1 ENS Live Breaking News

దళితవాడల అభివృద్ధి చంద్రబాబు తోనే సాధ్యం

దళిత వాడలు అభివృద్ధి చెందాలంటే అంది చంద్రబాబుతోనే సాధ్యమని అనకాపల్లి టిడిపి ఇన్చార్జి పీలా గోవింద సత్యన్నారాయణ పేర్కొన్నారు. బుధవారం ఎఎంసి కాలనీలో 83వ వార్డు ఇంచార్జీ బొద్దపు ప్రసాద్, అర్బన్ జిల్లా కార్యదర్శి శంకర్ల పద్మలత ల ఆధ్వర్యంలో మహాశక్తి పథకం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా మాజీ ఎమ్మెల్యే పీలా మాట్లాడుతూ, ఏపీకి త్వరలోనే మంచిరోజులు రానున్నాయన్నారు. తెలుగు మహిళలు తో కలిసి ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణి చేశారు. అంతకుముందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ , టీడీపి వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు  విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి, జిల్లా అధ్యక్షురాలు ఆడారి మంజు,పార్టీ నాయకులు పోలవరపు త్రినాథ్, అధికసంఖ్యలో కార్యకర్తలు ,అభిమానులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2023-08-09 16:19:05

విశాఖజిల్లాలో వారాహి యాత్రను విజయవంతం చేయండి

విశాఖ ఉమ్మడి జిల్లాలో ఈనెల 10 నుంచి 19 వరకు  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టబోయే వారాహి యాత్రను అన్ని వర్గాల ప్రజలు జయప్రదం చేయాలని  నియో జకవర్గ జనసేన ఇంచార్జి పరుచూరి భాస్కరరావు పిలుపునిచ్చారు. బుధవారం అనకాపల్లి బైపాస్ రోడ్ లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 10న పవన్ కళ్యాణ్ విశాఖ ఎయిర్పోర్ట్ కు 11 గంటలకు విచ్చేసి, అక్కడి నుండి దసపల్లా హోటల్ కు చేరుకుంటారని చెప్పారు. పార్టీ నాయ కులు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని విజ్ఞప్తి చేశారు. 19వ తేదీ వరకు పవన్ కళ్యాణ్  విశాఖ ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తారని తెలిపారు.అలాగే జనవాణి కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. అనకాపల్లి ఎప్పుడు వస్తారనేది త్వరలో తేదీ ఖరారు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రం ప్రగతి బాటన నడవాలంటే జనసేన అధికా రంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అంశాన్నిఅందరూ గుర్తించాలన్నారు.

Anakapalle

2023-08-09 15:29:28

డుంబ్రిగుడలో ఘనంగా ఆదివాసి దినోత్సవం

ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని డుంబ్రిగుడ మండల కేంద్రంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి మండల కేంద్రంలోని జంక్షన్ వరకు  గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించి మనోహరం చేపట్టారు. అనంతరం గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ బి పోతురాజు, టి.సూర్యనారాయణ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం  వచ్చి దశబ్దాలు గడుస్తున్న ఇప్పటికీ అనేక గిరిజన గ్రామాల్లో రోడ్లు, వంతెనలు తాగునీరు, విద్యా వైద్యం వంటి సౌకర్యాలు అందక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాజ్యాంగంలో కల్పించిన గిరిజన చట్టాలను అమలు చేయకుండా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. ఖండ్రు మ్ ఎంపీ యూపీ పాఠశాలలో కూడా విద్యార్థులు ఆదివాసి దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కే.సంజీవరావు, యుటిఎఫ్ మండల అధ్యక్షుడు ఎస్ బాలకృష్ణ, కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Dumbriguda

