1 ENS Live Breaking News

Ens Live చెప్పినట్టే.. సచివాలయాలే ఆదాయమార్గాలు

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయాలే ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరులు కాబోతున్నాయి. కామన్ సర్వీస్ సెంటర్ కింద ప్రభుత్వం 572 సేవలను సచివాలయాలు అందిస్తున్నాయి. తొలుత పైలట్ ప్రాజె క్టుగా కొన్ని సచివాలయాలకే ఇచ్చారు. ఇపుడు రాష్ట్రంలోని 14వేల5 సచివాలయాల్లో వీటిని అమలు చేయ నున్నారు. అంతేకాకుండా ప్రతీశాఖ ఉద్యోగికి కంప్యూటర్ ఇచ్చి, సదరు ఉద్యోగి ప్రభుత్వశాఖల కు చెందిన సేవలను, దృవీకరణ పత్రాలను వారితోనే చేయిస్తారు. ఇలాచేస్తే ప్రభుత్వ ఖజానాకు నిత్యం కాసులేనని Ens Live ఏడాది క్రితమే తెలియజేసింది. సీఎం సమీక్షలో ఈవిషయాన్ని అధికారులు(SOP)గా చెప్పారు.

Tadepalli

2023-01-05 05:38:05

యలమంచిలి బయలు దేరిన సీఎం వైఎస్ జగన్..

ఏపీ  సీఎం వైఎస్‌ జగన్‌ అనకాపల్లి జిల్లా యలమంచిలి పర్యటన నిమిత్తం కొద్ది నిమిషాల క్రింత విజయవాడ విమానాశ్రయం నుంచి విశాఖ బయలు దేరారు. నిన్న మృతిచెందిన విశాఖ డెయిరీ చైర్మన్‌ అడారి తులసీరావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. 12.00 గంటలకు యలమంచిలిలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త అడారి ఆనంద్‌ నివాసానికి చేరుకుంటారు. విశాఖ డెయిరీ చైర్మన్‌ అడారి తులసీరావు భౌతికకాయానికి నివాళర్పిస్తారు.  అనంతరం 12.40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2.25 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

2023-01-05 04:50:02

సిమ్ కార్డులు ఇవ్వకముందే మూలకి చేసిన మొబైల్స్

ఏపీ గ్రామ, వార్డు సచివాలయశాఖలో వింతపరిస్థితి చోటుచేసుకుంది. ఇక్కడ పనిచేసే సచివాలయ మహిళా పోలీసులుకు ప్రభుత్వం సెల్ ఫోన్లు ఇచ్చింది గానీ, అందులో వినియోగించడానికి సిమ్ కార్డు(ప్రభుత్వ నెట్వర్క్ కలిగిన)లు ఇవ్వలేదు. ఈఫోన్లు ఇచ్చి ఏడాది గడిచింది. అపుడే ఆఫోన్లు మూలకు చేరిపోతున్నాయి. కొన్ని ఫోన్లు బ్యాటరీలు పాడైపోయి చార్జింగ్ నిలబడటం లేదు. ప్రభుత్వం సిమ్ కార్డులు ఇవ్వకపోవడంతో ఉద్యోగులే తమ సొంతఖర్చుతో ప్రైవేటు నెంబర్లు వేసుకొని ఆఫోన్లను వాడాల్సి వస్తుంది. ఈవిషయాన్ని పోలీసుశాఖ వద్ద ప్రస్తావిస్తే..త్వరలోనే సిమ్ కార్డులు ఇస్తాం అనిచెబుతూనే వస్తున్నారు ఏడాది నుంచి..!

