1 ENS Live Breaking News

ప్రెస్ అక్రిడిటేషన్లకు 3నెలలు కాలపరిమితి పొడిగింపు

ఏపీ సమాచారశాఖ వర్కింగ్ జర్నలిస్టులకు జారీచేసిన ప్రెస్ అక్రిడిటేషన్ల గడువు ఈఏడాది 31తో యుగియడంతో మరో మూడు నెలలు అంటే 31‌-03-2023 వరకూ పొడిగిస్తూ రాష్ట్ర సమాచారశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. మీడియా సంస్థలు, దినపత్రికల యాజమాన్యాలు సదరు అక్రిడిటేషన్ జర్నలిస్టుల జాబితాను తెలియజేస్తూ ఉమ్మడి 13 జిల్లాల డీపీఆర్వో కార్యాలయాలకు స్వయంగా లేఖలు పంపాల్సి వుంటుంది. ఈనేపథ్యంలో విధుల నుంచి తప్పుకున్నవారు, మానేసిన వారి జాబితాలను కూడా తెలియజేయాల్సి వుంటుంది తప్పితే.. కొత్తగా పేర్లు నమోదు చేయడానికి అవకాశం లేదు. లేఖలు ఈనెల 31నాటికి అన్నిజిల్లా డీపీఆర్వో కార్యాలయాలకు అందజేయాల్సి వుంటుంది. (BEST COACHING FOR SI & CONSTABLE : KEERTI COMPETITIVE INSTITUTE : KAKINADA ‌-9032228708)

Tadepalli

2022-12-28 07:42:35

సమాచారశాఖ కమిషనర్ ను తప్పుదోవ పట్టిస్తున్నారు..

ఆంధ్రప్రదేశ్ లో అన్నీ వింతలే జరుగుతుంటాయి.. ఏపీలో13 జిల్లాలను విభజించి 26 జిల్లా లను చేస్తూ రాష్ట్రప్రభుత్వం గెజిట్ పబ్లికేషన్ చేసినా నేటికీ కేంద్రంలోనూ, రాష్ట్రపతి వద్ద ఇంకా కొత్త జిల్లాల ఆమోద ముద్రపడలేదు. ఇది చాలదన్నట్టు కొత్త జిల్లాల ఏర్పాటైనా కొత్తజిల్లాల్లో పరిపాలన పూర్తిస్థాయిలో జరగలేదు. కనీసం మీడియా ద్వారానైనా గుర్తింపు వచ్చి చస్తుందా అంటే అదీ లేకుండా పోయింది. ఇపుడు కొత్తగా జర్నలిస్టు సంఘాల నేతలందరూ తమకు ప్రభుత్వం ఇచ్చే ఆ కొన్ని ప్రెస్ అక్రిడిటేషన్లు ఉమ్మడి జిల్లాల నుంచే ఇవ్వాలని కోరుతున్నారట. మరీ వెటకారం కాకపోతే కొత్త జిల్లాలు ఏర్పాటై..అన్నిజిల్లాలకు ప్రభుత్వం కలెక్టర్లను కూడా నియమిచింది. కొత్త జిల్లాల్లో కూడా ప్రెస్ అక్రిడిటేషన్లు కలెక్టర్లు మాత్రమే జారీచేయాలి. కారణం అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టరే కనుక. అలా కాకుండా జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల గొంతమ్మకోర్కెలు విని ఉమ్మడి జిల్లాల్లో ప్రెస్ అక్రిడిటేషన్లు మంజూరు చేస్తే..కొత్త జిల్లాల్లో కలెక్టర్లు ఎలాంటి అధికారాలు, చైర్మన్ హోదాలు లేనట్టుగానే గుర్తించాల్సి వుంటుంది. అదే జరిగితే కేవలం సమాచారశాఖ ద్వారానే కొత్తజిల్లాల్లోని సివిల్ సర్వీస్ అధికారుల స్థాయి తగ్గించిన శాఖగా గుర్తింపు కూడా పొందుతుంది.

కొత్త జిల్లాలకు మీడియా ద్వారానే అసలైన గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటైన 13 కొత్తజిల్లాలు, పరిపాలన ప్రజలకు తెలియాలన్నా, పరిపాలన గాడిలోపడి కేంద్రప్రభుత్వ గుర్తింపు రావాలన్నా మీడియా ద్వారానే జరగాల్సి వుంటుంది. కానీ ఇపుడు అదే మీడియా ద్వారా కొత్తజిల్లాలకు, అక్కడి కొత్త కలెక్టర్లకు గుర్తింపు లేకుండా పోయే పరిస్థితి దాపురించింది. కొత్త జిల్లాలు ఏర్పాటై ఇంతకాలం అవుతున్నా నేటికీ కొత్తజిల్లాల్లోని కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఇతర 75 ప్రభుత్వశాఖల అధికారులకు సరైన గుర్తింపు లేకుండా పోయింది. సగం సమాచారశాఖ గుర్తింపు రానీయకుండా చేస్తే..మరో సగం మిగిలివున్న మీడియా బాహ్య ప్రపంచానికి తెలియనీయకుండా శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నది. అసలు సమాచారశాఖలోనే ఉమ్మడి జిల్లాల సమాచారశాఖ అధికారులు అటు రాష్ట్ర కమిషనర్ ను, సమాచారశాఖ మంత్రిని, ప్రభుత్వాన్ని కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. వాస్తవానికి కొత్త జిల్లాల్లో జరిగే కార్యక్రమాలు మీడియా ద్వారా దేశవ్యాప్తం కావాలి. కానీ కొత్త జిల్లాల పేర్లు పలకడానికి సమాచారశాఖ ద్వారా విస్త్రుత మీడియా ప్రచారం చేయడానికి సమాచారశాఖలోని అధికారులు ముందుకి రావడం లేదు.

పాతజిల్లాల నుంచే అక్రిడిటేషన్లు కావాలంటే కొత్తజిల్లాలెందుకు
ప్రభుత్వ నిబంధనల కారణంగా ప్రెస్ అక్రిడిటేషన్ల జారీ భారీ మొత్తంలో పడిపోయింది. వచ్చే ఆ కొద్దపాటి ప్రెస్ అక్రిడిటేషన్లు పాత ఉమ్మడి జిల్లాల నుంచి ఇవ్వాలంటూ కొన్ని జర్నలిస్టు సంఘాల నేతలు ఏపీ సమాచారశాఖ కమిషనర్ ను తప్పుదారి పట్టిస్తున్నట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధికోసం ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చి కొత్త పరిపాలనా విధానాలను అమలు చేసిన తరుణంలో కొందరు జర్నలిస్టులు, మరికొందరు జర్నలిస్టు సంఘాల నేతలు ప్రెస్ అక్రిడిటేషన్ విషయంలో సమాచారశాఖను తప్పుదారి పట్టించడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సమాచారశాఖ కారణంగానే కొత్తజిల్లాల్లోని డీపీఆర్వోలు, డీడీలు ప్రభుత్వ సమాచారం ఇవ్వకుండా సోకాల్డ్ మీడియా జర్నలిస్టులతోనే ప్రెస్ గ్రూపులు ఏర్పాటు చేసి ప్రభుత్వ అభివృద్ధిని, సమాచారాన్ని ప్రజలకు తెలియనీయకుండా సాయశక్తులా కృషిచేస్తున్నారు. ఇపుడు మళ్లీ ప్రెస్ అక్రిడిటేషన్ల విషయంలో కూడాకొత్తజిల్లాల్లో కాకుండా.. ఉమ్మడి జిల్లాల్లో ఇస్తే రాష్ట్రంలో కొత్తజిల్లాల కలెక్టర్లు అధికారం లేనట్టుగా తేటతెల్లం అయిపోతుంది. ఇప్పటికైనా సమాచారశాఖ కమిషనర్ కార్యాలయం నుంచి కొత్త అక్రిడిటేషన్ల విషయంలో నూతన జిల్లాల నుంచి మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవడం ద్వారా కొత్తజిల్లాలకు గుర్తింపు రావడంతోపాటు, మీడియా ద్వారా కొత్త జిల్లాకలెక్టర్లు కూడా ప్రత్యేక గుర్తింపు వస్తుంది. లేదంటే కేంద్రం, రాష్ట్రపతి దృష్టిలో మాదిరిగానే ఇంకా ఏపీలో 13 జిల్లాలనే భావనతోనే అధికారికంగా ఉండాల్సి వస్తుంది..!

Tadepalli

2022-12-27 10:51:39

పెద్ద కబుర్లాడే అధికారుల పాలిట పాసుపతాస్త్రం..!

