1 ENS Live Breaking News

వేంకటేశ్వర ఆలయానికి స్థల పరిశీలన..

విశాఖలోని  ఋషికొండ వద్ద శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం  నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ను టీటీడీ  చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి  మాట్లాడుతూ ఆలయ నిర్మాణం త్వరలో పూర్తి కానుందని , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చే  ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. మిగిలివున్న పనులను త్వరితగతిన  పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రాంగణం  ప్రశాంతమైన సముద్రతీరంలో 10 ఎకరాల స్థలం లో నిర్మిస్తున్నామని  ప్రధాన ఆలయం  ఒకటిన్నర ఎకరా ల్లో వుంటుందన్నారు. మిగతా స్థలం పార్కింగ్ కేటాయించాం. ఆలయానికి వాడే రాయి మొత్తం కోటప్పకొండ రప్పించినట్లు చెప్పారు.   పర్యాటక శాఖ మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ  టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి  ప్రత్యేకంగా శ్రద్ద పెట్టి రూ.28 కోట్లతో నిర్మించడం జరుగుతుందన్నారు. స్వామి వారి అనుగ్రహంతో నిర్మించడం జరుగుతుందన్నారు. ఆధ్యాత్మికంగా , అంతర్జాతీయ నగరంగా విశాఖ అభివృద్ధి చెందుతుందనన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ  ఎం.వి.వి.సత్యనారాయణ, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గొల్ల బాబూరావు,విశాఖ నగర అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్, ఇతర స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

రుషికొండ

2020-12-11 22:03:59

బాలాలయ సంప్రోక్షణలో చ‌తుర్థ‌శ క‌ల‌శ స్న‌ప‌నం

తిరుమల శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయంలో బాలాలయ సంప్రోక్షణలో భాగంగా నాలుగ‌వ‌ రోజైన బుధ‌‌‌వారం చ‌తుర్థ‌శ క‌ల‌శ స్న‌ప‌నం నిర్వ‌హించారు.ఇందులో భాగంగా శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయంలో ఏర్పాటు చేసిన యాగ‌శాల‌లో హోమగుండాల‌ను వెలిగించి పుణ్యాహవచనం, విష్వక్సేనారాధన,  కుంభారాధ‌న‌, విశేష హోమాలు నిర్వ‌హించారు. త‌రువాత యాగ‌శాల‌లో భ‌గ‌వ‌త్ వైఖాన‌స ఆగ‌మోక్తంగా వి‌విధ‌ దేవ‌త మూర్తుల సూక్త మంత్ర‌ముల‌తో మ‌హాశాంతి కుంబ‌‌ జ‌ప్యం నిర్వ‌హించారు.  కాగా, బుధ‌‌‌వారంనాడు సాయంత్రం  బాలా‌ల‌యంలో ఉండే స్వామివారి దారు బింబ‌ము శుద్ధి కొర‌కు చ‌తుర్థ‌శ క‌ల‌శ స్న‌ప‌నం నిర్వ‌హించారు. ‌ఇందులో 7 ప్ర‌ధాన అభిషేక ద్ర‌వ్యాలైన పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రి నీళ్ళు, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో, 7 విశేష మంత్ర జ‌ల క‌ల‌శాల‌తో అభిషేకం జ‌రిగింది. అనంత‌రం ద్వార పాల‌కులు, ఎదురు ఆంజ‌నేయ‌స్వామివారికి, విష్వక్సేనులవారికి, భాష్య‌కారులవారికి‌, విమాన గోపురం న‌మూనాకు అభిషేకం నిర్వ‌హించారు. దీని వ‌ల‌న బింబ‌ములోని దోషాలు తొల‌గి పోయి, జీవ‌శ‌క్తి బింబ‌ములోనికి ప్ర‌వేశిస్తుంద‌ని అర్చ‌కులు తెలిపారు.          త‌రువాత యాగ‌శాల‌లో శ్రీ దేవి, భూదేవి స‌మేత శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి, శ్రీ వ‌రాహ‌స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు పంచామృత అభిషేకం నిర్వ‌హించారు.  డిసెంబరు 10వ తేదీ ఉదయం 9 నుంచి 10.30 గంటల మధ్య మకర లగ్నంలో బాలాలయ మహా సంప్రోక్షణము వైఖానస ఆగమోక్తంగా నిర్వహించనున్నారు.            ఈ కార్య‌క్ర‌మంలో కంక‌ణ‌బ‌ట్టార్  వేణుగోపాల దీక్షితులు, వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు  మోహ‌న రంగాచార్యులు,  ఎన్ఎకె.సుంద‌ర‌వ‌ర‌ద‌చార్యులు,  ఎపి అనంతశ‌య‌న దీక్షితులు, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు గోవింద‌రాజ దీక్షితులు,  కృష్ణ‌శేషాచ‌ల దీక్షితులు, రుత్వికులు, అధికారులు పాల్గొన్నారు.

