ మెంట్ ఉన్న పత్రికలకు ప్రభుత్వం కొద్దో గొప్పో ప్రభుత్వ ప్రకటనలు విడుదల చేయంతో మళ్లీ చిన్న, స్థానిక, మధ్య తరహా పత్రికలకు జీవం వచ్చింది. చాలా కాలం తరువాత జర్నలిస్టులకు గుర్తింపు వస్తుందని అంతా ఆనంద పడుతూ కూటమి ప్రభుత్వం విడుదల చేయబోయే నూతన ప్రెస్ అక్రిడిటేషన్ జీఓ, జర్నలిస్టుల యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్, జర్నలిస్టుల హెల్త్ కార్డ్స్, అటాక్స్ కమిటీలు, మీడియా రక్షణ, ప్రెస్ అకాడమీ శిక్షణలు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హౌసింగ్ వంటి వాటిపై ఆశలు మొదలు అయ్యాయి. 

ఆ ఆశతోనే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 50వేల మంది జర్నలిస్టులు కూటమి ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకొని  జీవిస్తున్నారు. జర్నలిస్టు వృత్తి వదిలేసిన చాల మంది తిరిగి ఆ వృత్తిలోకి వస్తున్నారు. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వర్కింగ్ జర్నలిస్టుల ప్రెస్ అక్రిడిటేషన్ కార్డులు గత ప్రభుత్వంలోని జీఓ నెంబరు 38 ఆధారంగానే రెవిన్యువల్ చేసుకుంటూ వచ్చారు తప్పితే నూతన జీఓతో కొత్త అక్రిడిటేషన్లు ఇవ్వలేదు. ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పత్రికలు, మీడియా, న్యూస్ ఏజెన్సీలు అన్నీ కూటమి ప్రభుత్వం విడుదల చేయబోయే నూతన అక్రిడిటేషన్ జీఓపైనే ఆశలు పెట్టుకున్నాయి. ఇటీవలే క్యాబినెట్ లో ఆమోదం పొందిన జర్నలిస్టుల అక్రిడిటేషన్ ఫైలు ఇంకా జీఓ రూరంలో రాలేదు. అయితే ఆ జీఓ గత ప్రభుత్వంలోని జీఓ నెంబరు 38కి అనుకూలంగా ఉంటుందా లేదా.. ప్రతికూలంగా ఉంటుందా అనే విషయంలో జర్నలిస్టులు ఆందోళన పడుతున్నారు. గత ప్రభుత్వంలో సమాచారశాఖలోని కొందరు అధికారులు, సలహాదారులు చర్యల వలన జర్నలిస్టులకు గుర్తింపు లేకుండా పోయింది. 

ఇపుడు మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మీడియాకి ఎల్లప్పుడూ సముచిత స్థానం ఇచ్చే సీఎం చంద్రబాబు, రాష్ట్ర సమాచార పౌరంబంధాల శాఖ ద్వారా జర్నలిస్టుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు.. తద్వారా జర్నలిస్టులకు ఏం మేజరుగనుంది అనే విషయంలోనే అంతా ఆలోచనలో పడ్డారు.  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జర్నలిస్టులు బాధలు, కష్టాలు, చిన్నపత్రికల నిర్వహణ తెలిసిన అధికారిగా గుర్తింపు తెచ్చుకున్న సమాచారశాఖ డైరెక్టర్ హిమాంశుశుక్లా చాలా వరకూ స్థానిక పత్రికలు, మధ్య తరహా పత్రికలకు చేయూత ఇస్తూ వస్తున్నారు. చిన్న పత్రికలకు ఆగిపోయిన ప్రభుత్వ ప్రకటనలను మళ్లీ విడుదల చేయిస్తూ.. ఆర్ధిక కష్టాలు తీరేందకు ఎంతో మంచి మనసుతో దోహద పడుతున్నారు. ఈ మధ్యలో కొన్ని జర్నలిస్టుల సంఘాల్లో  వారిలో వారికి పడకపోవడంతో మళ్లీ కాస్త ఇబ్బందులు మొదలయ్యాయి. అందులోనూ సామాజిక వర్గం పేరుతో నడిచే రాష్ట్ర స్థాయి జర్నలిస్టుల సంఘాల్లోని పోస్టుల్లో వున్నవారు సీఎం స్థాయిలో చక్రం తిప్పడం వలన కూడా ఇటీవల విడుదలకు సిద్ధమైన ప్రెస్ అక్రిడిటేషన్ జోఓల్లో కూడా మార్పులకు కారణం అయ్యారని చెబుతున్నారు.

 ప్రస్తుతం ఆ ఆంశం రాష్ట్రంలో చర్చనీయాంశం అవుతుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత  స్థానిక దినపత్రి కలకు చేయూత అందిస్తూ వస్తున్నది. ఈ క్రమంలో ప్రభుత్వంపై ఆశలే తప్పా నిరాశ లేదు. కానీ కొన్ని జర్నలిస్టు సంఘాల నేతలు మధ్యలో దూరి సమాచారశాఖ అధికారులు, తప్పుదోవ పట్టించడంతో మార్పులు చేర్పులు ఉంటాయనేది తెరపైకి వచ్చింది. దీనితో గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా కూటమి అయినా రాజకీయాలకు పోకుండా కరుణిస్తేనే స్థానిక పత్రికలు మనుగడ సాధిస్తాయని, లేదంటే ఉన్న ఆ కొద్ది మంది కూడా మీడియాను, పత్రికలను మూసుకోవాల్సి వస్తుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూడాలి..త్వరలో రానున్న మీడియా అక్రిడి టేషన్ కమిటీ జీో ఏ విధంగా ఉండబోతుంది, జర్నలిస్టులకు స్థానిక దిన పత్రికలు ఏ స్థాయిలో మేలు చేయబోతుంది. ఏ స్థాయిలో నియంత్రణ చేపట్టబోతుందనేది..?!

visakhapatnam

2025-04-21 06:44:54

ఈరోజు-ఈఎన్ఎస్ చెప్పిందే నిజమైంది.. మల్లగుల్లాల సచివాలయ మహిళా పోలీస్..?!

ఈరోజు-ఈఎన్ఎస్ కథనాలు చెప్పినట్టే గ్రామ, వార్డుు సచివాలయశాఖలో ప్రతీ అడుగు పడుతుండటం ఇపుడు మీడియా వర్గాల్లో చర్చనీ యాంశం అవుతున్నది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి సంబంధించిన మీడియాలో కొన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమాచారం సదరు మీడియాలోనే ప్రధానంగా వస్తుంటుంది. కానీ విచిత్రంగా గ్రామ, వార్డు సచివాలయశాఖకి సంబంధించి గత ప్రభుత్వంలోనూ.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలోనూ అనుకూల మీడియాకి రాని సమాచారం, తెలియని అంశాలు ఒక్క ఈరోజు-ఈఎన్ఎస్ లో మాత్రమే ప్రత్యేక కథనాలుగా వెలువడుతున్నాయి. అంతేకాదు.. కథనాల ఆధారంగానే కూటమి ప్రభుత్వంలోని పరిపాలనా విభాగం అడు గులు వేస్తున్నదంటే ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేక కథనాల్లో వాస్తవికత ఏస్థాయిలో ఉందో ఇపుడు రాష్ట్రంలోని ప్రధాన మీడియా సంస్థలకు తెలిసొచ్చింది. ఈరోజు-ఈఎన్ఎస్ లో స్టోరీ వస్తే నిజమవుతుందా.. ఆ మీడియా అంత తోపా.. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుందా అని బీరాలు పోయిన వాళ్లే ఇపుడు ప్రత్యేకంగా జీఓలు, ఉత్తర్వులు ప్రభుత్వం జారీచేయడాన్ని చూసి నోరెళ్లబెడుతున్నారు..!

నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనూ.. నేటి కూటమి ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయశాఖకు సంబంధించిన తాజా అంశాలను ఈరోజు-ఈఎన్ఎస్ ప్రజలు, ఉద్యోగుల ముందుకి తీసుకురావడం, అదే అంశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ఇక్కడ విశేషం. గత కొన్నేళ్లుగా ప్రభుత్వశాఖలేని ఉద్యోగులుగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు కూటమి ప్రభుత్వం ఒక ప్రభుత్వశాఖను కేటాయించే చర్యలు చేపట్టింది. దానికోసం నాలుగైదు ప్రభుత్వశాఖల్లోని క్యాడర్లు, పదోన్నతులు, సర్వీస్ రూల్స్, మహిళా పోలీసుల సర్వీస్, గతంలో వీరికోసం తయారు చేసిన ప్రమోషన్ ఛానల్, వారికి నచ్చిన శాఖను ఎంచుకునే అంశాన్ని వారి ముందుకి తీసుకురావడానికి మల్లగుల్లాలు పడుతున్నది. గ్రామ, వార్డు సచివాలయశాఖలో 26 జిల్లాల్లోని 15వేల 4 సచివాలయాల్లో సుమారు లక్షా 28వేలకు పైగా ఉద్యోగులు పనిచేస్తుండగా ఒక్క మహిళా పోలీసు విభాగంలోనే  13910 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి మాతృశాఖ పోలీసుశాఖ అయినప్పటికీ, వీరిని పోలీస్ రిక్రూట్ మంట్ బోర్డు ద్వారా కాకుండా ఎపీపీఎస్సీ ద్వారా నియమాకాలు జరిపారంటూ కోర్టులో కేసు వేయడంతో వీరికి మూడేళ్లుగా ప్రభుత్వశాఖ లేకుండా పోయింది. 

వీరు పోలీసుశాఖకు చెందినవారు కాదని గత ప్రభుత్వం కోర్టుకి లిఖిత పూర్వకంగా లేఖ సమర్పించడంతో నాటి నుంచి నేటి వరకూ వీరు గాల్లోనే ఉన్నారు. గత ప్రభుత్వం అదిగో ఇదిగో అని కాలయాపన చేసింది తప్పిగే పోలీసుశాఖలో వీరికి మినిస్టీరియల్ స్టాప్ గానీ, పీఆర్భీ ద్వారా శిక్షణ ఇచ్చి పోలీసు సిబ్బందిగా కూడా తీసుకోకుండా తాత్సారం చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హోం మంత్రి వంగలపూడి అనిత ఈ విషయాన్ని అసెంబ్లీలోనూ, శాసన మండలిలోనూ చర్చించి వీరి చదువులు, వయస్సు, శారీక ధృడత్వాన్ని బట్టి వారికి డిపార్ట్ మెంట్ స్టైడింగ్ ఇవ్వాలని ఆలోచన చేసింది. ఆలోచన అయితే వచ్చింది గానీ ఏ క్యాడర్ లో వీరికి కోరుకున్న శాఖలకు పంపాలనే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నది. ప్రస్తుతం గత ప్రభుత్వం పెంచేసిన రెండేళ్ల అదనపు ఉద్యోగ విరమణ వయస్సు పూర్తయి చాలా ప్రభుత్వశాఖల్లో ఉద్యోగులు ఉద్యోగవిరమణలు చేయడంతో వేల సంఖ్యలో శాఖల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. ఆ ఖాళీల్లో వీరిని భర్తీచేయాలంటే వీరికి దగ్గరగా ఉన్న ప్రభుత్వశాఖలైతే వారిని అటుు సచివాలయాల్లోనూ, ఇటు కలిపేసిన ప్రభుత్వశాఖలోనూ రెండింటివద్దా పనిచేయించుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. 

దానికోసం గత ఏడాది అనధికారికంగా వీరిని పోలీసుశాఖలోని వివిధ పనులు, కార్యాలయ పనులు, బందోబస్తు పనులు ఇలా నచ్చిన విధంగా విధులు చేయించింది. ఆ సమయంలో కూడా కొందరు తమకు ప్రభుత్వశాఖ కేటాయించాలని, ఈ శాఖ కాకుండా మరోశాఖకు బదిలీచేయాలని ప్రజాప్రతినిధుల వద్ద మొరపెట్టుకోవడంతో ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలన చేస్తున్నది. దానికోసం వయస్సుఉండి ఫిట్ గా ఉన్నవారిని పీఆర్బీ ద్వారా ఫిజికల్ టెస్ట్, శిక్షణ ఇచ్చి పోలీసులుగానూ, లేదంటే వయసు దాటిన వారిని పోలీసుశాఖలోనే కార్యాలయాల్లో మినిస్టీరియల్ స్టాప్ గానూ, అదే కాదంటే పదోన్నతి ఇస్తున్నట్టుగా చూపించి గ్రేడ్-2 ఐసిడిఎస్ సూపర్ వైజర్ గా డిపార్ట్ మంట్ స్లైడింగ్, ఆప్సన్లు ఇచ్చి వారిని బదిలీ చేయాలని యోచిస్తున్నది. కోరుకున్న ప్రభుత్వశాఖలకు బదిలీచేసినా అటు మాతృశాఖ, ఇటు సచివాలయశాఖలో రెండింటిలోనూ మహిళా పోలీసులు పనిచేయాల్సి వుంటుందనే క్లాజుని రాష్ట్రంలోని ఉన్నతాధికారులు పెట్టినట్టుగా ఇక్కడ సమాచారం అందుతుంది. దానికి కారణం ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలన్నా.. వాటిని ప్రజలకు అందించాలన్నా సిబ్బంది చాలా అవసరం. 

ఉన్న మహిళా పోలీసులను శాఖలు కోరుకోమని అక్కడికి పంపేస్తే.. గ్రామ, వార్డు స్థాయిలో పథకాల అమలు కష్టతరం అయిపోతుంది. దానికోసం వారికి డిపార్ట్ మెంట్ అలాట్ మెంట్, సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానల్ వెళ్లే శాఖలను అనుగుణంగా చేసి.. వారిని మళ్లీ సచివాలయాల్లోనే విధులు నిర్వహించేలా చేస్తే.. కొత్త ఉద్యోగాలు భర్తీచేసేవరకూ ప్రభుత్వానికి పరిపాలనా పరమైన ఇబ్బందులు రాకుండా ఉంటాయని ప్రభుత్వానికి తమ నివేదికలో కొందరు ప్రభుత్వశాఖల ముఖ్యకార్యదర్శిలు చెప్పినట్టుగా సమాచారం అందుతుంది. మరోప్రక్క గ్రామ, వార్డు సచివాలయశాఖలోనే చాలా విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. వాటిలోకి మహిళా పోలీసులను తీసుకున్నా.. అక్కడి ఖాళీలు భర్తీతోపాటు, ప్రస్తుతం ఉద్యోగుల భర్తీ సమస్య కూడా తీరినట్టు వుంటుందని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ఈ విషయాన్ని ఈరోజు-ఈఎన్ఎస్ ద్వారా ప్రత్యేక కథనాలు అందించింది. ప్రస్తుతం వాటిపైనే రాష్ట్రప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వారికి ప్రభుత్వశాఖల కేటాయింపుతోపాటు, ఇతర ప్రభుత్వశాఖ ఉద్యోగుల మాదిరిగా ప్రభుత్వ ప్రయోజనాలన్నీ సచివాలయ ఉద్యోగులకు కూడా అందిస్తే.. వారికి న్యాయం చేసినట్టు అవుతుందని భావిస్తున్నది. 

ప్రస్తుతం పనిచేస్తున్న మహిళా పోలీసుల్లో చాలా 30శాతానికి పైగా వారికి పోలీసుశాఖలో ఉంటం ఇష్టం లేదని, తమని ఐసీడిఎస్  కి పంపేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 50శాతం మంది పోలీసుశాఖలో ఉంటామని తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు. మరో 10శాతం మంది తమను పోలీసుశాఖలోనే ఉంచి పోలీస్ స్టేషన్లు లేదా, జిల్లా ఎస్సీ కార్యాలయాలు, డిఎస్సీ కార్యాలయాల్లో మినిస్టీరియల్ స్టాఫ్ గా నియమించాలని కోరుతున్నారు.  మరికొందరు ఐదు ఉద్యోగాలకు పోటీ పరీక్ష రాసి మహిళా పోలీసులుగా సెలక్ట్ అయ్యామని, ఖాళీగా ఉన్న ఇతర శాఖల పోస్టుల్లో తమను భర్తీచేయాలని..తామంతా డిగ్రీలు, పీజీలు, పీహెచ్డీలు చేసి ఉన్నామని కూడా ప్రభుత్వానికి అర్జీలు చేశారు. ఈ విషయాలను కూడా ఈరోజు-ఈఎన్ఎస్ పతాక శీర్షికన ప్రత్యేక కథనాలు అందించింది. దీనితో ఎట్టకేలకు మహిళా పోలీసులకు దగ్గరగా ఉన్న ప్రభుత్వశాఖల్లోనే వారు కోరున్న శాఖకు పంపించి వారికి డిపార్ట్ మెంట్ అలాట్ మెంట్ చేసి రూట్ క్లియర్ చేయాలని ప్రభుత్వం అన్ని రకాలుగా సంప్రదింపులు చేస్తున్నది. 

అన్నీ అనుకున్నట్టు  జరిగితే నెలాఖరు లేదా. వచ్చే నెల మొదటి వారంలో ఉద్యోగులకు డిపార్ట్ మెంట్ స్లైడింగ్, ప్రభుత్వశాఖలను ఎంచుకునే ఆప్షన్ వస్తుందని సమాచారం అందుతుంది. ఎక్కువ మంది మహిళలు పోలీసుశాఖను కోరుకుంటే వారిని పీఆర్బీబీ ద్వారా ఫిజికల్ టెస్టులు పెట్టి వారిని పోలీసుశాఖలోకి తీసుకొని మహిళా పోలీసు స్టేషన్లలో ఖాళీలను భర్తీచేయాలనే ప్రతిపాదన కూడా ఇపుడు తెరపైకి వచ్చింది. చూడాలి ప్రభుత్వం మహిళా పోలీసుల విషయంలో మల్లగుల్లాలు పడి..ఏ నిర్ణయం తీసుకుంటుందనేది..?!

visakhapatnam

2025-04-17 15:22:10

ఈరోజు-ఈఎన్ఎస్ చెప్పిందే నిజమైంది.. గ్రామ, వార్డు సచివాలయాల మదింపు షురూ..!