2023-08-09 14:57:12

18ఏళ్లు దాటితే ఓటరుగా నమోదు చేయించుకోవాలి

18ఏళ్లు నిండి అర్హత కలిగిన  ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేయించుకోవాలని విశాఖజిల్లా జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్ తెలిపారు.  బుధవారం దక్షిణ నియోజక వర్గంలోని వెలం పేట పరిధిలో  91 మరియు 98 నెంబరు గల  పోలింగ్ బూత్  పరిధిలో గల  ఇంటింటికి ఓటరు సర్వే కార్యక్రమంలో  పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ బి ఎల్ ఓలు డోర్ టు డోర్ వెరిఫికేషన్ కు వచ్చినప్పుడు ఓటరు వివరాలు, డోర్ నెంబరు సరిగా ఉన్నది, లేనిది ఓటరు బి ఎల్ ఓలను అడిగి తెలుసుకోవాలన్నారు . బి.ఎల్.ఓ డోరు టు డోరు సర్వే పై  స్థానికంగా అపార్ట్  మెంట్ లలో నివాసం ఉంటున్న ఓటర్లను కలిసి వివరాలను అడిగి తెలుసుకోవాలని అన్నారు. అదే విదంగా పాత వారి వివరాలు, కొత్తగా చేరిన వారి నమోదు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓటు అనేది భారత రాజ్యంగం మనకు కల్పించిన హక్కు అని, కుటుంబంలో ఎవరైనా 18 సంవత్సరాలు వయస్సు నిండిన  ప్రతి ఒక్కరూ భాద్యతగా తమ ఓటు నమోదు చేసుకోవాలన్నారు.  ఈ కార్యక్రమంలో విశాఖ పట్నం ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్, మహారాణిపేట తాహాసీల్దార్ టి.ఆనంద్ కుమార్, బూత్ లెవెల్ అధికారులతో పాటు బూత్ లెవెల్ ఏజెంట్ తదితరులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2023-08-09 09:19:43

రైతులకు అన్నింటా పెద్దపీట వేయాలి..ఆడారి కిషోర్

దేశానికి వెన్నుముకలా నిలబడ్డ రైతులకు అన్నింటా పెద్ద పీట వెయ్యాలని, మిషన్ కర్షక దేవో భవ  చైర్మన్ ఆడారి కిషోర్ కుమార్ కోరారు.  బుధవారం విశాఖ నగరం లోని భీష్మ  కాలేజ్ విద్యార్థిని విద్యార్థులతో మిషన్ కర్షక దేవో భవ ప్రచార కార్యక్రమం లో భాగంగా 12వ రోజు అవగాహనా సదస్సు నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ప్రజలు ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన ఆహారం పండించే రైతులకు అత్యున్నత హోదా కల్పించాలన్నారు. మనం రోజు తినే ఆహారాన్ని పండించే రైతులుఅమ్మే కూరగాయలు ఇతర పంటలు కొనుగోలు సమయంలో ఎటువంటి బేరసారాలు చేయవద్దని.. ఎంతో శ్రమ చేసి పండిస్తే తప్ప అవి దిగుబడికి రావన్నారు. అలాంటి రైతులకు కృతఙ్ఞతలు చెప్పడం మన కనీస ధర్మం అన్నారు. అంతేకాకుండా రైతులకు ప్రతి ఆర్టీసి బస్సులోనూ,  ప్రత్యేక సీటు కేటాయించాలన్నారు.

  సమాజంలో తమ వంతు భాద్యతగా రైతాంగానికి సహకారాన్ని అందించాలన్నారు.  కర్షక దేవోభవ ప్రాజెక్ట్,  రైతులకు సంక్షేమం కోసం ప్రజల్లో అవగాహనా కల్పించేం దుకు అన్నిప్రాంతాల్లోనూ పర్యటిస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యార్థులు ఖాళీ సమయాల్లో రైతులకు తగిన సహకారం అందించాలన్నారు. రైతు కుటుంబాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులను ప్రత్యేకించి అభినందించారు.  కొందరు విద్యార్థులు తమ తల్లిదండ్రులు చేస్తున్న వ్యవయం, పంటల కోసం వివరించారు. యువత, విద్యార్ధినీ, విద్యార్ధులు ఈ మిషన్ లో వాలంటీర్లు గా చేరేందుకు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమం లో కాలేజ్ అధికారులు, అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-08-09 08:57:55