పేరుకే వారంతా సివిల్స్, గ్రూప్-1, గ్రూప్-2 అధికారులు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు పెద్దగా పట్టించుకోరు..పైగా ప్రభుత్వం యొక్క బాధ్యతను వారే తమ బుజాలపై తెగ మోసేస్తున్నట్టు ఇచ్చే ఫీలింగ్, కలరింగ్, బిల్డప్ మామూలుగా ఉండదు. కిందిస్థాయి ఉద్యోగులు చేసే పనిని, పడిన కష్టాన్ని వీరి ఖాతాలోకి మళ్లించుకొని ప్రభుత్వం దగ్గర చేసే హడావిడి మామూలుగా ఉండదు. ఆఫీసుకి గంట ఆలస్యంగా వచ్చి రెండు గంటలు ముందు ఇంటికి వెళ్లిపోయే అధికారులను గాడిలో పెట్టడానికి ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఫేస్ బయో మెట్రి అటెండెన్స్ ఉత్తర్వులపై(ఏస్థాయి అధికారైనా బయోమెట్రిక్ వేయాల్సిందే) క్రిందిస్థాయి సిబ్బంది, నిబద్దతలో పనిచే అధికారుల నుంచి ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ఏ స్థాయి ఉద్యోగి అయినా ఖచ్చితంగా బయో మెట్రిక్ వేయాల్సిందేననే నిబంధనను అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు స్వాగతిస్తున్నారు. చేస్తున్నది ప్రభుత్వ ఉద్యోగమే అయినా ఏవేవో కాకమ్మ కబుర్లు చెప్పి బయట ప్రైవేటు పనులు చేసుకునేవారికి సింహ స్వప్నం లాంటి నిబంధన ఇన్నేళ్ల తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేశారంటూ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇకపై ఉద్యోగి అంటే కార్యాలయంలో ఉండి తీరాలనే నిబంధన అమలు కావడంతోపాటు, ప్రజల సమస్యలు కూడా సత్వరమే పరిష్కారం అవుతాయనే భావన ప్రతీ ఒక్కరిలోనూ వ్యక్తమవుతుంది.

75ఏళ్ళ చరిత్రలో ఒకే ఒక్క..ప్రభుత్వం
75ఏళ్ల స్వాతంత్ర్య భారత దేశంలో అటెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ వరకూ బయో మెట్రిక్ వేసి విధులు నిర్వహించేలా చేసిన ప్రభుత్వంగా వైఎస్సార్సీపీ జగన్ ప్రభుత్వం నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులంటే నచ్చిన సమాయానికి వస్తాం..చిరాకొస్తే ఇంటికి వెళ్లిపోతామనే దోరణిలోనే ఇప్పటి వరకూ ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల వ్యవహారం నడిచింది. కానీ చరిత్రలో మొట్టమొదటి సారిగా..అధికారులు, సిబ్బంది విధి నిర్వహణ, కార్యాలయ సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ప్రతీ ఒక్క ప్రభుత్వ ఉద్యోగీ బయో మెట్రిక్ అటెండెన్సు(ఫేస్ రికగ్నైజేషన్ యాప్ బయో మెట్రిక్) వేయాలనే నిబంధన తీసుకురావడం ఇపుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఈ విధానం ప్రభుత్వ అధికారులకు, సిబ్బందికి ఇబ్బందిగా ఉన్నా సరైన ప్రభుత్వసేవలు సకాలం అందాలంటే ప్రతీ ఉద్యోగీ, అధికారి ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాల్సి అవసరం వుంది. దానికోసం ఏర్పాటు అన్నిశాఖల, అన్ని స్థాయి అధికారులు అటెండెన్సు వేయాలనే నిబంధన ఇపుడు ప్రజల నుంచి విశేషంగా మన్ననలు పొందుతోంది..

కల్లబొల్లి మాటలకు, డుమ్మావిధులకు ఇక చెల్లుచీటి
ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఫేస్ రికగ్నైజేషన్ యాప్ బయో మెట్రిక్ విధానం వలన ప్రతీసారి కల్లబొల్లి మాటలు చెబుతూ విధులకు డుమ్మాకొట్టేవారు, కాకమ్మ కబుర్లు చెప్పి ప్రభుత్వ విధినిర్వహణలో బయటకు వెళ్లిపోయి సొంత పనులు చూసుకునేవారు,నేనొక్కడినే తెగ కష్టపడిపోతున్నాను.. మిగిలిన వారంతా కూర్చొని జీతం తీసేసుకుంటున్నారని తెగఫీలైపోయే ప్రభుత్వ కొలువు వెలగబెడుతున్నమహానుభావులందరూ ఇక చచ్చినట్టు ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసి తీరాల్సిందే. అంతేకాకుండా ఎంతసేపు ఆలస్యంగా వస్తే అంతసేపు కార్యాలయంలో విధులు నిర్వహించాలి..లేదంటే జీతంలో కోత వంటి చర్యలు కూడా అమలు చేస్తామంటున్న ప్రభుత్వ చర్యలు మంచి ఫలితాలను ఇస్తాయనే ఆశాభావాన్ని విధినర్వహణే దైవంగా బావించే ఉద్యోగులు, అధికారులు చక్కగా స్వాగతిస్తున్నారు. గతంలో ఆడుతూ, పాడుతూ, విధులకి వచ్చే వారందరికీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇపుడు గొంతులో పచ్చి వెలక్కాయ్ పడ్డట్టు తయారైంది.

అమలు చేస్తేనే అసలైన ప్రగతి..లేదంటే తిరోగమనమే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత ప్రజా ఆమోదయోగ్యమైన నిర్ణయం అన్ని స్థాయిల అధికారులు, ఉద్యోగులు బయో మెట్రిక్ వేయాలనే నిబంధన ద్వారా జవాబుదారీ తనాన్ని పెంచనుంది. అదే సమయంలో ప్రతీ ప్రభుత్వ ఉద్యోగినీ సమయానికి కార్యాలయానికి తీసుకొచ్చి పనిచేయించిన ఘనత కూడా ఏపీ సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డికి దక్కుతుంది. అదే సమయంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది నుంచి వ్యతిరేకత వస్తుందని ఈ నిబంధనల్లో సడలింపులు చేస్తే ప్రగతి మాట అలా ఉంచితే..ఉన్న కాస్త ప్రగతి కూడా తిరోగమనంలో పయనించే పరిస్థితి వస్తుందని మేధావులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి ఒత్తిడిలు ఎక్కడ నుంచి వచ్చినా వాటిని పట్టించుకోకుండా ఫేస్ రికగ్నైజేషన్ యాప్ బయో మెట్రిక్ ను అమలు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చుననే వాదన సర్వత్రా వినిపిస్తోంది. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగమంటే ఎలా పనిచేసినా, వెళ్లినా, వెళ్లకపోయినా నెల అయ్యేసరికి జీతాలు వచ్చేస్తాయన్న ధీమా నుంచి నెల పూర్తయినా జీతాలు వస్తాయో రావో అనే పరిస్థితిని ప్రభుత్వ ఉద్యోగులకు రుచి చూపించిన ప్రభుత్వం, ఇపుడు అన్నిస్థాయిల అధికారుల చేత పనిచేయించాలని తీసుకున్న ఈ 

నిర్ణయం మాత్రం ప్రభుత్వం అమలుచేస్తున్న నవరత్నాల పథకాలంటే వెయ్యిరెట్లు మెరుగ్గా వుందని సాధారణ ప్రజల నుంచి పనిచేసే అధికారులందరూ తమ మద్దతును తెలియజేస్తున్నారు. చూడాలి పెద్దకబుర్లాడే అధికారులతో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ బయో మెట్రిక్ అటెండెన్సు ఏ మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచి పనిచేయిస్తూ ప్రజలకు సేవలు అందిస్తుందనేది..!

Tadepalle

2022-12-27 09:46:33

ఏపీలో26 జిల్లాల సంఖ్య ప్రభుత్వానికి కీడుని తెస్తున్నదా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాష్ట్రంలోని 26 జిల్లా సంఖ్య(2+6=8 ఈ సంఖ్య సంఖ్యాశాస్త్రం ప్రకారం దెయ్యం లేదా డెవిల్ సంఖ్య అంటారు) కీడు తెస్తున్నదా..అంటే అవుననే అంటున్నారు న్యూమరాలజిస్టులు. ఇదే సంఖ్యతో ప్రభుత్వం తన పరిపాలన కొనసాగిస్తే వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా హెచ్చ రిస్తున్న అంశం ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఏపీలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చిన సమయంలోనే ఈ విషయాన్ని న్యూమరాలజిస్టులు ప్రభుత్వం దృష్టికి, కొందరు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా ప్రభుత్వం అనుకున్నట్టుగా కేవలం 26 జిల్లాలనే రా జపత్రం (గెజిట్ నోటఫికేషన్) ద్వారా ప్రకటించి ప్రచురించింది. అప్పటి నుంచి చాలా విషయాల్లో ప్రభుత్వాకి అంతా కీడే జరుగుతున్నదని, కొత్త జిల్లా బిల్లుకి కేంద్రంలో రాష్ట్రపతి ఆమోద ముద్రలభించలేదని, పోలవరానికి నిధులు ఆగిపోయాయని, 3 రాజధాను అంశం ముందుకు వెళ్లలేదని, నవరత్నాల్లోని ముఖ్యమైన మధ్యపాన నిషేదాన్ని అమలు చేయలేకపో తున్నారని, అభివృద్ధి సక్రమంగా జరగక ఆర్ధికంగా ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు వస్తున్నాయని..న్యూమరాలజిస్టులు చెప్పుకొస్తున్నారు. ఇటీవల కాలం ఆ ప్రచారం మరింత అధికమై తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన చర్చకు దారితీసింది. అటు ప్రభుత్వం కూడా మరో కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది..పరిపాలనా పరమైన ఇబ్బదులు, ప్రజల జిల్లా కేంద్రానికి వచ్చే ఇబ్బందులు తగ్గుతాయా అనే కోణంలో ఆలోచిస్తున్నట్టు సమాచారం వస్తు న్నది.