అనుకున్నంతా అవుతోంది..వైఎస్ జగన్మోహనరెడ్డి మానస పుత్రిక గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, ప్రభుత్వంలోని 75వ ప్రభుత్వశాఖ త్వరలో కనుమరుగయ్యే టైమ్ వచ్చేసింది.. అవును గ్రామ, వార్డు సచివాలయాలను మదిస్తూ కూటమి ప్రభుత్వం క్టస్టర్ విధానం అమలు చేస్తోంది.. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాలను క్లస్టర్ విధానంతో సగానికి తొలుత కుదించేస్తున్నారు. ఇదే విషయాన్ని ఈరోజు-ఈఎన్ఎస్ నెల రోజుల క్రితం పతాక శీర్షిక ప్రచురిస్తే.. ఈరోజు పేపర్ లో రాస్తే అయిపోతుందా అని ఉన్నతాధికా రులతో పాటు, సచివాలయ ఉద్యోగులూ వెటకారంగా నవ్వారు.. తీరా ఇపుడు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు వెలువరించేసరికి నోరెళ్లబె డుతున్నారు.. ఈరోజు-ఈఎన్ఎస్ రాసింది అక్షరాల నిజమైందని చర్చ మొదలు పెట్టారు.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన దగ్గర నుంచి ఈశాఖలో వచ్చేమార్పులను, తలాతోకా లేకుండా చేస్తున్న పరిపాలనను రాష్ట్రంలోనే ఏ మీడియా అందించనంతగా గ్రౌండ్ లెవల్ రిపోర్ట్ ను ఈరోజు-ఈఎన్ఎస్ మాత్రమే ప్రత్యేక కథనాల రూపంలో ప్రచురిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే క్లస్టర్ విధానంతో తొలుత సచివాల యాలను మదించి, తరువాత కుదించి.. ఆపై తొలగిస్తారనే కథనం ప్రచురించింది. అందులో మొదటి అంశం మదింపుపై కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం విశేషం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని 75వ ప్రభుత్వ శాఖగా ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ వచ్చిన ఐదేళ్లలోనే కనుమరుగు కాబోతుంది. ప్రజలకు ఇంటిముంగిటే సేవలు అందించాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్.జగన్మోహనరెడ్డి మానసపుత్రికగా గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటైంది. ఎక్కడైనా, ఎప్పుడైనా ప్రభుత్వంలో ఒక ప్రభుత్వశాఖ కొత్తగా ఏర్పాటైతే దానికి నిర్ధిష్ట విధివిధానాలు, సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్, ఇతర ప్రభుత్వశాఖల్లో ఉన్నట్టుగా కొత్త శాఖలోనూ క్యాడర్లు ఏర్పాటు చేస్తారు. కానీ ఉన్న ప్రభుత్వశాఖలనే మాత్రుశాఖగా ఉంచి అదనంగా కొత్తశాఖగా ఏర్పాటు చేసి.. తలా తోకా లేకుండా వీరి నియామకాలు చేపట్టింది గత ప్రభుత్వం. అలాగని అధికారంలో ఉన్న సమయంలో కూడా వారికి న్యాయం చేసిందా అంటే అదీలేదు. ఈ క్రమంలోనే ఉన్న ఇతర ప్రభుత్వశాఖల్లో ఉద్యోగుల విరమణ వయస్సు రెండేళ్లు పెంచేసింది. దానితో ఒకేసారి 74 ప్రభుత్వశాఖల్లో వేల సంఖ్యలో ఉద్యోగులు దఫ దఫాలుగా ఉద్యోగ విరమణలు చేస్తూ వస్తున్నారు. 

ఇప్పటికిప్పుడు కొత్తగా మళ్లీ వేల సంఖ్యలో ఉద్యోగాలు నియామకాలు చేపట్టే పరిస్థితి ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో లేదు. దీనితో మాత్రుశాఖ ప్రామాణింగా నియమాకాలు చేపట్టి, గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటు చేసి.. నియమించిన ఉద్యోగులనే ఇపుడు కూటమి ప్రభుత్వం వారిని ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేయాలని చూస్తున్నది. ఇందులోభాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలను తొలుత మదింపు చేయడం మొదలు పెట్టింది. అంటే రెండు సచివాలయాలను కలిపి ఒక సచివాలయంగా మదించింది. తద్వారా ఒక సచివాలయంలోని సిబ్బందిని ఇతర ప్రభుత్వశాఖల్లో ఖాళీలను భర్తీచేయడానికి మార్గం సుగమం చేసుకుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే అన్ని ప్రభుత్వశాఖల్లోనూ భారీగా అన్ని కేటగిరీల్లోని భారీగా ఖాళీలు ఉండేవి. వాటిని భర్తీచేయకుండా ఏకంగా 1.30లక్షల ఉద్యోగాలను ఒకే శాఖలో తలా తోకా లేకుండా భర్తీచేసి చేతులు దులుపుకుంది. అప్పటి ఖాళీలు, తరువాత రెండేళ్లు ఉద్యోగ విరమణ వయస్సుతో ఖాళీ అయినవి తడిసి మోపెడు అవడంతో కూటమి ప్రభుత్వంపై భారం పడింది. 

ఆ భారాన్ని ప్రభుత్వశాఖల్లో ఉద్యోగుల ఖాళీలను భర్తీచేయడానికి ఇపుడు గ్రామ, వార్డు సచివాలయశాఖ సిబ్బందినే వినియోగించాలని నిర్ణయానికి వచ్చింది. ఎలాగూ మాత్రుశాఖల ప్రామాణికంగానే సచివాలయశాఖ ఏర్పాటుచేశారు కనుక అదే మాత్రుశాఖల్లోని ఖాళీను భర్తీచేయడానికి వీరినే వినియోగిస్తే.. గత ప్రభుత్వం వీరికి సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకుండా వదిలేసిన విధివిధానాలను భర్తీచేయాలని యోచిస్తున్నది. ఒకరకంగా సచివాలయ ఉద్యోగులకు మేలే చేస్తున్నప్పటికీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం లో భారీగా నష్టపోయిన ప్రయోజనాల విషయంలో ఎలాంటి ప్రకటన చేయకుండానే కూటమి ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం తనకి నచ్చినట్టుగా చేసుకుపోతున్నది. ప్రస్తుతం అన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు క్లస్టర్ విధానంపై ఉత్తర్వులు వచ్చాయి. అందులో కొన్ని పోస్టులను కూడా లేపేశారు. ముఖ్యంగా మహిళా పోలీసు పోస్టులనే ముందు లేపేసి.. ఉత్తర్వులు జారీచేసింది ప్రభుత్వం. 

అయితే అలా లేపేసిన మహిళా పోలీసులను ఖాళీ ఉన్న సచివాలయాల్లో నియమిస్తారా లేదా అనే విషయాన్ని మాత్రం ఎక్కడా పొందుపరచలేదు. దీనితో ఇప్పటికే కోర్టు కేసుల కారణంగా ఏ ప్రభుత్వశాఖ లేకుండా గాల్లో ఉన్న తమను క్లస్టర్ విధానంలో ఉన్నపోస్టులను లేపేయడంతో తమ పరిస్థితి ఏంటని మహిళా పోలీసులు గగ్గోలు పెడుతున్నారు. వాస్తవానికి చాలా సచివాలయాల్లో ప్రధాన విభాగాల్లో పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వెల్పేర్ అసిస్టెంట్, వార్డు అడ్మిన్, పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్ ఇలా చాలా పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వాటిలో వీరిని భర్తీచేయవచ్చు. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందో ఉత్తర్వుల్లో తెలియజేయకుండా క్లస్టర్ లిస్టు జారీలో మాత్రం ఏ సచివాలయం ఏ సచివాలయంలో కలుస్తుంది.. ఏ పోస్టులను లేపేశారు అనే వివరాలు మాత్రమే పొందుపరిచారు. ఒకరకంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులకు నిర్ధిష్ట ప్రభుత్వశాఖ ఏర్పాటు కావడంతోపాటు, ఏ ప్రభుత్వశాఖలోకి వీరిని పంపిస్తున్నారో సదరు ప్రభుత్వశాఖ సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ వర్తించే విధంగా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. 

కానీ ప్రజలకు అందుబాటులో ఉండే సచివాలయ వ్యవస్థకు మాత్రం దశల వారీగా మంగళం పాడేసే విధంగానే ప్రస్తుత ప్రభుత్వం చర్యలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తలా తోకా లేకుండా ఏర్పాటు చేసిందని పదే పదే చెబుతున్న కూటమి ప్రభుత్వం... అధికారంలో ఉండి ఏ చేస్తుందో కూడా చెప్పకుండా గత ప్రభుత్వం వ్యవహరించిన తీరుకంటే దారుణంగా వ్యవహరిస్తుందనే వాదనను ఉద్యోగులు వినిపిస్తున్నారు. ఏపీపీఎస్సీ ద్వారానే పోటీపరీక్షలు రాసే ఉద్యోగాలు పొందినా.. ఏ ప్రభుత్వశాఖలోనూ లేని విధంగా అన్ని ప్రభుత్వశాఖల విధులు తమతో చేయిస్తున్నారని.. పైగా సదరు ప్రభుత్వశాఖలకు ఇచ్చే ప్రయోజనాలు, సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ మాకూ వర్తింపచేయండి అంటే మాత్రం.. ఆ ఒక్కటీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు సేవలు అందించేందుకు తమతో అన్నిశాఖలు పనులు, డ్యూటీ టైమ్ కంటే అదనంగా చేయిస్తూ.. సెలవు రోజుల్లో కూడా వదిలిపెట్టకుండా పనులు పురమాయించి మరీ చేయిస్తున్న ప్రభుత్వం తమకిచ్చే ప్రయోజనాలు ఇవ్వమంటే మాత్రం ఆ తప్పుని గత ప్రభుత్వంపై నెట్టేసి మా నోట్లో మట్టి కొడుతుందని లబో దిబో మంటున్నారు.

 దేశంలోనే ఏ రాష్ట్రప్రభుత్వంలో లేని ఒకే ఒక్క తేడా విధానం ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయశాఖలోనే ఉందని..ఒక ప్రభుత్వ శాఖ ఉద్యోగి ఇతర ప్రభుత్వశాఖలకు చెందిన పనులు చేయడం, అదీ అదనపు పనిగంటలు చేయించడం దారుణమని వాపోతున్నారు. దానికి తోడు ఇపుడు క్లస్టర్ విధానం అమలు చేస్తూ.. సచివాలయాలను మదిస్తూ.. కొంతమంది ఉద్యోగులను లేపేయడం ఎలా అర్ధం చేసుకోవాలో తెలియడం లేదంటున్నారు. చూడాలి గత వైఎస్సార్సీపీపై తప్పులన్నీ నెట్టేస్తున్న కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాల యశాఖ విషయంలో రెండవ దశ ఉద్యోగుల కుదింపును క్లస్టర్ విధానం తరువాత ఏ విధంగా చేపడుతుందనేది..ఆఖరిగా తొలగింపు ఇంకెలా చేస్తుందనేది..?!

visakhapatnam

2025-04-10 22:53:38

ఈరోజు-ఈఎన్ఎస్ కథనాలకు కూటమి ప్రభుత్వ స్పందన.. సచివాలయ మహిళా పోలీసులకు ప్రభుత్వశాఖ..?!

ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ.. ఏ ప్రభుత్వశాఖ లేని ఉద్యోగులుగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసుల కష్టాలకు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టే ప్రయత్నాలు ప్రారంభించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నుంచి కోర్టు కేసులతో ఎలాంటి ప్రభుత్వశాఖ లేని ఉద్యోగులుగా ఇప్పటి వరకూ గాల్లో ఉన్న గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసుల కష్టాలు, భాదలపై ఈరోజు-ఈఎన్ఎస్ వరుస కథనాలు ప్రచురించింది.. దీనితో స్పందించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించింది.. అయినా ఫలితం లేకపోవడంతో రంగంలోకి దిగిన ఈరోజు-ఈఎన్ఎస్.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బాధలు, గత ప్రభుత్వం చేసిన మోసం, తలా తోకాలేని నియమాకాలు, ప్రభుత్వశాఖ లేకుండా మహిళలతో ప్రభుత్వ ఉద్యోగం చేయిస్తున్న మహిళా పోలీసుల వెతలపై గ్రౌండ్ లెవల్ రిపోర్టింగ్ తో వరుస కథనాలు ప్రచురించింది. దీనితో కూటమి ప్రభుత్వంలో కదిలిక వచ్చింది..త్వరలోనే క్యాబినెట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో విశాఖలో ఈ విషయాన్ని మళ్లీ ఈరోజు-ఈఎన్ఎస్ హోం మంత్రి అనివద్ద ప్రస్తావించగా మహిళా పోలీసుల కష్టాలు 10-15రోజుల్లో తీర్చడానికి ప్రభుత్వం ఒక సముచిత నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు..!

భారత దేశంలోనే ప్రభుత్వ శాఖ లేకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు కష్టాలకు ఇక తెరపడే గడియలు దగ్గరకి వచ్చాయి. ఉద్యోగుల బాధలు, సర్వీసు నిబందనలు, ప్రమోషన్ ఛానల్ లేకుండా, ఎలాంటి పదోన్నతులకు అవకాశం లేకుండా ఇప్పటి వరకూ గాల్లోనే ఉండిపోయిన మహిళా పోలీసుల కష్టాలు కూటమి ప్రభుత్వంలో తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సచివాలయశాఖ ఏర్పాటు చేసి, తలా తోకా లేకుండా నియామకాలు చేసిందని.. కోర్టు కేసుల నెపంతో ఉద్యోగులను గాల్లో పెట్టిందని హోం మంత్రి వంగల పూడి అనిత మండి పడ్డారు. ప్రతిపక్షంలో ఉన్న దగ్గర నుంచి పోరాటం చేస్తున్న మంత్రి అధికారంలోకి రావడం అదే పోలీసుశాఖకు మంత్రిగా ఉండటంతో కాస్త గట్టిగానే ఈ విషయాన్ని పట్టుకున్నారు. అంతేకాకుండా అసెంబ్లీ, శాసన మండలి వరకూ తీసుకెళ్లి వారికి న్యాయం చేస్తామని, వారి చదువులు, ఆశక్తిల మేరకు వారికి సముచిత స్థానం కల్పించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పుకొస్తున్న ఆమె..ఇదే విషయాన్ని నేడు ప్రభుత్వం ముందుకి తీసుకెళ్లారు. అంతేకాదు అదే విషయాన్ని విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఈరోజు-ఈఎన్ఎస్ ప్రధాన ప్రతినిధి వేసిన ప్రశ్నకు బదులుగా.. మహిళా పోలీసులకు 10-15 రోజుల్లో వారు కోరుకునే విధంగా వారిని సముచిత స్థానాల్లో కూర్చో బెడతామని, ప్రభుత్వశాఖ కేటాయింపులు చేస్తామని ప్రకటించారు.

 ప్రస్తుతం సచివాలయశాఖలో 26 జిల్లాల్లోని సుమారు 15వేల మంది మహిళా పోలీసులు పనిచేస్తున్నారని.. అందులో చాలా మందికి పోలీసుశాఖలో పనిచేయడం ఇష్టంలేదని, మరికొందరు ఇష్టం చూపుతున్నారని చెప్పారు. ఎవరికి ఏ శాఖ ఇష్టమో తెలుసుకొని, వారి చదువులు, ప్రస్తుతం వారు ఏ పోస్టుకి అర్హులో విచారణ చేసి వారికి తగ్గ స్థానాల్లో కూర్చో బెడతామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం కొత్త ప్రభుత్వశాఖ ఏర్పాటు చేసింది తప్పితే దానిని ఒక పద్దతి ప్రకారం చేయలేదని, దాని ఫలితంగానే మహిళా పోలీసులంతా నేడు ప్రభుత్వశాఖ లేని ప్రభుత్వ ఉద్యోగులుగా ఏ శాఖకూ చెందని ఉద్యోగులుగా పనిచేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగా వీరికా ప్రభుత్వశాఖతోపాటు, ప్రమోషన్లకు ఒక ప్రత్యేక వ్యవస్థ, ప్రభుత్వశాఖ కేటాయింపులు చేసి ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగానే వీరికి న్యాయం చేస్తామని చెప్పుకొచ్చారు.  సచివాలయ మహిళా పోలీసుల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే వీరు ఏ శాఖకు చెందని ఉద్యోగులుగానే ఉండిపోవాల్సి వస్తుందన్నారు. అది కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరన్నారు. అలాకాకుండా ప్రభుత్వ అవసరాలు, ప్రభుత్వశాఖలు, వారి అర్హతలు, వారికి నచ్చిన శాఖలను గుర్తించి వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

-ఈరోజు-ఈఎన్ఎస్ మాత్రమే సచివాలయ శాఖపై పోరాటం
ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వంలో 74 ప్రభుత్వశాఖలు ఉన్నా 75వ ప్రభుత్వ శాఖగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖను ఏర్పాటు చేసింది. అయితే కొత్త ప్రభుత్వశాఖ ఏర్పాటు చేస్తే అన్నిస్థాయిల్లో ఉద్యోగాలొస్తాయని అంతా భావించారు. అలాగే ఒక్క ఇదే సచివాలయ శాఖలో సుమారు 1.28 లక్షల ఉద్యోగాలను గత ప్రభుత్వం భర్తీ చేసింది. అయితే ఏ ఒక్క ఉద్యోగికి కూడా న్యాయం చేయలేదు. వారి జీవితాలను గాల్లోనే పెట్టేవిధంగా ఉంచేసింది. అందులో నిత్యం ప్రజల్లోనే ఉండే మహిళా పోలీసులని. వీరితో పాటు సంక్షేమ పథకాలు ఇచ్చే సంక్షేమ కార్యదర్శిలని. వీరి నియామకాల దగ్గర నుంచి అన్నీ అతుకుబొతుకులే. దానితో వీరి నియామకాలు చెల్లవంటూ ఉమ్మడి విశాఖ జిల్లాలో కొందరు కోర్టుని ఆశ్రయించారు. మహిళా పోలీసులను పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా కాకుండా ఏపీపీఎస్సీ ద్వారా  నియమించారని, వీరు మహిళా పోలీసులగా అనర్హులంటూ కోర్టులో కేసులు వేశారు. దానితో ప్రస్తుతం పనిచేస్తున్న మహిళా పోలీసులు పోలీసుశాఖకు సంబంధం లేదని చెప్పి కోర్టుకి అఫడవిట్ దాఖలు చేసి గత ప్రభుత్వంలో ఇదే పోలీసుశాఖ చేతులు దులుపుకుంది.

