ఉత్తరాంధ్రా ప్రజల ఇలవేలుపు శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాల రాట ముహూర్తం విశాఖలోని ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ఈఓ జె.మాధవి, ఏఈఓ వి.రాంబబులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ.. కోవిడ్ నిబంధనలను ద్రుష్టిలో ఉంచుకొని అమ్మవారి మార్గశిర మాసోత్సవాలను నిర్వహించాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శానిటైజర్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కారోనా వైరస్ సూచనలు భక్తులకు తెలియజేస్తూ, అమ్మవారి దర్శనాలు కల్పించాలన్నారు. ఈఓ మాధవి మాట్లాడుతూ, అమ్మవారి రాట కార్యక్రమం సందర్భంగా స్థానిక మహిళలకు తీర్ధ ప్రసాదాలతోపాటు జాకెట్టు ముక్కలు, తాంబూలం పంపిణీచేసినట్టు వివరించారు. అంతేకాకుండా అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు వైభంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో త్రిమూర్తులు, శ్రీనివాస్, రాంబాబు, రామారావు, రాజు తదితరులు పాల్గొన్నారు.
తిరుమలలో జరిగే అత్యంత ప్రముఖమైన ఉత్సవాలలో ఒక్కటైన చక్రతీర్థ ముక్కోటి నవంబరు 26న గురువారం జరుగనుంది. పౌరాణిక నేపథ్యంలో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వెలసివున్న శేషగిరులమీద దక్షిణభాగంలో మహా పవిత్రతీర్థమైన చక్రతీర్థం ఉంది. ప్రతి ఏడాదీ కార్తీక మాసం శుద్ధద్వాదశినాడు ఈ చక్రతీర్థ ముక్కోటి తిరుమలలో జరుగుతుంది. ఆరోజున ఉదయం 9 గంటలకు స్వామివారు అర్చకులు, పరిచారకులు మంగళవాయిద్యాలతో స్వామివారు ఆలయం నుండి ప్రదక్షిణంగా చక్రతీర్థానికి వెళతారు. చక్రతీర్థంలో వెలసివున్న శ్రీ చక్రత్తాళ్వారువారికి, శ్రీ నరసింహస్వామివారికి, శ్రీ ఆంజనేయస్వామివారికి అభిషేకం, పుష్పాలంకారం, పూజలు చేస్తారు. అనంతరం హారతి నివేదించి తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. స్కంద పురాణం ప్రకారం పద్మనాభ మహర్షి చక్రతీర్థంలో 12 సంవత్సరాలు తపస్సు చేశారు. అందుకు సంతసించి శంఖచక్రగధాభూషితుడైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై కల్పాంతం వరకు తనకు పూజలు చేయాలని చెప్పి అంతర్థానమయ్యారు. స్వామి ఆజ్ఞానుసారం పద్మనాభ మహర్షి చక్రతీర్థంలో తపస్సు చేశారు. అయితే ఒకనాడు ఓ రాక్షసుడు అతనిని భక్షించడానికి రాగా మహర్షి తిరిగి స్వామివారిని ప్రార్థించారు. అప్పుడు స్వామి తన చక్రాయుధాన్ని పంపి ఆ రాక్షసుని సంహరించారు. ఆ సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉంచి భక్తులకు రక్షణ కల్పించాల్సిందిగా స్వామివారిని మహర్షి కోరారు. భక్తవల్లభుడైన స్వామివారు తన సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండేలా ఆజ్ఞాపించడంతో ఈ తీర్థం చక్రతీర్థంగా ప్రసిద్ధిగాంచింది. వరాహ పురాణ నేపథ్యంలో తిరుమలలోని శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల తీర్థాలలో అత్యంత ముఖ్యమైనవిగా ఉన్న సప్త తీర్థాలలో చక్ర తీర్థం ప్రముఖ తీర్థంగా వెలుగొందుతోంది.