26 సంఖ్య వెనుక ఏమున్నది..ఏం చెబుతుంది..
న్యూమరాలజీలో 8వ సంఖ్యలను డెవిల్ నెంబరు అనిపిలుస్తారు. అదే 9వ సంఖ్యను కింగ్ నెంబర్ అని పిలుస్తారు. కింగ్ నెంబరు కావాలని కోరుకునేవారు చాలా మంది వారు తీసుకున్న మొబైల్ నెంబరు గానీ, వాహనాల నెంబర్లు గానీ తొమ్మిది వచ్చేలా తీసుకుంటారు. టోటల్ 8 సంఖ్య వచ్చేలా ఎవరూ తీసుకోరు. 100 మందిలో ఈ 8వ అనే సంఖ్య ఒకటి నుంచి 5 గురు సభ్యులకు కూడా పనిచేయదని..ఇది కంప్లీట్ గా డివిల్ నెంబరు అని నమ్ముతారు. అదే క్రైస్తవులైతే ఈ సంఖ్యను సాతాను(దెయ్యం)గా అభివర్ణిస్తారు. అలాంటిది ఏపీ ప్రభుత్వం జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా తీసుకున్న నిర్ణయం ప్రకారం రాష్ట్రంలోని 13 జిల్లాలు 26 జిల్లాలుగా మార్చారు. ఇపుడు ఆ కొత్త జిల్లాలు అభివృద్ధి 26 జిల్లాల సంఖ్య కారణంగానే  నోచుకోలేదని.. అంతేకాకుండా ప్రభుత్వం కోర్టుల్లో వేసిన కేసులను గెలువలేకపోతున్నదని, ఏ విషయంలోనూ గ్రహాలు అనుకూలించక అభివృద్ధి పనులకి ముందడుగు పడటం లేదని, ఆదాయం పెరగడం లేదని, శాస్వత అభివృద్ధి పనులు సైతం చేపట్టలేకపోతున్నదనేది ప్రస్తుతం జరుగుతున్న వాదన. వాదన అనేకంటే ప్రస్తుత రాష్ట్రం యొక్క ఆర్ధిక పరిస్థితి కూడా అలానే వున్నదని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల సంఖ్యను ఒక కొత్తజిల్లా అదనంగా చేర్చి 27 జిల్లాలు చేస్తే ఆ సంఖ్య న్యూమరాలజీ(సంఖ్యాశాస్త్రం) ప్రకారం ఇటు ప్రభుత్వానికి జిల్లాలకు కూడా మంచి జరుగుతుందని న్యూమరాలజిస్టులు చెబుతున్నారు.  

27వ జిల్లా ఏర్పాటు సుగమం అయ్యిందా..?
ఏపీలో కొత్తజిల్లాలు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి 26 సంఖ్య న్యూమరాలజీ ప్రకారం డెవిల్ నెంబరు అనే ప్రచారాన్ని అటుంచితే..పరిపాలనా పరమైన చిక్కులను తెచ్చిపెడుతున్నది. 26 జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవర ఐటీడీఏ ప్రాంతాన్ని కూడా చేర్చారు. దీనితో జిల్లా కేంద్రం పాడేరుకి ఇక్కడి ప్రజలు వెళ్లాంటే ఒకరోజంతా ప్రయాణం సుమారు 485 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే తప్ప వెళ్లలేరు. అదేవిధంగా అధికారుల పరిస్థితికూడా అంతే. ఈ ప్రాంతం నుంచి మండల, డివిజన్ అధికారులు పూర్తిస్థాయిలో జిల్లా కేంద్రానికి, జిల్లా కలెక్టర్ ఈ ప్రాంతాలను అనుకున్న సమయంలో రాలేకపోతున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దానిని దృష్టిలో ఉంచుకొని ఇపుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి తరువాత 27వ జిల్లాగా రంచపచోడవరం రెవిన్యూ డివిజన్ లోని 11 మండలాలు కలుపుతూ ఒక జిల్లాగా చేయాలని భావిస్తున్నట్టు ఒక ఉన్నతాధికారి ఈఎన్ఎస్ తో చెప్పుకొచ్చారు. 

అయితే అది కార్యరూపం దాల్చుతుందా..లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి వున్నదనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం 26 అనే సంఖ్య మొత్తం కలిపితే 8 వస్తుందని..ఈ నెంబరు కీడు,చెడుకి సంకేతమనే విషయం ఇటు ప్రుభుత్వం దృష్టికి కూడా వచ్చిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రచారాలు, సంఖ్యాశాస్త్రం తదితర అంశాలను పక్కనపెడితే అల్లూరి జిల్లాలకు ఆ మూలన వున్న రంపచోడవరం ప్రాంతాన్ని జిల్లాగా విడదీయడం ద్వారా పరిపాలన సౌలభ్యం, ప్రజలకు ఇబ్బందులు తగ్గుతాయని విషయం ప్రభుత్వం గుర్తించిందన్నారు. అయితే అల్లూరి సీతారామరాజు బ్రిటీషు సేనలపై పోరాటం చేసిన ప్రాంతాలన్నీ ఒకే జిల్లాల్లో ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం మొత్తం ప్రాంతాన్ని అల్లూరి జిల్లాగా తయారు చేసిందన్నారు.

ఇపుడు ప్రధానంగా రంపచోడవరం ప్రాంతాన్ని తప్పితే జిల్లాకి పెట్టిన పేరు విషయంలో భావం పోతుందన్నారు..కానీ ఇపుడు అన్ని అంశాల్లోనూ పరిపాలనా ఇబ్బందులు, అధికారులు, ప్రజల నుంచి కూడా ప్రభుత్వంపై ఒత్తిడి వస్తున్నదన్నారు. ప్రస్తుతం ఈ విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదని కొత్తజిల్లా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు చెప్పారు. అయితే అది ఎప్పుడు జరుగుతుందో చెప్పలేమని.. అల్లూరి జిల్లా భావం పోకుండా అల్లూరి పోరాటం చేసిన ప్రాంతాలను విభజించకుండా కొత్తగా జిల్లా ఏర్పాటు చేస్తారా అనే విషయం కూడా పరిశీలనలో ఉందన్నారు. న్యూమరాలజీ చెబుతున్నట్టుగా 26 సంఖ్యను 27 చేయడంతోపాటు ప్రజల ఇబ్బదులను తీర్చడానికి 27వ జిల్లా రాష్ట్రంలో ఏర్పాటవుతుందే సంకేతాలైతే వస్తున్నాయి. చూడాలి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందనేది..!

Tadepalli

2022-12-27 02:24:24

దర్శన టోకెన్‌ ఉన్న భక్తులకు వైకుంఠద్వార దర్శనం

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు టికెట్లు, టోకెన్లు పొంది తిరుమలకు రావాలని టిటిడి ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ విజ్ఞప్తి చేశారు. తిరుమలలో సోమవారం వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల పరిశీలన అనంతరం ఈవో మీడియాతో మాట్లాడారు. వైకుంఠ ద్వార దర్శనం జనవరి 2 నుండి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు ఉంటుందని ఈవో చెప్పారు. ఇందుకోసం ఆన్‌లైన్‌ ద్వారా రూ.300/` ఎస్‌ఇడి టికెట్లు 2 లక్షలు కేటాయించినట్టు తెలిపారు. తిరుపతిలో అలిపిరి వద్దగల భూదేవి కాంప్లెక్స్‌, రైల్వేస్టేషన్‌ ఎదురుగా గల విష్ణునివాసం, రైల్వేస్టేషన్‌ వెనుక గల 2, 3 సత్రాలు, ఆర్‌టిసి బస్టాండు ఎదురుగా గల శ్రీనివాసం కాంప్లెక్స్‌,
ఇందిరా మైదానం, జీవకోన జిల్లా పరిషత్‌ హైస్కూల్‌, భైరాగిపట్టెడలోని రామానాయుడు మున్సిపల్‌ హైస్కూల్‌, ఎంఆర్‌ పల్లి జడ్‌పి హైస్కూల్‌, రామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేస్తున్న కౌంటర్లలో జనవరి ఒకటో తేదీన సర్వదర్శనం టోకెన్ల జారీ  ప్రారంభిస్తామన్నారు. 10 రోజుల కోటా పూర్తయ్యేంత వరకు నిరంతరాయంగా టోకెన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులు తిరుమలలోని కృష్ణతేజ విశ్రాంతి గృహం వద్ద రిపోర్టు చేయాలని తెలిపారు.

భక్తులు టిటిడి వెబ్‌సైట్‌, ఎస్వీబీసీ, ఇతర మాధ్యమాల ద్వారా టికెట్ల లభ్యతను ముందే తెలుసుకుని తమ తిరుమల ప్రయాణాన్ని ఖరారు చేసుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. భక్తులు ముందుగానే వచ్చి క్యూలైన్లలో నిరీక్షించకుండా టోకెన్‌పై తమకు కేటాయించిన ప్రాంతానికి నిర్దేశించిన సమయానికి మాత్రమే రావాలని కోరారు. తిరుమలలో వసతి సౌకర్యం తక్కువగా ఉన్నందున దర్శన టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే ముందు వచ్చిన వారికే ముందు అన్న ప్రాతిపదికపై వసతి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో అన్నప్రసాదాలు, తాగునీరు, మరుగుదొడ్లు, వైద్యసదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈవో వెంట అదనపు ఈవో(ఎఫ్‌ఏసి)  వీరబ్రహ్మం, 
సివిఎస్వో నరసింహ కిషోర్‌,  ఎస్వీబీసీ సిఈవో  షణ్ముఖ్‌ కుమార్‌, చీఫ్‌ ఇంజినీర్‌  నాగేశ్వరరావు, ఎస్‌ఇ-2  జగదీశ్వర్‌రెడ్డి, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, ట్రాన్స్ పోర్టు జిఎం  శేషారెడ్డి, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి  శాస్త్రి తదితరులు ఉన్నారు.

Tirumala

2022-12-26 11:25:45

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ మరో జాబ్ నోటిఫికేషన్..?