 దీనితో నాటి నుంచి నేటి వరకూ వీరు గాల్లోనే ఉంటూ వీరి శాఖ కాని శాఖ పోలీసుశాఖ ఉద్యోగులుగానే అనధికారికంగా పనిచేస్తున్నారు. అప్పటి నుంచి కూటమి ప్రభుత్వం వచ్చేంత వరకూ వీరు అర్జీ పెట్టని ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, జిల్లా కలెక్టర్ ఆఖరుకి ఎంపీడీఓలు, వారే పనిచేస్తున్న సచివాలయాల్లోని స్పందనలో కూడా దరఖాస్తులు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటైన దగ్గర నుంచి ఉద్యోగుల తేడా నియామకాలు, సగం సగం పేస్కేలు,  సర్వీసు రెగ్యులరైజేషన్ లో నోషనల్ ఇంక్రిమెంట్లు ఎగ్గొట్టడం, పీఆర్సీ ఇచ్చి ఐఆర్ ఇవ్వకపోవడం, దానికంటే ముందుగా  హెచ్ఆర్ఏల్లో కుదింపులు, మళ్లీ పేస్కేలు అమలు చేసిన తరువాత మళ్లీ మార్పులు, ఇలా అనేక రకాలుగా తాలింపులు చేసుకుంటూ వచ్చింది. దానితో గ్రామ, వార్డు సచివాలయశాఖలోని మహిళా పోలీసులు దేనికీ చెందని వారుగా మిగిలిపోయారు. నాటి నుంచి నేటి వరకూ వారి కష్టాలను ఎప్పటికప్పుడు ఈరోజు-ఈఎన్ఎస్ సమస్యల వారీగా ప్రత్యేక కథనాలు ప్రచరిస్తూ వస్తోంది. ఇపుడు కూడా కథనాలు ప్రచురించడంతో స్పందించిన కూటమి ప్రభుత్వం ఇదే సచివాలయశాఖలోని ఉద్యోగులకు చిన్న చిన్న పదోన్నతులు ఇవ్వడానికి సిద్ద పడింది. 

తరువాత ప్రభుత్వశాఖ లేని ఉద్యోగులుగా ఉండిపోయిన మహిళా పోలీసుల కష్టాలను తీరుస్తామని, వారికి సముచిత స్థానాన్ని కేటాయిస్తామని హోం మంత్రి అనిత విశాఖలో ప్రకటించారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల ముందు హామీ ఇవ్వడంతో ఉద్యోగులు పెద్ద ఎత్తున కూటమి అధికారంలోకి రావడానికి వన్ సైడ్ గా ఓట్లు వేశారు అన్ని ప్రభుత్వశాఖ ఉద్యోగులతోపాటు, అధికంగా సచివాలయ ఉద్యోగులు. ఎన్ని ఒత్తిడులు వచ్చినా.. దానికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం ఒక్కొక్క పని చేయడానికి వీలుగా కమిటీలు వేస్తూ ముందుకు వెళుతున్నది. మహిళా పోలీసుల విషయంలో అనుకూలంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని.. ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేక కథనాలను నిజం చేస్తూ, వాటిపై స్పందిస్తూ.. సచివాలయ ఉద్యోగులకు న్యాయం జరగడానికి మార్గం సుగమం కావడం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రకటించినట్టుగానే, ఎన్నికల హామీని నిలబెట్టుకొని ఏ ప్రభుత్వశాఖ లేనటువంటి తమకు ప్రభుత్వశాఖ ఏర్పాటు చేయడంతోపాటు, పదోన్నతులు కల్పించాలని మహిళా పోలీసులకు కోరుతున్నారు. అదే సందర్భంలో కూటమి ప్రభుత్వానికి కూడా మహిళా పోలీసులు ధన్యవాదములు తెలియజేస్తున్నారు. చూడాలి హోం మంత్రి 10-15 రోజుల్లో మహిళాపోలీసులకు సముచిత స్థానం కల్పిస్తామని చేసిన ప్రకటన,భరోసా ఏ స్థాయిలో ప్రభుత్వంలో కార్యరూపంలో దాలుస్తుందనేది. ఎప్పుడు క్యాబినెట్ సమావేశాల ముందుకి వెళ్లి చేసిన ప్రకటనకి అమలు రూపం వస్తుందనేది..!

visakhapatnam

2025-04-09 20:43:18

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు తేడా పదోన్నతులు..?!

ఎస్..ఈరోజు-ఈఎన్ఎస్ చెప్పినట్టుగానే కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను కుదించడానికే దారులు వెతుకు న్నది.. దానికోసం ఉత్తుత్తి పదోన్నతులు కల్పించి సచివాలయాల్లోని వార్డు వెల్పేర్ అండ్ ఎడ్యేకేషనల్ అసిస్టెంట్లను సంక్షేమ శాఖల్లోని జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించినట్టుగా చూపి.. రాష్ట్రవ్యాప్తంగా 20శాతం మందిని మెరిట్ ప్రాతిపిదిక లాగేయడానికి రంగం సిద్దం చేసింది.. దానికోసం గ్రామ, వార్డు సచివాలయశాఖ డైరెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. శాఖాపరంగా జరిగిన సమావేశంలోని అంశాల ను పొందుపరుస్తూ దానిని ప్రభుత్వానికి నివేదించారు.. నేటి వరకూ సచివాలయశాఖలోని ఉద్యోగులకు సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయని ప్రభుత్వం.. ఆయాశాఖల్లోకి జూనియర్ అసిస్టెట్లుంగా పదోన్నతి పొందిన తరువాత  వెళ్లినశాఖలోని సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ అక్కడ  వర్తిస్తాయని పేర్కొంటుంది..గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు తప్పా ఇతర అన్నిశాఖల్లోని సిబ్బం దిని దశలవారీగా శాఖీలు అధికంగా ఉన్నశాఖల్లోకే తరలించడానికి మార్గం సుగమం చేస్తున్నది కూటమి ప్రభుత్వం. దశలవారీగా సిబ్బం దిని పదోన్నతుల పేరులతో అత్యధిక ఖాళీలు ఉన్న ప్రభుత్వశాఖల్లోకి కుదించేస్తే ఇక గ్రామ,వార్డు సచివాలయశాఖ ఆటోమేటిక్ గా రద్దై పోయే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి..!

భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు  తొంగి చూసిన గ్రామస్థాయి పరిపాలన, సేవల విధానమైన గ్రామ, వార్డు సచివాలయశాఖను కూటమి ప్రభుత్వ హయాంలోనే పూర్తిగా రద్దు చేయడానికి అన్ని దారులూ వెతుకుతున్నట్టుగానే కనిపిస్తున్నది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన తేడా పనులు, మరింత తేడా పరిపాలన, ఉద్యోగకల్పన వలన ఇపుడు గ్రామాల్లోని ప్రజలకు దగ్గరగా ఉన్న సచివాలయశాఖ కొద్ది కొద్దిగా పదోన్నతుల పేరుతో ఖాళీ చేసి.. చివరకి ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది మొత్తం ప్రస్తుతం ఉన్న 74 ప్రభుత్వశాఖల్లోని నాల్గవ తరగతి ఉద్యోగులుగా తరలించేయనున్నారు. దానికోసం ఆయాశాఖల్లోని ఖాళీలలను గుర్తించిన ప్రభుత్వం ఒక్కో ప్రభుత్వశాఖకు అనుబంధంగా ఉన్న సచివాలయ శాఖ సిబ్బందిని ప్రభుత్వశాఖల్లోకి తరలించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గత ప్రభుత్వంలో ఉద్యోగుల విరమణ వయస్సు రెండేళ్లు పెంచేయడంతో.. వేల సంఖ్యలో ఉద్యోగులు రిటైర్ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఒకేసారి అన్ని ప్రభుత్వశాఖల్లోని ఉద్యోగులను భర్తీచేయలేని ప్రభుత్వం అదే ప్రభుత్వశాఖలకు అనుబంధంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయశాఖల సిబ్బందిని పదోన్నతుల పేరుతో  ఆయాశాఖల్లోకి తరలించేస్తే.. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీతోపాటు, ఉద్యోగులకు పదోన్నతులు కూడా కల్పించినట్టు అవుతుందని భావిస్తున్నది. అయితే తీవ్ర అన్యాయానికి, పేస్కేలు నష్టానికి గురైన సచివాలయ ఉద్యోగులకు ఒక రకంగా కూటమి ప్రభుత్వం రివర్స్ ప్రమోషన్ ఇస్తున్నట్టుగానే కనిపిస్తున్నది. 

ప్రభుత్వంలో ఎక్కడైనా, ఏశాఖలోనైనా నాల్గవ తరగతి(ప్రస్తుతం పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ క్యాడర్) ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తే సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ పదోన్నతి కల్పించాలి. కానీ సచివాలయశాఖ ఉద్యోగుల విషయంలో అది రివర్స్ లో జరుగుతున్నది. ప్రస్తుతం 22460 పేస్కేలు అందుకుంటున్న వెల్పేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీలకు జూనియర్ అసిస్టెంట్ గా పదోన్నది కల్పించి.. వారికి  రూ.25220 పేస్కేలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నది.  అంటే రూ.2760  వ్యత్యాసంతో అదే జూనియర్ అసిస్టెంట్ పేస్కేలు అమలు చేయడం ద్వారా పదోన్నతి కల్పించినట్టుగా ఉంటుందని.. అంతకంటే ముఖ్యంగా ప్రభుత్వశాఖల్లోని ఖాళీలను అత్యవసరంగా భర్తీచేసినట్టుగా వుంటుందని ప్రభుత్వం ఆలోచిస్తున్నది.

ఇప్పటికే వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన తేడా నియామకాల వలన ప్రొబేషన్ రెండేళ్లు పూర్తయిన తరువాత అదనంగా తొమ్మిది నెలలు రూ.15వేలకే పని చేసి పూర్తి పేస్కేలుకోల్పోయి ఉద్యోగులు ఆపై..  పీఆర్సీలో ఐఆర్, డీఏలు, రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు కోల్పోయారు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు. ఇపుడు మళ్లీ కూటమి ప్రభుత్వంలోనూ అదే అన్యాయానికి గురవుతున్నారు సచివాలయ ఉద్యోగులు. సుమారు ఆరేళ్లు జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ లో పనిచేసిన ఉద్యోగులకు పదోన్నతి కల్పిస్తే కనీసం సీనియర్ అసిస్టెంట్  ప్రమోషన్ ఇవ్వాలి. అంతకంటే ముందు సర్వీస్ రెగ్యులర్ టైమ్ లో ఇవ్వాల్సిన రెండు ఇంక్రిమెంట్లు ఇచ్చిన తరువాత పదోన్నతులు కల్పించాల్సి వుంటుంది. అలా చేయకుండా.. కనీసం ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకుండా నేరుగా ఇతరశాఖల్లోకి బదిలీ చేయాలని చూస్తున్నది ప్రభుత్వం.

కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలని చూస్తున్న వేళ ఉద్యోగులు మాత్రం ఇక్కడ ఒక్క ఉపయోగం మాత్రం కనిపిస్తున్నది అదే ఉద్యోగులకు ఇతర శాఖలోని సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ అమలు. అది తప్పా మిగిలినవన్నీ తీవ్రమైన నష్టాలుగా కనిస్తున్నాయి. అయితే  పూర్తిగా గుడ్డికంటే మెల్ల బెటర్ అన్నట్టుగా కనీసం రూ. 2760 అదనంగా పేస్కేలు వస్తుందని మాత్రమే సంబర పడాల్సిన దుస్తుతి. పదోన్నతులు కల్పిస్తామని చెబుతున్న ప్రభుత్వం సర్వీసు రెగ్యులర్ అయిన తరువాత ఇవ్వాల్సిన రెండు ఇంక్రిమెంట్ల విషయంలో ఎక్కడా పదోన్నతులు అంశాలను ప్రస్తావించి, ప్రతిపాదించిన అంశాల్లో చేర్చలేదు.  20శాతం అంటే 3వేల మంది ఉద్యోగులను మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో సంక్షేమశాఖలు(బిసీవెల్పేర్, మైనార్టీ వెల్పేర్, సోషల్ వెల్పేర్, ట్రైబల్ వెల్ఫేర్) శాఖల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది.

వెల్పేర్ అసిస్టెంట్లకు ప్రభుత్వశాఖ వలన ప్రయోజనం లేని పదోన్నతులైనా వస్తున్నాయి తప్పితే మహిళా పోలీసులకైతే నేటికీ కనీసం ప్రభుత్వశాఖ కూడా లేకుండా గాల్లోనే ఉన్నారు. కాకపోతే తొలుత పోలీసుశాఖ ద్వారా వీరి నియామకాలు జరిపారు కనుక అదే శాఖలో అనధికారికంగా విధులు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి వీరి నియమాకాలపై కోర్టులో కేసులు పెండింగ్ లో ఉండటంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాలం నెట్టుకొచ్చేసింది తప్పితే వీరికి ఎలాంటి న్యాయం చేయలేదు. అలాగని కూటమి ప్రభుత్వం అయినా ఏమైనా చేసింద అంటే  అసెంబ్లీలో హడావిడి ప్రస్తావించి, ఉద్యోగుల్లో ఆశలు రేపి వదిలేసింది తప్పితే మహిళా పోలీసుల విషయంలో ఒక్క అడుగుకూడా ముందుకి వేయలేదు. 

రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 1.30లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. అందులో ప్రస్తుతం వెల్పేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు సుమారు 14వేలకు పైగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్నిజిల్లాల్లో సంక్షేమశాఖలోని ఖాళీలను భర్తీచేయడానికి 20శాతం అంటే సుమారు 3వేల మంది ఉద్యోగులను మెరిట్ అండ్ రోస్టర్ పాయింట్లను వినియోగించి ఆయాశాఖల్లోకి భర్తీచేయనుంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలను గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శిలుగా అంతేశాన్ని తీసుకొని వారికి ఖాళీ అయిపోయిన గ్రామపంచాయతీలకు సర్దేయడానికి కార్యాచరణ పూర్తి చేసింది. ఏఎన్ఎంలకు స్టాఫ్ నర్స్ శిక్షణ ఇచ్చి వారిని కూడా స్థానిక పీహెచ్సీలు, జిల్లా ఆసుపత్రుల్లోకి పంపనుంది. మరో వైపు ఇంజనీరింగ్ అసిస్టెంట్లును ఏఈలు లేదా వర్క్ ఇనెస్పెక్టర్లుగా పదోన్నతులు కల్పించాలని చూస్తున్నది. ఇక గ్రామీణ మత్స్య సహాయకులను కూడా ఫిషరీష్ ఇనెస్పెక్టర్లుగా పదోన్నతులు కల్పించడానికి మెరిట్ లిస్టులు తయారు చేస్తున్నది. రెవిన్యూలో భాగంగా ఉన్న విఆర్వోలు, సర్వేయర్లను అదే శాఖలోకి మండల కేంద్రాల్లోకి తీసుకోవాలనే యోచనలో ఉంది.

 అందరికీ అన్నీ చేసినా మహిళా పోలీసులకు ఏం చేయాలనే విషయంలో ప్రభుత్వం నేటికీ ఒక నిర్ణయానికి రాలేదు. వచ్చే అవకాశాలు కూడా ఎక్కడా కనిపించడం లేదు. హోం శాఖ మంత్రి వంగలపూడి అని అసెంబ్లీలో ప్రస్తావించినంత  వేగంగా కార్యాచరణలో మాత్రం పోలీసుశాఖలో వీరిని ఏ సేవలకు వినియోగించాలనే విషయంలో నిర్ణయానికి రాలేదు. ఆ దిశగా ఆలోచన కూడా చేయడం లేదు. ఈ విషయంలో మహిళా పోలీసులు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది.  గ్రామ, వార్డు సచివాలయశాఖలో ప్రస్తుతం రేషనలైజేషన్, ఆపై క్లస్టరైజేషన్ అంశాలు  మాత్రం వేగంగా నడుస్తున్నాయి.

ఇవన్నీ పూర్తయితే మిగిలిన 74 ప్రభుత్వశాఖల్లో ఎక్కడ ఖాళీలు ఉంటే అక్కడికి ఇక్కడి సిబ్బందిని పూర్తిగా పంపించేసి గ్రామ, వార్డు సచివాలయాలకు మంగళం పాడేయనున్నారు. అయితే అది ఒకేసారి చేస్తే వ్యతిరేకత వస్తుందని భావించి దానికి వివిధ దారులు వెతికి వాటి ద్వారా మెల్ల మెల్లగా ఈ వ్యవస్థకు చరమగీతం పాడటం కోసం అన్ని పనులు చక చకా చేసుకుపోతున్నది ప్రభుత్వం. కొత్తగా ఒక ప్రభుత్వశాఖను లెక్కా పత్రం, విధి విధానాలు లేకుండా ఏర్పాటు చేస్తే.. కావాల్సినట్టు ఇతర శాఖల్లోని ఖాళీలను భర్తీచేయడానికి ఇక్కడి సిబ్బందిని పంపేయవచ్చునని రాష్ట్ర ప్రభుత్వం చేతల్లో చేసి చూపిస్తున్నది.  దానికోసం కార్యాచరణ చేసిస్పష్టంగా.. అధికారికంగా చకచకా అడుగులు వేస్తున్నది. ఈ నేపథ్యంలో మిగిలిన శాఖల సచివాలయ సిబ్బందికి ఏ విధమైన పదోన్నతులు కల్పిస్తారో, వారికి ఏ విధమైన ప్రతిపాదనలు చేస్తారో.. ఖాళీలు ఉన్న ఏశాఖలోకి వారిని పంపిస్తారో వేచి చూడాల్సిందే మరి..!

visakhapatnam

2025-04-05 14:42:07

కొత్త జిల్లాలకు కలెక్టరేట్ భవనాలు.. ఈరోజు-ఈఎన్ఎస్ కథనాలపై స్పందించిన కూటమి ప్రభుత్వం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాల్లో నూతనంగా కలెక్టరేట్లు, జిల్లా శాఖల కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. అదీకాకుండా ఉమ్మడి జిల్లాల ప్రభుత్వ భవన సముదాయాల మాదిరిగానే కొత్త జిల్లాల్లో కూడా కలెక్టరేట్, అధికారుల నివాసాలు, క్యాంపు కార్యాలయాలు నిర్మించడానికి సీఎం నారా చంద్రబాబునాయుడు పచ్చజెండా ఊపారు. 26 జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్సులో ఈ విషయాన్ని వెల్లడించారు. కొత్త జిల్లాల్లో ప్రభుత్వ అద్దె భవనాలు, ఆలోచనలో పడ్డ సివిల్ సర్వీసు అధికారులు.. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు వెనక్కేనా.. అనే కథనాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈరోజు-ఈఎన్ఎస్ వరుసగా ప్రచురించింది. పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వ అధికారుల సమస్యలపై సీఎం సమీక్షించిన తరుణంలో కొత్తజిల్లాల్లో ప్రభుత్వ భవనాల నిర్మాణాలు, అద్దె కార్యాలయాల అంశం తెరమీదకు రావడంతో ముఖ్యమంత్రి కొత్తజిల్లాల్లో కూడా శాస్వత ప్రభుత్వ భవనాలను నిర్మించడానికి అంగీకారం చెప్పారు. దీనితో కలెక్టర్ల కాన్ఫరెన్సులో ఈరోజు-ఈఎన్ఎస్ కథనాలు చర్చనీయాంశం అయ్యాయి. మరోసారి ఈరోజు-ఈఎన్ఎస్ కథనాల వాస్తవికతకు ప్రభుత్వమే సాక్ష్యమైంది..!