తిరుమల

2020-12-09 22:16:12


2020-12-09 08:05:01


2020-12-08 20:25:10


2020-12-08 20:02:48


2020-12-08 19:48:38


2020-12-08 19:22:13

శాస్త్రోక్తంగా బాలాలయ మహాసంప్రోక్షణ ..

తిరుమల శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయంలో బాలాలయ మహాసంప్రోక్షణలో భాగంగా మూడ‌వ రోజైన మంగ‌ళ‌‌వారం  శాస్త్రోక్తంగా వైదిక కార్యక్రమాలలో నిర్వ‌హించారు.  ఇందులో భాగంగా శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయంలో ఏర్పాటు చేసిన యాగ‌శాల‌లో హోమగుండాల‌ను వెలిగించి పుణ్యాహవచనం, విష్వక్సేనారాధన,  కుంభారాధ‌న‌, పంచగవ్యారాధన నిర్వ‌హించారు. త‌రువాత  స‌ర్వ‌దైవ‌శ్చ‌‌హోమం, ప‌ర‌మాత్మిక హోమం, శాంతి హోమాలు జ‌రిగాయి.  కాగా, మంగ‌ళ‌‌వారంనాడు ఉదయం బాల‌ల‌యంలో ఉండే స్వామివారి దారు బింబ‌మున‌కు,  ఎదురు ఆంజ‌నేయ‌స్వామివారికి, విష్వక్సేనులవారికి, భాష్య‌కారులవారికి‌, విమాన గోపురం న‌మూనాకు పంచ‌గ‌వ్యాధివాసం, క్షీరాధివాసం, జ‌లాధివాసం, న‌వ‌క‌ల‌శ స్న‌ప‌నం నిర్వ‌హించారు.

         ఈ కార్య‌క్ర‌మంలో కంక‌ణ‌బ‌ట్టార్  వేణుగోపాల దీక్షితులు, వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు  మోహ‌న రంగాచార్యులు,  ఎన్ఎకె.సుంద‌ర‌వ‌ర‌ద‌చార్యులు,  ఎపి అనంతశ‌య‌న దీక్షితులు, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు  గోవింద‌రాజ దీక్షితులు,  కృష్ణ‌శేషాచ‌ల దీక్షితులు, ఆల‌య డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాథ్‌, రుత్వికులు, అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2020-12-08 19:21:14

50 లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ కనెక్షన్ లక్ష్యం..