ఆంధ్రప్రదేశ ప్రభుత్వం నిరుద్యోగులకు సంక్రాంతి పండుగ కానుకగా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ జారీకి ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. దానికోసం గ్రామ, వార్డు సచివాలయ శాఖలో మిగిలిన ఉద్యోగాల భర్తీచేపట్టనున్నట్టు తెలిసింది. ప్రభుత్వం 2019లో లక్షా 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వగా అపుడు 1.20వేల మంది మాత్రమే ఉద్యోగాలకు అర్హత సాధించారు. ఆ తరువాత పలు ప్రభుత్వశాఖల్లో విధినిర్వహణలో మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాల వారికి కారుణ్య నియామకాల క్రింద కొన్ని పోస్టులను భర్తీచేసింది. ఇంకా మిగిలిని ఉద్యోగాలను శాఖల వారీగా విడి విడిగా నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీచేయడానికి ఏర్పాట్లు పూర్తి అయినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. దానికోసం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఖాళీల భర్తీ వివరాలను ప్రభుత్వం సేకరించి ఉంచింది.

Tadepalli

2022-12-25 11:43:40

ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్ధులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్ధులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి శుభవార్త చెప్పారు. ఇటీవలే ఇచ్చిన ఉద్యోగ ప్రకటనకు సంబంధించి అభ్యర్ధుల వయోపరిమితిని రెండేళ్లకు పెంచారు. కోవిడ్ సమయంలో ప్రభుత్వ నోటిఫికేషన్లు రాకపోవడం, చాలా మంది అభ్యర్ధులకు వయస్సు దాటిపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పోలీస్ శాఖ ద్వారా వెళ్లిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి ఆమోద ముద్రవేశారు. దీనిపై అధికారిక ప్రకటన సోమవారం వెలువడే అవకాశం ఉంది. కాగా ప్రభుత్వం అభ్యర్ధుల వయోపరిమితి రెండేళ్లు పెంచడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల నుంచి హర్షం వ్యక్తం అవుతున్నది. అంతేకాకుండా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారిక సంఖ్య కూడా భారీగా పెరగనున్నది.

Tadepalli

2022-12-25 08:08:12

27న శ్రీవారి ఆలయంలో బ్రేక్ ద‌ర్శనాలు రద్దు

తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా డిసెంబరు 27న బ్రేక్ ద‌ర్శనాలు రద్దు చేస్తున్నట్టు టిటిడి ప్రకటించింది. ఆరోజు ఉదయం 6 నుంచి 12 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉన్న కారణంగా డిసెంబరు 26న సిఫార్సు లేఖలు స్వీకరించబడవని పేర్కొన్నారు. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి టిటిడికి స‌హ‌క‌రించాల‌ని మీడియా ద్వారా తెలియజేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతీ ఏడాది స్వామివారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ నిర్వహిస్తుంటారు.

Tirumala

2022-12-25 07:49:15

శ్రీ సాధు సుబ్రమణ్య శాస్త్రి వంద కోట్ల హిందువుల ఆస్తి

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం చరిత్రను ప్రపంచానికి తెలియజేసిన శ్రీమాన్ సాధు సుబ్రమణ్య శాస్తి దేశంలోని వంద కోట్ల హిందువుల ఆస్తి అని ఎమ్మెల్యే భూమన కరుణా కర రెడ్డి అన్నారు. సుబ్రమణ్య శాస్త్రి 133వ జయంతి సందర్భంగా శనివారం శ్వేత సమావేశం మందిరంలో జరిగిన జయంతి సభకు కరుణాకర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీవారి ఆలయ చరిత్ర వెలికి తీసిన  సుబ్రమణ్య శాస్త్రి స్వామివారి కి అనన్య సేవ చేశారన్నారు. రాణి సామవై భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని ఆలయానికి అందించారని శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి వెలికి తీసిన తొలి శాసనమే శ్రీవారి ఆలయ చరిత్ర బయటకు రావడానికి కారణమన్నారు. టీటీడీలో చిన్న స్థాయి అధికారిగా ఉంటూ వెయ్యి కి పైగా శాసనాలను వెలికితీసి పరిష్కరించిన గొప్ప వ్యక్తి ఆయన అని చెప్పారు. అలాంటి మహానుభావునితో తనకు పాఠశాల చదివే రోజుల్లోనే పరిచయం కావడం తన అదృష్టమని తెలిపారు. 

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అమూల్యమైన సేవలందించిన శ్రీ సాధు సుబ్రమణ్య శాస్త్రి,  వేటూరి ప్రభాకరశాస్త్రి,  రాళ్ళ పల్లి ఆనంతకృష్ణ శర్మ విగ్రహాలు ప్రతిష్టించాలనే ఆలోచన శ్రీ వేంకటేశ్వర స్వామి వారే తనకు కల్పించారన్నారు. ఇలాంటి మహానుభావుల జీవితాల మీద చర్చ జరగాలని, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. సాధు సుబ్రమణ్య శాస్త్రి వెలికి తీసి పరిష్కరించిన శాసనాల పుస్తకాలను ప్రతి ఒక్కరు చదవాలన్నారు. టీటీడీ బోర్డు సభ్యులు  పోకల అశోక్ కుమార్ మాట్లాడుతూ,  సుబ్రమణ్య శాస్త్రి తన జీవితాన్ని స్వామి సేవకు అంకితం చేసిన మహా మనిషి అన్నారు. ఇలాంటి వారి సేవలను టీటీడీ గుర్తు చేసుకోవడం సంతోషమన్నారు. సుబ్రమణ్య శాస్త్రి కూతురు  గిరిజ, మనుమడు, కడప అదనపు జిల్లా సెషన్స్ జడ్జి  సి ఎస్ మూర్తి మాట్లాడుతూ,  భూమన కరుణాకర రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలోసుబ్రమణ్య శాస్త్రి విగ్రహం ప్రతిష్టించడం సంతోషమన్నారు.

 శ్వేత డైరెక్టర్  ప్రశాంతి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో శాసన పరిశోధకులు కృష్ణారెడ్డి, టీటీడీ సిఏవో  శేషశైలేంద్ర, 
డిఈవో  భాస్కర రెడ్డి, దూరదర్శన్ విశ్రాంత అదనపు డైరెక్టర్ జనరల్  అనంత పద్మనాభరావు, పుదుచ్చేరి యూనివర్సిటీ ప్రొఫెసర్  చంద్ర మౌళి, ఎస్వీ మ్యూజియం ప్రత్యేకాధికారి  కృష్ణారెడ్డి,  ఎస్వీ ఓరియంటల్ కళాశాల ఆచార్యులు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
 ఈ సందర్భంగా

 సాధు సుబ్రమణ్య శాస్త్రి జయంతి సందర్బంగా టీటీడీ ముద్రించిన సారస్వత సంవీక్షణం పుస్తకాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే  కరుణాకర రెడ్డి ఆవిష్కరించారు.  అంతకుముందు శ్వేత భవనం ఎదురుగాగల శ్రీమాన్ సాధు సుబ్రమణ్య శాస్త్రి విగ్రహానికి అథితులందరూ పూలమాలలు వేసి నివాళులర్పించారు.


Tirumala

2022-12-17 08:28:54

గ్రామ, వార్డు సచివాలయాల్లో పేరుకుపోతున్న కాగిత చెత్త

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయాలకు ఇపుడు కొత్త చె(చిత్తు)త్త సమస్య వచ్చిపడింది..తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు పెట్టుకునే కాగితపు అర్జీలు, ఇచ్చిన దరఖాస్తులన్నీ చెత్తగా మారి కార్యాలయాల డెస్కులు నిండిపోతుండగా, కొన్నింటిని బయట పడేస్తున్నారు. వినడానికి వింతగా ఉన్నా ఇదినిజం. రాష్ట్రప్రభుత్వం 2019లో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలు నేటితో మూడేళ్లు  ర్తిచేసుకుంటున్నా.. ఈ శాఖలో ఈ-ఫైలింగ్ విధానాన్ని అమలు చేయలేదు. ఒక్కో సచివాలయంలో 10 నుంచి 12 ప్రభుత్వ శాఖల సిబ్బంది పనిచేస్తుండటంతో వారి పరిధిలోకి వచ్చే సమస్యల దస్త్రాలన్నీ, అభ్యర్ధన రూపంలో కార్యాలయాల్లో మేట్లుగా నిండిపోతున్నాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఎంతమేర చిత్తు పేరుకుపోతున్నదో ఒక్కసారి రాష్ట్రప్రభుత్వం గుర్తించాల్సి వుంది. వీటికితోడు సచివాలయాల్లోనే ఇచ్చే, జనణ, మరణ దృవీకరణ పత్రాల నకళ్లు కూడా ఇక్కడ భారీ ఎత్తున దొంతర్లుగా పేరుకుపోతున్నాయి. చిత్తు పెరిగిపోతుందని వాటిని పడేయలేక, ఎపుడైనా అవసరం వస్తుందని వాటిని ఉంచలేక సచివాలయ సిబ్బంది, కార్యదర్శిలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోసారి ముఖ్యమైన దస్త్రాలు వాటిలో కలిసిపోయి సమయానికి కపించకుండాపోయి జిల్లా అధికారులతో నానా చివాట్లూ సిబ్బంది తినాల్సి వస్తున్నది.