తాడేపల్లి

2023-01-05 03:49:31

సచివాలయ ఉద్యోగులకు సంక్రాంతికి బంపరాఫర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్ర సచివాలయంలోనే అందుబాటులోకి వచ్చిన ఫేషియల్ బయోమెట్రిక్ హాజరు గ్రామసచివాలయాలకు వర్తింపచేయనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి చెప్పారు. ప్రస్తుతం సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్సు నడుస్తుండగా సంక్రాంతి దాటిన తరువాత నెలాఖరులోపుగా దానిని పూర్తిస్థాయిలో అమలు చేస్తారు. ఇకపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వివిధ కారణాలు చెప్పి బయటకి వెళ్లిపోయే జంపింగ్ లకు కళ్లెం పడనుంది. అంతేకాకుండా ఇకపై సచివాలయాలపై ప్రత్యేక పర్యవేక్షణ కూడా ఏర్పాటు చేస్తున్నారు.

Tadepalli

2023-01-05 03:26:17

గ్రామ సచివాలయాలను మరింత ఆధునీకరించాలి

గ్రామ, వార్డు సచివాలయాలను మరింతగా ఆధునీకరించి ప్రజలకు సేవలు అందించడంతో అగ్రగామిగా నిలవా లని సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో సచివాలయ వ్యవ స్థపై సమీక్ష నిర్వహించిన ఆయన సిబ్బంది విధులపై ఆయాప్రభుత్వశాఖలు ఎస్ఓపీ(స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీ జర్) ఏర్పాటుచేయాలన్నారు. అన్ని సచివాలయాలకు ఇంటర్నెట్ అందుబాటులోకి తేవాలన్నారు. సచివాల యాల్లోని ప్రభుత్వ శాఖాధిపతులు నెలలో రెండుసార్లు సచివాలయాలను సందర్శించాలని ఆదేశించారు. దేశంలోనే అత్యుత్తమ వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నారు.

Tadepalli

2023-01-05 03:12:55

శ్రీవారి దర్శనానికి 190 గ్రామాల గిరిజన భక్తులు..

కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనేది ప్రతి హిందువు కోరిక. మన రాష్ట్రంలోనే ఉన్నా వ్యయ ప్రయాసలకోర్చి స్వామివారిని దర్శించుకోలేని పరిస్థితి వారిది. అలాంటి వెనుకబడిన పేదవర్గాల భక్తులకు టిటిడి రెండేళ్లుగా బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి సమయంలో శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. శ్రీవాణి ట్రస్టు నిధులతో ఆలయాల నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లోని 190 గ్రామాల నుండి సుమారు 9300 మంది ఎస్‌సి, ఎస్‌టి, మత్స్యకార భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి ఆహ్వానించినట్టు సమరసత సేవ ఫౌండేషన్‌ కార్యదర్శి త్రినాథ్‌ తెలిపారు.

Tirumala

2023-01-04 15:11:18

బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి కాలరీస్ సరికొత్త రికార్డు

తెలంగాణ నల్ల బంగారం ఉత్పత్తి చేసే సింగరేణి కాలరీస్ సంస్థ సరికొత్త రికార్డు నెలకొల్పింది. డిసెంబర్ నెలలో అత్యధిక నెలవారీ ఉత్పత్తిని సాధించినట్లు సంస్థ ప్రకటించింది. గత నెల 67.2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించామని అది 2021 డిసెంబర్ కంటే 19 శాతం ఎక్కువని వెల్లడించింది. అంతే కాకుండా గత నెలలో రోజుకు 2.18 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసి ఆల్ టైం రికార్డు నెలకొల్పినట్లు ప్రకటించింది. ఇదే ఉత్సాహాన్ని మరో 3నెలల పాటు కొనసాగించి ఉత్పత్తి, రవాణా పెంచాలని సంస్థ సీఎండీ శ్రీధర్ కార్మికులకు పిలుపునిచ్చారు.