కరోనా నేపథ్యంలో ఇంటర్నెట్ సేవల ప్రాధాన్యత పెరిగిందని దీంతో రాష్ట్రంలో ఏ.పి. ఫైబర్ నెట్ సేవలు కూడా మరింత పెరిగాయని ఏ.పి. ఫైబర్ నెట్ మేనేజింగ్ డైరెక్టరు యం. మధుసూధనరెడ్డి అన్నారు. మంగళవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేటి ఆధునిక కాలంలో ప్రతీ ఒక్కరూ ఇంటర్నెట్ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారని కరోనా నేపథ్యంలో వాటి ప్రాధాన్యత మరింత పెరిగిందని మధుసూధనరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో 70 శాతం పనులు ఇంటర్నెట్ ఆధారంగానే ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయని విద్యాభోధన కూడా ఆన్‌లైన్ ద్వారా జరుగుతున్నాయన్నారు. ఇంటర్నెట్ సేవల ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం ఏ.పి. ఫైబర్ నెట్ ద్వారా హైస్పీడ్ సేవలను గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రజలకు అందించాలన్న ప్రతిపాదన తీసుకురావడం జరిగిందన్నారు. బేసిక్ ప్యాక్ రూ. 300 లు, ఎ సెన్షియల్ ప్యాక్ రూ. 449 లు, ప్రీమియం ప్యాక్ రూ. 599 లు ధరల్లో వినియోగదారులకు అందుబాటులోనికి తీసుకువచ్చామన్నారు. ఈ ఇంటర్నెట్ కనెక్షన్ సేవల్లో భాగంగా ఇంటర్నెట్, కేబుల్, టెలిఫోన్ సదుపాయాలను కూడా వినియోగదారులకు అందుబాటులోనికి తీసుకువస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మంది చందాదారులకు ఏ.పి. ఫైబర్ నెట్ సేవలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 660 మండలాలు, 6300 గ్రామీణ ప్రాంతాలకు ఫైబర్ నెట్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా సేవలు అందించడం ఏ.పి. ఫైబర్ నెట్ ప్రత్యేకత అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలకు, రైతుభరోసా కేంద్రాలకు, వైయస్ఆర్ ఆరోగ్య కేంద్రాలకు, పాలసేకరణ కేంద్రాలకు, నాడు-నేడు పాఠశాల కార్యక్రమాలకు ఏ.పి. ఫైబర్ నెట్ ఇంటర్నెట్ కనెక్టవిటీని అనుసంధానం చేసామన్నారు. వీటికి టెలిఫోన్ సౌకర్యాన్ని అందించడం గమనార్హమని మధుసూధనరెడ్డి తెలిపారు. ట్రంక్ ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ మౌలిక సదుపాయాలు కలిగి 24 కిలోమీటర్ల నిడివిలో ఆర్కిటెక్చర్ కలిగి ఉన్న సాంకేతిక అనుసంధానంతో ఒక వలయంగా రాష్ట్రవ్యాప్తంగా 2600 ప్రదేశాలలో పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్‌తో కూడిన సేవలను అందిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 55 వేల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ సేవలను గ్రామపంచాయతీలతో ఫేజ్ - 2 ప్రాజెక్టులో భాగంగా అనుసంధానం చేస్తున్నట్లు మధుసూధనరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల గృహాలకు ఏ.పి. ఫైబర్ నెట్ సేవలు అందుబాటులోనికి తీసుకురావాలని ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి ఆదేశించారని మధుసూధనరెడ్డి తెలిపారు. రాబోయే 2, 3 సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఏ.పి. ఫైబర్ నెట్ సేవలను అనుసంధానం చేస్తామన్నారు. పెరుగుతున్న ఖాతాదారులకు అనుగుణంగా సిపిఇ బాక్స్‌లను కూడా సరఫరాను పెంచుతామని ఆయన తెలిపారు. స్ధానికంగా ఉండే కేబుల్ ఆపరేటర్ల నిర్వాహకులతో ఏ.పి. ఫైబర్ నెట్ సేవలను అందుబాటులోనికి తీసుకురావడం జరుగుతుందని ఆయన తెలిపారు.

Vijayawada

2020-12-08 18:07:13

2020-12-08 12:44:23

2020-12-08 11:23:57

2020-12-08 11:18:49

2020-12-08 09:23:04

ఈ రోజు దిన పంచాగం 08.12.2020

సూర్యోదయం..07:01:55 , సూర్యాస్తమయం..17:24:27, చాంద్ర రాశిసింహ - 19:32:00 వరకు చంద్రోదయం..24:53:59, చంద్రాస్తమయం..13:01:00 , ఋతువు..హేమంత, శక సంవత్సరం..1942   శార్వరీ, విక్రమ సంవత్సరం..2077, పగటి వ్యవధి..10:22:32, నెల.. అమాంతకార్తీకం, నెల.. పుర్నిమంతామార్గశిరం, దుర్ముహుర్తం..09:06:25 నుంచి 09:47:55, రాహు కాలం..14:48:49 నుంచి 16:06:38, యమ ఘంటిక..10:29:25 నుంచి 11:10:56, యమగండము..09:37:33 నుంచి 10:55:22, అభిజిత్ ..11:52:26 నుంచి 12:33:56, దిశ శూల్..ఉత్తరం, తారాబలంఅశ్వని, భరణి, కృతిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మాఘ, పూర్వఫల్గుణి, ఉత్తరఫల్గుణి, హస్త, స్వాతి, అనూరాధ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రావణ, శతభిష, ఉత్తరాభాద్ర, చంద్రబలం..మిథున, సింహ, తుల, వృశ్చిక, కుమ్భ, మీన