విశాఖలో వారాహి యాత్రను విజయవంతం చేయండి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని రాష్ట్ర అధికార ప్రతినిధి యలమంచిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ సుందరపు విజయ్ కుమార్ అన్నారు.  మంగళవారం హరిపురంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వారాహి 3వ విడత యాత్ర ఈ నెల 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరుగుతుందన్నారు. 10వ తేదీన విశాఖపట్నంలో ప్రారంభమై అదే రోజు సాయంత్రం జగదాంబ జంక్షన్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారన్నారు. దానితో పాటుగా జనవాణి కార్యక్రమం కూడా జరుగుతుందన్నారు. అధికార వైసీపీ పార్టీ అవినీతి, భూకబ్జాలు ఎక్కడ బయటపడతాయనో భయంతో గతంలో జనవాణి కార్యక్రమం జరగకుండా అడ్డుకున్నారని ఇలాంటి ఎన్ని కుయుక్తులు పన్నినా ఈసారి మటుకు ఖచ్చితంగా జనవాణి కార్యక్రమం కూడా జరగడంతో పాటుగా కొంతమంది అధికార పార్టీ నేతల కనుసన్నలలో అక్రమాలు జరిగిన విస్సన్నపేట భూములను కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం ఉందన్నారు. డేటా చోరీతో పాటుగా వాలంటీర్ల శ్రమను దోచుకుంటుందని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తే నియోజకవర్గ శాసనసభ్యులు యువి రమణమూర్తి రాజుతో పాటుగా మరో ప్రజాప్రతినిధి కూడా పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేశారని మరి అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం గ్రామ సచివాలయంలో వాలంటీర్ ద్వారా జరిగిన అక్రమాన్ని గురించి ఎమ్మెల్యే ఎందుకు నోరు మెదపడం లేదని విమర్శలు గుప్పించారు.

 ఇప్పటికీ కూడా యలమంచిలి నియోజకవర్గములో అధికార పార్టీ నేతలలో వర్గ పోరు నడుస్తుందని ప్రస్తుత ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ అభివృద్ధి ఎక్కడా కనిపించని దుస్థితి ఏర్పడిందని ఘాటుగా విమర్శించారు. తాను ఇన్నాళ్లు అధికారంలో లేకపోయినా ప్రజలకోసం నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారంలో ప్రజలకి తోడుగా ఉన్నానన్నారు. ఈ కార్యక్రమంలో అచ్చుతాపురం మండల మాజీ జడ్పిటిసి సభ్యులు జనపరెడ్డి శ్రీనివాసరావు, యలమంచిలి మున్సిపాలిటీతో పాటుగా మండలాల అధ్యక్షులు బైలపూడి శ్రీరామదాసు, పప్పల నూకన్న దొర, టెక్కలి పరశురాం, బొద్దపు శ్రీనివాసరావు, పార్టీ సీనియర్ నాయకులు గుర్రాల శేఖర్, ఇతర నాయకులు లాలం సోము నాయుడు, కార్యదర్శులు చోడపల్లి ప్రసాద్, నాని, బుల్లిబాబు, చొప్ప శ్రీను, కొలగాని భాస్కర్, వీర మహిళ సుందరపు సత్యవతి, జనసైనికులు పాల్గొన్నారు.