ఈ-ఫైలింగ్ విధానం లేక పడరాని పాట్లు
ఏ ప్రభుత్వశాఖలోనూ లేనివిధంగా ఒక్క గ్రామ, వార్డు సచివాలయశాఖలోనే సుమారు 12 నుంచి 16శాఖల సిబ్బంది పనిచేస్తున్న సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ శాఖలో ఈ-ఫైలింగ్ విధానాన్ని అమలు చేయడం లేదు. ఈవిధానం అమలు చేయడం ద్వారా ప్రజలకు చెందిన వివిధ సమస్యల డేటాతోపాటు, నకలు, అసలు కూడా అన్నీ ఈ-ఫైలింగ్ లోనే నిక్షిప్తం అయి ఉంటాయి. అలా చేయకపోవడం నేటికీ దస్త్రాలు పట్టుకునే గ్రామస్థాయి నుంచి మండల, జిల్లా స్థాయి వరకూ ప్రజలు అధికారులు, సిబ్బంది చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాల్సి వస్తున్నది. ఒక సారి పెట్టిన సమస్య అర్జీపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే పదే పదే పెట్టే అర్జీల వలక కూడా చిత్తు కార్యాలయాల్లో అత్యధికంగా పేరుకు పోతున్నది. పైగా సచివాలయాల్లో ఈ-ఫైలింగ్ లేకపోవడం వలన సచివాలయాల నుంచి సంబంధిత శాఖకు దస్త్రాన్ని పంపడానికి కూడా రోజుల తరబడి సమయం పడుతున్నది. ఒక్కోసారి దస్త్రం సంబంధిత మండల, జిల్లాశాఖలకు వెళ్లినా సదరు కార్యాలయ సిబ్బంది కూడా ఏదో మూల పడేస్తున్నారు తప్పితే వాటిపై ప్రత్యేక శ్రద్ద చూపించడం లేదు. ఫలితంగా ఇటు సచివాలయంతో పాటు, అక్కడ జిల్లా కార్యాలయంలోనూ దస్త్రాలు పేరుకుపోతున్నాయి. ఒకప్పుడు పంచాయతీలు ఉండే సమయంలో ఈ సమస్య పెద్దగా ఉండేదికాదు. ఇపుడు సచివాలయ వ్యవస్థ  ఏర్పాటైన తరువాత ఉద్యోగులు, పెరగడం ప్రభుత్వశాఖల వారీగా ఉద్యోగులు కూడా పెరగడతో అర్జీల దరఖాస్తు చిత్తు కూడా అదే మొత్తంలో పెరుగుతూ వస్తున్నది. ఈ-ఫైలింగ్ విధానం అమలు చేస్తే ఉపయోగం ఏమిటంటే గ్రామ, వార్డు సచివాలయశాఖలో ఈ-ఫైలింగ్ విధానాన్ని అమలు చేయడం ద్వారా ప్రజల సమస్యల దరఖాస్తుకి ఖచ్చితత్వం వస్తుంది.  గ్రామసచివాల యంలో ని కార్యదర్శి, ఇతర శాఖ సిబ్బంది లాగిన్ల నుంచి మండలంలోని ఎంపీడీఓ ఇతర మండలశాఖల అధికారుల లాగిన్లు, ఆ తరువాత జిల్లా అధికారుల లాగిన్ వరకూ ఒక స్టేజ్ వైజ్ సిస్టమ్ ఏర్పాటవుతుంది. ప్రతీ దరఖాస్తూ క్రమ సంఖ్యతో ప్రభుత్వశాఖల అధికారుల లాగిన్ లో స్పష్టంగా చూపిస్తుంది. తద్వారా సమస్య పరిష్కారానికి ఆస్కారం ఏర్పడటంతోపాటు, ఏ సమస్య పరిష్కారం కాలేదో ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా తెలుస్తుంది. ఎన్ని సమస్యలు, ఎన్ని అర్జీలకు అధికారులు పరిష్కారం చూపించారో కూడా రికార్డెడ్ గా ప్రభుత్వశాఖలు ప్రభుత్వానికి నివేదించడానికి కూడా వీలుపడుతుంది. ఒక్కోసారి అర్జీదారుడు ప్రభుత్వానికి దరఖాస్తు చేసిన సమస్య పరిష్కారానికి నోచుకోనపుడు ఎన్నిసార్లు అదే సమస్యపై అర్జీపెట్టారు.. ఏ ప్రభుత్వశాఖ సదరు సమస్యను పరిష్కరించకుండా వదిలేసింది అనే విషయం కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్లడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఒక్క ఈ-ఫైలింగ్ విధానాన్ని అమలు చేయడం ద్వారా ఇటు ప్రభుత్వశాఖ సిబ్బందికీ, అధికారులకు, ప్రజలకూ ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో మేలు జరగడంతోపాటు గో గ్రీన్ ఆఫీస్ సిస్టమ్ ను అభివృద్ధి చేయడానికి మార్గం సుగమం అవుతుంది.

ఈ-ఫైలింగ్ లేక సిబ్బందికీ తీరని ఇబ్బందులు 
గ్రామ, వార్డు సచివాలయశాఖలో ఈ-ఫైలింగ్ విధానం అమలు చేయకపోవడం వలన ఇటు సిబ్బంది కూడా రాష్ట్రవ్యాప్తంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఆఖరికి ఒక సెలవు తీసుకోవాలన్నా సెలవుచీటీ రాసి సచివాలయంతోపాటు, ఎంపీడీఓ, జిల్లా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలవులు పెట్టినపుడు, తిరిగి రీ జాయిన్ అయినపుడు, సాలరీ బిల్లులు పెట్టించుకునే సమయంలోనూ, తిరిగి దరఖాస్తు ద్వారా విషయాన్ని తెలియజేసే విషయంలో అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. సెలవుల అర్జీలను పోస్టుద్వారా పంపే సమయంలో జిల్లా కార్యాలయాలు, మండల కార్యాలయాల్లో అవి కనిపించకుండా పోవడం, వాటిని అధికారులు పట్టించుకోనట్టు వదిలేయడం తదితర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలా కాకుండా ఈఫైలింగ్ విధానం అమలు చేయడం ద్వారా గ్రామసచివాలయం నుంచి ఐదంచెల విధానంలో సచివాలయం నుంచి జిల్లాశాఖ అధికారుల వరకూ దస్త్రం మొత్తం ఈ-ఫైలింగ్ విధానంలోనే చేరి అనుమతులు మంజూరు చేయడం కూడా సులభంఅవుతుంది. అర్జీ కూడా ఆన్ లైన్లో తేదీతో తహా స్పష్టంగా కనిపిస్తుంది. దానికి అధికారులు ప్రత్యేకంగా కార్యాలయంలోనే ఉండే పనికూడాలేదు. వారి విధినిర్వహణ చేసే సమయంలో ఏదో కొద్ది సమయం కేటాయిస్తే అధికారుల ప్రోటోకాల్ లాగిన్ ప్రకారం ఈ-ఫైలింగ్ పెట్టిన దస్త్రానికి అదే వేదిక ద్వారా అనుమతులు ఇవ్వడానికి మార్గం ఏర్పడుతుంది. తద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో దస్త్రాల చిత్తు పెరిగిపోకుండా వుంటుంది.

సచివాలయశాఖ కార్యదర్శి పునుకుంటేనే అడుగు పడేది
గ్రామ, వార్డు సచివాలయాల్లో పేరుకుపోతున్న చెత్తను నియంత్రించడానికి ఈ శాఖకు చెందిన ప్రత్యేక ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ ఈ-ఫైలింగ్ విధానం అమలు చేసే విషయంలో పూనుకుంటే తప్పా..సచివాలయాల్లో ఈ-ఫైలింగ్ అందుబాటులోకి రాదు. అలాగని సదరుశాఖ ముఖ్యకార్యదర్శి సచివాయాల్లోని ఇబ్బందులపై దృష్టి సారించినదీ లేదు. ఇటు జిల్లా కలెక్టర్లు, సచివాలయశాఖతో అనుసంధానంగా వున్న ఇతర ప్రభుత్వశాఖల కమిషనర్లుగానీ, ఇతర ప్రభుత్వశాఖల ముఖ్యకార్యదర్శిలు కూడా ఈ-ఫైలింగ్ విధానంలో నేటికీ నోరు మెదపడం లేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముందుకి తీసుకెళ్లనూ లేదు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటై మూడేళ్లు దాటిపోతున్నా..నేటికీ ఉద్యోగులకు సంబంధించి విధివిధానాలనే ప్రభుత్వం పూర్తిస్థాయిలో రూపొందించలేదు. ఇక తాము ఎదుర్కొంటున్న సమస్యలు ఏం పట్టించుకుంటారని సచివాలయ సిబ్బంది మీడియా ముందు పెదవి విరుస్తున్నారు. ఏ ప్రభుత్వశాఖలోనైనా ఏ శాఖకు చెందిన ఉద్యోగులు,, సిబ్బంది ఆ ప్రభుత్వశాఖ విధులే నిర్వహిస్తారు. కానీ సచివాలయశాఖలో మాత్రం ప్రభుత్వంలోని అన్నిశాఖల విధులు ఇక్కడి ఉద్యోగులు నిర్వహించాల్సి వుంటుంది. ఆ తీవ్రతను, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొనైనా ప్రభుత్వం ఇక్కడ ఈ-ఫైలింగ్ విధానాన్ని అమలు చేయడం లేదు. ఇప్పటికైనా అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించి గ్రీన్ చానల్ సచివాలయాలుగా మార్చి ప్రజలు సత్వర సేవలు అందించడానికి ఈ-ఫైలింగ్ విధానాన్ని అమలు చేస్తే మరిన్ని ఫలితాలు వస్తాయని సచివాలయ ఉద్యోగులే సూచిస్తున్నారు. చూడాలి ప్రభుత్వం ఈ-ఫైలింగ్ విధానం ఏర్పాటు చేసే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది..!