ఈరోజు-ఈఎన్ఎస్ అందించే గ్రౌండ్ లెవల్ రిపోర్టింగ్ పై ప్రభుత్వం స్పందించడం మొదలు పెట్టింది. అంతేకాదు చక చకా ఆదేశాలివ్వ డంతోపాటు, కార్యకాలపాలకు నిర్ణయాలకు కూడా ఒకే చెబుతున్నది. కొత్త జిల్లాల్లో అద్దెభవనాలు, ప్రైవేటు ఇళ్లల్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల నివాసాలు.. అధికారుల ఆలోచనలు.. ప్రజల ఇబ్బందులపై అందించిన కథనాలకి ఫలితాలు మొదలయ్యాయి. కూటమి ప్రభు త్వంలో కదలిక తీసుకువచ్చాయి. గత ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చింది. కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు చేసినా కార్యకలా పాలన్నీ అద్దె భవనాల్లోనే నిర్వహిస్తూ వస్తోంది. ప్రభుత్వానికి ఆర్ధిక భారంతోపాటు, అధికారులకి కూడా నివాస సముదాయాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కొందరు అధికారులు పాత ఉమ్మడి జిల్లాల నుంచి రాకపోకలు సాగిస్తుంటే.. మరికొందరు కొత్త జిల్లాల్లోనే కాపురాలు ఉంటున్నారు. 

ప్రభుత్వ అధికారుల కార్యాలయాలు, నివాస సముదాయాలు అంటే ప్రత్యేకంగా ఒక ప్రదేశం ఉండాలి. కానీ అవకాశం లేక కొత్త జిల్లాల్లో ప్రైవే టు భవనాల్లోనే కాలం గడుపుతూ వస్తున్నారు. అదే విషయాన్ని వరుస కథకాల్లో ప్రచురించింది. ఇదే విషయాన్ని కలెక్టర్లు కూడా ముఖ్య మంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో కొత్త జిల్లాల్లో ప్రభుత్వ భవనాల సముదాయాల నిర్మాణాలకు మార్గం సుగమం అయ్యింది. త్వరలోనే కొత్త జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు, అధికారులకు నివాస సముదాయాలు రానున్నాయి. అపుడు అధికారులందరూ జిల్లా కేంద్రంలోనే ప్రజలందరికీ అందుబాటులోకి రానున్నారు.  అయితే కొత్త జిల్లాల్లో నిర్మాణాల వ్యయాన్ని తగ్గించుకునేందుకు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు నిర్మిస్తారా.. ఏ ప్రభుత్వశాఖకు ఆ ప్రభుత్వశాఖ భవనాలు అన్నట్టుగా విడివిడిగా నిర్మిస్తారానే అనే విషయంలో క్లారిటీ రావాల్సి వుంది.

-పేరుకే కొత్త జిల్లాలు.. కార్యకలాపాలన్నీ ఉమ్మడి జిల్లాగానే
రాష్ట్రంలో 13జిల్లాలు జిల్లాలు 26 జిల్లాలు అయినా అవి కేవలం రాష్ట్ర ప్రభుత్వంలోని రికార్డులకే పరిమితం అయ్యాయి. కానీ కేంద్రప్రభుత్వం దృష్టిలో మాత్రం ఇంకా 13 జిల్లాలే. కొత్త జిల్లాలకు చట్టబద్దత రావాలంటే రాష్ట్రపతి ఆమోద ముద్ర పడాలి. కానీ ఇది గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నుంచి నేటి కూటమి ప్రభుత్వం వరకూ జరగలేదు. అయినా కేంద్రంలో పనిలేకుండా రాష్ట్రప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్లు విడు దల చేసి పరిపాలన విస్తరించి అమలు చేస్తున్నది. కానీ కేంద్రప్రభుత్వం మాత్రం కొత్త జిల్లాల గుర్తింపు విషయంలో ఒక్క అడుగు కూడా వేయ లేదు. దీనితో రాష్ట్రంలో కొత్త జిల్లాలు మారినా.. పరిపాల వికేంద్రీకరణ జరిగినా.. బదిలీలు, నియామకాలు ఇతరత్రా వ్యవహారాలన్నీ పాత ఉమ్మడి జిల్లాల ప్రాతిపదిక మాత్రమే జరుగుతున్నాయి. 

వాస్తవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సఖ్యత ఉన్నా ఎందుకనో రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల చట్టబద్దత, కొత్త మండలాలు, కొత్త పంచాయతీలు, కొత్త జిల్లా పరిషత్ లు, నూతన నియోజకవర్గాల ఏర్పాటు విషయంలో ముందుడు వేయలేపోతున్నది. తద్వారా రాష్ట్రానికి కొత్తజిల్లాలకు రావాల్సిన చాలా నిధులు కూడా కోల్పోతున్నది. ఒక రకంగా కొత్త జిల్లాలకి చట్టబద్దత వస్తే ఆ వెంటనే కొత్త జిల్లా పరిషత్ లు, కొత్త మండాలు, ఇప్పటికే ఏర్పడ్డ గ్రామ పంచాయతీలకు కూడా చట్టబద్దత వస్తుంది. ఇవన్నీ జరగాలంటే రాష్ట్ర ఆమోద ముద్ర కావాల్సి ఉన్నది. అలా జరగాలంటే ఉబయ సభల్లోనూ బిల్లు పాస్ కావాలి. కానీ ఆ విషయాన్ని మన ఎంపీలు కూడా కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లడం లేదు.  అయితే రాష్ట్రంలో జన గణన, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, కొత్తజిల్లా జిల్లాలకు చట్టబద్ద ఇవన్నీ ఒకేసారి జరపాలని కేంద్రం భావిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయనే విషయంపై ఇటు రాష్ట్రప్రభుత్వానికి కూడా క్లారిటీ లేదు. అటు కేంద్రమూ ప్రకటించలేదు. రాష్ట్ర పునర్విభజనలోని కీలకమైన ఈ అంశాలపై కేంద్రం నేటి వరకూ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. 

విభజన హామీలను అమలు చేయలేదు. అలాగని ఎంపీలు, రాష్ట్రప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. కేంద్రం కొత్త జిల్లాల విషయంలో ముందడుగు వేస్తే రాష్ట్రంలో 175 ఉన్న నియోజకవర్గాలు 225 మారుతాయి. 13 కొత్త జిల్లాలకు చట్టబద్దత, 13 జిల్లాపరిషత్ ల ఏర్పాటు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు, ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల సంఖ్యను మరో మూడు అదనంగా చేరిస్తే వాటికి, అఖిల భారత సర్వీసు అధికారుల పెంపు, ఇలా చాలా ప్రయోజనాలే ఉన్నాయి. కానీ వాటిని సాధించడానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం సరైన ప్రణాళిక చేస్తున్నట్టు కనిపించడంలేదు. విషయాన్ని హోం ఎఫైర్స్,  మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకొని వెళ్లి పార్లమెం టులో ప్రత్యేక బిల్లు పాస్ చేయించడం ద్వారా అనుకున్నవన్నీ కార్యరూరంలోకి వస్తాయి. మిత్ర పక్షాలుగా ఉన్న కేంద్ర, రాష్ట్రప్రభు త్వాలు ఈ విషయంలో ముందుడుగు వేయాల్సిన ఆవశ్యకత ఇపుడు ఆశన్నమైంది. చూడాలి ఇప్పటికైనా ఆ దిశగా దృష్టి సారిస్తారా లేదా అనేది..?!

visakhapatnam

2025-03-26 20:58:44

విశాఖలో ఇన్చార్జి ఆర్డీడీతో లీవ్ పెట్టించలేకపోయిన ఆయుష్ కమిషనర్.?!

విశాఖలో జోన్-1 ఇన్చార్జి ఆయుష్ ఆర్డీడీ డా.ఝాన్సీలక్ష్మీభాయ్ ఒక దళిత ఉద్యోగినిపై చేయి చేసుకోవడం, ఆపై కులం పేరుతో దూషించిన వ్యవహారంలో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైనా  ఆయుష్ కమిషనర్ డి.మంజుల ఆమెతో లాంగ్ లీవ్ పెట్టించలేకపోతున్నారు.. ఇదే కేసు విషయమై ఆర్డీడీ కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ తో లాంగ్ లీవ్ పెట్టించిన కమిషనరేట్ అధికారులు ఇన్చార్జి ఆర్డీడితో మాత్రం లీవ్ పెట్టించ లేక చేతులెత్తేశారు..  తనకి కమిషనర్ అయినా, ప్రిన్సిపల్ సెక్రటరీ అయినా ఒకటే  లిఖిత పూర్వకంగా ఆర్డర్ ఇస్తే తప్పా తాను లీవ్ పెట్టనని భీష్మించుకొని కూర్చున్నారు సదరు ఇన్చార్జి ఆర్డీడి. అలాగని విధులుకు హాజరు కాకుండా.. ఇంటి దగ్గరే ఉండి ఎఫ్ఆర్ఎస్ అటెండెన్సులు వేస్తూ.. తన కేసు విషయంలో వైద్యులు, సిబ్బంది అంతా సహాయం చేయాలని.. లేదంటే మీరు చేసిన తప్పులన్నీ బయటకు తీస్తానని బెదిరింపులకు కూడా దిగుతున్నారట.. ఇంతజరుతున్నా ఆయుష్ కమిషనర్ గానీ, వైద్యఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గానీ ఈమెతో లాంగ్ లీవ్ పెట్టించలేకపోతున్నారు..ప్రస్తుతం ఈ విషయం ఆయుష్ శాఖలో హాట్ టాపిక్ అవుతోంది..!


కూటమి ప్రభుత్వంలో కూడా పైరవీలు చేసేవారికి.. తప్పులు చేసినా.. వాటికి ఆధారాలున్నా.. దళిత వైద్యులను కులం పేరుతో దూషించిన వేధింపులపై లిఖిత పూర్వక ఫిర్యాదులున్నా.. ఆయుష్ కమిషనరేట్ అధికారులు సదరు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోరని తేలిపోయింది. దానికి కారణం ఒక ప్రైవేటు ఐఏఎస్ స్టడీ సర్కిల్ లో ప్రభుత్వంలోని కొందరు ఐఏఎస్ అధికారుల పిల్లలు శిక్షణ పొందడటం, ఆ లాబీయింగ్ తోనే సదరు వ్యక్తి ఆయుష్ కమిషనరేట్, మెడికల్ అండ్ హెల్త్ పెషీలో తన వారిలో అడ్డగోలు పైరవీలు చేస్తున్నారనే విషయం తేటతెల్లం అవుతందని దళిత వైద్యులు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం దళితులమనే తమపై ప్రభుత్వం కూడా వివక్ష చూపుతోందని వాపోతున్నారు. కేవలం ఈ కారణంతోనే వైద్యఆరోగ్యశాఖలోని ప్రన్సిపల్ సెక్రటరీ కార్యాలయంలోని అధికారులు ఒత్తిడి వలనే ఇన్చార్జి ఆర్డీడి చేసిన తప్పులకి ఆధారాలున్నా.. 

దళిత వైద్యులను కులం పేరుతో దూషించారని లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేసినా.. ఉద్యోగి రిటైర్ మెంట్ ఫంక్షన్ కోసం డిస్పెన్సరీలన్నీ మూయించి.. విశాఖజిల్లా పరిషత్ లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకూ సన్మానాలు చేయించుకున్నా..ఆయుష్ శాఖలోని ఉన్నతాధికారైన కమిషనర్ ఈమె విషయంలో కనీసం చిన్న చర్య కూడా తీసుకోలేని పరిస్థితి ఎదురైందని ఇక్కడి అధికారులు, వైద్యులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అంటే అధికారులు తప్పులు చేయొచ్చు.. కానీ వాళ్లతో కనీసం లీవ్ కూడా పెట్టించలేని స్థితిలో కమిషనరేట్ అధికారులు ఉన్నారనడాకి జోన్-1 ఇన్చార్జి ఆర్డీడి ఉదయంతమే ప్రధాన ఉదాహరణ అని కూడా చెబుతున్నారు.

ఏ ప్రభుత్వ శాఖలోనైనా కమిషనర్ వేసే ఆర్డర్లను క్రింది స్థాయి అధికారులు పాటించి తీరాలి. కానీ ఆయుష్ లో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఇష్టానుసారం తప్పులు చేసినా.. సర్వీసు నిబంధనలు ఉల్లించినా.. అడ్డదారిలో ఇన్చార్జి ఆర్డీడి పోస్టులోకి వచ్చేసినా.. ఆపోస్టును అడ్డం పెట్టుకొని దళిత వైద్యులను, ఉద్యోగులను వేధించినా కమిషనర్ కాదు కదా...వైద్యఆరోగ్యశాఖలోని ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అంతేకాదు వాస్తవాలు బయటపెట్టే మీడియాని మేనేజ్ చేయడానికి వారి అనుచరులు అందరూ రంగంలోకి దిగిపోతారు. అక్షరాన్ని అమ్ముకునే తేడా మీడియా, అందులో పనిచేసే ప్రతినిధులు ఉండొచ్చు.. కానీ ఈరోజు-ఈఎన్ఎస్ మాత్రం అలాంటి నీచమైన పనులకు తలొంచదు. ప్రభుత్వ ఉద్యోగులు, అందునా దళితులు, అంతకంటే ముఖ్యంగా దళిత మహిళలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే పరిస్థితి కూడా లేదు.

 ఆ ఒక్కకారణంతోనే వరుస కథనాలు సదరు ఇన్చార్జి ఆర్డీడి విషయంలోనూ, ఆమె తప్పులు చేసినా వెనుకేసుకు వచ్చే అధికారులు ఉన్న విషయాన్ని కూడా పదే పదే ప్రజలు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నది. ఈ ప్రయత్నంలో ఈరోజు-ఈఎన్ఎస్ కి కొందరు తేడాగాళ్లు ఫోన్లు చేసి, వ్యక్తిగతంగా బెదిరింపులకు కూడా దిగినా దానిని కేర్ చేయలేదు. అంతేకాదు.. వాస్తవాలను బయటకు తీసి.. దానిని ప్రజల ముందుంచే విషయంలో తేడాగాళ్లు ఏం చేసినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ ప్రభుత్వశాఖలోనైనా అధికారులు సర్వీసు నిబంధనలు ఉల్లంఘిస్తే అలాంటి అధికారులను కమిషనరేట్ అధికారులు లాంగ్ లీవ్ లోకి పంపి.. ఇన్చార్జి పోస్టుల నుంచి తప్పిస్తారు. కానీ ఆయుష్ లో మాత్రం ఆ విధంగా జరగలేదు. కనీసం చేసిన తప్పులు, దళిత మహిళా ఉద్యోగినిపై చేయిచేసుకున్న విషయంలో ఎఫ్ఐఆర్ నమోదైనా.. సదరు ఇన్చార్జి ఆర్డీడిపై ఒక పల్లెత్తు మాట కూడా అనేదైర్యం ఉన్నతాధికారులు చేయడంలేదంటే ఏ స్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు.

 అధికారం, డబ్బు, పరపతితో చాలా మంది కాసులకి కక్కుర్తి పడేవారిని మేనేజ్ చేయవచ్చుగానీ.. ఈరోజు-ఈఎన్ఎస్ విషయంలో మాత్రం తేడాగాళ్ల పప్పులు ఉడకలేదు. దానితో అధికార యంత్రాగాన్నే మేనేజ్ చేస్తున్నారు. అంతేకాదు వారి బృందాన్ని విశాఖలో దింపి బెదిరింపులకు దిగుతున్నారు. మిగిలిన మీడియాని మేనేజ్ చేస్తున్నారనే సమాచారం కూడా ఉంది. అందుకే ఇంత జరుగుతున్నా.. ఒక్క మీడియాలో కూడా జరుగుతున్న తంతుపై కథనాలు వెలువడటం లేదు. అదే విధంగా కమిషనరేట్, ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయంలోనూ కొందరు అధికారులతో ఒత్తిడి తేవడం వలనే తప్పులుచేసిన ఇన్చార్జి ఆర్డీడిని పల్లెత్తు మాట అనలేక రోజులు వెల్లదీస్తున్నారు. 