Visakhapatnam

2020-12-08 07:18:02

మనం కట్టేది ఇళ్లు కావు.. ఊళ్లు

‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యన్నారాయణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. డిసెంబర్‌ 25న ఇళ్ల స్థలాలు పంపిణీతో పాటు అదే రోజు ఇళ్ల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. డిసెంబర్‌ 25 నుంచి జనవరి 7 వరకూ  కార్యక్రమం  కొనసాగనుంది. అన్ని నియోజకవర్గాల్లో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. కోర్టు కేసులు వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలని, న్యాయస్థానాల ముందు తగిన వివరాలు ఉంచాలని అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. లబ్ధిదారులు ఎలా కావాలంటే.. అలా ఇళ్లు కట్టించి ఇస్తామని సీఎం తెలిపారు. ‘‘లబ్ధిదారులు ఇళ్లు కట్టించి ఇవ్వమంటే.. ఇళ్లు కట్టించి ఇస్తాం. మెటీరియల్‌ ఇవ్వండి, లేబర్‌ కాంపొనెంట్‌కు సంబంధించి డబ్బు ఇవ్వండి అంటే అది చేస్తాం. లేదు డబ్బులు ఇవ్వండి అంటే డబ్బులు ఇస్తాం, ఇళ్లు లబ్ధిదారుడు కట్టుకోవచ్చు. ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో ముందుకెళ్లాలి.  ఇళ్ల నిర్మాణం ప్రారంభించిన తర్వాత శరవేగంతో పనులు సాగాలి. దీని కోసం ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలి. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత చాలా ముఖ్యమని’’ సీఎం స్పష్టం చేశారు. ప్రతి లేఅవుట్‌ను ఒక యూనిట్‌గా తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ఆ లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి సెంట్రింగ్‌ వంటి పనులకు అవసరమైన సామాగ్రిని అక్కడే సిద్ధం చేసుకోవాలని, దీని వల్ల సమయం ఆదా అవ్వడంతో పాటు ఇళ్ల నిర్మాణం చురుగ్గా ముందుకు సాగుతుందని సీఎం తెలిపారు. ఇటీవల వర్షాలను దృష్టిలో ఉంచుకుని, ఆయా లే అవుట్లలో అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు. అవసరమైన విధంగా డ్రైయిన్లు నిర్మాణం, ఇతరత్రా చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అసౌకర్యం లేకుండా, సమస్యలు లేకుండా చూడాలని.. ప్రతి లే అవుట్‌పైనా సమగ్ర పరిశీలన, అధ్యయనం చేయాలని, దీని తర్వాత తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మనం కట్టేవి ఇళ్లు కావు, ఊళ్లన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఏ పని చేసినా కాలనీల అందాన్ని పెంచేలా చూడాలి. వీధి లైట్ల దగ్గర నుంచి అక్కడ ఏర్పాటు చేసే ప్రతి సదుపాయంపైనా దృష్టి పెట్టాలి. ప్రతి లే అవుట్‌లో నమూనా ఇంటిని (మోడల్‌ హౌజ్‌) నిర్మించాలని’’ సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ♦మొత్తంగా 30.75 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు ♦3,65,987 ఇళ్లస్థలాలపై కోర్టు కేసులు ♦ఇళ్ల స్థలాల కోసం 68,361 ఎకరాల సేకరణ ♦రూ.23,535 కోట్ల విలువైన ఇళ్ల స్థలాల పంపిణీ ♦కోర్టు కేసులు కారణంగా ఇళ్ల స్థలాలు ఇవ్వలేక పోతున్న ప్రాంతాల్లో లబ్ధిదారులుగా ఎంపికైన వారికి, కేసులు పరిష్కారం కాగానే పట్టా ఇస్తామంటూ లేఖ ఇవ్వాలని నిర్ణయం ♦వచ్చే మూడేళ్లలో 28.3 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక ♦పట్టాలు ఇచ్చిన ప్రాంతాల్లో డిసెంబర్‌ 25నే 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభం ♦175 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 8,914 ఇళ్లు చొప్పున పనులు ప్రారంభం ♦8,838 కొత్త లే అవుట్లలో 11.26 లక్షల ఇళ్ల నిర్మాణం  ♦రెండో దశలో 12.7 లక్షల ఇళ్ల నిర్మాణం ♦టిడ్కో ఇళ్లలో 365, 430 చదరపు అడుగుల ఫ్లాట్లపై సీఎం ప్రకటించిన తాజా రాయితీల ప్రకారం అదనంగా రూ.482 కోట్ల ఖర్చును భరించనున్న ప్రభుత్వం ♦300 చదరపు అడుగుల ఫ్లాట్‌లను కేవలం రూ.1 రూపాయికే ఇవ్వనున్న ప్రభుత్వం

Velagapudi

2020-12-07 21:01:57