Tadepalli

2022-12-15 07:16:08

ఈఎన్ఎస్ లైవ్ కథనం చెప్పినట్టుగానే ప్రభుత్వ చర్యలు

భారతదేశపు తొలి తెలుగు జాతీయ వార్త సంస్థ ఈఎన్ఎస్ అధికారిక మొబైల్ న్యూస్ యాప్ Ens Live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net కథనాలు అక్షర సత్యాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే మరోసారి నిరూపించింది. ఎన్నికల విధుల నుంచి ఉపాధ్యాయులను తప్పించిన తరువాత ఆ విధులన్నీ గ్రామ, వార్డు 
సచివాలయ ఉద్యోగులకు అప్పగిస్తుందని.. వారినే ఎన్నికల విధులకు వినియోగించనున్నదని ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా ప్రత్యేక కథనాన్ని ఇటీవలే ప్రచురించింది. నేడు అదే విషయాన్ని నిజంచేస్తూ.. రాష్ట్ర సమాచారశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల క్రిష్ణ అధికారికంగా ప్రకటించారు. 

Tadepalli

2022-12-14 09:43:34

సచివాలయాలకు చట్టబద్దత సరే మరి సర్వీసు రూల్సు..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల విషయంలో ఒక కీలక అడుగు వేసి.. రెండు అడుగులు వెనక్కి వేసింది.. ఈ సచివాలయ వ్యవస్థకుకొత్తగా చట్టం తీసుకొస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. సచివాలయాలు ఏర్పాటై మూడేళ్లు దాటిపోతున్న తరుణంలో ఈవ్యవస్థపై చట్టబద్దత వచ్చినందు కు ఆనందపడాలో..నేటికీ తమ ఉద్యోగాలకు సర్వీసు రూల్స్ పొందు పరచకుండా తాము ఏ కేటగిరీ ఉద్యోగాల కిందకి వస్తామో చెప్పకుండా, ఈ ఉద్యోగాల్లో తమకు ఎలాంటి పదోన్నతులు వస్తాయో వివరించకుండా వదిలేసినందకు బాధపడాలో తెలియని అయోమయ పరిస్థితిలో కొట్టిమిట్టాడుతున్నారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సచివాలయ ఉద్యోగులు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే.. 2019 అక్టోబర్‌ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. అప్పట్లో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ నూతన వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చారు. గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికే అమలులో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం, ఆంధ్రప్రదేశ్‌ మునిసిపాలిటీ, మునిసిపల్‌ కార్పొరేషన్‌ చట్టం తరహాలోనే సచివాలయ వ్యవస్థకు కూడా చట్ట రూపం వచ్చింది. రాజ్యాంగంలోని 11, 12 షెడ్యూళ్లలో పేర్కొన్న ప్రకారం ప్రజల కేంద్రంగా ప్రభుత్వ సేవలు, ఇతర సదుపాయాలను అందించేందుకు చట్టం ద్వారా గ్రామ/వార్డు సచివాల­యాల పేరుతో వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నట్టు ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు.  

చట్టంతో పూర్తిస్థాయి పటిష్టత.. ఏదీ సక్రమంగా జరగలేదు
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ప్రభుత్వం చేసిన ఆర్డినెన్సుతో చట్టబద్దత వచ్చినప్పటికీ.. సచివాలయ ఉద్యోగుల విషయంలో ఏదీ సక్రమంగా జరగలేదు. వీరి సర్వీసులను రెండేళ్లలో క్రమబద్దీకరించాల్సి ఉండగా అదనంగా 9నెలలు పనిచేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఉద్యోగులు ఒక డీఏతోపాటు, పూర్తిస్థాయి పేస్కేలు కోల్పోయారు. పోనీ ఎట్టకేలకు ఉద్యోగాలు రెగ్యులర్ చేశారనుకుంటే.. నేటి వరకూ సచివాలయాల్లో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల సర్వీసు రూల్సు, పదోన్నతుల విషయంలో ప్రభుత్వం నేటికీ క్లారిటీ ఇవ్వలేదు. ఏఎన్ఎంలకు ఇన్ సర్వీసు స్టాఫ్ నర్స్ శిక్షణ ఇప్పిస్తున్నప్పటికీ..మిగిలిన శాఖల విషయంలో మాత్రం ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేయలేదు.  రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు ఏ కేటగిరీలోకి వస్తారో ఆర్డినెన్సుకి ముందే ప్రభుత్వం ప్రకటించి ఉంటే బావుండేదనే వాదన బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం సచివాలయాల్లతో 545 రకాల సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చినా కొన్ని సేవలను మాత్రమే అమలు చేస్తున్నారు.. అన్ని సేవలు అమలు చేస్తే ప్రభుత్వానికి ఆదాయంతోపాటు, ప్రభుత్వ లక్ష్యం కూడా నెరవేరేది. కానీ అలా జరగడం లేదు.

ప్రతిపక్షాల తప్పుడు ప్రచారానికి చట్టబద్దతో చెక్
గ్రామ, వార్డు సచివాలయాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఉంటాయి..ఆ తరువాత ఉద్యోగాలను ఆ వచ్చే ప్రభుత్వం తీసేస్తుందని ప్రతిపక్షాలు పనిగట్టుకొని చేసే ప్రచారానికి ప్రభుత్వం సోమవారం జారీ చేసిన ఆర్డినెన్సుతో తెరపడినట్టు అయ్యింది. రాష్ట్రంలో ప్రస్తుతం అమలులో ఉన్న పంచాయతీ­రాజ్, మునిసిపల్‌ చట్టాలకు అదనంగా గ్రామ/­వార్డు సచివాలయ వ్యవస్థ చట్టం ఉంటుందని ఆర్డినెన్స్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఈ ఆర్డినెన్స్‌తో గ్రామ/­వార్డు సచివాలయాల ద్వారా అందజేసే ప్రభుత్వ సేవలు, గ్రామ/వార్డు సచివాలయ శాఖ ద్వారా జారీ చేసే ఉత్తర్వులు శాసనాధికారంతో కూడినవిగా ఉండనున్నాయి. ఈ చట్టం శాసనసభ, శాసన మండలిలో ఆమోదం పొందిన తరువాత ఉద్యోగుల సర్వీసు నిబంధనలు, పదోన్నతుల విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. అపుడు గానీ సచివాలయ ఉద్యోగులు ఏ కేటగిరీ ఉద్యోగులో తేలే అవకాశం లేదు. కాకపోతే భారతదేశం మొత్తం తొంగి చూసే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మంచి ప్రశంసలు అందుతున్నప్పటికీ మూడేళ్లు దాటినా ఒక విధి విధానంలో ఈ శాఖను అమలు చేయని విషయంపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఒక కొత్త వ్యవస్థ ఏర్పాటైన మూడేళ్ల తరువాత చట్టబద్దత తీసుకొచ్చే విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక అడుగు వేసిందనే చెప్పాలి..!

Tadepalli

2022-12-13 02:05:52

పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమిత పెంచండి

ఏపీ పోలీస్ కానిస్టేబుల్ జనరల్ అభ్యర్థుల వయోపరిమితి 29 సంవత్సరాలకు, ఎస్ఐ కి 32 సంవత్సరాలకు వయస్సు పెంచాలని ప్రభుత్వాన్ని సీబీఐ మాజీ జెడి వి.వి.లక్ష్మీనారాయాణ కోరారు. శుక్రవారం 
డాబాగార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పలు జిల్లాలు పర్యటిస్తున్నప్పుడు SI/కానిస్టేబుల్,  పోటీ పరీక్షలకు సన్నదమవుతున్న యువత కొంతమంది ఆర్థిక పరిస్థితులు బాగోలేక కోచింగ్ తీసుకోలేకపోతున్నామని..దానికి కోసం సహాయం చేయమని అడిగారని, వారి అభ్యర్ధన మేరకు ఐఏసిఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఉచితంగా శిక్షణ ఇచ్చి  సహకరిస్తామని ముందుకు వచ్చారని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత కోసం జేడీ ఫౌండేషన్, సదరు కోచింగ్ సెంటరుతో కలిసి సంపూర్ణ కోచింగ్ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 45 వేల వరకు అభ్యర్ధులు నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. అందులో 1000 మందిని మెరిట్ లో ఎంపికచేసి వారికి ఉచితంగా రాత పరీక్ష, గ్రౌండ్ ఈవెంట్స్, మెయిన్స్ వరకు పూర్తి కోచింగ్ online మరియు offline లో సేవలు అందిస్తామని చెప్పారు, ఆదివారం ఉదయం 9.30 నుండి 12.30 వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో 38 పరీక్ష కేంద్రాలలో రాత పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. కాగా డిసెంబర్ 10 వరకు అభ్యర్ధులు పేర్లు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. ఆశక్తి కలిగిన వారు 7093651037 వాట్సాప్ నెంబర్ కి HI అని సందేశం పంపిస్తే, పూర్తి వివరాలు పంపిస్తాం అని వినయ్ కుమార్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ కన్వీనర్ ప్రియాంక దండి, కోఆర్డినేటర్ జగన్ మురారి,బుద్దాల కృష్ణ మోహన్ మురారి, ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సమయం హేమంత్  కుమార్, కోచింసెంటర్ ఇంచార్జ్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-12-09 11:03:44