ఇదే విషయమై ఆయుష్ కమిషనర్ ను ఈరోజు-ఈఎన్ఎస్ వివరణ కోరగా.. విశాఖజోన్-1 ఇన్చార్జి ఆర్డీడి విషయంలో లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు వచ్చాయని అన్నింటినినీ పరిశీలన చేస్తున్నామని.. విచారణ కొనసాగుతందనే చెప్పుకొస్తున్నారు. గత నెల 25 నుంచి చెప్పిన డైలాగే మార్చకుండా చెబుతన్నారు మీడియాతో. ఇప్పటికే ఇదే విషయమై జాతీయ ఎస్సీ కమిషన్, లోకాయుక్తాలకు బాధితులు,  దళిత వైద్యులు ఫిర్యాదులు కూడా చేశారు. చూడాలి.. చేసిన తప్పులకి రుజువులు ఉన్నా, ఆపై ఫిర్యాదులు వచ్చినా.. ఎఫ్ఐఆర్ లు నమోదైనా.. సర్వీసు రూల్స్ ఉల్లంగించినా ఇంకెన్ని రోజులు తప్పుచేసిన ఇన్చార్జి ఆర్డీడి విషయంలో ఆమెకు ఏమీ కాకుండా తప్పించడానికి ఇంకెన్ని రోజులు సమయంతీసుకొని  మేనేజ్ చేస్తారనేది..?!

visakhapatnam

2025-03-22 21:13:11

గ్రామ, వార్డు సచివాలయాలు నిర్వీర్యం..? వడి వడిగా అడుగులు.. ఇక కొద్దినెలల్లోనే..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 75వ ప్రభుత్వశాఖ శాఖగా ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయశాఖ పూర్తిగా నిర్వీర్యం అయ్యే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.. గత ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయస్సు పెంచేయడం.. ఆపై వేలాదిగా ఉద్యోగులు అన్నిశాఖల్లో రిటైర్ మెంట్ కావడం.. అదే సమయంలో కొత్త ఉద్యోగాలు తీసే పరిస్థితి లేకపోవడం.. ఉన్న సచివాలయశాఖ ఉద్యోగులనే ఇతర శాఖల్లోకి సర్ధుబాటు పేరుతో విలీనం చేయడానికి రేషనలైజేషన్, క్లస్టర్ విధానాన్ని తెరపైకి తీసుకు రావడం, సచివాలయాల్లో అందే సేవల్లో చాలా వరకూ వాట్సప్ గవర్నెన్స్ లో అందించడం.. ప్రాధాన్యత శాఖల్లో విపరీతంగా సిబ్బంది కొరత పెరిగిపోవడం..

  అన్నీ వెరసీ గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సుమారు 1.30 లక్షల మందిని ఖాళీ అయిపోయిన శాఖల్లోకి సర్దుబాటు చేస్తే తక్షణమే ఖాళీల భర్తీ కి కార్యాచరణ శర వేగంగా జరుగుతున్నట్గు సమాచారం అందుతోంది.. ఆపై సచివాలయ వ్యవస్థను దశల వారీగా రద్దు చేయడానికి ఆస్కారం వుంటుందనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తున్నది. ఇటీవలే రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం పోలీస్ స్టేషన్లు ఇతర ప్రభుత్వశాఖలకు కేటాయించడం కూడా సచివాలయాల నిర్వీర్యానికి ఊతమిస్తున్నాయి. ఈ విషయంలో ఏం జరుగుతుందనే విషయంలో సాంకేతిక కోణాలపై  ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేంగా అందిస్తున్న గ్రౌండ్ లెవల్ రిపోర్ట్..! 

 వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏర్పాటైన సచివాలయశాఖలోని 26 జిల్లాల్లో 15వేల నాలుగు గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న 1.30 లక్షల మంది ఉద్యోగుల్లో చాలా విభాగాలకు గత ఐదేళ్ల నుంచి  సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకుండా అలా ముందుకి నడిపించేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దక్కుతుందనడంతో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా సచివాలయశాఖ ఉద్యోగులకు అన్నీ అమలు చేస్తే పేస్కేలు పెరిగి ఆర్ధిక భారం ప్రభుత్వంపై పడుతుందని భావించి ఐదేళ్లకు పైనే కాలం నెట్టుకొచ్చేసిన ప్రభుత్వంగా కూడా ఆంధ్రప్రదేశ్  చరిత్ర సృష్టించింది. ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఏర్పడ్డ గ్రామ, వార్డు సచివాల యశాఖ ఉద్యోగులకు  కనీసం ఎదుగుదల లేకుండా.. ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా ప్రభుత్వ ప్రయోజనాలు, పీఆర్సీ ప్రయోజనాలు అందకుండా చేసి పరిపాలించేసిన ఘనత గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి దక్కితే.. ఆ ప్రభుత్వం ఎలాగూ చేయలేదు..

 మనమెందుకు చేయాలిలే అన్నట్టుగా రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులకు రాజ్యాంగంలోని ఆర్టికల్స్  ద్వారా కల్పించాల్సిన.. సర్వీస్ నిబంధ నలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకుండా.. తాడూ బొంగరం లేకుండానే ఇంత కాలం సిబ్బందితో పనులు చేయించేసు కుం టోంది ప్రభుత్వం. గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు గ్రామస్థాయిలో అందాలని ఈ వ్యవస్థ ఏర్పాటు చేస్తే.. కూటమి ప్రభుత్వం ఉన్న ప్రభుత్వ శాఖల్లోని ఒక్కసారిగా ఏర్పడ్డ ఖాళీలను భర్తీచేసుకోవడానికి, సర్ధుబాటుకోసం మళ్లీ ఇదే సచివాలయ శాఖను వినియోగిం చుకోవ డం విశేషం. ఏ ప్రభుత్వశాఖలోనూ లేనివిధంగా సెలవు రోజులు, అదనపు పనిగంటలు, రెండవ శనివారాల్లోనూ కూడా ఎడా పెడా పనులు చేయించుకొని మరీ సిబ్బందిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తున్న ఘనత అటు వైఎస్సార్సీపీ ప్రభుత్వం తరువాత కూటమి ప్రభుత్వానికి దక్కిందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

రాష్ట్ర ప్రభుత్వం  సెలవు రోజులకు కూడా కలిపే జీతాలు ఇస్తున్నందున ఆరోజుల్లో కూడా ప్రజలకోసమే సిబ్బందితో పనులు చేయిస్తున్నామని వాదిస్తోంది. మరి వేళా పాలా లేకుండా అప్పగిస్తున్న అదనపు పనిగంటల సంగతేంటని ప్రశ్నిస్తే మాత్రం ప్రజలకోసం, ప్రభుత్వం కోసం ఆమాత్రం అదనంగా పనిచేయాలేరా..? సర్వేల కోసం సొంతంగా సెల్ ఫోన్లు సమకూర్చుకోలేరా.. ప్రభుత్వం  ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచు కొని.. మీరే ఇంటర్ ప్యాకేజీలు వేయించుకోలేరా..? కార్యాలయాల్లో సొంత ఖర్చులతో స్టేషనరీ కొనుక్కొని మరీ సేవలు అందించలేరా..? ఇన్ని చేసిన తరువాత కూడా ఇచ్చిన టార్గెట్లు పూర్తికాకపోతే కోపంతో తిట్టిన తిట్లు, పెడుతున్న వేధింపులు భరించలేరా..? అంటోంది.. ప్రభుత్వం. ఒక్క ముక్కలో చెప్పాలంటే భారతదేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగు లకి ప్రభుత్వం కేటాయించినది ఒక శాఖ మాత్రమే అయినా.. అన్ని శాఖల పనులు వీరితోనే చేయించడం ఇక్కడ ప్రత్యేకత. అలా చేయించినా..

 రాజ్యాంగ బద్ధంగా వీరికి కల్పించాల్సిన ఉద్యోగ భద్రత, సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ మాటేంటి అంటే.. అవన్నీ చేస్తే.. ప్రభుత్వంపై ఆర్ధిక భారం పడుతుంది.. ఉద్యోగులతో, సిబ్బందితోనూ కావాల్సినట్టుగా అదనపు పనిగంటలతో పనులంటే  చేయించుకోగలం తప్పితే.. ఉద్యోగులకు చట్టబద్ధంగా ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వ ప్రయోజనాలంటే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే అంటున్నారు సదరు శాఖల ముఖ్యకార్యదర్శిలు. అలాగని సచివాలయ ఉద్యోగులకు మాత్రం ప్రతీ ఆరు నెలలకు ఒకసారి ఏదో జరిగిపోతుందన్నట్టుగా.. వీరికి ఏదో ఇచ్చేస్తామన్నట్టుగా.. సమస్యలు పరిష్కరించేస్తామన్నట్టుగా మాత్రం అసెంబ్లీలో సైతం వీరి ప్రధాన సమస్యలను ప్రస్తావించి ఉద్యోగుల్లో ఆశలను చిగురింప చేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించిన అంశాలు ఎక్కడైనా జరిగిపోతాయని ఉద్యోగులు భావిస్తారు.. కానీ గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగుల్లో మాత్రం అది కనీసం ఒక్క అడుగు కూడా ముందుకి పడటం లేదు.. కాదు కాదు వేయకుండా అలా మబ్బుల్లో తేలుస్తున్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ లో 75 ప్రభుత్వశాఖల్లో లేని అత్యంత ఎక్కువ మంది ఉద్యోగులు ఒక్క గ్రామ, వార్డు సచివాలయశాఖలోనే ఉన్నారు. వారికి పూర్తిస్థాయిలో పనిలేదని జనాలను నమ్మించేసి.. వారిని ఖాళీ అయిపోయిన ప్రభుత్వశాఖల్లోకి సర్ధుబాటు చేస్తే.. కొత్తగా ఉద్యోగాలు భర్తీచేసే పనుండదని ప్రభుత్వం భావిస్తోంది. దానికోసమే తొలుత రేషనలైజేషన్ విధానాన్ని తెరపైకి తెచ్చి.. మళ్లీ సచివాలయాలను కుదించడానికి క్లస్టర్ విధానాన్ని అమలు చేయాలని చూస్తుంది. ఈ మధ్య కాలంలో ఒక్కో శాఖను వారి మాతృశాఖలో విలీనం చేయడానికి చాపక్రింద నీరులా వ్యవహారాలన్నీ చక్కచెబుతున్నది.  అలాగని సదరు ప్రభుత్వ శాఖలోకి విలీనం చేసినపుడైనా వారికి.. ఆశాఖలోని ఉద్యోగులు మాదిరిగా క్యాడర్, సర్వీస్ రూల్, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేస్తారా.. అమలు చేస్తారా అంటే.. ఆ ఒక్కటీ అడక్కండీ.. కేవలం ప్రస్తుతం సర్ధుబాటు మాత్రమే జరుగుతుంది.. మిమ్మల్ని మల్టీ టాస్కింగ్ స్టాప్ గా నచ్చినట్టుగా వినియోగించుకుంటామని ఇటీవలే రేషనలైజేషన్ కోసం జీఓ కూడా ఇచ్చేసింది. ఇపుడు ఎడ్యుకేషన్ అసిస్టెంట్లను విద్యాశాఖకు అప్పగించి అక్కడ పనులు చేయించడానికి కార్యాచరణ సిద్దం చేస్తున్నది. 

మరి సూపర్ సిక్స్ పథకాలు ఎలా అమలు చేస్తారు.. పెన్షన్లు ఏ విధంగా పంచుతారంటే మాత్రం ఆ పనీ వీళ్లతోనే చేయిస్తాం.. కాకపోతే రానున్న రోజుల్లో గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉంటుందో ఊడుతుందో చెప్పలేమనీ.. సూచాయగా చెబుతున్నారు అధికారులు. ఒక ప్రభుత్వం ప్రజల ఇంటి ముంగిటనే సేవలు అందించడానికి ఒక ప్రభుత్వశాఖను ఏర్పాటు చేస్తే మరో ప్రభుత్వం శాఖల్లోని సిబ్బంది ఒకేసారి వేల సంఖ్యలో రిటైర్ అయిపోవడంతో  ఆ ఖాళీలను భర్తీచేసుకోవడానికి సచివాలయ ఉద్యోగులను వినియోగించుకోవాలని చూస్తున్నది. ఇన్ని చేస్తున్న ప్రభు త్వం ఒకేసారి ఈ శాఖను రద్దు చేసేయొచ్చుగదా అంటే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందని ఆలోచన చేస్తోందట.. అలాగని తెరవెనుక  నిర్వీర్య పనులు మాత్రం ఎక్కడా ఆపడంలేదు.. చూడాలి గ్రామ, వార్డు సచివాలయాలు ఉంటాయో..ఊడుతాయో.. వారికి జాబ్  క్యాడర్, సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానల్ విలీనంచేసిన శాఖల్లోనైనా కేటాయిస్తారా.. లేదా అనేది..?!

visakhapatnam

2025-03-18 17:43:29

సచివాలయ ఉద్యోగుల నోట్లో మట్టి..!? ప్రభుత్వశాఖ లేని మహిళా పోలీసులు

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేలు జరుగుతుందనుకుంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కంటే దారుణంగా పరిస్థితి మారిపోయిందని ఉద్యోగులు గొల్లు మంటున్నారు.. దేశం చూపుని ఆకర్షించిన సచివాలయ శాఖ ఉద్యోగులకు నేటికీ సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్, ప్రభుత్వశాఖల కేటాయింపు లేని ఏకైక ప్రభుత్వశాఖలో క్యాడర్ లేని ఉద్యోగులుగా తామే చరిత్ర కెక్కామని.. తమలాంటి దౌర్భాగ్య స్థితి మరే ఇతర ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులకూ రాకూడని నెత్తీ నోరూ కొట్టుకుంటున్నారు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యోగులను సగం నాశనం చేస్తే.. కూటమి ప్రభుత్వం మిగిలిన సగానికి పాతాళ లోకంలోకి  తొక్కేసిందని మండి పడుతున్నారు.. సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ అమలు చేస్తే అదనంగా జీతం, ప్రయోజనాలు కల్పించాల్సి వస్తుందని వాటి జోలికి వెళ్లకుండా.. రేషనలైజేషన్ పేరుదో ఉద్యోగుల కుదింపు.. క్లస్టర్ విధానంతో సచివాలయాల మదింపుకోసం మాత్రం ఆగమేఘాలపై పనులు చేస్తోందని.. అంతే వేగంగా తమకు కనీసం ప్రభుత్వ శాఖనైనా కేటాయించాలని మహిళా పోలీసులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.. వైస్సార్సీపీయే తమ భవిష్యత్తుతో ఆడుకుందనుకుంటే.. ఇపుడు కూటమి ప్రభుత్వం అంతకు రెండింతులు తమజీవితంలో పదోన్నతి చూడకుండా చేయాలని కంకణం కట్టుకుని తమ నోట్లో మట్టి కొట్టిందని కన్నీటిపర్యంతం అవుతున్నారు..!

భారతదేశంలోని ఒక్క ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని మాత్రమే క్యాడర్ లేకుండా పనిచేస్తున్నారు ఉద్యోగులు. ఏ ప్రభుత్వంలోనైనా, మరే రాష్ట్రంలోనైనా గ్రూప్-4 నుంచి ప్రారంభమయ్యే క్యాడర్ ఉంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఆ క్యాడర్ కూడా లేకుండా.. దానిక మరో క్యాడర్ పెంచి క్రిందికి దించేసిన విధానం ఉన్న ఉద్యోగాలు సచివాలయంలోనే ఉన్నాయని  వాపోతున్నారు. అందులోనూ మహిళా పోలీసులకైతే ఏ ప్రభుత్వశాఖనూ కేటాయించకుండానే ప్రభుత్వం వారిని పోలీసుశాఖలోని విధులకు, సచివాలయంలోని పనులకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గా వినియోగించుకుంటున్నది. కోర్టు కేసుల నేపథ్యంలో గత ప్రభుత్వంలో హైకోర్టుకి  మహిళా పోలీసులు పోలీసుశాఖకు చెందిన ఉద్యోగులు కారని ఒక అఫడవిట్ దాఖలు చేసి చేతులు దులిపేసుకుంది. ఆనాటి నుంచి ఈరోజు వరకూ వీరికి ప్రభుత్వ శాఖ లేకుండా వీరితో ప్రభుత్వం శెలవు రోజుల్లో కూడా అదనంగా పనులు చేయించుకుంటున్నది. తప్పిదే వీరికోసం కనీసం ఆలోచించిన పాపాన పోలేదు.

 గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులకు ఇపుడు పూర్తిస్థాయిలో సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్  ఏర్పాటు చేస్తే.. ఇతర ప్రభుత్వశాఖల్లోని ఉద్యోగులు మాదిరిగా జీతంతో కూడా ప్రయోజనాలు ఇవ్వాలని.. అదే ఏమీ చేయకుండా వదిలేస్తే.. కేవలం జీతంతోనే సరిపెట్టేయొచ్చుననే ఆలోచనగా కనిపిస్తున్నది కూటమి ప్రభుత్వానికి. దానికి గత ప్రభుత్వం చేసిన తప్పులనే బూచీగా చూపిస్తూ కాలం నెట్టుకొచ్చేస్తున్నది. అయితే ఇటీవల కాలంలో గత ప్రభుత్వం పెంచేసిన ఉద్యోగ విరమణ వయస్సు ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా 74 ప్రభుత్వ శాఖల్లో సుమారు 60వేలకు పైగా ఉద్యోగులు దఫ దఫాలుగా ఉద్యోగ విరమణలు చేస్తూ వస్తున్నారు. దీనితో ఆయా ప్రభుత్వశాఖల్లోని ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ వస్తున్నది. ప్రస్తుతం కొత్తగా ఉద్యోగాలు తీయాలంటే ప్రభుత్వం వద్ద ఆ  పరిస్థితి కనిపించడం లేదు. దానితో సచివాలయ ఉద్యోగులనే ఇతర ప్రభుత్వశాఖలకు పంపించే విధంగా రేషనలైజేషణ్ విధానాన్ని తెరపైకి తీసుకు వచ్చి సుమారు 40 వేల ఉద్యోగులు అధికంగా ఇక్కడ ఉన్నారని.. వాళ్లని ఆయా ప్రభుత్వశాఖల్లోని ప్రాధాన్యత కలిగిన శాఖలకు పంపించేందుకు ఆఘమేగాలపై జీఓ విడుదల చేసింది. 

ఆ రకంగా ఉద్యోగుల కుదింపు ఒక రకంగా జరిగితే ఇపుడు మళ్లీ.. క్లస్టర్ విధానాన్ని గుట్టుచప్పుడు కాకుండా అమలు చేసి ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలను( రెండు మూడింటిని) కలిపేయడానికి చక చకా నిర్ణయాలు చేస్తున్నది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మార్చి నెలాఖరు నాటికి క్లస్టర్ విధానం కూడా పూర్తయి సచివాలయాల సంఖ్య కూడా తగ్గిపోనున్నది. ప్రస్తుతం రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 1.28 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో రేషనలైజేషన్ ద్వారా 40 వేల మంది ఉద్యోగులను గుర్తించిన ప్రభుత్వం ముఖ్యమైన ఆదాయం వచ్చేశాఖల్లో వీరిని డిప్యూటేషన్ పద్దతిపై పంపడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఇంకా ఉద్యోగులు కావాల్సి రావడంతో మళ్లీ ఆ ఉన్న ఉద్యోగులను కుదించి మరింత మందిని తగ్గించి.. అలా వచ్చిన వారిని మరికొన్ని ప్రభుత్వశాఖల్లోకి పంపేందుకు చకచకా పనులు పూర్తిచేసేస్తున్నది. దగ్గర దగ్గరగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలు ఏవి ఎందులో కలిసిపోతాయో ఎవరికీ తెలియని పరిస్థితి ఉద్యోగుల్లో నెలకొంది.