Yalamanchili

2023-08-08 16:25:34

ఈనాం భూముల సర్వేకై రేపు ఎల్లవరంలో గ్రామసభ

గొలుగొండ మండలంలోని కొత్త యల్లవరం గ్రామంలో ఈనాం భూమలు సర్వే కోసం మంగళవారం గ్రామస్తులతో గ్రామసభ నిర్వహించనున్నట్టు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తెలియజేశారు. ఈ మేరకు ఆయన నర్సీపట్నంలో మీడియాతో మాట్లాడారు. అక్కడి భూముల సర్వే విషయమై అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవిపట్టన్ శెట్టిని కలిసి అక్కడి పరిస్థితిని వివరించినట్టు పేర్కొన్నారు. అనంతరం నర్సీపట్నంలో ఆర్డీఓ తో కూడా ఇదే విషయమై చర్చించిన ఎమ్మెల్యే తొలుగ గ్రామ సభ ఏర్పాటు చేసి అనంతరం ఈనాం భూముల సర్వే చేపట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఇక్కడి భూములు సర్వేపూర్తయితే ఎల్లవరం గ్రామపంచాయతీ ప్రజలు త్వరలో రైతులందరికీ పట్టాదారు పుస్తకాలు మంజూరవుతాయని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ముందుంటుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా వివరించారు.

Narsipatnam

2023-08-07 11:03:09

18ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదుకావాలి

18ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు చేయించుకోవాలని కొయ్యూరు మండల బూత్ కన్వీనర్ రమణ మండల మహాశక్తి మహిళా కార్యదర్శి మీనా అన్నారు. సోమవారం కొయ్యూరు గ్రామంలో ఓటర్ సర్వే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత ఎన్నికల కమిషన్ ఓటరు నవీకరణ కార్యక్రమం చేపడుతోందని, ఓటరు కార్డులు తప్పులు, అడ్రసు, నూతన కార్డుల రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. భారతదేశంలో ఓటు హక్కు  వజ్రాయుధంతో సమానమని దీనివల్ల ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేసి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి ఆస్కారం వుంటుందన్నారు. ముఖ్యంగా యువత స్వచ్చందంగా ముందుకివచ్చి ఓటరుగా నమోదు చేయించుకోవాలని అన్నారు. దానికోసం ప్రతీ గ్రామ సచివాలయ పరిధిలోని బిఎల్వోలను సంప్రదించాలని సూచించారు.

Koyyuru

2023-08-07 10:12:41

చంటి పిల్లలకు తల్లిపాలతో సంపూర్ణ ఆరోగ్యం

చంటి పిల్లలకు తల్లిపాలతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని విజయ వాహిని చారిటబుల్ ఫౌండేషన్ బ్లాక్ కో ఆర్డినేటర్ ఎం.హారిక అన్నారు. సోమవారం తల్లిపాల వారోత్స వాల సందర్భంగా టాటా ట్రస్ట్,  ఏషియన్ పెయింట్స్ ఆధ్వర్యంలో రామన్నపాలెం గ్రామంలో తల్లిపాలు వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మురిపాలు ఫస్ట్ టీకాలా పనిచేస్తాయన్నారు. పిల్లలకు రోగనిరోధక శక్తిని పెంచుతుంద సూచించారు. తల్లిపాలు పట్టడం వల్ల తల్లికి బిడ్డలకి ఆరోగ్య సమస్య లు నివారణ అవుతాయన్నారు. అనంతరం డబ్బా పాలు వద్దు తల్లిపాలే ముద్దు అంటూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి లాలం శ్రీను, నాయుడు  అంగన్వాడీ టీచర్ పద్మ,పోశన్.సఖి అనూష, సివలక్ష్మి , ఎంఎల్ హెచ్పీ, ఆశా వర్కర్లు, పిల్లల తల్లిదండ్రుడు హాజరయ్యారు.