గ్రామ, వార్డు సచివాలయాలకు ఆత్మహత్యల గ్రహణం

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయాలకు ఆత్మహత్యల గ్రహణం పట్టుకున్నట్టుంది. ఒకే ఏడాదిలో ముగ్గురు సచివాలయ ఉద్యోగులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అందులో ఇద్దరు ఉద్యోగుల విశాఖపట్నంలో ఆత్మహత్యచేసుకోగా..మరో సచివాలయ ఉద్యోగి తూర్పుగోదావరి జిల్లాలో ఆత్మహత్యచేసుకున్నాడు. ఈ మూడు ఆత్మహత్యలకు విధి నిర్వహణలోని పని ఒత్తిడే కారణంగా చెబుతున్నారు. ఆశలు నెరవేరి ప్రభుత్వం ఉద్యోగం వచ్చిందనే ఆనందం ఉన్న రోజులు కూడా నిండకుండానే మధ్యలోనే తనువు చాలిస్తున్నారు. అధికారుల వేధింపులు ఓ ప్రక్క.. పని ఒత్తిడి మరోప్రక్క వెరసీ గ్రామ, వార్డు సచివాలయశాఖలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. ఆత్మహత్యలు చేసుకునే సమయంలో తమ ఛావుకి పని ఒత్తిడే కారణమని సూసైడ్ నోట్ లో రాసి మరీ చనిపోతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అధికారుల పర్యవేక్షణ లోపం, పని ఒత్తిడి, చదివిన చదువుకి అటు అటెండరు, ఇటు జూనియర్ అసిస్టెంట్ కాని క్యాడర్, అన్ని ప్రభుత్వశాఖల్లో కెల్లా అతి తక్కువ జీతం.. ఇతర ప్రభుత్వ ఉద్యోగులకంటే అత్యధిక పనిభారం ఈ ఆత్మహత్యలకు కారణం అవుతూ, కన్నవారికి కన్నీరుని 
మిగులుస్తున్నాయి.

ఫ్యాషనైన పదం..నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తా..
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను అధికారులు ఏ స్థాయిలో బెదిరిస్తున్నారంటే నిన్ను ఉద్యోగంలో నుంచి తీసిపారేస్తా(ఒక ప్రభుత్వ ఉద్యోగిని విధుల్లో నుంచి  తీసేసే హక్క ఆ ప్రభుత్వానికి కూడా ఉండదు, తప్పిదారి దేశ ద్రోహం చేస్తే తప్పా.. ఆ విషయం తెలిసీ కూడా మండల, జిల్లా అధికారులు ఈ విధమైన బెదిరింపులు 
ఎలా చేస్తున్నారో వారికే తెలియాలి).. ఈ నెల నువ్వు జీతాలు ఎలా అందుకుంటావో చూస్తాను.. ఇక నుంచి ఉద్యోగాలు ఎలా చేస్తారో అదీ చూద్దాం.. నాకేం  సంబంధం లేదు.. సచివాలయంలో నేనున్నా సెలవు కావాలంటే ఎంపీడీఓని అడగండి.. లేదంటే మీ మండల, జిల్లా అధికారి నుంచి అనుమతి పత్రం, డ్యూటీ 
సర్టిఫికేట్, సెలవు చీటీలు తీసుకురండి(వాళ్ల దగ్గర నుంచి, వీళ్ల దగ్గర నుంచి అనుమతి తీసుకొస్తే సచివాలయంలో ఉన్న కార్యదర్శి ఎందుకో జిల్లా అధికారులకే  తెలియాలి).. అంటూ ఫ్యాషన్ గా బెదిరించడం అలవాటు చేసుకున్నారు. పంచాయతీలోని కార్యదర్శి దగ్గర నుంచి మండల కేంద్రంలో ఎంపీడీఓ, జిల్లాశాఖల 
వరకూ ఇదే వరస. ఎక్కడ చూసినా సచివాలయ ఉద్యోగులను బెదిరించడానికే వీరికి సమయం సరిపోవడం లేదు. ప్రైవేటు ఉద్యోగం కంటే దారుణంగా టార్గెట్లు విధించడం సచివాలయశాఖలో షరా మామూలు అయిపోయింది. ఇచ్చిన టార్గెట్ పూర్తిచేయకపోతే మెమోలు ఇవ్వడం, సమావేశంలో అందరి ముందు నిలబెట్టి  తిట్టడం, మీపై జిల్లా అధికారులకు రిపోర్టు చేస్తానని చెప్పడం ఇలా మండల అధికారులకు ఏ విధంగా తోస్తే ఆవిధంగా చేస్తూ సచివాలయ ఉద్యోగులపై తీవ్ పని ఒత్తిడి తీసుకు వస్తున్నారు. ఆఖరికి ఉద్యోగి సెలవుపై వెళ్లినా ఆ సమయంలో కూడా తీవ్ర స్థాయిలో స్కూలు, కాలేజి విద్యార్ధులను బెదిరించినట్టు ఒత్తిడితో కూడిన బెదిరింపులకు దిగుతున్నారు మండల, జిల్లా అధికారులు. 

ఇంటి పెద్దను కోల్పుతున్న కుటుంబాలు
బలవంతంగా సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడటం వలన ఆ కుటుంబాన్ని అంతటినీ పోషించే పెద్దదిక్కును కోల్పోతున్నారు. ఎంతో కొంత జీతం వచ్చి నాలుగు వేళ్లు నోట్లోకి వెళతాయనుకుంటున్న తరుణంలో సచివాలయ ఉద్యోగులు యుక్త వయస్సులో ఆత్మహత్యలకు పాల్పడటం రాష్ట్రస్థాయిలో 
చర్చనీయాంశం అవుతున్నది. తమ పుత్రుడికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది, తమ కష్టాలు తీరుతాయనుకునే లోపే సదరు ఉద్యోగులు పని ఒత్తిడి, అధికారుల  బెదిరింపుల నేపథ్యంలో మధ్యలోనే తనువు చాలిస్తున్నారు. దీనితో తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలుతోంది. దానికితోడు ప్రస్తుతం సచివాలయ ఉద్యోగాలు 
చేస్తున్నావారిలో 70శాతానికి పైగా నిరుపేద కుటుంబం నేపథ్యం నుంచి వచ్చినవారే కావడంతో ఆ కుటుంబాలు చెట్టంత కొడుకుని కోల్పోయి మళ్లీ రోడ్డున పడిపోతున్నారు. మరీ ముఖ్యంగా ఉద్యోగం వచ్చిందనే దైర్యంతో పెళ్లిళ్లు చేసుకొని మధ్యలోనే ఆత్మహత్యలకు పాల్పడి ఇటు కట్టుకున్న భార్యకి, అటు కన్నవారికీ దూరమైపోతున్నారు. కేవలం అధికారులు ప్రభుత్వం అప్పగించిన పనిని పూర్తిచేయాలనే నెపంతో ఉద్యోగులపై తీవ్రమైన పనిఒత్తిడికి గురిచేస్తూ.. బెదిరింపులతో ఉద్యోగులు ఆత్మహత్యులు చేసుకోవడానికి కారణం అవుతున్నారు.

పేరుకే ఒక శాఖ ఉద్యోగం..అన్నీశాఖల పనులూ చేయాలి..
‘‘ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదు’’ అన్నట్టు తయారైంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విధినిర్వహణ. సాధారణంగా ఏ ప్రభుత్వ శాఖలో అయినా సదరు ప్రభుత్వ శాఖకి చెందిన పనులు మాత్రమే చేయాల్సి వుంటుంది. కానీ గ్రామ, వార్డు సచివాలయశాఖలో వారి మాతృశాఖతో పాటు అన్నిశాఖల ప్రభుత్వ 
ఉద్యోగాలను, విధులను చేయాల్సి వస్తుంది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ గానీ, జిల్లాశాఖల అధికారులు గానీ నోరు మెదపకపోవడంతో అన్నశాఖల మండల అధికారుల పని ఒత్తిడి సచివాలయ ఉద్యోగులపై పడుతున్నది. సమయానికి వచ్చి బయో మెట్రిక్ వేయకపోతే జీతాల్లో కోత విధించాలని సిఫార్సు చేస్తున్న మండల అధికారులు, అదే ఉద్యోగులు రాత్రి 8 గంటల వరకూ విధులు నిర్వహించినపుడు మాత్రం అదనంగా చేసిన పనిగంటలను, అదనపు బాధ్యతల విషయాన్ని జిల్లా అధికారుల వద్ద కనీసం నోరువిప్పి చెప్పడంలేదు. పైగా సచివాలయ ఉద్యోగులు పడిన కష్టం, చేసిన పనంతా తామే చేసేసినట్టు జిల్లా అధికారులు వద్ద ఇచ్చే 
కలరింగ్ కి సినిమా సీన్లను మించిపోతున్నది. ఈ తరుణంలో కనీసం ప్రభుత్వం అయినా అసలు సచివాలయ ఉద్యోగులు తక్కువ సమయంలో ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే విషయాన్ని గుర్తించడంలేదు.