అంటే ఇక్కడ ప్రభుత్వానికి అవసరం అనుకుంటే జీఓలన్నీ రాత్రికి రాత్రే పుట్టుకొచ్చేస్తాయి... అదే ప్రభుత్వ ఉద్యోగికి మేలు చేయాలన్నా.. ఏ ప్రభుత్వశాఖ లేని మహిళా పోలీసులకు ఒక ప్రభుత్వ శాఖ కేటాయించాలన్నా... ఉన్న శాఖల ఉద్యోగులకి సర్వీసు నిబంధనలు అమలు చేయాలన్నా, ప్రమోషన్ ఛానల్ వర్తింపచేయాలన్నా.. గత ప్రభుత్వం చేసిన తప్పులు గుర్తుకి వచ్చేసి మొత్తం ప్రక్రియను ఏ పనీ చేయకుండా వైఎస్సార్సీపీపై తోసేస్తున్నది. ప్రభుత్వం చేస్తున్న ఈ వింత దోరణి వలన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నేటికీ పదోన్నతి రాకుండా మిగిలిపోయారు. ఇపుడే కాదు రాష్ట్ర ప్రభుత్వం వీరికి సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేసే వారకూ ఇక్కడ పనిచేసే ఉద్యోగులు వారి సర్వీసు మొత్తంలో పదోన్నది కళ్ల చూస్తే ఒట్టు... పూర్తిస్థాయిలో పీఆర్సీ ప్రయోజనాలు తీసుకుంటే మరో రెండు ఒట్లు.. ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు మాదిరికి అన్ని క్యాడర్ వర్తింపచేస్తే మూడు ఒట్లు...ప్రయోషన్ తీసుకుంటే నాలుగు ఒట్లు.. ఇలా కిందా మీదా పెట్టి ఏదో ఒక రోజు ఈ శాఖ వలన ప్రభుత్వానికి, ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని ఈ శాఖను ప్రత్యేక ఆర్డినెన్సుతో రద్దు చేయకపోతే మరో ఐదు ఒట్లు.. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ గ్రామ, వార్డు సచివాలయశాఖ రద్దు దిశగానే అడుగులన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మొదట గ్రామ వాలంటీర్లు తొలగించారు.. ఆ పనులు సచివాలయ సిబ్బందికి అప్పగించారు.. ఇపుడు సిబ్బందిని కుదించడానికి రేషనలైజేషన్ తెరమీదకి తీసుకొచ్చి 40వేల మంది ఉద్యోగులను ఇతర శాఖల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. మరో ప్రక్క సచివాలయల సంఖ్యలను తగ్గించేయడానికి.. ఖాళీలు ఏర్పడుతున్న ప్రభుత్వశాఖల్లో ఉద్యోగుల కోసం ఇపుడు క్లస్టర్ విధానాన్ని తీసుకొచ్చి.. రెండు మూడు సచివాలయాను ఒకటిగా చేసి.. మిగిలిన వాటిని రద్దు చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ఆగమేఘాలపై చేసేస్తున్నది. ఇవన్నీ ప్రభుత్వానికి అత్యవసరంగా కావాల్సిన పనులు కనుక నేరుగా ఒక జీఓ జారీ చేసి పనులు చేసుకుంటూ వెళ్లిపోతున్నది. అదే ఇక్కడి ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించమంటే మంటే మాత్రం వెంటనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం గుర్తుకొచ్చేసి.. నిబంధనలన్నీ తెరపైకి వచ్చేస్తున్నాయి..

 ఈ విధంగా తమ ఉద్యోగుల నోట్లో కూటమి ప్రభుత్వం మట్టికొట్టి ఆనందపడుతుందని ఉద్యోగులు వాపోతున్నారు. ఇదే పద్దతి కొనసాగితే వైఎస్సార్సీపీ కి పట్టిన గతి కంటే దారుణమై పరిస్థితులు కూటమి ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా ఉద్యోగులు అపుడే ప్రజల్లోకి బలమైన వాయిస్ ను తీసుకెళుతున్నట్టుగా కనిపిస్తున్నది. చూడాలి ఎన్నికల్లో గెలుపుకోసం ఎడా పెడా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు హామీలిచ్చిన ప్రభుత్వం గత వైఎస్సార్సీపీ చేసిన తప్పులను సరిచేసి ఉద్యోగులను ఆదుకుంటుందా.. లేదంటే తమకు కావాల్సినట్టు వినియోగించుకొని.. ప్రయోజనం కల్పించాల్సి వచ్చే సమయానికి ఆ తప్పుని యదావిధిగా వైఎస్సార్సీపీ నెట్టేసి ఈ ఐదేళ్లు కనీసం ఉద్యోగులకు ప్రమోషన్ ఇవ్వకుండా.. సర్వీసు రూల్స్ వర్తింపజేయకుండా అలాగే ఉండిపోతుందా అనేది..?!

visakhapatnam

2025-03-13 20:33:59

అంతా నాయిష్టం.. కమిషనర్ అయితే ఏంటి..? ఈరోజు-ఈఎన్ఎస్ పై అవ్వాకులు చవ్వాకులు పేలితే కబడ్దార్..!

విశాఖలోని జోన్-1 ఆయుష్ ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీలక్ష్మీభాయ్ విషయంలో ఈరోజు-ఈఎన్ఎస్ అందిస్తున్న వరుస కథనాలు కూటమి ప్రభుత్వంలో చలనం తీసుకు వస్తున్నాయి.. కావాలని చేసిన తప్పులు.. నోటి దురుసు, నిమ్నజాతీయులను కులం పేరుతో దుర్భాష లాడటం, దూషించడం.. స్పష్టంగా కనిపిస్తున్నా ఆధారాలతో కూడిన కథనాలు  ఈరోజు-ఈఎన్ఎస్ లో వస్తుంటే లోన తడిచిపోతున్నా.. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.. అదేదో చిన్న మీడియా సంస్థ.. అందులో వార్తలు వస్తే ఏమైపోతుంది..?  చేసిన తప్పులు స్పష్టంగా కనిపిస్తున్నా..  ఇన్చార్జి ఆర్డీడి విషయంలో ఆయుష్ కమిషనర్ అయినా, ప్రిన్సిపల్ సెక్రటరీ అయినా ఎవరేం చేయగలరు..? అంటూనే ఈరోజు-ఈఎన్ఎస్ పై కడుపులో ఉన్న కుళ్లునంతా కక్కుతున్నారు సదరు స్టడీ సర్కిల్ నిర్వాహకుడు.. నిజమే ఈరోజు-ఈఎన్ఎస్ వార్తలు మిమ్మల్ని ఏమీ చేయలేపోవచ్చు.. మీరు అందరినీ మీ స్టైల్ లో మేనేజ్ చేయవచ్చు.. 

ఇక్కడ ఈరోజు-ఈఎన్ఎస్ ని ప్రభావితం చేయలేక పోయారు కదా..? మీకు భయం లేకపోతే మీ శాఖ మంత్రి వద్ద ప్రస్తావన ఎందుకు తెస్తారు.. పదే పదే ఈ విషయంలో కమిషనరేట్ చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు..?  అదేదో చిన్న సంస్థ, అయితే ఏంటి అని లోలోన భయ పడుతూ.. పైకి ధైర్యం నటించడం దేనికి..?  అంటే.. ఈరోజు-ఈఎన్ఎస్ కథనాల్లో కంటెంట్ ఉంది..? ఆధారాలున్నాయి.. చేసిన తప్పులపై ఫిర్యాదులున్నాయి.. అంతేకాదు పక్కాగా విశాఖ పీఎం పాలెం పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ కేసే నమోదైందంటే ఇంకా మీరు చేసిన తప్పులేం టో మీకు అర్ధం కావడం లేదా..? ఈ విషయంలో ఎవరూ ఈరోజు-ఈఎన్ఎస్ ని ప్రభావితం చేయలేరు.. కూటమి ప్రభుత్వానికి ఆయుష్ ద్వారా కావాలని చేసే తప్పులతో మచ్చతేవాలని చూస్తే.. ఊరుకునేది లేదు..!

ఎస్.. ఈరోజు-ఈఎన్ఎస్ అంటే మీడియా సంస్థ మాత్రమే కాదు..  ఒక న్యూస్ బ్రాండ్.. ఒక రియల్ న్యూస్ ఫ్యాక్టరీ.. ఒక ట్రెండ్ సెట్టర్..  ఈ మీడియా సంస్థ నుంచి వచ్చే వార్తలకు ఒక లెక్కంటుంది.. ఆధారాలతో రుజువు చేసే కంటెంట్ వుంటుంది.. ఈ విషయంలో ఎవరూ ఈరోజు-ఈఎన్ఎస్ ని ప్రభావితం చేయలేదు.. న్యాయం ఎవరివైపు వుంటే వాళ్ల వైపే ఈరోజు-ఈఎన్ఎస్ కలం కదులుతుంది.. వారి ఆవేదనకు, అవమానాలకు కథనాలు తోడవుతాయి.. న్యాయం కోసం ఎంత వరకైనా వెళుతుంది.. ఎవరో కాసుల ఆశ చూపారాని.. మరెవరో కులం పేరుతో ప్రలోభాలకి దిగారని.. జడిసే రకం కానేదు.. ఇక విషయానికి వద్దాం.. వైద్య ఆరోగ్యశాఖలో భాగంగా ఉన్న ఆయుష్ విషయంలో జరుగుతున్న వ్యవహారాలను గత కొద్ది రోజులుగా ఈరోజు-ఈఎన్ఎస్ వరుస కథనాలతో బయట పెడుతున్నది. అయితే ఆ కథనాలకు ఉలిక్కిపడుతున్న విశాఖ జోన్-1 ఇన్చార్జి ఆర్డీడి, వారి కుటుంబ సభ్యులుగా చెప్పుకునే వారు ఆయుష్ కమినరేట్ లో ఈరోజు-ఈఎన్ఎస్ కథనాలపై మల్ల గుల్లాలు పడుతున్నారు. 

ఎవరినైనా మేనేజ్ చేయగలుగుతున్నాం కానీ.. విశాఖ నుంచి వచ్చే ఆ స్మాల్ అండ్ మీడియం మీడియా సంస్థను మేనేజ్ చేయలేకపోతున్నామని అంటూనే.. ఆ పేపర్ లోనూ, ఆ సంస్థలోనూ వార్తలు వస్తే ఏమైపోతుంది.. అంటూ బీరాలు పోతున్నారు.. ఏదో అయిపోతుందని ఈరోజు-ఈఎన్ఎస్ వాస్తవాల ఆధారంగా కథనాలు రాయడం లేదు సుమీ.. జరిగిన విషయాలు, జరుగుతున్న అధికారిక ప్రలోభాలను,  దళిత వైద్యులకు జరిగిన అవమానాలను, మాల నాకొడకా.. మాదిగ నాకొడకా అని తిట్టిన విధానంపై ఆయుష్ కమిషనర్ కి వెళ్లిన ఫిర్యాదు పైనా..  దళిత మహిళా ఉద్యోగినిపై చేయి చేసుకుని తిరిగి ఆమెపైనే ఫిర్యాదు చేసిన వైనంపైనా ఈరోజు-ఈఎన్ఎస్ లో కథనాలు ప్రచురితం అవుతున్నాయి. అవి అవాస్తవాలు కాకపోతే మీరూ  ఖండన ఇచ్చుకోవచ్చు.. దానిని ప్రచురిస్తాం వాస్తవాలుంటే.. అంతే తప్పా వరుస కథనాలు రాస్తున్నారని ఈరోజు-ఈఎన్ఎస్ పై అవ్వాకులు, చెవ్వాకులు పేలితో మాత్రం అదీ వార్తాకథనంగా రాస్తాం.. ఇదిలో ఇలా అన్నమాట.

ఆయుష్ కమిషనర్ డి.మంజుల, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ క్రిష్ణబాబులకు విశాఖలోని జోన్-1 ఆయుష్ ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీ లక్ష్మీభాయ్ చేస్తున్న పనులు, తప్పులు కనిపిస్తున్నాయో లేదో తెలియడం లేదు.. దళిత వైద్యులను మాల నాకొడకా.. మాదిగ నా కొడకా అని సంబంధించి వేధిస్తున్న ఫిర్యాదులు చూశారో లేదో తెలీదు.. విశాఖలోని ఆయుష్ ఆర్డీడి కార్యాలయంలో దళిత మహిళా ఉద్యోగిని సుష్మాపై చేయి చేసుకొని, తిరిగి ఫిర్యాదు చేసిన విషయం అసలు గుర్తించారోలేదో కూడా తెలీదు.. అంతెందుకు ఒక రిటైర్ అయిన డాక్టర్ ఫేర్ వెల్ పార్టీ కోసం విశాఖలోజిల్లాలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ అతిథి గృహంలోనే డిస్పెన్సరీలన్నీ మూసేసి సన్మానాలు చేయించుకున్న విషయం మీడియాలో వచ్చిన ఫోటో ఆధారిత కథనాలు.. డిస్పెన్సిరీలను డోర్ లాక్  విషయం కూడా కావాలనే మరిచిపోయారా..? 

దళిత ఉద్యోగినిపై చేయి చేసుకున్నవిషయంలోనూ, కులం పేరుతో దూషించిన విషయంలోనూ పీఎం పాలెం పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైన విషయం నేటికీ తెలియదా..?  సర్వీసు రూల్స్, క్రమశిక్షణ చర్యలు అసలు ఆయుష్ లో ఉండవా..?  దళిత వైద్యులు, ఉద్యోగులు జాతీయ మహిళా సంఘానికి తమను కులం పేరుతో దూషించారని, పరిపాలన పేరుతో వేధించిన విషయమూ మీకు తెలీదా..? నిబంధనలను అతిక్రమించి రోస్టర్ పోయింట్లను మట్టిలో కప్పెట్టేసి.. అడ్డదారిలో ఇన్చార్జి  ఆర్డీడి పోస్టు కట్టబెట్టిన విషయమూ గుర్తులేదా..? జరిగిన అవినీతిపై లోకా యుక్తాకి ఫిర్యాదులు వెళ్లిన విషయమూ ఇంకా తెలీదా..? ఇదే ఇన్చార్జి ఆర్డీడి విషయంలో డా.లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్వాహకుడిపై బాధితులు జాతీయ ఎస్సీ కమిషన్ కు  ఫిర్యాదులు చేసిన విషయంలో జరిగిన రాద్దాం మర్చిపోయారా..? ఇదే ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్వాహకుడు బాధితులపైనే తిరిగి ఆరోపణలు చేస్తూ.. కమిషనరేట్ లోనూ, ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయంలోనూ తన పలుకుబడిని వినియోగిస్తున్నా అసలే గుర్తులేదా అంటున్నారు..

 ఆయుష్ లోని దళిత వైద్యులు, వేధింపబడ్డ  వెనుకబడిన వర్గాల వైద్యులు, డిస్పెన్సరీల సిబ్బంది.. అదే విషయాన్ని ఈరోజు-ఈఎన్ఎస్ లో వరుస కథనాలు వస్తే.. ఏం పీకుతారులే అన్నవారు..? వైద్యఆరోగ్యశాఖ మంత్రి పెషీలో రచ్చచేయడం దేనికి... అడ్డదారిలో ఇన్చార్జి పోస్టుకొట్టేసిన విషయాన్ని ఇదే కమిషనరేట్ లోని ఒక ఉన్నతాధికారి పెషీలోని అధికారులకు జీవోలు, అడ్డదారి వ్యవహారాలను వివరిస్తే ఎందుకు వెనక్కి తగ్గారు..? అంటే మీరు చేసేవన్నీ చేసేయొచ్చు.. మీవాళ్లని కాపాడేసుకోడానికి ఏమైనా చేయొచ్చు.. అదే ఈరోజు-ఈఎన్ఎస్ లో జరిగిన అంశాలపై వాస్తవాలతో కూడిన కథనాలవు వస్తే నొప్పులొచ్చేస్తున్నాయా  అంటూ ప్రశ్నిస్తున్నారు దళిత వైద్యులు, బాధితులు..?

అంతెందుకు.. విశాఖలోని ఇన్చార్జి ఆయుష్ ఆర్డీడి డా.ఝాన్సీలక్ష్మీభాయ్ ఇదే కార్యాలయంలోని దళిత మహిళా ఉద్యోగినిపై చేయి చేసుకొని, కులం పేరుతో దూషించిన విషయంలో ఎస్సీ ఎస్టీ కేసు పీఎం పాలెం పోలీస్ స్టేషన్ లో నమోదైతే... ఇటు ఇన్చార్జి  ఆర్డీడిని, అటు జూనియర్ అసిస్టెంట్ ను సుదీర్ఘ సెలవుపై వెళ్లిపోమని కమిషనరేట్ నుంచి మౌకిక ఆదేశాలిస్తే ఎవరు పాటించారు..? ఇదే ఇన్చార్జి ఆర్డీడి తనకు లిఖిత పూర్వకంగా ఆర్డర్ వస్తే తప్పా తాను సెలవు పెట్టనని.. ఎఫ్ఎఆర్ఎస్ అటెండెన్సు ఇంటి దగ్గరే ఉండి  విధులు నిర్వహిస్తుంటే ఆయుష్ లోని కమిషనర్ గానీ, వైద్యఆరోగ్యశాఖలోని ప్రిన్సిపల్ సెక్రటరీగానీ, బాధితులు జాతీయ ఎస్సీ కమిషన్ కి ఫిర్యాదు చేస్తూ అందులో పేర్కొన్న డా.లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్వాహకులకు గానీ ఆమె చేస్తున్న తప్పులు కనిపించడం లేదా..?