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని, తిరుమల శ్రీవారిని దర్షించికుని మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు చెన్నై తిరుగు ప్రయాణం సందర్భంగా రేణిగుంట విమానాశ్రయం లో భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ వారికి సాదర వీడ్కోలు లభించింది. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, జిల్లా ఇంచార్జీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, పుట్టపర్తి శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్త, అడిషనల్ డిజిపిలు చంద్రశేఖర్ ఆజాద్, హరీష్ కుమార్, జెసి మార్కండేయులు, తిరుపతి ఆర్బన్ ఎస్.పి.రమేష్ రెడ్డి, , అడిషనల్ ఎస్.పి. సుప్రజ జెసి (సంక్షేమం) రాజశేఖర్ , డిఆర్ఓ మురళి, ఆర్డీఓ కనక నరసా రెడ్డి , ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ ఎస్. సురేష్, సివిఎస్ ఓ రాజశేఖర్ రెడ్డి, డిప్యూటీ కమాండెంట్ సిఐఎస్ ఎఫ్ శుక్ల రేణిగుంట తహసీల్దార్ శివప్రసాద్ వీడ్కోలు తెలిపిన వారిలో వున్నారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ ప్రత్యేక విమానంలో రా.6.50 గంటలకు గన్నవరం బయలుదేరగా సాదర వీడ్కోలు లభించింది..
బంగాళాఖాతంలో ఏర్పాడిన ‘నివార్’ సైక్లోన్తో ప్రభుత్వం అప్రమత్తమైంది. నివార్ తుపాన్పై జిల్లాకలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను నేరుగా ఏపీని తాకకపోయినా, సమీప ప్రాంతంలో దాని ప్రభావం ఉంటుందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలిని సూచించారు. ఈ తుపాను ప్రభావం బుధ వారం నుంచి గురువారం వరకు ఉంటుందని, సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. ‘నెల్లూరు, చిత్తూరు, కడపలోని కొన్ని ప్రాంతాలు, ప్రకాశం జిల్లాలో తీర ప్రాంతం, కర్నూలు, అనంతపురం జిల్లాలపై 11-20 సెంటీమీటర్ల మేర వర్షాలు కురిసే అవకాశం ఉంది. 65 నుంచి 75 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. పంటలు దెబ్బతినకుండా వాటి రక్షణకోసం చర్యలు తీసుకోవాలి. ఆర్బీకేల ద్వారా రైతులకు సూచనలు పంపాలి. కోతకోసిన పంటలను రక్షించేందుకునే విధంగా వారికి అవగాహన కల్పించాలి. ఒకవేళ ఇంకా పొలంలోనే పంటలు ఉంటే... వాటిని కోయకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాని ఆదేశించారు. అక్టోబరు వరకూ పడ్డ వర్షాలతో చెరువులు, రిజర్వాయర్లు అన్నీ నిండి ఉన్న నేపథ్యంలో మళ్లీ భారీ వర్షాలు పడితే... చెరువులు గండ్లు పడే అవకాశాలు ఉంటాయి. ఈ గండ్లు పడకుండా నిరంతరం మానిటరింగ్ చేసి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. కోస్తా ప్రాంతంలో ప్రాణ నష్టం లేకుండా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా చూసుకోండి. గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారికి దశ, దిశ చూపండి. వీరి సేవలను పెద్ద స్థాయిలో వినియోగించుకోండి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంచేసుకోండి. అలాగే కరెంటు సరఫరాకు ఇబ్బందులు వచ్చిన సమక్షంలో వెంటనే పునరుద్ధరణకు కరెంటు స్తంభాలను సిద్ధంచేసుకోండి.ప్రతిజిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసుకోండి. మండల కేంద్రాల్లో కూడా కంట్రోల్రూమ్స్ఉండాలి.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని మంగళవారం మధ్యాహ్నం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వీరితోపాటు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా ఉన్నారు. రాష్ట్రపతి మంగళవారం మధ్యాహ్నం తిరుమల శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం నుంచి బయలుదేరి క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా శ్రీ వరాహస్వామివారి దర్శనం చేసుకున్నారు. అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి అహ్వానం పలికారు. అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకస్వాములు వారికి స్వామివారి శేషవస్త్రం అందజేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఛైర్మన్, ఈవో కలిసి శ్రీవారి తీర్థప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని, 2021 