సచివాలయ ఉద్యోగం వదిలి వేరే ఉద్యోగాలకు
జీవితంలో స్థిరపడిపోవచ్చునని ఎన్నో ఆశలతో గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగాలల్లోకి వచ్చిన వారంతా ఇపుడు వేరే ఉద్యోగాలవైపు చూస్తున్నారు. మరికొందరు వేరేశాఖలో ఉద్యోగం వస్తే దీనిని వదిలి వెళ్లిపోతుండగా, మరికొందరు ఉద్యోగాలను శాస్వతంగా వదిలి వెళ్లి పోతున్నారు. గత మూడేళ్లలో 
సచివాలయం ఉద్యోగం వచ్చి వేరే ఉద్యోగాలకు వెళ్లిపోయినవారు, వేరే ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాలు వచ్చి వెళ్లిపోయిన వారి సంఖ్య రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1500కి పైగానే ఉంటుంది. బ్యాంకు ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు, ఇదే శాఖలో గ్రేడ్4 కార్యదర్శిలు, ఇలా పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగాల్లోకి వెళ్లిపోతున్నారు. 
ప్రస్తుతం అన్ని ప్రభుత్వశాఖ ఉద్యోగాలతో పోల్చుకుంటే ఒక్క సచివాలయశాఖలోని ఉద్యోగులకే అత్యంత తక్కువ జీతాలు ఉండటం, పని ఒత్తిడి ఇతర ప్రభుత్వశాఖల కంటే అత్యధికంగాఉండటమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖలో జరుగుతున్న వరుస 
ఆత్మహత్యలపై విచారణ కమిటీ వేయకపోతే ఈ మరణమృదంగం కొనసాగే అవకాశాలే చాలా అధికంగా కనిపిస్తున్నాయి..!

Tadepalli

2022-12-09 10:23:00

సీఎం వైఎస్.జగన్ క్లాస్ తో ఆ 40% మందికీ సీట్లు డౌటే..!

వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లూ గెలవాలి..  మీరేం చేస్తారో నాకు తెలియదు.. ప్రభుత్వ పరంగా ఇచ్చి హామీలన్నీ నెరవేర్చాం.. వచ్చే మన ప్రభుత్వంలో మరిన్ని సంక్షేమ పథకాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం.. ఇక ప్రజలకు చేరువయ్యే బాధ్యత మీదే. ప్రజల్లో ఉన్నవారినే అంతా ఆదరిస్తారు.. గడప గడపకి ప్రభుత్వం  కార్యక్రమం పెట్టింది కూడా అందుకే.. ఈసారి గెలుపు అవకాశం లేనివారికి సీటు ఇచ్చేదిలేదు అంటూ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలకు తెగేసి చెప్పారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్చార్జులు, సమన్వయకర్తలతో సమీక్షించిన జగన్ ఖారాఖండీగా విషయాన్ని కుండ బద్దలు గొట్టారట. జగన్ ఇచ్చిన క్లాసు ఆధారంగా ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 40శాతానికి పైగానే అభ్యర్దులకు సీట్లు కోల్పేయే ప్రమాదం ఉన్నట్టుగా సూచాయగా చెప్పటినట్టు తెలిసింది. దీనితో ఎవరికి సీటు వస్తుందో ఎవరికి రాదో అనే అనుమానాలు అపుడే పార్టీలో వ్యక్తమవుతున్నాయి. అందులోనూ రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాలకు కొత్తగా నియమించిన ఇన్చార్జిలు కూడా తమ రిపోర్టులను నిష్పక్షపాతం ఇవ్వలేనట్టు తెలిసింది. మరికొంత మంది సమన్వకర్తలు ఉన్నది ఉన్నట్టుగా రిపోర్టులు నియోజవర్గంలోని పరిస్థితిని సీఎం జగన్ ముందు ఉంచడంతో అధినేత ఈ వ్యాఖ్యలు చేసినట్టు చెబుతున్నారు.

ప్రజల్లో పట్టు లేకపోతే సీటు ఇచ్చినా వృధా..
గత ఎన్నికల్లో సమయంలో ప్రజలకు ప్రభుత్వం ఇచ్చినహామీలన్నీ అమలు చేశాం. అయినా కొందరు ఎమ్మెల్యేలు ప్రజలకు దగ్గరకాలేకపోవడం దారుణం. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా వుందో ఎప్పటికప్పుడు సమాచారం మొత్తం అంతా నాకు అందుతుందని నియోజకవర్గ ఇన్చార్జిలకు చెప్పారట జగన్. ప్రస్తుత  నియోజవకర్గాల్లో కో-ఆర్డినేటర్ల పరిస్థితి బాలేకపోవడంతోనే కొత్తవారిని నియమించాం. అయినా మార్పురాలేదని కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టుగా  చెబుతున్నారు. ఇలా అయితే ప్రజల్లో పట్టు కోల్పోతే సీటు ఇచ్చినా వృధా అయిపోతుంది. తీరుమార్చుకొని ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ప్రజల్లోనే ఉండాలి. వచ్చే  ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం చెప్పినట్టుగా 175కి 175 రావాల్సిందేనని దానికోసం మీరు ఏం చేస్తారో..ప్రజలను ఏ విధంగా మచ్చిక  చేసుకుంటారో తెలియదని తేల్చిచెప్పారట. అన్ని విషయాల్లోనూ  ప్రజలకు చేరువగా ఉంటేనే నెగిటివ్ ప్రచారాలకు ఆస్కారం వుండదని.. అదే సమయంలో ప్రభుత్వంపై వచ్చే అసత్య ప్రచారాలను తప్పికొట్టాలని కాస్త గట్టిగానే చెప్పినట్టు సమాచారం.

సీట్లన్నీ తెచ్చేపూచీ మాది భరోసా ఇచ్చిన ఇన్చార్జిలు
రాష్ట్రంలోని 175కి 175 స్థానాలు గెలిపించి తీసుకు వచ్చే బాధ్యత తమదని అన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలు సీఎం వైఎస్. జగన్మోహనరెడ్డికి భరోసా ఇచ్చారట. తమపై పెట్టిన నమ్మకాన్ని సీట్లు గెలిపించి బహుమతిగా తీసుకు వస్తామని నియోజకర్గాలకు ఇన్చార్జిలుగా నియమింప బడ్డవారంతా ముక్త కంఠంతో చెప్పినట్టు తెలిసింది. నియోజకవర్గాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. అక్కడ ఏమేం కావాలో, ఎలాంటి అభివ్రుద్ధి పనులు చేయాలో, ఏ సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత ఉంది.. ఎవరి నుంచి మంచి ప్రోత్సాహం వుంది తదితర అంశాలన్నింటిపైనా దృష్టిపెట్టి నియోజకవర్గాలన్నింటిని మనవైపు తిప్పుకోవాలని జగన్  ఇన్చార్జిలకు సూచించారట. నియోజకవర్గాల్లో అన్నివర్గాల ప్రజలతో సమావేశాలు ఏర్పాటుచేసి అక్కడ సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు చొరవ చూపాలని, ముఖ్యంగా గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో సమస్యలు స్వీకరించి పరిష్కరిస్తే ప్రజల్లో మనపై నమ్మకం పెరుగుతుందని సీఎం ఇన్చార్జిలకు క్లాస్ ఇచ్చినట్టు చెబుతున్నారు. కాగా కొత్తగా ఇన్చార్జిలు నియమించిన వారిలో కొన్ని నియోజకవర్గాల్లో వారు వాస్తవ పరిస్థితిని నివేదికల రూపంలో ఇవ్వడం పట్ల జగన్ సంతృప్తి వ్యక్తం చేశారట.

ఎమ్మెల్యేలతో సమావేశం నాటికి పక్కా రిపోర్టులు అందాలి
త్వరలో ఎమ్మెల్యేలతో మరోసారి సమీక్ష నిర్వహిస్తాం ఆ నాటికి 175 నియోజకవర్గాల్లోని వాస్తవ పరిస్థితిని నా ముందుంచాలి అపుడు ఎవరెవరకి సీటు వచ్చేది.. ఎవరికి సీటు నిరాకరించేంది తేల్చి చెప్పేస్తా అని సీఎం తెగేసి చెప్పారట. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాం. ఇంటి ముంగిటే గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నాం. అయినా కొంతమంది ఎమ్మెల్యేల్లో ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందంటే వారు ప్రజల్లో లేరని..వారికి ప్రజాభిమానం లేదని అర్ధమవుతుంది. అలాంటి వారి వలన పార్టీకి ప్రభుత్వానికి నష్టం రాకూడదు. ఈ విషయంలో ఇన్చార్జిలు చాలా ఖచ్చితత్వంగా వ్యవహరించాలని ఇన్చార్జిలతో ప్రత్యేకంగా మాట్లాడిన క్రమంలో జగన్ సూచించారట. సిట్టింగ్ ఎమ్మెల్యే విషయంలో అక్కడి ప్రజల నుంచి వస్తున్న స్పందన అక్కడ ప్రజల నుంచి ఎలాంటి మద్దతు ఉందనే విషయం తెలిస్తేనే మనం దైర్యంగా ముందుకి వెళ్లడానికి ఆస్కారం వుంటుందని..ఆ విషయాలను కనుక్కోవడానికే మిమ్మల్ని అక్కడ నియమించామనే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరిచిపోవద్దని చెప్పారట. మీతోపాటు ఎమ్మెల్యేలకు సమావేశం నిర్వహిస్తాం. అప్పటికి అంతా ప్రజాభిమానంతో, వారి పట్ల నూశాతం నమ్మకంతో రావాలి..లేదంటే నా పనినేను చేస్తానని చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కాగా ఇన్చార్జిలతో ఏర్పాటు  చేసిన సమావేశంలో ఒక బలమైన సందేశాన్ని సీఎం జగన్ పంపినట్టు చెబుతున్నారు. దీనిని బట్టి ఈరోజు నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యే తీరులో మార్పు కనిపించే అవకాశం వుంది.. చూడాలి రాజకీయ ముఖ చిత్రం ఆ 40% మందిలో ఎలాంటి మార్పు తీసుకు వస్తుందనేది..!

Tadepalli

2022-12-09 02:44:27