 పైగా తప్పుడు ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని అధికారులను, ప్రజాప్రతినిధులను ఏ మొహం పెట్టుకొని మేనేజ్ చేస్తే.. అధికారులు మరెలా నమ్ముతారంటూ దళిత సంఘాలు సైతం మండి పడుతున్నాయి.. ఆ విషయాలే కథనాలు ఈరోజు-ఈఎన్ఎస్ రాసింది.. ప్రత్యేక కథనాలుగా అందించింది.. అంటే మీరు తప్పులు మీద తప్పులు కావాలని చేసేయొచ్చు కానీ.. దానిపై ఏ మీడియాలోనూ వార్తలు రాయకూడదు..? ఎవరూ ప్రశ్నించకూడదు..? అడ్డదారిలో ఇన్చార్జి ఆర్డీడి అయిపోయినా అడక్కూడదు..? తప్పులను ప్రశ్నించకూడదంటే ఎలా అంటున్నదళిత సంఘాలను కూడా బెదిరాస్తారా..? ఇలాంటివి ఈరోజు-ఈఎన్ఎస్ చూస్తూ ఎలా ఊరుకుంటుంది..? అందుకనే వార్తలు రాసింది. మీకు వాస్తవాలపై వచ్చిన వార్తలంటే పట్టింపు లేకపోవచ్చు.. కానీ పేపర్ అంటే పేపర్.. అందులో చిన్నా, పెద్దా ఉండవు.. ఆధారాలు ఆధారాలే అనే విషయం అధికారులకు కూడా తెలుసు కనుకనే కమిషనర్ డి.మంజుల సైతం ఈరోజు-ఈఎన్ఎస్ కి జరుగుతున్న వ్యవహారాలు, తాము రాసే కథనాలకు సంబంధించి ఎప్పటికప్పుడు వివరణలు కూడా ఇస్తున్నారు.

 ఆయుష్ కమిషనరేట్,  మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయం, ఆరోగ్యశాఖ మంత్రి పెషీలో ప్రైవేటు వ్యక్తుల ప్రలోభాలకు కూటమి ప్రభుత్వంలో ఎవరూ తలొంచరు కాబట్టే.. వాస్తవాలపై ఈరోజు-ఈఎన్ఎస్ కథనాలు ప్రచురించ గలుగుతుంది. అలా కాకకుండా మొత్తం తేడా బ్యాచ్ అని తెలిస్తే వదిలి పెట్టేసేది.. ఒక్క కథనం కూడా రాసేది కాదు.  అధికారుల్లోని నిజాయితీ ఉంది కనుకనే ఈరోజు-ఈఎన్ఎస్ రాసే కథనాలకు వివరణలు ఇస్తున్నారు.. ఆ కథనాల క్లిప్పింగులనే ప్రభుత్వానికి సమర్పిస్తున్నారు..  విశాఖలోని ఆయుష్ ఇన్చార్జి ఆర్డీడి విషయంలో కావాలని చేసిన తప్పులపై వచ్చిన ఫిర్యాదులు సంఖ్య, ఇప్పటి వరకూ ఇచ్చిన చార్జి మెమోల విషయాన్ని మీడియా ద్వారా బయటకు తెలియజేస్తున్నారు. వైద్యులంటే దేవుడితో సమానం.. అందులో దళిత వైద్యులంటే  ఇంకా చేతులెత్తి మొక్కి మరీ వారికి గౌరవం ఇవ్వాలి.. సమాజంలో వారికంటూ ఓ గుర్తింపు ఉంది.. 

సమస్త ప్రజానికానికీ వైద్యసేవలు అందించే దళిత వైద్యులను మాల నా కొడకా.. మాదిగ నా కొడకా అని తిట్టి, అవమానించిన లిఖిత పూర్వక ఫిర్యాదుపై చర్యలు లేకపోతే కూటమి ప్రభుత్వంలోని అధికారులు ప్రలోభాలకు గురిచేసే వారి గుప్పెట్టో పడ్డట్టేనని అంతా అనుకుకునే అవకాశం ఉంది కదా..? ఆ విషయాన్ని ఈరోజు-ఈఎన్ఎస్ కథనాలుగా రాస్తే బెదిరింపులా..? అవాకులు, చెవాకులూ మాట్లాడతారా..? మీరు మాట్లాడండి మీకు వాక్ స్వాతంత్ర్యపు హక్కు వుంది.. మీడియాగా మాకు రాజ్యాంగం ఆర్టికల్ 19, ఆర్టికల్ 10 ప్రకారం పత్రికా స్వేచ్ఛ హక్కు ఇచ్చిందీ మేమూ రాస్తాం.. రాసే కలాన్ని బెదిరింపులతోనూ, అదిరింపులతోనూ ఎవరూ ఆపలేరు.. అవ్వాకులు, చెవ్వాలకు పేలి అసలే నియంత్రించలేరు.. ఈ విషయంలో ఎంతటి వారికైనా ఆధారాలతో కూడి వార్తలతోనే సమాధానం చెబుతాం తప్పా ఎవరి బెదిరింపులకు అదిరేది లేదని.. కాసులకు కక్కుర్తి పడేది లేదని తెలియజేస్తున్నాం. వాస్తవ కధనాలకు మేము కంకణ బద్దులం..  

కబడ్దార్.. నోరు అదుపులో పెట్టుకోక పోతే మర్యాద దక్కదని మరోసారి హెచ్చరిస్తున్నాం..ఇదే సమయంలో జరుగుతున్న తంతులో ప్రతీ విషయంలోనూ వివరణ ఇస్తూ.. ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు ఈరోజు-ఈఎన్ఎస్ కి చెప్పే ఆయుష్ కమిషనర్ ముంజుల, ఆయుష్ కమిషనరేట్ అధికారులకు ధన్యవాదములు తెలియజేస్తున్నాం.. దళితులకు, అందునా దళిత మహిళకు అన్యాయం జరిగినపుడు సహాయం పడకపోయా.. వాస్తవాలను రాజ్యాంగం కల్పించిన భావప్రకటన హక్కు ద్వారా మీడియాలో కథనాలు ప్రచురించకపోయినా.. రాజ్యాంగ సృష్టికర్త డా.బీఆర్.అంబేద్కర్ ను అవమానించినట్టే లెక్క.. చూడాలి.. తప్పులు చేస్తూ.. అధికారులను, వారి ఆదేశాలను దిక్కరిస్తూ.. దళిత వైద్యులను కులంపేరుతో దూషించి, అధికారుల ఆదేశాలను దిక్కరించిన విశాఖ జోన్-1 ఇన్చార్జి ఆర్డీడి విషయంలో ఆయుష్ కమిషనరేట్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది..?!

visakhapatnam

2025-03-12 18:43:33

విశాఖజోన్-1 ఆయుష్ ఇన్చార్జి ఆర్డీడీ కి చార్జ్ మెమో -ఎట్టకేలకు కదిలిన ఆయుష్ కమిషనరేట్ అధికారులు

విశాఖలోని జోన్-1 ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీ లక్ష్మీభాయ్, కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ సుష్మలకు కమిషనర్ డి.మంజుల మెమోలు జారీచేశారు. జూనియర్ అసిస్టెంట్ కి మూడు అంశాలు, ఇన్చార్జి ఆర్డీడికి సుమారు 18 అంశాలతో మెమోలో అంశాలు పేర్కొన్నట్టు సమాచారం అందుతుంది. గత కొన్ని రోజులుగా ఇన్చార్జి ఆర్డీడి పలు వివాదాల్లో చిక్కుకున్నారు. అయితే ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా ఆయుష్ కమిషనరేట్ స్పందించలేదు. దీనితో మిడియాలో వరుస కథనాలు రావడంతో వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశాలతో ఇన్చార్జి ఆర్డీడిపై వెళ్లిన ఫిర్యాదులు ఆధారంగా మెమోలు జారీచేశారని.. కమిషనరేట్ వర్గాలు తెలియజేశాయి. మెమో రాకుండా చాలా కాలం డా.లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్వాహకులు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. కమిషనర్ ముందు అవేమీ పనిచేయలేదు.

 వాస్తవానికి ప్రభుత్వ అధికారులపై ఎస్సీ, ఎస్టీ కేసుపై ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే ఉద్యోగులను సదరుశాఖ కమిషనరేట్ అధికారులు లాంగ్ లీవ్ లోకి కావాలనే పంపేస్తారు. అదే సమయంలో పరిపాలనకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా ఆ స్థానంలో మరొకరికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తారు. అయితే  ఆయుష్ లో మాత్రం అదేమీ జరగలేదు. చేసిన తప్పులు, వచ్చిన ఫిర్యాదులపై రాజకీయనాయకులు, వైద్యఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మంత్రి పేషీ, ప్రైవేటు ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్వాహకుల ఒత్తిడితో చాలా కాలం ఆగారు. అయితే కమిషనరేట్ అధికారులు చేస్తున్న తప్పులు, కొందరు అధికారులు మామూళ్లకు లొంగిపోవడంతో మెమోలు రావడం కూడా ఆలస్యం అయ్యింది. ఎక్కువ కాలం తాత్సారం చేస్తే మొదటికేమోసం వస్తుందని.. ఏదో ఒక అంశాన్ని కాగితంపై చూపించే ప్లాన్ లో భాగంగా కమిషనరేట్ అధికారులు ఇన్చార్జి ఆర్డీడికి, జూనియర్ అసిస్టెంట్ కు మోమోలు జారీ చేశారు. 

వీరిచ్చిన సమాధానాలు, అనంతరం వీరిపై విచారణ అధికారిని నియమించిన తరువాత వచ్చే రిపోర్టు ఆధారంగా చర్యలు ఉండనున్నాయి. అందునా ప్రైవేటు వ్యక్తుల ప్రలోభాలకు ఆయుష్ కమిషనరేట్, ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయ అధికారులు తలొగ్గుతున్న విషయాన్ని కూడా బాధితులు జాతీయ ఎస్సీ కమిషన్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఎక్కడ కమిషన్ కు సమాధానం చెప్పాల్సి వస్తుందోనని ఆయుష్ కమిషనరేట్, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయ అధికారులు వీరికి మెమోలు జారీచేశారు. అయితే ఇన్చార్జి ఆర్డీడి విషయంలో మాత్రం ఇంకా ఆయుష్ కమిషనరేట్ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో తప్పులు చేసినా.. అధికారుల అండదండలతో ఆమె ఇన్చార్జి ఆర్డీడిగా కొనసాగుతుండటం కొసమెరుపు.

visakhapatnam

2025-03-10 17:11:02

ఆయుష్ కమిషనర్ పైనే బురద చల్లుతున్నారు..?! వాస్తవాలు బయటకొస్తే ఉన్నపోస్టు పోతోందని భయం

ఆయుష్ జోన్-1 ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీ లక్ష్మీభాయ్ చేసిన తప్పులనుంచి తప్పించుకోవడానికి మరిన్ని తప్పులు చేస్తూ.. వారి వెనుక ఉన్న సమాచార భజన బ్యాచ్ తో చేయిస్తున్నట్టుగానే కనిపిస్తున్నది.. ‘లంకలో సీత ఎలా ఉందో చూసి రమ్మని ఆంజనేయుడికి పురమా యిస్తే.. లంకను మొత్తం తగులబెట్టి వచ్చినట్టు’ ఇన్చార్జి ఆర్డీడి అండ్ కో బ్యాచ్, ముడుపులు తీసుకొని ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సమాచార ప్రతినిధులు ఏకంగా ఆయుష్ సమాచారశాఖ కమిషనర్ పైనే విధులకు గైర్హాజరువుతున్నారనే తప్పుడు ప్రచారాలకు తెరలేపారనే విషయం ఇపుడు ఆరోగ్యశాఖలో గొల్లుమంటున్నది. అటుతిరిగి.. ఇటు తిరిగి ప్రోటోకాల్ అధికారులపై బురద చల్లించడానికి ఒడిగడుతు న్నారని సమాచారం.. ఆ విధంగా కథనాలు వస్తే.. విషయం ప్రక్కదారి పట్టి.. తాను చేసిన తప్పుల నుంచి తప్పించుకొని.. ఎవరి ద్వారా అయితే ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చిందో ఈ తప్పు వారిపైకి వెళ్లిపోతుందని భావించి మోకాళ్ళ తెలివి తేటలు ప్రయోగిస్తున్నారనే విషయం ఆయుష్ కమిషనరేట్ ఒక అంచనాకి వచ్చింది..!

విశాఖలో జోన్-1 ఇచ్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీ లక్ష్మీభాయ్ తప్పుల మీద తప్పులు చేయడం ఏంటి..? దానిపై విచారణ చేస్తున్న ఆయుష్ కమిషనర్ డి. మంజుల విధులకు సక్రమంగా విధులకు హాజరు కావడం లేదంటూ మీడియాలో కథనాలు రావడం ఏంటి అసలు ఎక్కడైనా పోలికుందా.. అసలు ఒక జిల్లా స్థాయి అధికారి విషయంలో అఖిల భారత సర్వీసుకి చెందిన అధికారి విధులకు గైర్హాజరు కావాల్సిన పనేముంటుంది అనేది తేడా కథనాలు రాసేవారు ఆలోచించుకోవాలి అంటున్నారు కమిషనరేట్ అధికారులు. వాస్తవానికి విశాఖలోని ఆయుష్ జోన్-1 ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీ లక్ష్మీభాయ్ సర్వీస్ మొత్తం అంతా కూడా అడ్డదారులే. సీనియారిటీ రోస్టర్ మెరిట్ లిస్టుని కాదని వక్రంగా ఇన్చార్జి ఆర్డీడి పోస్టు తెచ్చుకో గలిగారు. దానికి ఇదే ఆయుష్ కమిషనరేట్ అధికారులు, వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి కార్యాలయ అధికారులు సహకరించారు. 

తీరా ఆ విషయం బయటకు వచ్చిన దగ్గర నుంచి మెరిట్ లిస్టులో ఉన్న వైద్యులపైనా.. ఆ విషయం బయటకు తెలియజేసిన వైద్యులనూ వేధించడం మొదలు పెట్టారు. ప్రతీ పనికీ కాసులు తీసుకునే అన్నీ చేశారని.. దానిని తట్టుకోలేక ఎదురు తిరిగితే తమను మాల నా కొడకా, మాదిగనా కొడకా అని తిట్టడం మొదలు పెట్టారు. అంతేకాదు ఆ విషయమై లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఈ నేపపథ్యంలో విశాఖలోని ఆర్డీడి కార్యాలయంలోని ఒక దళిన మహిళా ఉద్యోగినిపై చేయిచేసుకోవడంతోపాటు..కులంపేరుతో దూషించారు కూడా దీనిపై ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు అయ్యింది. ఈ సమయంలో కూడా క్రింది స్థాయి ఉద్యోగిని తనను కొట్టిందనే విషయాన్ని ప్రముఖంగా కొన్ని పత్రికల్లో రాయించుకోగలిగారు. అసలు ఆ రాసేవారికైనా.. వినే వారికైనా కనీసం అవగాహన ఉండాలి..

ఏ దైర్యంలో ఒక క్రింది స్థాయి ఉద్యోగిని జిల్లా అధికారులపై చేయిచేసుకుంటుందని.. తీరా ఆ విషయంలో కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేసి సుదీర్ఘ కాలం సెలవులు పెట్టమంటే ఎక్కడ ఇన్చార్జి ఆర్డీడి పోస్టు నుంచి తప్పిస్తారోనని ఏకంగా కమిషనరే విధులకు సక్రమంగా రారని తన అనుగచరగణంతో మిలాకత్ అయిన వారితో వార్తలు రాయించారనే ఆరోపణులున్నాయి. వైద్యులను వేధించిన విషయం, కులం పేరుతో దూషించిన విషయం, కాసులతోనే పనులు చేస్తున్న విషయం ఏ నాడూ ప్రస్తావించని సదరు సమాచార ప్రతినిధులు ఇపుడు ఏ విధంగా ఇన్చార్జి ఆర్డీడి డా.ఝాన్సీలక్ష్మీభాయ్ విషయంలో కమిషనరే సక్రమంగా విధులకు రారనే విషయాన్ని ఎలా రాయించారని వాపోతున్నారు కమిషనరేట్ అధికారులు. ఎవరు ఏం చేసినా ఆధారాలు చూపకపోతే ప్రభుత్వం, చట్టం తన పనితాను చేసుకుపోతుందంటున్నారు. కమిషనరేట్ సిబ్బంది.

ముక్కుసూటి అధికారినిగా కమిషనర్ డి. మంజులకి మంచిపేరు
ఆంధ్రప్రదేశ్ లోని వైద్యఆరోగ్యశాఖలో ఒక విభాగంగా ఉన్న ఆయుష్ కమిషనర్ గా పనిచేస్తున్న డి.మంజులకి ప్రభుత్వంలోనే ముక్కుసూటి అధికారిణిగా మంచి పేరుంది. తప్పుచేసిన వారు ఎంతటి వారైనా తనదైన రీతిలో విచారణ చేసి ప్రభుత్వానికి మచ్చరాకుండా పరిపాలన చేస్తారని కూడా చెబుతారు. ప్రభుత్వం కూడా ఏరి కోరి గాడి తప్పుతున్న ఆయుష్ శాఖను గాడిలో పెట్టేందుకు అడ్డదారుల్లో వ్యవహారాలు నడిపేవారి చేష్టలను నియంత్రించడానికే ఈమెను ఆయుష్ శాఖ కమిషనర్ గా నియమించారనేది నేటికి ఎవరికీ తెలియని విషయం. నోటి మాటలు కాకుండా తన పరిపాలన అంతా పేపర్ పై ఆధారాలతో పెడుతూనే చర్యలు తీసుకోవడంలోగానీ, పరిపాలన చేయడంలోగానీ ఆమె దిట్ట. అంతేకాదు ప్రభుత్వంలో కూడా ఈమెను డైనమిక్ ఆఫీసర్ గా అభివర్ణిస్తారు కూడా. 