Singareni

2023-01-04 05:41:33

ఉదయం 6 గంటల నుంచే వైకుంఠద్వార సర్వదర్శనం

సామాన్య భక్తులు ఎక్కువ మందికి వైకుంఠ ద్వార సర్వదర్శనం చేయించాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించిన మేరకు సోమవారం ఉదయం 6 గంటల నుండే సర్వదర్శనం ప్రారంభించామని టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. సర్వదర్శనం ప్రారంభమైన అనంతరం శ్రీవారి ఆలయం ముందు, ఆ తరువాత అన్నమయ్య భవన్లో చైర్మన్ మీడియాతో మాట్లాడారు. సామాన్య భక్తుల దర్శనానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో  వైకుంఠ ద్వార దర్శనం జరిగే 10 రోజులు సిఫారసు లేఖలపై జారీ చేసే దర్శనాలు రద్దు చేశామన్నారు. అలాగే శ్రీవాణి టికెట్లు కూడా ఆఫ్ లైన్లో రద్దు చేసినట్లు ఆయన వివరించారు. 

Tirumala

2023-01-02 13:34:02

హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు శుభవార్త

హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు శుభవార్త చెప్పింది. నాంపల్లి నుమాయిష్ కు వచ్చే సందర్శకుల కోసం మెట్రో సేవలను మరో గంటపాటు పొడిగించింది. దీనితో అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో రైళ్లు నడవనున్నాయి. ఎల్బీనగర్, నాగోల్, మియాపూర్, రాయదుర్గం మెట్రో స్టేషన్ల నుండి అర్ధరాత్రి 12 గంటలకు చివరి మెట్రో బయల్దేరనుంది. ఎల్బీనగర్- మియాపూర్, నాగోల్- రాయదుర్గం రూట్లలో మాత్రమే మెట్రో వేళలను పొడిగించారు. ప్రస్తుతం రాత్రి సమయాల్లో ప్రయాణించాలకునేవారికి మెట్రో చాలా ఉపయుక్తం కానున్నది.

Hyderabad

2023-01-02 04:46:33

గుంటూరు మృతులకు రూ.30 లక్షల పరిహారం

గూంటూరు టిడిపి సభ, తొక్కిసలాటలో మృతిచెందిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు చంద్రబాబుపై ఫైర్ అవుతున్న సమయంలో ఊహించని నష్టపరిహారం ప్రకటనలు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20లక్షలు ఇస్తామని ఉయ్యూరు ఫౌండేషన్ ప్రకటించింది. ఇటు టిడిపి తరపున ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించగా, టిడిపీనేత కె.రవీంధ్ర రూ.2లక్షలు, డేగల ప్రభాకర్ రూ.లక్షచొప్పున ప్రకటించారు. కాగా రాష్ట్రప్రభుత్వం రూ.2 లక్షలు ప్రకటించింది. ఈ ఘటన సగటు పాఠకుడిగా మీ అనాలసిస్ కామెండ్ చేయండి.

Guntur

2023-01-01 17:23:28

ఆ మృతుల బాధ్యత చంద్రబాబుదే..విడదల రజనీ

చంద్రబాబుకి అర్జెంటుగా అధికారం తెచ్చేసుకోవాలనే యావతో పెట్టే సభలు, సమావేశాలు ప్రజల ప్రాణాలకు ముప్పుతెస్తున్నాయని వైద్యఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని మండి పడ్డారు. గుంటూరులో జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు చనిపోయిన ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా, వారికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితులను మంత్రి విడదల రజిని పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, జరిగిన రెండు సభలు మృత్యు ఘంటికలు మోగిస్తున్నా చంద్రబాబుకి ఏమీ పట్టడం లేదన్నారు. ఏదో కానుకలు ఇస్తామని ఫేక్‌ ప్రచారం చేశారని, వాహనాలు పెట్టి జనాలను తరలించారని మంత్రి రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రచార యావ, అధికార దాహంతోనే ఈ దారుణం జరిగిందనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.