2023-08-07 09:24:08

తూటిపాలలో ఘనంగా చేనేత దినోత్సవం

మాకవరపాలెం మండలంలోని తూటిపాల ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా  నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపా ధ్యాయులు కోసూరు రాము ఉపాధ్యాయిని  సంతోషి, స్థానిక ఆరోగ్య కార్యకర్త, ముగ్గురు విద్యార్థులు చేనేత వస్త్రాలు ధరించి పాఠశాలకు హాజరయ్యారు. పీఎం నరేంద్ర మోడీ సూచనల మేరకు తొమ్మిదవ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు చేనేత వస్త్రాలు  ప్రాముఖ్యతను వివరించారు. నూలు వడకడము, రాట్నం, దారము ప్రాధాన్యతను  చేనేత కార్మికుడు నూకరాజు  విద్యార్థులకు వివరించారు. గాంధీ నూలు వడకడము జీవితాంతం తాను ఖద్దరు మాత్రమే ధరించారని విద్యార్థులకు తెలిపారు. అనంతరం గ్రామంలో విద్యార్థులు ఉపాధ్యాయులతో  చేనేతను ప్రోత్సహిద్దాం. మన భారతీయతను, మన సంస్కృతిని కాపాడుకుందాం ఖద్దరు ధరిద్దాం వంటి నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.

Makavarapalem

2023-08-07 08:24:00

మమ్మల్ని పోలీసుశాఖలోనే కొనసాగించేలా చూడండి

గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులుగా పనిచేస్తున్న తమను మాత్రుశాఖ పోలీసుశాఖలోనే కొనసాగించేలా చూడాలని సచివాలయ మహిళా పోలీసులు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని రజనీని కలిసి వేడుకున్నారు. గురువారం చిలకలూరిపేట నియోజక వర్గంలోని క్యాంపు కార్యాలయంలో చిలకలూరిపేట అర్బన్, రూరల్, నాదెండ్ల మహిళా పోలీస్ లు సంయుక్తంగా తమ సమస్యలపై వినతిపత్రాన్ని సమర్పించారు. మహిళా పోలీసులకి సరైన జాబ్ చార్ట్ లేనందున అనేకమైన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. లైన్ డిపార్ట్మెంట్ లేనందున సమస్యలు ఎదుర్కొంటున్నామని..తనుహోం డిపార్ట్మెంట్ లోనే  కొనసాగిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. తమవిధులకు ఎలాంటి ఆటంకం లేకుండా పటిష్ఠమైన మహిళా పోలీస్ చట్టం తీసుకురావాలని కోరారు. మహిళా పోలీసుల సమస్యలపై స్పందించిన మంత్రి ఈ విషయాన్ని సీఎం వైఎస్.జగన్ మోహనరెడ్డి ద్రుష్టికి తీసుకెళతానని చెప్పారు. 

Chilakaluripet

2023-08-03 17:03:25

అన్నవరం పంచాయతీ కార్మికులకు ఈఎస్ఐ వర్తింపు

అన్నవరం పంచాయతీలోని పారిశుధ్య కార్మికులకు ఈఎస్ఐ వర్తింపు వలన వారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులను అదిగమించడానికి అవకాశం వుంటుందని సర్పంచ్ ఎస్.కుమార్ రాజా పేర్కొన్నారు. మంగళవారం పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పంచాయతీకార్మికులు ఈఎస్ఐ ద్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్టాడుతూ, ఇప్పటికే పారిశుధ్య కార్మికులకు పిఎఫ్ అమలు జరుగుతుందని..నేటి నుంచి ఈఎస్ఐ ప్రయోజనం కూడా కలుగుతుందన్నారు. కాకినాడ జిల్లాలో ఒక్క అన్నవరం పంచాయతీలో మాత్రమే కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించినట్టు ఆయన తెలియజేశారు. తద్వారా కార్మికులు, వారి కుటుంబాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Annavaram