ఏ సమస్యవచ్చినా.. అందునా మీడియా ఏ సమయంలో పిలిచే ఏకైక మహిళా అధికారి ఆయుష్ కమిషర్ డి.మంజుల. అలాంటి అధికారిణి ఏకంగా కమిషనరేట్ కే సక్రమంగా విధులకు రారు అనే విధంగా కథనాలు రాయించారంటే ఏ స్థాయిలో లాబీయింగ్ చేయించి ఉంటారని.. దానికి వివరణ కూడా ఇవ్వాలని, తాఖీదులు చేరవేయడానికి కూడా కమిషనరేట్ సిద్దపడుతున్నట్టు సమాచారం. అఖిల భారతస్థాయి అధికారులంటే వాస్తవానికి రాష్ట్రస్థాయి మెజిస్ట్రేట్ క్రిందే లెక్క. వాళ్లపై కథనాలు రాసే సమయంలో వాస్తవాలు తెలుసుకొని, లేదా వారి వివరణలతో రాయాల్సి వుంటుందని కమిషనరేట్ అధికారులు వాపోతున్నారు. అలా కాకుండా అడ్డదారిలో పదోన్నతి పొంది.. ఆపై వైద్యులపైనా, సిబ్బందిపైనా జులం ప్రదర్శించే అధికారుల కోసం వాస్తవాలు బయటపడే సమయంలో ఏకంగా రాష్ట్ర స్థాయి అధికారులపై ఈ విధంగా సామాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ఒక పేరున్న సంస్థలకు చిన్నతనమే అవుతుందనే పరిశీలకుల వాదన. 

అయితే సమాచారం ప్రజలకు అందించే సమయంలో ఎవరిపైనైనా వార్తలు రాసే అధికారం, అశకాశం ఒక్క సమాచార ప్రతినిధులకు మాత్రమే వుంటుంది. అదేసమయంలో పక్కా సమాచారం సమాచారం అందిస్తే.. సదరు సంస్థలకు పేరొస్తొందని.. లేదంటే ఉన్న గౌరవం పోతుందంటున్నారు. కమిషనరేట్ అధికారులు. ఇదంతా ఇన్చార్జి ఆర్డీడిపై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసు, దళిత వైద్యులు ఫిర్యాదు చేసిన అంశం, క్రింది స్థాయి సిబ్బంది ఇబ్బందులుపెట్టే అంశంలోనే తెరపైకి రావడం అనేది ఇపుడు చర్చనీయాంశం అవుతున్నది.

viskhapatnam

2025-02-25 16:59:20

సచివాలయ మహిళా పోలీసులకు డిపార్ట్ మెంట్ స్లైడింగ్..?!

గ్రామ, వార్డు సచివాలయశాఖలో ఉద్యోగుల బాలరిష్టాలకు కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపే విధంగా అడుగులు వేస్తోంది.. తలా తోకా లేకుండా గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయశాఖలో ఉద్యోగులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా పరమైన చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తోంది.. నాలుగు పోస్టులకి కలిపిఒకే పోటీపరీక్ష రాసి పోలీసుశాఖలోని మహిళా పోలీసులుగా విధుల్లో చేరిన వీరిని కోర్టు కేసులు వెంటాడుతున్నాయి. దీనితో వీరికి ఎలాంటి ప్రభుత్వశాఖ కేటాయించకుండా అనామతు ప్రభుత్వశాఖ ఉద్యోగులుగా విధు లు మాత్రం చేయించుకుంటుందీ ప్రభుత్వం.. దానితో వీరంతా సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానల్, డిపార్ట్ మెంట్ అన్నీ కోల్పోయారు. అదే సమయంలో వీరితో పాటు చేరిన వారందరికీ పదోన్నతులు ఇస్తున్నది ప్రభుత్వం. ఇపుడు వారికి న్యాయం చేసేందుకు వీలుగా ప్రభు త్వం యోచన చేస్తుండటంతో వారికి రెండు లేదా మూడు ప్రభుత్వశాఖలను స్లైడింగ్ ఇచ్చి వారికి ఖాళీలున్న సచివాలయ పోస్టులను భర్తీచే యాలని ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తున్నది. అదే జరిగితే మహిళా పోలీసుల కష్టాలు గట్టెక్కినట్టే..!

గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ రెండేళ్లుకు పెంచేయడంతో.. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత 75 ప్రభుత్వశాఖల్లోని వేల సంఖ్యలో ఉద్యోగులు రిటైర్ అయిపోతున్నారు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం కూడా కొత్త నోటిఫికేషన్లు విడుదల చేసి ఖాళీలను భర్తీచేసే పరిస్థితి కూడా లేదు. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం ముందున్న రెండు ఉపయోగకరమైన అంశాలేంటంటే.. ఒకటి రేషనలైజేషన్, రెండవది డిపార్ట్ మెంట్ స్లైడింగ్. మొదటిది ఎలాగూ అమలు చేసి మిగులు ఉద్యోగులను ఇతర ప్రభుత్వశాఖల్లో వినియోగించుకునే విధంగా జీఓనెంబరు-1 విడుదల చేసింది. ఇపుడు కోర్టుకేసులు, గత ప్రభుత్వం ఏమీ చేయకుండా వదిలేసిన గ్రామ, వార్డు సచివాలయశాఖలోని మహిళా పోలీసులకు డిపార్ట్ మెంట్ స్లైడింగ్ ఇచ్చి వారిని ఖాళీగా ఉన్న పోస్టుల్లో భర్తీ చేయయడం. 

దానికోసం ఇపుడు ప్రభుత్వం వేగంగా చర్యలు మొదలు పెట్టింది. కోర్టు కేసులు ఎప్పుడు తేలతాయో తెలీదు.. అలాగని ప్రభుత్వశాఖల్లో సిబ్బంది లేకపోతే పరిపాలనా పరమైన చిక్కులు రౌండప్ చేసేస్తాయి. వీటి నుంచి బయట పడాలంటే ఖాళీగా ఉన్న ప్రభుత్వశాఖల్లో ప్రస్తుతం ఏ ప్రభుత్వశాఖకూ చెందని మహిళా పోలీసులకు స్లైడింగ్ ఇవ్వడం ద్వారా సదరు ఖాళీల్లో భర్తీచేయడానికి వీలుపడుతుంది. అదే సమయంలో మహిళా పోలీసుల సమస్య కూడా పరిష్కారం అవుతుంది. దానికోసం రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోనేి 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సుమారు 14వేల మంది మహిళా పోలీసులకు డిపార్ట్ మెంట్ స్లైడింగ్ ఇవ్వడం ద్వారా వారికి ఒక ప్రభుత్వ శాఖ కేటాయించినట్టు అవుతుంది. అంతేకాకుండా పదోన్నతులు కల్పించడాకి కూడా వీలు పడుతుంది.

ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాకు అనుబంధ శాఖలుగా ఉన్న పంచాతీయతీరాజ్ శాఖలోని పంచాయతీ కార్యదర్శిలు, పురపాలకశాఖలోని వార్డు అడ్మిన్లు సాంఘిక సంక్షేమశాఖలోని డిజిల్ అసిస్టెంట్లు, రెవిన్యూ శాఖలోని విఆర్వో పోస్టులు భారీ ఎత్తున ఖాళీలు ఉన్నాయి.. వాటికి తోడు మరో 5 నెలల్లో ఉద్యోగ విరమణ చేయబోయే ఉద్యోగులతో తో మరింత ఎక్కువ ఖాళీలు ఏర్పడబోతున్నాయి. ఖాళీ అయిన పోస్టుల్లో మహిళా పోలీసులకి డిపార్ట్ మెంట్ స్లైండింగ్ ఇవ్వడం ద్వారా ప్రాధాన్యత కలిగిన పోస్టులను భర్తీచేయడానికి అవకాశం ఏర్పడుతుంది. చాలా వార్డు సచివాలయాలు, గ్రామ, సచివాలయాలు ఇన్చార్జి సెక్రటరీలతోనే నడుస్తున్నాయి. ఖాళీలను భర్తీచేయడానికి ఇటీవలే గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు మెరిట్ బేస్డ్ గ్రేడ్-4 పంచాయతీకార్యదర్శిలుగా పదోన్నతులు కల్పించింది ప్రభుత్వం(ప్రస్తుతం ఎన్నికల కోడ్ కారణంగా అవి నిచిలిపోయాయి తరువాత పదోన్నతులు చేపడతారు) 

అయినప్పటి ఇంకా చాలా ఖాళీలు మిగిలిపోతున్నాయి.  వాటిని భర్తీచేయాలంటే ప్రభుత్వానికి కొత్త నోటిఫికేషన్లు తీయడం ఒక్కటే శరణ్యం. కానీ రాష్ట్రప్రభుత్వంలోని ఒక ఉన్నతస్థాయి అధికారి గతంలో ఓ సారి టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన డిపార్ట్ మెంట్ స్లైడింగ్ అంశాన్ని తెరమీదకు తీసుకు రావడంతో ప్రభుత్వం ఆ విధంగా చేస్తే ఎలావుంటుందో పరిశీలించాలని  ఆదేశించిందట. అలా వచ్చిన ఆలోచన ద్వారానే ఉద్యోగులకు డిపార్ట్ మెంట్ స్లైడింగ్ ఇస్తారని చెబుతున్నారు. అది కూడా అధికారిక ఉత్తర్వులు వస్తే తప్పా క్లారిటీ వచ్చే పరిస్థితి లేదు. కాకపోతే గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకి ప్రభుత్వశాఖ లేకుండా వారికి గాల్లో పెట్టి ఉద్యోగాల్లో కొనసాగించడం కూడా ప్రభుత్వ తప్పే అవుతుంది. దానిని నుంచి బయట పడాలన్నా ప్రభుత్వం డిపార్ట్ మెంట్ స్లైడింగ్ ని అమలు చేయాల్సి వస్తుంది. 

అదే జరిగితే రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు సెక్రటరీలు నియామకంతోపాటు, వార్డుల్లోని అడ్మిన్ సెక్రటరీల నియామకం, వీఆర్వో ఖాళీల బర్తీ, డిజిటల్ అసిస్టెంట్ల భర్తీ అన్ని జరిగిపోతాయి. దీనితో ప్రభుత్వం కూడా ఈ విధంగా చేయాలని ప్రాధమికంగా ఆలోచనకు వచ్చినట్టు సమాచారం అందుతుంది. కాగా మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికల తంతు పూర్తయిన తరువాత రాష్ట్రప్రభుత్వం సచివాలయ మహిళా పోలీసులకు డిపార్ట్ మెంట్ స్లైడింగ్ ఇచ్చే అంశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎన్ని ప్రభుత్వశాఖలకు స్లైడింగ్ ఇస్తుంది.. ఏ పోస్టుల్లో భర్తీచేస్తుంది అనేది మాత్రం తేలాల్సి వుంది..?!


visakhapatnam

2025-02-14 14:05:35

రేషనలైజేషన్ దెబ్బ...40వేల ఉద్యోగాలు అబ్బా..?!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖలో చేపట్టిన రేషనలైజేషన్ తో ఏకంగా ప్రభుత్వం 40వేల మంది ఉద్యోగులను.. 74 ప్రభుత్వశాఖల్లో సర్దుబాటు చేసుకోవడానికి వీలు కల్పించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెంచేసిన రిటైర్ మెంట్ ఏజ్ 62ఏళ్లు పూర్తైన వారం తా వరుసగా మూడు నెలల్లో వేల సంఖ్యలో రిటైర్ అయిపోతున్నారు. ఆ ఖాళీల్లో ఉద్యోగులను కొత్తగా నియమించాలంటే ప్రభుత్వానికి కొం డంత భారం. దానితో లక్షా 30వేలకు పైగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ శాఖను రేషనలైజేషన్ చేస్తే.. కొత్తగా ఉద్యోగాలు భర్తీచేసే పనిలే కుండా.. సిబ్బందిని అవసరం ఉన్న ఖాళీలున్న శాఖ్లల్లోకి భర్తీచేసుకోవచ్చునని భావించింది. మూడు కేటగిరీల క్రింద గ్రామ, వార్డు సచివా లయాలను విభజిస్తే.. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో సుమారు 40వేల మందికి పైగా ప్రభుత్వానికి కలిసొచ్చారు.. వారందరికీ ఇపుడు రిటైర్ అయిపోతున్న ఖాళీల్లో అవసరమైన చోట డిప్యూటేషన్ పై నియమిస్తున్నారు..!

రాష్ట్రప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించమంటే మీన మేషాలు, రాజ్యాంగంలోని చట్టాలను, కోర్టు కేసులను , ఆర్ధిక ఇబ్బందులను బూచిగా చూపిస్తుంది కానీ.. ప్రభుత్వానికే అవసరం అనుకుంటే అనుకున్నది చేయడానికి గంటల వ్యవధిలో జీఓలు విడుదల చేసి.. వారం రోజుల్లోనే ఉద్యోగులను అనుకున్న చోటుకి పంపించగలరు. ఇపుడు కూడా అదే చేసింది కూటమి ప్రభుత్వం రేషనలైజేషన్ చేసి గ్రామ, వార్డు సచివాలయాల్లోని సిబ్బందిని ఇతర  ప్రభుత్వశాఖల్లోని ఖాళీలను భర్తీచేయడానికి వినియోగిస్తున్నది. వాస్తవానికి చాలా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న సిబ్బందికి పూర్తిస్థాయిలో పనులు లేవు. అయినా గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం సర్వేలు, సమాచార సేరకరణ, ప్రభుత్వ పథకాల పంపిణీ పేరుతో వీరితో సాధారణ ప్రభుత్వ విధుల కంటే అదనంగానే పనులు చేయిస్తూ వచ్చింది. 

ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రప్రభుత్వంలోని 74 ప్రభుత్వశాఖల్లో ఏ శాఖలోనూ లేనివిధంగా వీరి ఉద్యోగాల భర్తీ, శాఖల కేటాయింపూ.. పలానా శాఖ పనులనే కాకుండా అన్ని ప్రభుత్వశాఖ ల పనులూ చేయించడం మొదలు కొని.. తలా తోకా లేనివిధంగా కనీసం సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ కూడా ఏర్పాటు చేయని శాఖ ఏదైనా ఉందంటే అది ఇదేనని చెప్పొచ్చు.  ఇదంతా ప్రభుత్వ సౌలభ్యం కోసమే చేసుకుంటుందంటే అతిశయోక్తి కాదు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు భర్తీచేపట్టి ఐదేళ్లు దాటిపోతున్నా.. నేటికీ వీరి మాతృశాఖలు ఏంటి..? సదరు మాతృశాఖలోని సర్వీసు నిబంధనలు వీరికి కూడా వర్తిస్తారా అంటే ఆ ఒక్కటీ అడక్కు అనే అంటోంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగని కొత్తగా ఏర్పాటు చేస్తారా అంటే.. రాజ్యాంగంలోని ఏ నిబంధనల క్రింద మీకు సర్వీసు నిబంధనలు ఇవ్వాలని తిరిగి ప్రశ్నిస్తున్నది.

 చచ్చీ చెడీ రాజ్యాంగంలోని కొన్ని నిబంధన ప్రకారం మాకూ మా మాతృశాఖల్లోని నిబంధనలే వర్తింపచేయొచ్చనే వెసులు వాటు ఉందీ అంటే... ఇప్పుడప్పుడే కాదు తరువాత చూద్దాం అంటోంది. అంటే ఉద్యోగులకు చట్టబద్ధంగా, న్యాయ బద్ధంగా ఇవ్వాల్సిన ప్రయోజనాల విషయంలో మీనమేషాలు లెక్కపెట్టుకుంటూ వచ్చిన ప్రభుత్వం.. ఇపుడు అత్యవసరంగా కొత్తగా ఉద్యోగాల భర్తీ చేయాల్సి వస్తుందని మాత్రం రేషనలైజేషన్ పేరుతో ఉద్యోగులను కుదించేసింది. అదేమంటే ప్రభుత్వం అనుకుంటే ఏమైనా చేస్తుంది.. పరిపాలనా సౌలభ్యం కోసం ఏ నిర్ణయమైనా తీసుకును అధికారం ప్రభుత్వానికి ఉందని ప్రత్యేక జీఓలు వెలువరించి మరీ చెబుతున్నది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో  15 వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లోని లక్షా 35వేల మంది ఉన్న ఉద్యోగులు గత ప్రభుత్వంతో పాటు, ఇపుడు కూటమి ప్రభుత్వంలోనూ హెచ్చరికలు, బెదిరింపులు, టార్గెట్ లకు గురవుతూనే ఉన్నారు. ఐదేళ్ల నుంచి ఈశాఖ ఉద్యోగులకు విధినిర్వహణలో సమయపాలన లేదంటే అతిశయోక్తి కాదు. 

కనీసం రెండవ శనివారాలు, ఆదివారాలు, పండుగ సెలవులు అనేవి కూడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులతో పనులు చేయించుకుంటూ వస్తున్నది. అయితే ప్రభుత్వంలో రెగ్యులర్ ఉద్యోగమనే ఒకే ఒక్క కారణంతో విధులు చేస్తున్న ఉద్యోగుల విషయంలో గత ప్రభుత్వం మాదిరిగానే కూటమి ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసింది. దీనితో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని కాదని.. అనవసరంగా కూటమి ప్రభుత్వానికి చేయూతనిచ్చామని.. కనీసం గత ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇప్పటికైనా తమకు పదోన్నతులు, సర్వీసు నిబంధనలు వచ్చి ఉండేవని సామాజకి మాద్యమాల్లో పెద్ద చర్చలకు తెరలేపుతున్న ఉద్యోగులు. ఎవరు ఎన్ని చేసినా వచ్చే నాలుగున్నరేళ్లు కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఆధారంగా గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులు పనిచేయక తప్పదు. 

గత ప్రభుత్వమే కాదు.. ఈ ప్రభుత్వంలోనూ సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావనే విషయం జీఓనెంబరు 1 విడుదల (రేషనలైజేషన్) తో తేలిపోయింది. ఇక్కడ ఉద్యోగులను తీసుకెళ్లి ఇతరశాఖల్లో ఇన్చార్జిలుగా నియమిస్తే.. ఆ శాఖలో పనిచేయడానికి తప్పా.. ప్రభుత్వ ప్రయోజనాలు ఏ మాత్రం రావనే విషయం, ప్రభుత్వం అమలు చేయదనే విషయం సచివాలయ ఉద్యోగులకు తెలిసినట్టు లేదంటున్నారు విశ్లేషకులు. చూడాలి అవసరం కోసం రేషనలైజేషన్ చేసిన ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు నెరవేస్తుందా..? గత ప్రభుత్వం మాదిరిగా గాలికొదిలేస్తుందా..? అనేది..?!


viskahapatnam

2025-01-30 15:34:56