క్యాలెండర్, డైరీని రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా, డిఐజి క్రాంతిరాణా టాటా, టిటిడి సివిఎస్వో గోపీనాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్పి రమేష్రెడ్డి, డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని మంగళవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. రాష్ట్రపతి వెంట రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉన్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న రాష్ట్రపతి దంపతులకు టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, జెఈవో పి.బసంత్కుమార్, ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు, అర్చక బృందంతో కలిసి ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వస్త్రం, తీర్థప్రసాదాలను వారికి ఛైర్మన్ అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్తా, ఇంటెలిజెన్స్ ఐజి శశిధర్ రెడ్డి, టిటిడి సివిఎస్వో గోపినాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్రెడ్డి, అదనపు సివిఎస్వో శివకుమార్ రెడ్డి, విజివో మనోహర్, డెప్యూటీ ఈవో ఝాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన కడపజిల్లాలోని గండికోట ప్రాంతం. ఇక్కడ కోట, పెన్నానదీ ప్రవాహక ప్రాంతం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈప్రాంతాన్ని సందర్శించిన వారంతా ఏదో విదేశాల్లోని కౌ బాయ్ సినిమాను చూసినట్టుగా అనుభూతి పొందుతారు. గండికోట కూడా చూడ ముచ్చటగా వుంటుంది. అదే సమయంలో పెన్నా నదీ ప్రాంతం నుంచి చూస్తున్న ప్రాంతంలో కొండలు కూడా చాలా చక్కగా కనిపిస్తాయి. గండికోటను గ్రాండ్ కెన్యన్ గా అభివర్ణిస్తారంటే ఇక్కడి పర్యాటక అందాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. పెన్నా నదీ ప్రవాహం ఇక్కడి కొండల మధ్య లోతైన గండిని ఏర్పరచడం వల్ల ఈ కోటకు గండికోట అని పేరు వచ్చింది. రెండు మూడు వందల అడుగుల ఎత్తున నిటారుగా ఉండే ఇసుకరాతి కొండల గుండా ఈ ప్రవాహం చూడటానికే చాలా అందంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లోని చూడాల్సిన ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో గంటి కోట ఒకటి.
భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కి రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని, తిరుమల శ్రీవారిని దర్శనానికి వచ్చిన గవర్నర్ కు మంగళవారం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర పతి భిశ్వభూషణ్ హరిచందన్ లుస్వాగతం పలికారు. వీరితోపాటు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, జిల్లా ఇంచార్జీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఎపిఐఐసి ఛైర్మన్ రోజా, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి, పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి, రెడ్డెప్ప, పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి , ఎం.ఎల్.సి. యండపల్లి శ్రీనివాసులురెడ్డి, శాసన సభ్యులు ఆదిమూలం, బియ్యపు మధుసూధన రెడ్డి, భూమన కరుణాకర రెడ్డి, చింతల రామచంద్రా రెడ్డి, నవాజ్ బాషా , వెంకటే గౌడ, పెద్దిరెడ్డి ద్వారకానాధ రెడ్డి, జంగాలపల్లి నివాసులు, బాబు , డిసీసీబీ చైర్మన్ రెడ్డెమ్మ, జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్త,టిటిడి ఇఓ జవహర్ రెడ్డి, జెసి మార్కండేయులు, నగరపాలక కమిషనర్ గిరీషా, ఐజి శశిధర్ రెడ్డి, డిఐజి కాంతిరణా టాటా, తిరుపతి ఆర్బన్ ఎస్.పి.రమేష్ రెడ్డి, సివి అండ్ ఎస్ ఓ గోపినాధ్ జెట్టి,ఎయిర్ పోర్టు డైరెక్టర్ సురేష్, డిప్యూటీ కమాండెంట్ శుక్లా, చిత్తూరు ఎస్.పి.సెంధిల్ కుమార్ , జెసి (సంక్షేమం) రాజశేఖర్ , డిఆర్ఓ మురళి, ఆర్డీఓ కనక నరసా రెడ్డి, స్వాగతం పలుకగా విమానాశ్రయంలో ఏర్పాట్లను పర్యవేక్షించిన తహశీల్దార్లు శివప్రసాద్ , ఉదయ్ సంతోష్, డిఎస్ పి లు గంగయ్య, చంద్రశేఖర్ లు పర్యటనలో వి వి పి ల లైజన అధికారులు తుడ సెక్రటరీ లక్ష్మి, సెట్విన్ సి ఈ ఓ మురళీకృష్ణ , తహశీల్దార్ సురేష్ బాబు, సిడిపిఓ శాంతి దుర్గా , రెవెన్యూ ,పోలీస్ అధికారులు, సిబ్బంది వున్నారు.