Tadepalli

2023-01-01 16:50:01

గ్రామ సచివాలయాలకు ప్రభుత్వ కీలక ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల క్రమం తప్పకుండా సమయానికి ఫేస్ రికగ్నైజేషన్ బయో మెట్రిక్ మూడు సార్లు వేయాల్సి వుంటుం ది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయా ల్లో స్పంద న గ్రీవియన్స్ ప్రతీరోజూ మధ్యాహ్నాం 3 నుంచి 5గంటల వరకూ చేపట్టాలి. అలా చేపట్టకపోయి నా, అన్నిశాఖ సిబ్బందితోపాటు కార్యదర్శిలు సచివాలయాల్లో అందుబాటులో  లేకపోయినా చర్యలు తీసుకుంటారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా ఒక పూట కట్ చేస్తారు. 3 ఆలస్యా లకు ఒకరోజు జీతం కట్ చేస్తారు.

Tadepalli

2023-01-01 14:48:03

APPSC గ్రూప్-1 దరఖాస్తుల ద్వారా రూ.4.67 కోట్లు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 నోటిఫికేషన్ లో ప్రకటించిన 92 పోస్టులకు ఏకంగా ఒక లక్షా 26వేల 449 మంది దరఖాస్తు చేస్తున్నారు. అంటే కేవలం దరఖాస్తుల ద్వారానే 4 కోట్ల 67 లక్షల 86వేల 130 రూపాయాల ఆదాయం సమకూరింది. దరఖాస్తు ఫీజు రూ.250 కాగా ప్రాసెసింగ్ ఫీజ్ రూ.120 అభ్యర్ధిలు  చెల్లించారు. దీనితో ఏపీపీఎస్సీకి భారీగానే ఆదాయం సమకూరింది. కాగా సర్వీస్ కమిషన్ ఈనెల 8వ తేదీన గ్రూప్ -1 పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఎంత మంది పోటీపడుతున్నారనే విషయం ఆరోజు సాయంత్రానికి గాని తెలీదు.

Tadepalli

2023-01-01 06:49:05

తూచ్.. ఏపీపీఎస్సీ గ్రూప్-1లో మళ్లీ ఇంటర్వ్యూలు

ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టే గ్రూప్-1, 2 పోటీపరీక్షలకు ఇంటర్వ్యూలు ఉండవని ప్రకటించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం మరోసారి మడమ తప్పింది. ప్రస్తుతం తీయబోయే గ్రూప్-1 పరీక్షలో ప్రిలిమ్స్, మెయిన్స్ అయిపోయిన తరువాత ఇంటర్వ్యూలు పెట్టి పోస్టులు భర్తీ చేయనున్నట్టు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ మీడియా ముఖంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం తీస్తున్న 92 గ్రూప్-1 పోస్టులకు గతంలో భర్తీకాని 18 గ్రూప్-1 పోస్టులు కలిపే అవకాశం కూడా ఉందన్నారు. దానికి పాలనా పరమైన అనుమతులు రావాల్సి వుంటుందన్నారు. ఈ పరీక్షల ప్రక్రియ పూర్తయితే గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి కసరత్తు ప్రారంభం అవుతుందని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రూప్-1, 2, పోస్టులకు ఇంటర్వ్యూలు తీసేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం మళ్లీ ఇంటర్వ్యూలు పెట్టడం విశేషం.

Tadepalli

2023-01-01 04:20:57

రత్నగిరిపై అందుబాటులోకి హరిహర సదన్ సత్రం

అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం సత్యగిరి కొండపైనఉన్న హరిహర సదన్ భక్తులకు అందుబాటులోకి వచ్చింది. శనివారం నుంచే భక్తుల సౌకర్యార్ధం గదులు భక్తులకు కేటాయించేందుకు ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసినట్టు దేవస్థానం ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి ఒక ప్రకటనలో తెలియజేశారు. సదరు సత్రము వద్దనే రూమ్స్ భక్తులకు కేటాయిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. భక్తుల ఈవిషయాన్ని గమనించి హరిహర సదన్ సత్రము గదులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

annavaram

2022-12-31 12:04:41