2023-08-01 10:46:32

జోగుంపేటలో ఎమ్మెల్యే పెట్ల చిత్రపటానికి క్షీరాభిషేకం

నర్సీపట్నం నియోజకవర్గంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ కార్యక్రమాలకు మద్దతుగా జోగుంపేటలో గొలుగొండ వైఎస్ ఎంపీపీ జక్కు నాగమణి ఆధ్వర్యంలో పెట్ల ఉమా శంకర్ గణేష్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ తన రాజకీయ స్వలాభం కన్నా ప్రజా శ్రేయస్నే మిన్నని భావించి నర్సీపట్నం ప్రధాన రహదారి విస్తరణతో పాటు ఎన్నో ఏళ్లపాటు అభివృద్ధికి నోచుకోని ఆరిలోవ అడవి రోడ్డు మార్గం విస్తరణ చేయడం ఒక్క ఎమ్మెల్యే వలనే సాధ్యమైందన్నారు. రోడ్డు విస్తరణలో నష్టపోతున్నామని కోర్టుకెళ్లిన బాధితులతో స్వయంగా ఇళ్లకు వెళ్లి నర్సీపట్నం పట్టణాభివృద్ధికి సహకరించాలని విన్నవించిన విధానం చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపో తుం దన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికార ప్రతినిధి, జక్కు అప్పలస్వామి నాయుడు, పి.నాగరాజు, పి.అప్పలనాయుడు, వి.సత్యనారాయణ, జి.అప్పారా వు, కె.గంగ న్న, కె.శ్రీను జి. కన్నయ్య అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Golugonda

2023-08-01 07:03:47

రైల్వే స్టేషన్‌లో రూఫ్‌ ప్లాజాలు, సిటీ సెంటర్లు ఏర్పాటుచేయాలి

అనకాపల్లి రైల్వే స్టేషన్‌ స్టేషన్‌లో రూఫ్‌ ప్లాజాలు, సిటీ సెంటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కాండ్రేగుల వెంకటరమణ రైల్వే శాఖకు విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం అన్ని వర్గాల వినియోగదారుల సూచనలు, సలహాలతో రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ను మాత్రమే అమలు చేయాలని డిమాండ్‌ చేశా రు. ఈమేరకు దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌ఎంకు సోమవారం ఆయన ట్విట్టర్‌, ఈ మెయిల్‌ ద్వారా వినతిపత్రాన్ని పంపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడు తూ, స్టేషన్‌ లో వివిధ గ్రేడ్‌లు / రకాల వెయిటింగ్‌ హాళ్లు, రిటైరింగ్‌ రూములు, మంచి ఫలహారశాలలు / ఆచరణీయమైన రిటైల్‌ షాపులు, ఉన్నత శ్రేణి ప్లాట్‌ఫారాలు (760-840 ఎం.ఎం.) ఏర్పాటు చేయాలన్నారు. దీర్ఘకాలిక దృష్టి, మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతర ప్రాతిపదికన ఆధునికీకరించేలక్ష్యంతో అనకాపల్లి రైల్వే శాఖ స్టేషన్‌ను ‘అ మృత్‌ భారత్‌ స్టేషన్‌’పథకంలో కేంద్రం ఎంపిక చేయడం అభినందనీయమన్నారు.

Anakapalle

2023-07-31 10:29:25

పర్యావరణ పరిరక్షణకై ప్రతీఒక్కరూ ముందుకి రావాలి

పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతీ ఒక్కరూ బాధ్యతగా గుర్తించి ముందడువేయాలని  దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యన్నారాయణ పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏపీ ఐఏఎస్ అధికారుల భార్యల అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం అన్నవరం శ్రీ సత్యదేవ మారేడు వనంలో మారేడు, జమ్మి, సంపంగి, తులసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాతావరణంలో జరుగుతున్న విపరీత మార్పుల వలన సకాలంలో వర్షాలు కురవడం లేదని, అలాగే భూగర్భ జాలాలు అడుగంటులున్నాయ, ఎండల తీవ్రత పెరిగి హిమాలయాలు కరిగిపోవడం, కాలుష్యం పెరిగుదల జరుగుతున్నాయన్నారు. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే మొక్కలను విరివిగా పెంచాలన్నారు. ప్రతీఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు పెంచి ఉష్టోగ్రతల నియంత్రకు క్రుషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ చంద్రశేఖర ఆజాద్ సిబ్బంది పాల్గొన్నారు.

Annavaram

2023-07-28 08:57:11