ప్రభుత్వం తమను ప్రతిష్టాత్మక గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలోకి ఉద్యోగులుగా తీసుకుంది.. ఆడుతూ పాడుతూ పనిచేసినా ఎవరూ పట్టించుకోరు..ఒక వేళ వచ్చినా వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతున్నారు.. పెద్దగా అధికారుల పర్యటనలు..డ్యూటీ చార్ట్ పట్టించుకోవాల్సిన పనిలేదు..దిల్ ఖుష్ రాజా అంటూ విధులు నిర్వహించేయొచ్చు.. అనుకునే వారికి ఇది నిజంగా చేదు వార్తే. రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కలెక్టర్ ఏకంగా 9 మంది గ్రామసచివాలయ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఇపుడు రాష్ట్రంలోనే సంచనలంగా మారింది. గ్రామసచివాలయ వ్యవస్థను ప్రజలకు చేరువ చేయడానికి, అక్కడి ఉద్యోగుల్లో జవాబుదారీ తనాన్ని పెంపొందించడానికి జిల్లా కలెక్టర్లు, జెసి, ఇతర ప్రత్యేక అధికారులు గ్రామ, వార్డు సచివాలయాల్లో పర్యటనలు చేస్తున్నా... ఇప్పటి వరకూ ఎక్కడా ఎవరినీ సస్పెండ్ చేయలేదు. అదే కొందరు గ్రామసచివాలయ ఉద్యోగులకు, సిబ్బందికి అలుసుగా మారింది. అదే సమయంలో కర్నూలు జిల్లాలో కూడా ఇదే విధంగా సిబ్బంది విధినిర్వహణలో అలసత్వం వహించి కలెక్టర్ వీరపాండియన్ సచివాలయం సందర్శించే సమయానికి ఉద్యోగులు లేకపోవడంతో వెంటనే 9 మంది సచివాలయ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కర్నూలు జిల్లాయే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల సచివాలయ ఉద్యోగులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒక్కమాటలో చెప్పాలంటే హడలి చస్తూ(ఒకటీ, రెండూ పోసుకుంటున్నారు) పైగా కర్నూలు జిల్లా వీరపాండియన్ సస్పెండ్ చేసిన ఉత్తర్వులను సోషల్ మీడియాలో పెడుతూ, అన్ని జిల్లాల సచివాలయ సిబ్బందిని అలెర్ట్ చేస్తున్నారు. కొత్తగా చేరిన ఉద్యోగులతో ఇంతకాలం ప్రజలకోసం పనిచేయాలని చెప్పి పనిచేయిస్తున్న అధికారులకు కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తీసుకున్న చర్యలతో బలమొచ్చింది. ఇకపై తాము కూడా ఈ విధంగానే వ్యవహించాలనే ఆలోచనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అటు ప్రభుత్వం కూడా జిల్లా కలెక్టర్లు, ప్రత్యేకంగా సచివాలయాల కోసం నియమించిన జెసిలకు పూర్తిస్థాయి అధికారాలు ఇవ్వడంతో ఇక పూర్తిస్థాయిలో రంగంలోకి దిగేందుకు సిద్ధపడుతున్నారు రాష్ట్రంలోని కలెక్టర్లు, జెసిలు. ఇక పనిచేయకుండా పబ్బం గడిపేద్దామనుకునే సచివాలయ ఉద్యోగులందరూ జాగ్రత్తగా ఇంటికెళ్లిపోవడం ఖాయంగానే కనిపిస్తుంది.
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజును తన కళ్లతో చూసి, ఆయనకు సేవలందించిన శతాధిక వృద్దుడు బీరబోయిన బాలుదొర కన్నుమూశారు. తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం కొండపల్లి గ్రామానికి చెందిన ఆయన వయసు (115)సంవత్సరాలు. వయసు మీదపడిన కారణంగా వచ్చిన అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా మంచానికే పరిమితమైన ఆయన, ఆదివారం రాత్రి మరణించారు. 1924లో అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ వారిపై పోరాటం జరుపుతున్న సమయంలో బాలుదొర బాలుడిగా ఉండేవారు. కొండపల్లి ప్రాంతంలో అప్పట్లో తాను ఎత్తయిన కొండలపై ఉన్న అల్లూరి సీతారామరాజుకి, ఆయన అనుచరులకు ఆహార పదార్థాలను తీసుకుని వెళ్లి అందించేవాడినని, ఆయన్ను దగ్గరగా చూసే భాగ్యం తనకు లభించడం పూర్వజన్మ సుకృతమని, నాటి ఘటనలను బాలుదొర ఎంతో మందితో పంచుకునేవారు. ఆయన మరణవార్తను విన్న అల్లూరి చరిత్ర పరిశోధకులు ఈఎన్ఎస్ బాలు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈయన మరణ వార్తను విన్న చుట్టుప్రక్కల ప్రాంతాల వారు నివాళులు అర్పించేందుకు కొండపల్లికి తరలివచ్చారు.